వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన ఏది చేసినా సంచలనమే. తనకు నచ్చినట్లుగా ఓపెన్గా మాట్లాడే వర్మ.. తన సినిమాల విషయంలోనూ అదే ఫాలో అవుతుంటారు. ప్రేక్షకనాడితో తనకు పనిలేదని, తాను చెప్పాలనుకున్న కథను సినిమాగా రూపొందిస్తానని నిర్మొహమాటంగా చెప్పే తత్వం వర్మది. అయితే అలా ఓపెన్గా మాట్లాడటమే తమ కొంపముంచిందంటూ 'ఐస్ క్రీమ్' నిర్మాత రామ సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. రామ్ గోపాల్ వర్మ తీసిన ప్రయోగాత్మక సినిమాల్లో 'ఐస్ క్రీమ్' మూవీ ఒకటి. 'ఫియర్ ఈజ్ హాట్' అనే క్యాప్షన్తో రూపొందించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. నవదీప్- తేజస్వి జంటగా రూపొందిన ఈ సినిమాను ‘భీమవరం టాకీస్' పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. 2014 సంవత్సరం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా కలెక్షన్లు మాత్రం రాబట్టింది. అయితే వర్మ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ కారణంగా కోటి రుపాయల నష్టం వచ్చిందంటూ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత రామ సత్యనారాయణ అన్నారు. అప్పట్లో ఓ టీవీ ఛానెల్ వాళ్లు శాటిలైట్ రైట్స్ కోసం దాదాపు కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని, అయితే సినిమా ప్రమోషన్ సమయంలో వర్మ మాట్లాడుతూ కేవలం రెండున్నర లక్షల రూపాయలతో ఈ సినిమా తీశామని కామెంట్ చేయడంతో అనవసరంగా ఈ సినిమాను ఎక్కువ మొత్తానికి కొన్నామా? అన్న ఆలోచనలో పడ్డ ఆ డీల్ రద్దు చేసుకుందని అన్నారు. నిజానికి ఆర్జీవీ.. రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడితో సినిమా ప్రారంభించాం. హీరోయిన్లు, టెక్నీషియన్లు అందరం సినిమా సక్సెస్ అయ్యాక డబ్బులు తీసుకున్నాం అని చెప్పారు. కానీ వాళ్లదంతా వినలేదు. కేవలం ఆ పెట్టుబడి గురించి మాత్రమే విని సినిమా వదిలేశారని ఆయన చెప్పారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vK5zpt
No comments:
Post a Comment