ఒకానొక సమయంలో టాలీవుడ్ అగ్రహీలందరితో ఆడిపాడి స్టార్ హీరోయిన్గా ఫుల్ పాపులర్ అయింది కన్నడ భామ . పెళ్లి తర్వాత సినిమాల జోష్ తగ్గించి బుల్లితెర బాట పట్టిన ఆమె.. రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. వెబ్ సిరీసులతో పాటు టీవీ షోస్, సినిమాలతో క్రమంగా మళ్ళీ బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా స్నేహితునితో తన ఎఫైర్ తాలూకు విషయంపై రియాక్ట్ అయింది ప్రియమణి. గతేడాది 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్లో నటించి భేష్ అనిపించుకుంది ప్రియమణి. ఈ వెబ్ సిరీస్లో మనోజ్ బాజ్ పేయి భార్యగా సుచిత్ర పాత్రలో ఆమె నటించింది. అయితే ఇందులోని ఓ ట్విస్ట్ గురించి చెబుతూ ప్రియమణి ఓపెన్ అయింది. తన కుటుంబం ఉన్నత స్థాయికి వెళ్లడం కోసం లెక్చరర్ ఉద్యోగం వదిలి స్నేహితులు ప్రారంభిస్తున్న స్టార్టప్ కంపెనీలో పార్ట్నర్ అవుతుందామె. ఇదే సమయంలో ఆ కంపెనీ భాగస్వామితో ఆమె ఎఫైర్ పెట్టుకున్నట్లు చూపించారు. దీంతో ఇదే విషయమై తనను చాలా మంది ప్రశ్నిస్తున్నారని, అసలు అతనితో ఎఫైర్ ఉంటుందా.. ఉండదా? అని అడుగుతున్నారని ప్రియమణి చెప్పింది. అయితే నిజంగా అతనితో ఎఫైర్ ఉందో ? లేదో ?అనేది సెకండ్ సీజన్ లో క్లారిటీ ఇస్తామని అప్పటి వరకు వెయిట్ చేయండి అంటూ '' పై హైప్ క్రియేట్ చేసింది ప్రియమణి. ప్రధాన పాత్రలో కనిపించబోతున్న 'ఫ్యామిలీ మ్యాన్ 2' జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదిలాఉంటే సీనియర్ హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతోంది ప్రియమణి. ప్రస్తుతం ఆమె విక్టరీ వెంకటేష్ సరసన 'నారప్ప' మూవీలో అలాగే రానా హీరోగా రాబోతున్న 'విరాటపర్వం' సినిమాల్లో నటిస్తోంది. సీనియర్ స్టార్ హీరోలతో జోడీ కట్టేందుకు ప్రియమణికి క్రేజీ ఆఫర్స్ ఇస్తున్నారట దర్శకనిర్మాతలు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3udKcvy
No comments:
Post a Comment