ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో (62) కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్న ఆయనకు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ‘సూపర్హిట్’ అనే సినీ పత్రికను నడిపిన ఆయన.. సుమారు 1500 చిత్రాలకు పైగా సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించారు. ఆయన భార్య బి. జయ దర్శకత్వంలో వచ్చిన.. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మాతగా వ్యవహరించారు. అయితే రెండేళ్ల క్రితం డైరెక్టర్ బి. జయ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేసిన పిమ్మట 1994లో తన భార్య జయ.బి (కలిదిండి జయ) సహచర్యంతో సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి ఫిలిం జర్నలిజంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరితోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ , యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లతో బి ఏ రాజుకు సొంత కుటుంబ సభ్యుని వంటి అనుబంధం ఉంది. బీఏ రాజు మరణంతో సూపర్ స్టార్ మహేష్ బాబు దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఆయనతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oQ2YZb
No comments:
Post a Comment