Friday, 21 May 2021

BA Raju Death.. కదిలిన ఇండస్రీ.. ప్రభాస్, నాగ్, వెంకీ ఎమోషనల్

నిర్మాత, పీఆర్వో, సీనియర్ సినీ జర్నలిస్ట్ మరణంపై సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మరణించారు. ఈ క్రమంలో ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు, హీరోయిన్లు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ బీఏ రాజును తలుచుకుంటున్నారు. మామూలుగా అయితే బీఏ రాజు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు. ఈయన మరణంతో మహేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సొంతింటి మనిషిని కోల్పోయానంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ సైతం బీఏ రాజు మరణంతో షాక్ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్,పీఆర్వోగా సీని పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు అని ఎన్టీఆర్ అన్నారు. ‘గత 37 ఏళ్ల స్నేహం మాది.. నా శ్రేయోభిలాషి.. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాం.. తెలుగు సినిమా పరిశ్రమ కూడా మిమ్మల్ని మిస్ అవుతుంది’ అని ఎమోషనల్ అయ్యారు. ‘సీనియర్ జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు గారి అకాల మరణం నన్ను షాక్‌కు గురి చేసింది. ఆయన నా కుటుంబ సభ్యుల్లాంటి వారు. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలకు ఆయనతో కలిసి పని చేశాను. ఆ అనుభూతులు, అనుభవాలు ఎప్పటికీ నాకు గుర్తుండిపోతాయ్’ అని పేర్కొన్నారు. ‘నాకు ఇప్పుడు మాటలు రావడం లేదు.. నా మొదటి చిత్రం నుంచి ఆయన నాకు తెలుసు.. ఆయనెంతో సహృదయులు.. ఆయన లేని లోటు పూడ్చలేని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని అన్నారు. ‘నా జీవితంలో పాజిటివి లైట్‌ను వేసిన వారు. నా మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకు అది హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఆయన మంచి మాటలే చెప్పేవారు.. ప్రోత్సహించేవారు. ఆయన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. భరించలేనంత బాధగా ఉంది’ అని సమంత ఎమోషనల్ అయ్యారు. ‘నిద్రలేవగానే ఓ బాధాకరమైన వార్త విన్నాను.. సీనియర్ జర్నలిస్ట్, పీఆర్వో బీఏరాజు మరణించారని తెలిసి షాక్ అయ్యాను. టాలీవుడ్‌కు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను’ అని మంచు లక్ష్మీ అన్నారు. ‘బి ఎ రాజు గారు... ఆయనతో నాకు ఎప్పటినుంచో మంచి అనుభందం ఉంది. ఈరోజు ఆయన మనమధ్య లేరనే వార్త నన్నెంతో కలిచివేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని బాలయ్య అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/349mplU

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....