Monday 31 August 2020

Pavitra: ఎన్నో సమస్యలు మరెన్నో వేధింపులు.. పూరి జగన్నాథ్ డాటర్ డేరింగ్ డిసీజన్..!

సోషల్ మీడియా అకౌంట్స్ నేటి సమాజానికి ఎంతగా ఉపయోగకరమో అంతే ప్రమాదకరం కూడా. ఫేస్‌బుక్, ఇన్స్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ఎన్నో సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో నెటిజన్లు నేరుగా సెలబ్రిటీలకు తాము చెప్పదలచుకుంది చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడటం, సెలబ్రిటీలను ట్రోల్స్ చేయడం లాంటివి చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పవిత్ర కూడా అలాంటి వేధింపులే ఎదుర్కొందట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోషల్ మీడియా ఖాతాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది పవిత్ర. నిజానికి పవిత్ర పూరికి ఇన్స్‌స్టాగ్రామ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. @Pavithra_Puri పేరుతో అకౌంట్ మెయిన్‌టైన్ చేస్తున్న ఆమె.. ఎప్పటికపుడు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ పోస్టులు పెడుతుండేది. దీంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 104K దాకా దూసుకుపోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్నట్టుండి తన ఇన్స్‌స్టాగ్రామ్ డిలీట్ చేస్తున్నానని, కొత్త అకౌంట్ @PavithraPuri ఓపెన్ చేస్తున్నానని తెలిపింది పవిత్ర. అలాగే తన పాత అకౌంట్ డిలీట్ చేయడానికి కారణాలు తెలుపుతూ ఓపెన్ అయింది. Also Read: తన పాత ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో చాలా సమస్యలు వస్తున్నాయని, కొందరు ఆకతాయిలు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్న కారణంగా ఆ అకౌంట్ రద్దు చేసుకొని కొత్త అకౌంట్‌కి షిఫ్ట్ అవుతున్నట్లు చెప్పింది పవిత్ర పూరి. అయితే అంత ఫాలోయింగ్ ఉన్న అకౌంట్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందనే దానిపై జనాల్లో చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ఇప్పటికే కొడుకు ఆకాష్ పూరి సినీ గడప తొక్కిన నేపథ్యంలో కూతురు ఎప్పుడు కెమెరా ముందుకొస్తుంది అనేది హాట్ టాపిక్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32EapI2

Poco X3 NFC Set to Launch on September 7: All Details

Poco X3 NFC will be launched on September 7, and the live stream of the launch event can be watched via Twitter, YouTube and Facebook, the company has announced. The Poco X3 NFC sports a 64-megapixel...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lDztYb

Amazon Wins US FAA Approval to Deliver Packages by Drone

The US Federal Aviation Administration said Monday it had granted Amazon approval to deliver packages by drones.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bhi1UA

Motorola One 5G With Snapdragon 765G and 90Hz Refresh Rate Launched

Motorola One 5G has been announced in the US. It comes with the Snapdragon 765G SoC giving it 5G support, and a quad rear camera setup. It also has a 90Hz refresh rate screen.

from NDTV Gadgets - Latest https://ift.tt/2DkkilC

OnePlus Nord Getting OxygenOS 10.5.6 Update With Bluetooth Fix in India

OnePlus Nord is now receiving the OxygenOS 10.5.6 update in India and it brings the anticipated fix for the Bluetooth connection stability issue. Some users recently reported of facing Bluetooth...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jvvmf6

Facebook Partners With Researchers to Study Its Impact During US Election

Facebook said on Monday it is partnering with external researchers to examine the impact of the social media site on society during the 2020 US presidential election.

from NDTV Gadgets - Latest https://ift.tt/34U43XI

Zoom Rides Pandemic to Another Quarter of Explosive Growth

Zoom's videoconferencing service is deepening its integral role in life during the pandemic as tens of thousands more businesses and other users pay for subscriptions to get more control over their...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ETvCp0

Samsung Galaxy M51 Set to Launch in India on September 10

Samsung Galaxy M51 is set to launch in India on September 10, Amazon revealed through a microsite. The new development comes just a day after Samsung launched the Galaxy M51 as its latest Galaxy...

from NDTV Gadgets - Latest https://ift.tt/31M54zm

IPL, The Simpsons, and More on Disney+ Hotstar in September

IPL 2020, The Simpsons season 32, LeBron James' Becoming, Premier League, US Open, The Third Day, Secret Society of Second-Born Royals, Filthy Rich - the biggest movies, TV shows, and sporting...

from NDTV Gadgets - Latest https://ift.tt/32HUxUV

'The Indian Army is fully prepared'

'The use of military power to settle disputes is not always preferred and is the last preferred option, but it certainly remains an option.'

from rediff Top Interviews https://ift.tt/31Nkof4

Ladakh: 'The Indian Army is fully prepared'

'The use of military power to settle disputes is not always preferred and is the last preferred option, but it certainly remains an option.'

from rediff Top Interviews https://ift.tt/3bfbUQM

ప్రియుడితో లేడీ కమెడియన్ రహస్య నిశ్చితార్థం.. స్వయంగా మ్యాటర్ రివీల్ చేసిన విద్యుల్లేఖ

లాక్‌డౌన్ వేళ ఎక్కువ సమయం విరామం దొరకడంతో ఇన్నాళ్లుగా వాయిదాపడిన పనులను పూర్తిచేస్తున్నారు నటీనటులు. ఫిజికల్ ఫిట్‌నెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టేసి స్లిమ్‌ లుక్ లోకి మారుతున్నారు. మరోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లి పీటలెక్కుతూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా లాంటి యంగ్ హీరోలు తమ తమ ఇష్ట సఖులను పెళ్లాడగా.. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కంప్లీట్ చేసుకొని పెళ్లికి రెడీ అయింది. ఇదే బాటలో లేడీ కమెడియన్ కూడా తన ప్రియుడితో రోకా వేడుకను సీక్రెట్‌గా ఫినిష్ చేసేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రహస్య నిశ్చితార్థం తాలూకు వివరాలు తెలుపుతూ స్వయంగా తనకు కాబోయే భర్త ఫోటోను, నిశ్చితార్ధ సంగతులను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది విద్యుల్లేఖ. లాక్‌డౌన్ వేళ ఓ రేంజ్ వర్కవుట్స్ చేసి బాడీ తగ్గించిన ఆమె.. తన ప్రియుడితో పెళ్లికి రెడీ అయింది. ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడైన సంజయ్‌తో సైలెంట్‌గా నిశ్చితార్ధ కార్యక్రమాన్ని కానిచ్చేసింది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. Also Read: ఆగష్టు 26వ తేదీన తమ నిశ్చితార్థం జరిగినట్లు దాదాపు 5 రోజుల తర్వాత వెల్లడిస్తూ ప్రియుడితో దిగిన పిక్ షేర్ చేసింది రామన్. ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు పేర్కొన్న ఆమె.. లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి నిశ్చితార్థం చేసుకున్నట్లు చెప్పింది. మా నిశ్చితార్థం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు అని చెబుతూ విద్యుల్లేఖ పోస్ట్ పెట్టింది. తమిళ టెలివిజన్ నటుడు మోహన్ రామన్ కుతురే ఈ విద్యుల్లేఖ. తండ్రి వలె కెమెరా ముందు సత్తా చాటిన ఆమె పలు తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో నటించి హాస్యం పండించింది. రీసెంట్‌గా ఆమె ''విశ్వమిత్ర, అర్జున్ సురవరం, వెంకీ మామ, మత్తు వదలరా'' సినిమాల్లో కనిపించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bdBRjK

Redmi Note 9 Pro Max, Redmi Note 9 Pro to Go on Sale in India Today

Redmi Note 9 Pro Max and Redmi Note 9 Pro will go on sale today starting 12pm (noon). The phones will be available via Amazon and Mi.com through flash sales. Both the Xiaomi smartphones were launched...

from NDTV Gadgets - Latest https://ift.tt/32WhaVZ

An interview about the economy you MUST read!

Prof Ananth Narayan, well known financial expert who works as a faculty member at the SP Jain Institute of Management and Research and the RBI's nominee director on the board of Yes Bank, expects a double-digit contraction in India's GDP this fiscal year.

from rediff Top Interviews https://ift.tt/3lEAuPN

ప్రణబ్ ముఖర్జీలో ఆ విలక్షణత ఎంతో ఆకట్టుకుంది.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి

మాజీ రాష్ట్రపతి, భారతరత్న (84) సోమవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రాజకీయ కోవిదుడి మరణం యావత్ భారత దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. ప్రణబ్ దా మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా ప్రణబ్ ఇకలేరనే వార్త తెలియగానే జనసేన అధినేత, సినీ నటుడు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇందులో ప్రణబ్ గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు దివంగతులయ్యారనే వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత రాజకీయాల్లో తనదంటూ సొంత ముద్రను ప్రణబ్ ముఖర్జీ వేసుకొన్నారని పవన్ పేర్కొన్నారు. అంతటి దిగ్గజ నేత మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఈ మేరకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. Also Read: అదే ప్రకటనలో ప్రణబ్ గొప్పతనాన్ని కీర్తిస్తూ.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆయన రాజకీయాల్లో విలక్షణమైన ధ్రువతారగా వెలిగారని పేర్కొన్నారు. దేశ రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలు మరచిపోకుండా పండిట్ల కుటుంబపరంగా వస్తున్న దేవార్చన సంప్రదాయం అనుసరించి ప్రత్యేక పర్వదినాల్లో ఆ సంప్రదాయం కొనసాగించే విలక్షణత తనను ఆకట్టుకుందని పవన్ తెలిపారు. మరోవైపు ప్రణబ్ మృతిపై స్పందిస్తూ.. ఆయన మరణ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని పేర్కొంటూ ట్వీట్ చేశారు. భారత రాజకీయ కోవిదుడు ఇకలేరనే వార్తతో దేశం మూగబోయిందని, ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని మహేష్ తెలిపారు. అలాగే మంచు లక్ష్మి, మోహన్ బాబు, బండ్ల గణేష్, తాప్సి తదితరులు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lACwR8

Samsung Galaxy M51 With 7,000mAh Battery, Quad Rear Cameras Launched

Samsung Galaxy M51 has been launched in Germany, and is currency available for pre-orders on the company website. According to the website, the Samsung Galaxy M51 features a quad rear camera setup, a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3bj7xo0

Nokia 3.4 Alleged Render Leaks Ahead of Launch

Nokia 3.4 alleged render has been leaked by a tipster, suggesting that the phone may feature a circular camera module and a hole-punch screen design.

from NDTV Gadgets - Latest https://ift.tt/2EzzzQe

'Delhi police arresting Muslims on fabricated charges'

'1,300 Muslim youth have been arrested since the riots began and pressure has been constantly mounted on the Delhi police to create a narrative that these youths started the riots.'

from rediff Top Interviews https://ift.tt/34MfFvM

Meet Akshay's heroine in Laxmmi Bomb

'It's a dream come true.'

from rediff Top Interviews https://ift.tt/3jsQTF3

Sitara: అప్పుడు తమన్నా ఇప్పుడు రష్మిక.. సితార టార్గెట్ చూడండి గురూ!! పరేషాన్ చేసిందిలే

సూపర్ స్టార్ కూతురు సూపర్ ఫాస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చిన్నతనం నుంచే తన చలాకీతనంతో ఘట్టమనేని ఫ్యాన్స్ అందరికీ దగ్గరైంది సితార. పాటలు పాడటం, డాన్సులేయడం, డైలాగ్స్ చెప్పడం ఇలా ఆల్ రౌండ్ ప్రతిభ చూపిస్తూ వావ్! అనిపించుకుంది. ముఖ్యంగా తన తండ్రి మహేష్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులేస్తూ ఆకర్షిస్తున్న సితార పాప.. తాజాగా 'మైండ్ బ్లాక్' చేసే చిందులేసింది. Also Read: ఈ ఏడాది ఆరంభంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని డ్యాంగ్ డ్యాంగ్ పాటకు స్టెప్పేసి గతంలోనే ఫిదా చేసిన సితార.. ఈ సారి 'మైండ్ బ్లాక్' పాటకు డాన్స్ చేసి మరోసారి పరేషాన్ చేసేసింది. ఈ పాటలో హీరోయిన్ రష్మిక మందన వేసిన డాన్సింగ్ మూవ్‌మెంట్స్ అచ్చుగుద్దినట్లు దించేసింది సితార. ఈ వీడియోను నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. సితార చేసిన ఈ మెస్మరైజ్ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ చూసి.. ''నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్'' అంటూ అదే సినిమాలోని డైలాగ్‌తో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. లాక్‌డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న మహేష్ బాబు.. కూతురు సితార, కొడుకు గౌతమ్‌లతో జాలీగా గడుపుతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' అతి త్వరలో సెట్స్ మీదకు రానుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమా ఫినిష్ అయ్యాక రాజమౌళితో సినిమా చేయనున్నారు మహేష్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hKhwoy

Tecno Spark Go 2020 India Launch Tomorrow, Flipkart Availability Confirmed

Tecno Spark Go 2020 is set to launch in India on September 1. The phone is already being teased on Flipkart via a dedicated page, confirming availability on the e-commerce site. The Tecno Spark Go...

from NDTV Gadgets - Latest https://ift.tt/34NxoTO

Realme 7 Surfaces in Alleged Unboxing Video Ahead of Official Launch

Realme 7 has allegedly been spotted in an unboxing video that has since been taken down. Screenshots from the video were captured by a tipster and shared on Twitter, showing an 8GB + 128GB variant of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jwWgDw

Edict by Boat Affordable Audio Products Launched on Amazon India

Boat has launched a new sub-brand for audio products - Edict by Boat - to be sold via Amazon. The product range is affordably priced, starting at Rs. 299 for the wired earphones.

from NDTV Gadgets - Latest https://ift.tt/34TuoFz

Redmi K30 5G Model May Launch in India

Redmi K30 5G may be launched in India, according to a report. Citing a tipster, the report claims that the smartphone could be offered in Frost White and Mist Purple colours in the country.

from NDTV Gadgets - Latest https://ift.tt/3lzWJ9t

Sunday 30 August 2020

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కరోనాతో టాలీవుడ్ నిర్మాత మృతి

దేశంలో విలయతాండవం చేస్తున్న సినీ ఇండస్ట్రీని కూడా కుదిపేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన ఎందరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. ఇంకొందరు కరోనాతో పోరాడి కన్నుమూశారు. ఇదిలా ఉండగానే టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా గత రాత్రి టాలీవుడ్ నిర్మాత కన్ను మూశారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న బొగారి లక్ష్మీనారాయణ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో ‘ఎదురీత’ అనే సినిమాను నిర్మించారు బోగారి లక్ష్మీనారాయణ. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. పలు సినిమాల్లో విలన్ రోల్ పోషించిన శ్రవణ్ రాఘవేంద్ర‌ను ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయం చేశారాయన. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Z5V4iH

Last Tweet From Chadwick Boseman's Account Becomes Most Liked Ever

The last tweet posted from late actor Chadwick Boseman's Twitter account has now become the most-liked tweet ever with over 7.3 million likes and three million retweets.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QCV5WH

Mi Watch Revolve, Mi Band 5 Tipped to Launch in India Soon

Mi Watch Revolve is expected to be a rebranded model of the Mi Watch Color that was launched in China last year. This wearable will be the first smartwatch from Xiaomi to launch in the Indian market....

from NDTV Gadgets - Latest https://ift.tt/2QGHOwd

Paytm Mall Reportedly Hacked by Cybercrime Group 'John Wick'

Paytm Mall has been allegedly hacked according to risk intelligence platform Cyble. A known cybercrime group that calls themselves 'John Wick' was able to gain unrestricted access to Paytm...

from NDTV Gadgets - Latest https://ift.tt/2GdWf91

Netflix Is Offering Free Access to Select Original Movies and Series

Netflix is offering limited free access to several original series and movies, including Stranger Things, Murder Mystery, Élite, Boss Baby: Back in Business, Bird Box, When They See Us, Love Is...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gIPHvF

TikTok Parent ByteDance Says Will Abide by New Chinese Export Rules

TikTok owner ByteDance said it will "strictly abide" by China's new export rules, which could potentially complicate a sale of the business as demanded by US President Donald Trump.

from NDTV Gadgets - Latest https://ift.tt/3joUCDy

Huawei Focusing on Cloud Business That Has Access to US Chips: Report

Huawei is focusing on its budding cloud business, that still has access to US chips despite sanctions against the company, to secure its survival.

from NDTV Gadgets - Latest https://ift.tt/3gIbmnQ

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ సెలబ్రిటీల అరాచకాలు.. అమ్మో! భయమేస్తోందంటూ మాధవీలత షాకింగ్ కామెంట్స్

ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేయడం యంగ్ హీరోయిన్ మాధవీలతకు ఓ అలవాటు. ఇష్యూ ఏదైనా సరే తనదైన కోణంలో స్పందిస్తూ ఉంటుంది ఈ హీరోయిన్ కమ్ పొలిటీషియన్. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ వ్యవహారాన్ని టాలీవుడ్‌‌కి కూడా లింక్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ లోనూ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయని, టాలీవుడ్ అంతా డ్రగ్స్ మత్తులో ఊగిపోతోందని పేర్కొంటూ ఓ పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకొని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ డీలర్లతో ఆమె చేసిన వాట్సాప్ చాట్ బయటకురావడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ అయింది. అయితే ఈ ఇష్యూలోకి ఎంటరైన హీరోయిన్ కంగనా రనౌత్.. బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో నోరువిప్పి టాలీవుడ్‌లో కూడా డ్రగ్స్ మాఫియా ఉందని, ఇక్కడ ఏ పార్టీ జరిగినా డ్రగ్స్ తప్పకుండా వాడతారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతటితో ఆగక తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని పేర్కొంది. ''ఇతర దేశాల మారక ద్యవ్యాలు ఎందుకు? ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరు బయటపెట్టరు. అది సరే కానీ.. తెలంగాణ NCB మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి. పీతకన్ను కాకుండా సీరియస్ కన్ను వేయండి. మన ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంది. అది లేకుండా కొన్ని పార్టీలు జరగవు'' అని పేర్కొన్న మాధవీలత.. చివరగా ''నాకు భయంగా ఉంది ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో అని. ఎవరు డ్రగ్స్ జోలికి పోరు ఆ అధికారులు కూడా చూసి చూడనట్లే ఉంటారు. నిజంగా పట్టుకుంటే వాళ్ళకి భయం.. ఒకవేళ పట్టుకున్నా ప్రభుత్వాలు ఎలాగూ వేదిలెయ్ అని భయపెడతాయి కదా ఆఫీసర్స్‌ని. సరేలే నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వస్తుందేమో'' అంటూ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులపై సెటైర్స్ వేసింది మాధవీ. Also Read: గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం పెద్ద రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో చాలామంది సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ కేసు వివరాలు వెల్లడించకుండా అధికారులు మెల్లగా సైలెంట్ కావడంతో అది మిస్టరీ గానే మిగిలింది. మళ్ళీ ఇప్పుడు మాధవీలత చేసిన కామెంట్స్ చూస్తుంటే మరోసారి రచ్చ కావడం ఖాయమే అని తెలుస్తోంది. సో.. చూడాలి మరి మాధవీలత చేసిన ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ ప్రముఖులు ఎలా రియాక్ట్ అవుతారనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32F3UVh

US Telecoms Giant Bug Causes Global Internet Outages

A bug involving US-based telecoms giant CenturyLink briefly interrupted internet service in several global markets Sunday, affecting popular streaming services, gaming platforms, and webcasts of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2EJgKd8

S. Radha Krishna: నిర్మాత చినబాబు బర్త్ డే.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

నేడు (ఆగష్టు 31) టాలీవుడ్ ప్రొడ్యూసర్, మృదుస్వభావి . ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, పీఆర్‌ఓలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరితో కలివిడిగా ఉండే ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ స్వీట్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. చినబాబు అసలు పేరు . హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ స్థాపించి పలు సినిమాలు రూపొందించారు చినబాబు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు చినబాబు. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం 'ఆత్మకథ' సినిమా తీసి నష్టాలు మూటగట్టుకున్న ఆయన.. తిరిగి 'జులాయి' సినిమాతో మరోసారి నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఆ వెంటనే ''సన్నాఫ్ సత్యమూర్తి, అఆ..'' సినిమాలతో లాభాల బాట పట్టారు. ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేసిన చినబాబు నిర్మాతగా ఎదిగిన తీరు, సాధించి తీరాలనే ఆయన మొండితనం ఎందరికో ఆదర్శం అని చెప్పుకోవచ్చు. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెబుతుంటారు చినబాబు. ఆయన పదునైన మాటలు తనను ఎంతగానో ఆకర్షిస్తాయని, ఆయనతో ఎక్కువ సినిమాలు చేయాలనుందని అంటారాయన. కాగా ఇప్పటికే చినబాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ''జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ..'' సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన స్థాపించిన బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ సక్సెస్‌ఫుల్ సినిమాలతో ముందుకెళ్తోంది. హారిక, హాసిని తన ఇద్దరు కూతుళ్ళ పేర్లు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చినబాబు. ఇండస్ట్రీలో మృదుస్వభావిగా పేరున్న చినబాబుకు మీ మా 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QAl40K

'Investors need to be extremely selective'

'The market won't wait for earnings to recover.'

from rediff Top Interviews https://ift.tt/3hJhcqh

Manchu Lakshmi: రియా విషయంలో ఇది సరైన పద్దతి కాదు.. నెట్టింట రచ్చ చేస్తున్న మంచు లక్ష్మి ట్వీట్

బాలీవుడ్ యువ నటుడు బలవన్మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఈ మరణం వెనుక కొందరి హస్తం ఉందని ఆరోపణలు గుప్పుమనడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకొని సీబీఐ రంగంలోకి దిగింది. అయితే సుశాంత్ సూసైడ్ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని కార్నర్ చేస్తూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆమెను లోతుగా విచారిస్తూ కూపీ లాగుతున్నారు సీబీఐ అధికారులు. ఈ పరిస్థితుల్లో చేసిన ఓ ట్వీట్ నెట్టింట రచ్చ చేస్తోంది. ఇటు సుశాంత్‌కి, అటు రియా చక్రవర్తికి న్యాయం జరగాలంటూ మంచు లక్ష్మి పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. తాను ఇటీవల రియా, రాజ్‌దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ మొత్తం చూశాక దీనిపై స్పందించాలా వద్దా అని దీర్ఘంగా ఆలోచించి ఈ పోస్ట్ చేస్తున్నా అంటూ తన భావాలను అందరి ముందుంచింది మంచు లక్ష్మి. ఇందులో ఆమె ప్రస్తావించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో రచ్చకు కారణమయ్యాయి. ఓ అమ్మాయిని ఒంటరి చేసి రాక్షసురాలిగా చిత్రీకరిస్తున్నారని రియాను ఉద్దేశిస్తూ లక్ష్మి పెట్టిన సందేశంపై కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమె పోస్ట్ చేసిన సందేశం వివరంగా చూస్తే.. ''సుశాంత్ సూసైడ్ కేసులో నిజానిజాలేంటో తనకు తెలియదు. అయితే వాటిని తెలుసుకోవాలనుకుంటున్నా. సుశాంత్‌కు న్యాయం చేయాలని సీబీఐ సహా అన్ని రకాల ఏజెన్సీలు, అధికారులు కష్టపడుతున్న తీరు హర్షనీయం. కాకపోతే నిజానిజాలు బయటకురాకుండానే ఒకరిని నిందించడం, వేరొకరి ఫ్యామిలీని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదనేది నా అభిప్రాయం. మీడియా కథనాలు చూసి రియా కుటుంబం పడే ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. జీవితంలో ఇలాంటి సందర్భాల్లోనే సహచరులు అండగా నిలబడాలి. రియా విషయంలో ఇది సరైన పద్దతి కాదు. అసలు విషయం బయటకొచ్చే దాకా ఆమెను నిందించడం ఆపండి'' అని మంచు లక్ష్మి పేర్కొంది. Also Read: అయితే లక్ష్మి మాటలకు తాప్సి లాంటి కొందరు సెలబ్రిటీలు మద్దతిస్తుండగా.. కొంతమంది సుశాంత్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సూసైడ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాకు మీరు మద్దతు ఇవ్వడమేంటని మంచు లక్ష్మిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31IWgtQ

Redmi 9 to Go on Sale in India Today for the First Time

Redmi 9 is set to go on sale in India today. The latest Redmi phone that was launched in the country last week will be available for purchase for the first time through Amazon and Mi.com at 12pm...

from NDTV Gadgets - Latest https://ift.tt/3bn0GtP

Moto G9 to Go on First Sale in India Today

Moto G9 will be available for purchase through its first sale in India today at 12pm (noon) through Flipkart. The new Motorola smartphone debuted in the country last week.

from NDTV Gadgets - Latest https://ift.tt/3lugWxA

ఒక్కసారి ఆ సుఖం చూస్తే ఇక కదలవు.. అందుకే నేను ఊరొదిలి వెళ్లా.. పూరి వర్షన్‌లో ఓపెన్ అయ్యాడిలా..!!

లాక్‌డౌన్ వేళ వరుస పోడ్ కాస్ట్ ఆడియోలతో రకరకాల విషయాలు చెబుతున్నారు డాషింగ్ డైరెక్టర్ . తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఆడియో సందేశాలతో ఆలోచనలు రెక్కించిన ఆయన తాజాగా ఓ మోటివేషనల్ ఆడియో రిలీజ్ చేశారు. ఆయన వర్షన్ లోనే కష్టపడితే ఎలా పైకి రావొచ్చో వివరించారు. ''నీకేంట్రా పొయ్యికాడ ఆకు మడి అంటారు. దీని అర్థం పొలం మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఇంటిచుట్టూ పొలం ఉంటుంది. హాయిగా వంట చేసుకుంటూ పంట చేసుకోవచ్చు. ఏ టెన్షనూ ఉండదు. దీన్నే అంటాం. చాలా బాగా ఉంటుంది పైగా సుఖంగా కూడా ఉంటుంది. అందుకే అందరం దీన్నే కోరుకుంటాం. ఒక్కసారి ఆ సుఖం చూశాక అందులోంచి కదలం. దాని వల్ల మన గ్రోత్ ఆగిపోద్ది. మన లైఫ్ లిమిటెడ్ అయిపోద్ది. ఎక్కడికో వెళ్లాల్సిన వాడివి అక్కడే ఉంటావు. నేను కూడా కంఫర్ట్ జోన్‌లో చేసిన సినిమాలన్నీ తేడా చేశాను. ఆ జోన్ నుంచి బయటకొస్తే గానీ నిజమైన సక్సెస్ రాదనీ తెలుసుకున్నాను. Also Read: మనం చేసే పని రొటీన్ అని ఫీల్ అయిన ప్రతిసారి కొత్త ఐడియా వేస్తూ డిఫెరెంట్ రూట్‌లో వెళ్ళాలి. అందులో రిస్క్ ఉండాలి. రిస్క్ లేకపోతే అది కొత్త ఐడియానే కాదు. ఇక్కడ తీసుకుంటాం.. అక్కడ అమ్మేస్తాం.. ఇంత లాభం.. ఇది కంఫర్ట్ జోన్. కొంపదీసి ఇది ఎవ్వడూ కొనకుంటే.. ఇది రిస్క్ జోన్. మనం ఎప్పుడూ చిన్న రిస్క్ లోనే ఉండాలి. రిస్క్‌లో ఉన్నప్పుడే అలర్ట్ ఉంటూ తెలియకుండానే పనిపై ఎక్కువ ఎఫర్ట్ పెడతాం. దాని వల్ల వచ్చిన సక్సెస్ వేరే రేంజ్‌లో ఉంటుంది. నువ్ సూపర్ స్టార్ అవుతావు. కంఫర్ట్ జోన్ బ్యాచ్ అంతా నీ వెనుక ఉంటారు. నువ్వు మాత్రం ఎక్కడో ఉంటావు. నువ్ ఉన్న ఊళ్ళో నీకు కంఫర్ట్‌గా వెంటనే ఆ ఊరు వదిలేయ్. అదే పని వేరే ఊళ్ళో స్టార్ట్ చెయ్. తప్పదు లాక్ అయిపోయాను అనే పరిస్థితుల్లో ఆ ఊళ్ళోనే కొత్తగా ట్రై చెయ్. లైఫ్‌లో ఎప్పుడూ మన కింద మెత్తటి దిండు ఉండకూడదు. ఫైర్ ఉండాలి.. అప్పుడే మజా.. కింద కాలుతుంటేనే కరెక్టుగా ఉంటావ్. అందుకే నువ్వే మంట పెట్టుకొని దానిపై కూర్చో. భయం వైపు అడుగులు వెయ్. నువ్వు చేసే కొత్తపని మొత్తం నీ కంట్రోల్‌లో ఉండకూడదు. Also Read: ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ కాకూడదు. మైండ్ ఎప్పుడూ పాజిటివ్‌గా పెట్టుకోండి. కొత్తగా ట్రై చేయడం వల్ల కొంపలేం అంటుకుపోవు. మీరు ఎంప్లాయ్ అయితే ఉన్న జాబ్ కొత్తగా చేయండి లేదా కొత్త జాబ్ చేయండి. పిట్టగోడ మీద నడిచిన్నపుడే ఆచితూచి అడుగేస్తాం. ఒళ్ళు దగ్గరపెట్టుకొని నడుస్తాం. నోట్లో నుంచి నాన్సెన్స్ రాదు. మరీ భయంగా ఉంటే మెల్లగా అడుగులేస్తాం. అందుకే నేను ఊరొదిలి పోయా.. మీరు కూడా పోండి'' అని పూరి జగన్నాథ్ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gHKDrh

సీఎం జగన్ డైనమిక్ లీడర్.. దేవుడి ఆశీస్సులు ఆయనకే.. ‘కింగ్’ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ ‘కింగ్’ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన చిన్నా, పెద్ద ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందినవాళ్లు నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాగార్జునకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘‘తెలుగు సినీ ప్రపంచంలో ఎందరో గొప్ప నటుల్లో ఒకరైనా అక్కినేని నాగార్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. Must Read: సీఎం జగన్ ట్వీట్ చేసిన దాదాపు 19 గంటల తర్వాత నాగార్జున స్పందించారు. సీఎం జగన్ డైనమిక్ లీడర్ అని, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రియమైన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమపూర్వక మాటలకు ధన్యవాదాలు. మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తున్నాను. నాకు తెలుసు.. మీ డైనమిక్ లీడర్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంటుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.’’ అని నాగార్జున రిప్లై ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌కు, నాగార్జునకు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ప్రభుత్వానికి నాగార్జున మద్దగా నిలిచారన్న ప్రచారం ఉంది. వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ను కలిసి పరామర్శించిన, ఎన్నికల సందర్భంగా సహకారం అందించిన అతి కొద్ది మంది సినీ ప్రముఖుల్లో నాగార్జున కూడా ఒకరు. ఈ నేపథ్యంలో నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. Don't Miss: Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DaXX9V

మగువ ట్రైలర్: బూతు సీన్లతో రచ్చ రచ్చ.. మరీ ఇంత అరాచకమా? సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో..!

ఈ మధ్యకాలంలో బూతు కంటెంట్ సినిమాలు మరీ ఎక్కువయ్యాయి. సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే సినిమా అంతా బూతు సీన్లతో నింపేస్తున్నారు. కొన్ని సినిమాల్లో అయితే మరీ శృతిమించిన అడల్ట్ సీన్స్ పెడుతుండటం చూస్తూనే ఉన్నాం. సెగలు పుట్టించే సీన్స్ పెట్టేసి యువతరానికి గాలం వేస్తూ మార్కెట్ చేసుకుంటున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ఇక ఈ సంగతి అటుంచితే మోడ్రన్ యువతి ''అబల కాదు సబల'' అనే కాన్సెప్ట్ తీసుకొని '' అనే ఓ మూవీ రూపొందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఒక నిమిషం 28 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మగువ ట్రైలర్‌లో బూతు సీన్లు పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఓ సాఫ్ట్‌వేర్ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళుతుండగా కొందరు రేపిస్టులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని బిల్డింగ్‌కు తీసుకెళ్లి రేప్ చేసే ప్రయత్నం చేయడం, అయితే తెల్లారేసరికి ఆ అమ్మాయి ప్రాణాలతో బయట పడటాన్ని మధ్య మధ్యలో అడల్ట్ సీన్స్ పెట్టి ఆకర్షించే ప్లాన్ చేశారు. ''మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలి. ఇది నేటి మాట.. నా మాట'' అనే హీరోయిన్ డైలాగ్‌తో ట్రైలర్ ముగించారు. Also Read: యూనివర్సల్ డ్రీమ్స్ బ్యానర్‌పై దర్శకత్వంలో రూపొందుతున్న 'మగువ' మూవీలో సురేష్ బాబు, మధు ప్రియ, ప్రసన్న పుష్పమాల, హరీష్ చంద్ర, నవికేత్ పాటిల్, దేవలరాజు రవి తదితరులు నటించారు. రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ev9B0f

What Does Walmart See in TikTok? Millions of Young Shoppers

Walmart may be the world's largest retailer but it has mostly failed in its efforts to break Amazon's online dominance. Could TikTok, a fast-growing 3-year-old app filled with goofy videos, be the...

from NDTV Gadgets - Latest https://ift.tt/32CwVBc

Mahesh Babu: సితారతో మహేష్ సరదా సమయం.. నమ్రత ఇంట్రెస్టింగ్ కామెంట్

ఒకప్పుడు సినిమాల్లో సందడి చేసిన మహేష్ సతీమణి నమ్రత.. ఇప్పుడు సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుకుగా పోస్టులు పెడుతూ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా భర్త సినిమా ప్రాజెక్టులు, , గౌతమ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నమ్రత షేర్ చేసిన పిక్, దానిపై ఆమె చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ కావడంతో గత నాలుగు నెలలకు పైగా భార్యా పిల్లలతో ఇంట్లోనే సరదాగా గడుపుతున్నారు మహేష్ బాబు. సాదారణంగానే షూటింగ్స్ చేస్తూ కూడా ఫ్యామిలీకి సమయం కేటాయించే ఆయన ఈ పూర్తి విరామాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ విశేషాలను ప్రేక్షకుల ముందుంచుతూ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది నమ్రత. ఈ క్రమంలో ఇప్పటికే తన పిల్లలు సితార, గౌతమ్‌లతో మహేష్ చేస్తున్న సరదా తాలూకు ఫోటోలు వైరల్ చేసిన నమ్రత.. తాజాగా మరో ఫోటో పోస్ట్ చేస్తూ 'నాన్న కూతురు సితార' అని ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. ఆమె షేర్ చేసిన ఈ పిక్‌లో తన కూతురు సితారను ఆప్యాయంగా చూస్తూ మురిసిపోతున్నట్లు కనిపిస్తున్నారు మహేష్ బాబు. అయితే ఇందులో మహేష్ సరికొత్త మేకోవర్‌ చూడొచ్చు. Also Read: ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆరంభంలో 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hTqH64

2017 నుంచీ నేను గర్భవతినే.. బేబీ బయటకు రానంటోంది: సమంత

2017 నుంచీ నేను గర్భవతినే.. బేబీ బయటకు రానంటోంది: సమంత




from Telugu Samayam https://ift.tt/3gIRhxF

China's New Tech Export Controls Could Give Beijing a Say in TikTok Sale

China's new rules around tech exports mean ByteDance's sale of TikTok's US operations could need Beijing's approval, a Chinese trade expert told state media, a requirement that would complicate the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QBXscb

ప్రభాస్‌పై అమెరికన్ పాప్ సింగర్ ప్రశంసలు.. బిగ్ థ్యాంక్స్ చెప్పిన రెబల్ స్టార్

పాన్ ఇండియా స్టార్ హీరోగా, బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘’. సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ గతేడాది ఆగస్టు 30న విడుదలైంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బాగానే వసూలు చేసింది. అయితే, తెలుగు సహా ఇతర భాషల్లో రాణించలేకపోయింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల మేర గ్రాస్ వసూలుచేసింది. ఇదిలా ఉంటే, నేటితో ఈ చిత్రం ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే, హీరో ప్రభాస్ తన డైహార్డ్ ఫ్యాన్స్‌కి, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, అమెరికన్ పాప్ సింగర్, మోడల్ మెర్సీకి కూడా ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ఒక కారణం ఉంది. సాహోలో ‘బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ వచ్చే ఇంగ్లిష్ సాంగ్‌ను మెర్సీ ఆలపించారు. ‘సాహో’ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మెర్సీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిగ్ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు, ఆమె పాడిన సాంగ్‌ను కూడా పోస్ట్ చేశారు. మెర్సీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ‘సాహో’ సెలబ్రేషన్స్‌తో నింపేశారు. ఇప్పటి వరకు అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ప్రభాస్ ఒకరని మెర్సీ కొనియాడారు. నిజాయతీగా చెప్పాలంటే ఆయన గొప్ప వ్యక్తని ప్రశంసించారు. ప్రభాస్‌తో మరోసారి కలిసి పనిచేయాలనుందని పేర్కొన్నారు. అలాగే, ‘సాహో’ వంటి సినిమాలో తనకు పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమని మెర్సీ అన్నారు. చాలా మంచి టీమ్‌తో తాను పనిచేశానని సంతోషంగా చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gL4ndE

మా తాతయ్య చనిపోతే అంత్యక్రియలకు డబ్బుల్లేవు.. భాస్కర్ సాయం చేశాడు: ‘జబర్దస్త్’ నరేష్

‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ గురించి పరిచయం అవసరంలేదు. టీనేజ్ కుర్రాడే అయినా జన్యులోపంతో ఐదేళ్ల కుర్రాడిలా ఉంటాడు. అదే అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది. తనలోని లోపాన్ని తనకు అనువుగా మలుచుకొని కమెడియన్‌గా రాణిస్తున్నాడు నరేష్. ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో నటించడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో సైతం ఈవెంట్లు చేస్తూ వినోదాన్ని పంచుతున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో కలిసి తన ‘హోం టూర్’ వీడియో చేశాడు నరేష్. తన ఇంటిలో ఉన్న సామానులు, తనకు వచ్చిన ట్రోపీల గురించి నరేష్ వివరించాడు. ఈ క్రమంలో అమెరికాలో తనకు వచ్చిన తొలి షీల్డ్‌ను నరేష్ చూపించాడు. ఈ షీల్డ్ తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. దీనికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. అమెరికా ఈవెంట్‌కు వెళ్లే సమయంలో తన తాతయ్య చనిపోయారని.. అయితే, ఆ సమయంలో తాతయ్య అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బుల్లేవని నరేష్ వెల్లడించాడు. అప్పుడు భాస్కర్ అన్న దగ్గర అప్పు తీసుకున్నానని తెలిపాడు. Also Read: తాతయ్య కార్యక్రమాలు పూర్తయని తరవాత అమెరికా ఈవెంట్‌కు వెళ్లానని.. అక్కడ ఇచ్చిన డబ్బులతో భాస్కర్ అప్పు తీర్చానని నరేష్ చెప్పాడు. అమెరికాలో తాను చేసిన తొలి ఈవెంట్ కూడా అదేనని, అందుకే ఆ షీల్డ్ అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు. నిజానికి నరేష్ తన ఇంటిని షీల్డ్స్‌తో నింపేశాడు. కళాకారుడికి డబ్బుల కన్నా ఈ షీల్డ్స్ అంటేనే ప్రాణమని చెప్పుకొచ్చాడు. త్వరలోనే తాను ఒక పెద్ద ఇల్లు కొంటానని అన్నాడు. ప్రస్తుతం నరేష్ ఉంటోన్న ఇంటిని కింది వీడియోలో చూడొచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jmVV5W

Saturday 29 August 2020

Locus Maps App: Finder of Lost Phones and Great for Surveys Too

When a field scientist left his phone out in the wilderness, a GPS app on a second phone is called into service to track his way through the great outdoors.

from NDTV Gadgets - Latest https://ift.tt/3gDeNMx

మూడేళ్ల నుంచీ నేను గర్భవతినే.. బేబీ బయటకు రానంటోంది: సమంత

అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన కొన్ని నెలలకే ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో చర్చలు మొదలైపోయాయి. సమంత గర్భం దాల్చారంటూ ఇప్పటికే చాలా సార్లు వదంతులు వచ్చాయి. సమంత కూడా వాటిని ఖండిస్తూ వచ్చారు. తాజాగా సమంతకు మరోసారి ఈ ప్రశ్న ఎదురైంది. సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చాట్ సెషన్‌ను నిర్వహించారు. తన ఫాలోవర్లు అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. అయితే, ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్న.. దానికి సమంత ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ‘మీరు గర్భం దాల్చారా’ అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమంత చాలా సమయస్ఫూర్తితో, చమత్కారంగా సమాధానం ఇచ్చారు. తాను 2017 నుంచీ గర్భం దాలుస్తూనే ఉన్నాను అని ఇప్పటి వరకు వచ్చిన వదంతులను పరోక్షంగా ప్రస్తావిస్తూ సమంత రిప్లై ఇచ్చారు. ‘‘నేను 2017 నుంచీ గర్భవతినేనని భావిస్తు్న్నాను. ఈ బేబీ నిజంగా బయటికి రావడానికి ఇష్టపడటం లేదని నా భావన’’ అని సమంత వీడియో ద్వారా రిప్లై ఇచ్చారు. నాగచైతన్య, సమంత వివాహం 2017 అక్టోబర్ 6న గోవాలో జరిగింది. ఆ తరవాత ఈ జంట హనీమూన్‌కు విదేశాలకు వెళ్లింది. ఇక ఆ తరవాత సమంత ప్రెగ్నెన్సీ వార్తలు మొదలైపోయాయి. గడిచిన మూడేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని చూసి చూసి సమంతకు కూడా విసుగొచ్చినట్టుంది. అందుకే, మళ్లీ అదే ప్రశ్న అడిగేసరికి వెటకారంగా సమాధానం ఇచ్చారు. ఇక, సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమాను అంగీకరించారు. నయనతారతో కలిసి ఆమె నటించబోతున్నారు. Also Read: మరోవైపు, ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లో నటించిన సమంత.. ఇటీవలే తన డబ్బింగ్‌ను పూర్తిచేశారు. ఈ సిరీస్‌కు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, గుల్ పనగ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ వరల్డ్‌లోకి సమంత అడుగుపెడుతున్నారు. ఇక, అశ్విన్ సరవణన్ దర్శకత్వంలోనూ ఒక తమిళ సినిమాను సమంత అంగీకరించారు. హారర్ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రసన్న ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2EOxxv2

From The Boys to Enola Holmes, What to Watch in September

The Boys season 2, V movie, The Simpsons season 32, Enola Holmes, C U Soon, Cargo Netflix, The Devil All the Time, Dolly Kitty Aur Woh Chamakte Sitare - the biggest TV shows and movies coming to...

from NDTV Gadgets - Latest https://ift.tt/2EDKPuL

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కారుణ్య ఇంట విషాదం

టాలీవుడ్ ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య ఇంట విషాదం నెలకొంది. కారుణ్య తల్లి జానకి అనారోగ్యంతో శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌లోని త్రివేణినగర్‌లో ఆమె మృతి చెందారు. జానకి కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుది శ్వాస విడిచారు. కారుణ్య తండ్రి మధు సైతం డిఫెన్స్‌లోనే పనిచేసి రిటైర్‌ అయ్యారు. కారుణ్య తల్లి జానకి మరణవార్త తెలుసుకున్న పలువురు తమ విచారం వ్యక్తం చేశారు. పలువురు సింగర్స్ కారుణ్యకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో కారుణ్య తల్లి అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. సైదాబాద్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కారుణ్య 2006లో సోనీ టీవీ నిర్వహించిన 'ఇండియన్‌ ఐడల్‌' కార్యక్రమంలో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి ప్రముఖ గాయకుల సరసన నిలిచాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lt7U3P

ఎస్పీ బాలుకి ఫిజియోథెరపి.. మెల్లమెల్లగా కోలుకుంటోన్న దిగ్గజ గాయకుడు

కరోనా వైరస్‌తో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న దిగ్గజ గాయకుడు మెల్లమెల్లగా కోలుకుంటున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. అలాగే, బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులకు ఆయన స్పందిస్తున్నారని, ఇంకా వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్స కొనసాగుతోందని సమాచారం. బాలు ఆరోగ్యంపై శనివారం ఎంజీఎం హాస్పిటల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, హాస్పిటల్ వర్గాల ద్వారా బాలు ఆరోగ్య పరిస్థితిపై సమాచారం బయటికి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యంకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ కొన్ని రోజులుగా జరుగుతోందని, ఫిజియోథెరపీకి బాలు శరీరం సహకరిస్తోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తులు కూడా మెరుగుపడినట్లు తెలుస్తోంది. మరోవైపు, తన తండ్రి ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన తండ్రి మెల్లమెల్లగా కోలుకుంటున్నారని చెప్పారు. ఇక శనివారం ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘నాన్న నిన్నటి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. నాన్న ఆరోగ్యం గురించి ప్రస్తుతానికి కొత్త అప్‌డేట్ ఏం లేదు’’ అని చరణ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచీ ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆ తరవాత వెంటిలేటర్‌తో పాటు ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3b6vqiv

సీఎం జగన్ బిగ్ సర్‌ప్రైజ్.. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ‘కింగ్’ నాగార్జునకే!

ప్రముఖ తెలుగు సినీ హీరో నాగార్జునకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ‘కింగ్’ 61వ వసంతంలోకి అడుగు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో నాగార్జునకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ నాగార్జునకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండని .. ముఖ్యమైన విషయాలు, వ్యక్తులపైనే ట్వీట్ చేస్తుంటారు. ముఖ్యంగా బర్త్ డే విషెస్‌లు చెప్పడం వంటివి చాలా అరుదు. కానీ, ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నాగార్జునకు సైతం బర్త్ డే విషెస్ చెప్పారు. ‘‘తెలుగు సినీ ప్రపంచంలో ఎందరో గొప్ప నటుల్లో ఒకరైనా అక్కినేని నాగార్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు, నాగార్జునకు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ప్రభుత్వానికి నాగార్జున మద్దగా నిలిచారన్న ప్రచారం ఉంది. వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ను కలిసి పరామర్శించిన, ఎన్నికల సందర్భంగా సహకారం అందించిన అతి కొద్ది మంది సినీ ప్రముఖుల్లో నాగార్జున కూడా ఒకరు. ఈ నేపథ్యంలో నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lxLDlk

సుడిగాలి సుధీర్ హీరోగా మరో సినిమా: మళ్లీ ఆ దర్శకుడే.. ఈసారి రొమాంటిక్ కామెడీ!

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా సత్తా చాటిన ‘జబర్దస్త్’ కమెడియన్ మరో సినిమాను పట్టాలెక్కించారు. సుధీర్ హీరోగా సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కబోయే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో సుధీర్‌ని హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కాబోతోంది. Also Read: ఈ సినిమా గురించి దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ.. ‘‘హీరో సుధీర్, నా కాంబినేషన్‌లో రాబోతోన్న రెండో సినిమా ఇది. ప్రేక్షకులకు కనువిందు చేసే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. సప్తగిరి ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. చక్కటి సంగీతం, యూత్‌ని ఆకట్టుకునే పాటలు, అదిరిపోయే కామెడీ పంచ్‌లు హైలెట్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అన్ని కమర్షియల్ హంగులతో, సీనియర్ నటీనటులందరి కలయికతో ఈ సినిమా ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కానుంది. మా నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఖర్చుకు వెనకాడకుండా మంచి మంచి లొకేషన్స్‌లో చిత్రాన్ని రూపొందించడానికి సహకరిస్తున్నారు’’ అని తెలిపారు. కాగా, ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, ఝాన్సీ, రాజ్‌బాల తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lu17XM

జెనీలియాకు కరోనా పాజిటివ్.. 21 రోజులపాటు ఒంటరిగా..!

ప్రముఖ నటి దేశ్‌ముఖ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకినట్టు జెనీలియా ప్రకటించారు. అయితే, ప్రస్తుతం తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని కూడా చెప్పారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ‘‘మూడు వారాల క్రితం నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గడిచిన 21 రోజుల్లో నాలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దేవుడి దయవల్ల ఈరోజు నాకు కరోనా నెగిటివ్ అని వచ్చింది. ఈ వ్యాధిపై పోరాటం నాకు చాలా సులభంగా అనిపించినప్పటికీ గత 21 రోజుల పాటు ఒంటరిగా గడపడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. మరొకరితో గడిపే సమయం ఉండదు. కేవలం డిజిటల్ ప్రపంచంలో మునిగితేలడం వల్ల ఒంటరితనాన్ని పోగొట్టొచ్చు. మళ్లీ తిరిగి నా కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్దకు చేరడం సంతోషంగా ఉంది. మన చుట్టూ ఉన్నవారికి ప్రేమను పంచడమే నిజమైన బలం. అందరికీ ఇది అవసరం. త్వరగా పరీక్ష చేయించుకోండి, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి, ఫిట్‌గా ఉండండి. ఈ మహమ్మారిపై పోరాడటానికి ఇదొక్కటే మార్గం’’ అని జెనీలియా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసిన జెనీలియా.. ఆ తరవాత చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ సీఎం విలాష్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన తరవాత జెనీలియా సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్లిన జెనీలియా.. అత్తింటి గౌరవాన్ని కాపాడేలా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. భర్త రితేష్, కొడుకులు రియాన్‌, రాహిల్‌‌లతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3b857bv

ధైర్యం చేస్తోన్న నాగచైతన్య, సాయి పల్లవి.. షూటింగ్ షురూ!

షూటింగ్‌లు తిరిగి మొదలుపెట్టుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా స్టార్ హీరోలు మాత్రం భయపడుతున్నారు. తమ మూలంగా యూనిట్ సభ్యులు రిస్క్‌లో పడకూడదని భావించి ఇంకా ఏ స్టార్ హీరో షూటింగ్ మొదలుపెట్టలేదు. కానీ, అక్కినేని నాగార్జున ధైర్యం చేశారు. బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఆయన మేకప్ వేసుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్న తొలి స్టార్ హీరో నాగార్జునే. అయితే, ఇప్పుడు ఆయన బాటలోనే అక్కినేని నడుస్తున్నట్టు సమాచారం. నాగచైతన్య, తమ ‘లవ్ స్టోరీ’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తుందట. అన్ని జాగ్రత్తలూ చాలా కఠినంగా పాటిస్తూ ఈ షూటింగ్ చేయనున్నారని అంటున్నారు. సెప్టెంబర్ 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. 15 రోజుల షెడ్యూల్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని టాక్. Also Read: ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని రామోజీ ఫిలిం సిటీలోనే తక్కువ మంది సిబ్బందితో పూర్తిచేయాలని శేఖర్ కమ్ముల టీమ్ నిర్ణయం తీసుకుందని సమాచారం. కాగా, ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QAiLe7

ఆ రౌడీని నడిరోడ్డుపై కొట్టింది, టెర్రరిస్ట్‌ని పట్టుకున్నది నా వియ్యంకుడే: నాగబాబు వీడియో

మెగా బ్రదర్ గారాలపట్టి కొణిదెల వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. ఆగష్టు 13 వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే త్వరలో వియ్యంకుడు కాబోతున్న ఐజీ ప్రభాకర్ రావు డేరింగ్ నెస్ గురించి తెలియజేస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో విడుదల చేశారు నాగబాబు. ఈ వీడియోలో కాబోయే వియ్యంకుడిపై ప్రసంసలు కురిపించారు నాగబాబు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈనెల (ఆగష్టు) 31న రిటైర్డ్ కాబోతున్న ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ గారికి.. అభినందనలు తెలియజేస్తున్నా. వారితో త్వరలో వియ్యం అందుకోబోతున్నా. మా ఫ్యామిలీకి పోలీస్ డిపార్ట్ మెంట్‌తో తెలియని అనుబంధం ఉంది. మా నాన్న పోలీస్‌గా పనిచేశారు. మా నాన్నగారి కోరిక ఏంటంటే.. మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరొకర్ని ఐపీఎస్ చేయాలని.. కాని ఎవరం ఆ ఫీట్ సాధించలేకపోయాం. కాని ఇన్నాళ్లకు ప్రభాకర్ గారితో వియ్యం అందుకునే ఛాన్స్ వచ్చింది. ఆ విధంగా ఓ పోలీస్ మా ఫ్యామిలీలో భాగం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన 1990లో సర్వీస్‌లో చేరారు. అంతకు ముందు ప్రైవేట్ జాబ్ చేసేవారు. కాని పోలీస్ అవ్వి.. ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకున్నారు. అలాగే గ్రూప్ 1లో ఆఫీసర్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టారు. రీసెంట్‌గా ఆయన కరోనా ముందు వరకూ పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో.. గుంటూరలో ఓ రౌడీ షీటర్ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకుని వెళ్లి రౌడీయిజాన్ని కట్టడి చేశారు. అలాగే రాజమండ్రిలో టెర్రరిస్ట్‌లు చొరబడినప్పుడు వాళ్లని చాలా చాకచక్యంగా పట్టుకుని జాతీయ స్థాయిలో సన్సేషన్ అయ్యారు. రాయలసీమలో పనిచేస్తున్నప్పుడు ఫ్యాక్షన్ వల్ల వచ్చే నష్టాన్ని తెలియజేస్తూ వాళ్లతో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్ మెంట్‌కి సంబంధించిన వ్యక్తులు అంటే ఒకింత భయం ఉంటుంది. కాని ఆయన్ని చూసిన తరువాత ఇంత సాఫ్ట్‌గా ఉన్నారేంటి అనిపిస్తుంది. చాలా కూల్‌గా నవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే.. ప్రభాకర్ రావు గారి అబ్బాయి చైతన్యకి మా అమ్మాయి నిహారికను ఇవ్వడం. ఈ మధ్యలో వీరిద్దరికీ నిశ్చితార్థం అయ్యింది.. త్వరలో పెళ్లి జరగబోతుంది. ఇంత మంచి ఫ్యామిలీకి మా అమ్మాయి కోడలుగా వెళ్లడం ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులతో వియ్యం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. బావగారూ.. మీ రిటైర్డ్ మెంట్ అయిన తరువాత కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ వీడియో సందేశం ద్వారా తనకు కాబోయే బావగారిపై ప్రసంసలు కురిపించారు నాగబాబు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gMi0ti

ఈరోజు నా 31వ పుట్టినరోజు.. అక్కినేని వారి చమత్కారం.. శుభాకాంక్షల వెల్లువ

టాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బాస్ 4 హోస్ట్ అక్కినేని ఈరోజు (ఆగస్ట్ 29న) తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన 60వ పుట్టినరోజును స్పెయిన్‌లో జరుపుకున్న కింగ్ నాగార్జున.. ఈ బర్త్‌డేను మాత్రం హైదరాబాద్‌లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకుంటున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియో మెసేజ్‌ను నాగార్జున ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక ఆసక్తికర అంశం ఉంది. తాను 31వ ఏట అడుగుపెట్టినట్టు చెబుతూ నాగార్జున ఈ వీడియోను మొదలుపెట్టారు. ‘‘ఈవాళ నా 31వ పుట్టినరోజు. నిన్నటి నుంచి ఎంతో మంది విషెస్.. ప్రేమ, అభిమానంతో మెసేజ్‌లు నాకు పంపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకో విషయంపై చాలా హ్యాపీగా ఉన్నాను. ఐదున్నర నెలలు తరవాత మళ్లీ పని చేయబోతున్నాను. షూటింగ్‌కి వెళ్లబోతున్నాను. ఏ షూటింగ్ అంటే.. బిగ్ బాస్ సీజన్ 4’’ అని ఎంతో సంతోషంగా చెప్పారు నాగార్జున. అయితే, తన వయసు 31 అంటూ చెప్పిన అక్కినేని వారి చమత్కారానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కింగ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఎంతో మంది ట్విట్టర్ ద్వారా నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో నేచురల్ స్టార్ నాని, విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, శ్రీవిష్ణు, సీరత్ కపూర్, హేమంత్ మధుకర్, నాగచైతన్య, అఖిల్ తదితరులు ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31E8AeP

Huawei Watch Fit Debuts With Rectangular AMOLED Display

Huawei Watch Fit has been unveiled as the latest smartwatch by the Chinese company. The new offering comes in a rectangular design - unlike the company's existing Huawei Watch GT 2 and Watch GT that...

from NDTV Gadgets - Latest https://ift.tt/32CG2BD

ఈ ఈజీ హెయిర్ మాస్క్‌తో మీ జుట్టు బలంగా పెరుగుతుంది..

వీకెండ్స్ టైం లో స్కిన్ కేర్, హెయిర్ కేర్ మీద ఎక్కువ సమయం కేటాయించి రిఫ్రెష్ అవ్వడానికి వీలు కుదురుతుంది. ఫేస్ పాక్స్, హెయిర్ మాస్క్స్, బాడీ కేర్... వీటిని ఎంజాయ్ చేయడానికి సరైన టైం వీకెండే. ఈ సారి మీరు ట్రై చేయడానికి మీకు ఒక పరిచయం చేస్తున్నాం. ట్రై చేసి చూడండి. జుట్టు బాగా ఒత్తుగా షైనీ గా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, డాండ్రఫ్ వంటివి సామాన్యం గా అందరూ ఎదుర్కొంటున్న సమస్యలే. ఇవేమీ మ్యానేజ్ చేయలేని ప్రాబ్లంస్ కావు. అయితే, ఈ రెమిడీస్ కి చాలా టైం పట్టేస్తుంది అనుకుంటే మీ కోసం ఇక్కడొక సింపుల్ హెయిర్ మాస్క్ ఉంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీనే. అంతే, కాదు హెయిర్ కేర్ కి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా మీతో పంచుకుంటున్నాం. అవేమిటో చదివేయండి మరి. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు: * కొబ్బరి నూనె - రెండు టేబుల్ స్పూన్లు * పెరుగు - రెండు టేబుల్ స్పూన్లు * మూడు, నాలుగు - విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ (మీ జుట్టు పొడవుని బట్టి) హెయిర్ మాస్క్ వేసే పద్ధతి * ఒక బౌల్ తీసుకుని అందులో పదార్ధాలన్నీ వేసి జాగ్రత్తగా కలపండి. * ఈ పేస్ట్ ని డైరెక్ట్ గా స్కాల్ప్ కి అప్లై చేసి పది, పహిహేను నిమిషాలు మసాజ్ చేయండి. * ఒక షవర్ కాప్ పెట్టుకుని రాత్రంతా అలా వదిలేయండి. షవర్ కాప్ అందుబాటులో లేకపోతే మెత్తటి టవల్ చుట్టి నిద్రపోండి. * తెల్లవారిన తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేసి కండిషనర్ అప్లై చేయండి. ఈ హెయిర్ మాస్క్ వల్ల లాభాలేమిటి? జుట్టు కుదుళ్ళు బలంగా ఉండాలంటే వాటికి కొబ్బరి నూనె తాలూకు పోషణ కంపల్సరీ. అప్పుడే జుట్టు ఒత్తుగా షైనీ గా ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్ నీ, జుట్టు పల్చబడడాన్నీ కూడా తగ్గిస్తుంది. దీన్ని పెరుగుతో కలపడం వల్ల స్కాల్ప్ కూల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. ఇక, విటమిన్ ఈ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. మనందరికీ హెయిర్ వాష్ ఎలా చేయాలో తెలుసు. ముందు ఆయిల్ మసాజ్, తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం, ఆ తరువాత కండిషనర్ అప్లై చేయడం, మళ్ళీ నీటితో హెయిర్ వాష్ చేసుకోవడం. అయితే, దీన్ని రివర్స్ చేసే ప్రాసెస్ కూడా ఒకటి ఉంది. దాన్నే రివర్స్ హెయిర్ వాష్ అంటారు. ఇందులో ముందు హెయిర్ కండిషన్ చేశాక షాంపూ చేస్తారు. రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేస్తున్నా కూడా జుట్టు నిర్జీవం గా కనపడే వారికి ఈ రివర్స్ హెయిర్ వాష్ బెస్ట్ ఆప్షన్. ముందే చెప్పినట్లుగా ఈ పద్ధతిలో ముందు కండిషనర్ అప్లై చేయాలి. అయితే, స్కాల్ప్ కి మాత్రం కండిషనర్ అప్లై చేయకూడదు. కేవలం జుట్టుకి మాత్రమే ఇలా చేయాలి. చేసిన తరువాత మొత్తం వాష్ చేసేయకుండా కేవలం కొద్ది గా వాటర్ మాత్రం చల్లి ఇంక షాంపూ చేసేసుకోండి. బాగా నురగ వచ్చేలా చేసి మీ తలస్నానాన్ని ఎంజాయ్ చేయండి. కొంత మందికి కండిషనర్ వాడడం ఇష్టముండదు. జుట్టు బరువుగా ఉంటుంది అంటారు వీరు. ఈ టెక్నిక్ తో మీ హెయిర్ హెల్దీ గా, లైవ్లీ గా కనపడుతుంది. ఒక్కొక్కసారి హడావిడిలో కండిషనర్ అప్లై చేశాక కంప్లీట్ గా దాన్ని వాష్ చేయకపోతే కండిషనర్ జుట్టు మీద ఉండిపోతుంది. ఈ టెక్నిక్ తో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే, ఇక్కడ కండిషన్ చేశాక షాంపూ చేస్తున్నారు కదా; దాంతో పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఈ సారి ఇలా ట్రై చేసి చూడండి మరి. ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ చేస్తే మంచిదా, లేదా నైట్ చేయాలా అని సందేహం కూడా రావచ్చు. అసలు హెయిర్ వాష్ ఎప్పుడు చేయాలి, పొద్దున్నా, సాయంత్రమా? పొద్దున్న తొందరగా ఆరుతుంది, సాయంత్రమైతే తీరుబడిగా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఏది మంచిదో చూద్దాం రండి. రాత్రి పూట హెయిర్ వాష్ చేసుకుంటే నాచురల్ గా జుట్టు ఆరబెట్టుకోడానికి వీలుంటుంది. అదే పొద్దున్నైతే అంత టైం ఉండదు కాబట్టి హీటింగ్ టూల్స్ వాడాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా ఇలా హీటింగ్ టూల్స్ వాడడం మంచిది కాదు, అందుకే రాత్రి పూటే హెయిర్ వాష్ చేసుకోవడం మంచిది అని కొంత మంది అంటారు. రాత్రి హెయిర్ వాష్ చేస్తే ఎక్కువ సేపు తడిగా ఉంటుంది. తడి జుట్టు తో నిద్ర పోతే హెయిర్ కీ, హెల్త్ కీ కూడా మంచిది కాదు అని ఇంకొంత మంది అంటారు. ఒక్కొక్కరి జుట్టూ ఒక్కో తీరులో ఉంటుంది. మీ హెయిర్ కి ఏది సరిపోతుందో మీకే తెలుస్తుంది. అయితే, పొద్దున వాష్ చేస్తే జుట్టు నాచురల్ గా ఆరడానికి టైం ఉంచుకుని హెయిర్ వాష్ చేసుకోవాలి. రాత్రి హెయిర్ వాష్ చేస్తే జుట్టు ఆరాక, చిక్కు తీసుకుని, ప్రాపర్ గా జుట్టు ని టై చేసుకుని అప్పుడు నిద్రకి ఉపక్రమించాలి. వారం లో ఒక సారి పొద్దూన్నా, ఒక సారి రాత్రీ హెయిర్ వాష్ చేస్తే మీకే తెలుస్తుంది, మీ హెయిర్ కి ఏది బాగా సూట్ అవుతుందో.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/34Ljrps

నాని ‘V’ వెనకున్న సీక్రెట్.. హీరోయిన్ నివేదా థామస్ చెప్పిన కబుర్లు

సెలక్టివ్‌గా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ న‌టిగా ఒక్కో మెట్టు ఎదుగుతున్న హీరోయిన్ నివేదా థామ‌స్‌. ఈ టాలెంటెడ్ హీరోయిన్ లేటెస్ట్‌గా న‌టించిన చిత్రం ‘వి’. నేచుర‌ల్ స్టార్ , సుధీర్ బాబు, అదితిరావు హైద‌రిల‌తో క‌లిసి నివేదా థామ‌స్ న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న్‌కృష్ణ ఇంద్రగంటి ద‌ర్శక‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వెబినార్‌లో మీడియాతో ఆమె సినిమా గురించిన మాట్లాడారు. ✪ ‘వి’ అంటే... ‘వి’ అంటే ఏంట‌ని చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ‘వి’ అంటే విక్టరీ కూడా అనుకోవ‌చ్చు. నిజానికి ఈ సినిమాతో మా ఎంటైర్ టీమ్ విక్టరీ కావాల‌ని బ‌లంగా కోరుకుంటోంది. ఆ స‌క్సెస్ ద‌క్కుతుంద‌నే అనుకుంటున్నాం. అయితే ‘వి’ వెనుకున్న సీక్రెట్ ఏంటి అనే విష‌యం తెలియాలంటే మాత్రం సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. ✪ మీ పాత్ర గురించి... ఇందులో నేను అపూర్వ అనే క్రైమ్ న‌వ‌లా ర‌చ‌యిత పాత్రలో క‌నిపిస్తాను. మోహ‌న్ సార్‌ క‌థ చెప్పగానే బాగా క‌నెక్ట్ అయ్యాను. అపూర్వ పాత్ర ఎంత ఓబీడీయెంట్‌గా ఉంటుందో అంతే డేరింగ్, కాన్ఫిడెంట్‌‌గా క‌నిపిస్తుంది. ✪ ఓటీటీలో ‘వి’ విడుద‌లపై.. ‘వి’ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌నే కాన్సెప్ట్‌తోనే ఎంటైర్ యూనిట్ క‌ష్టప‌డింది. అయితే ప‌రిస్థితులు మ‌న‌కు అనుకూలంగా లేక‌పోవ‌డంతో సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి కుద‌ర‌లేదు. అమెజాన్‌లో సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నాం. నిజానికి ‘వి’ సినిమాను తెర‌పై చూస్తే వ‌చ్చే ఫీలింగే వేరు. అలాగే ఓ ఆర్టిస్ట్‌కు త‌న సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసుకోవాల‌నే ఉంటుంది. అది ఎన్ని సినిమాలైనా చేసుండొచ్చు. మేం కూడా ‘వి’ సినిమాను అలాగే చూడాల‌నుకున్నాం. అయితే పరిస్థితి మీరు చూస్తున్నారుగా. అలాగే ఓటీటీలో ఇంత మంది స్టార్స్‌తో వ‌స్తున్న తొలి తెలుగు సినిమా అని అంటున్నారు. మ‌రి ఓటీటీలో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి కూడా అంద‌రిలో మొద‌లైంది. క‌చ్చితంగా మంచి ఎక్స్‌పీరియెన్స్‌‌ని ఇస్తుంద‌ని చెప్పగ‌ల‌ను. ✪ స్క్రిప్ట్స్ ఎంపిక‌ గురించి... నేను ప‌లానా స్క్రిప్ట్ మాత్రమే వినాలి, విన‌కూడ‌దు అనే ఆలోచ‌నైతే లేదు. దాదాపు నా ద‌గ్గర‌కు వ‌చ్చే స్క్రిప్ట్స్‌ను త‌ప్పకుండా వింటాను. అయితే వినే స‌మ‌యంలో నేను ఈ పాత్రకు ఎలా న్యాయం చేయ‌గ‌లుగుతాను? అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. దాన్ని బట్టే స్క్రిప్ట్స్‌ను ఎంచుకుంటాను. ✪ నాని పాత్ర గురించి... టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ను బ‌ట్టి చూస్తే నాని పాత్రలో గ్రేషేడ్ క‌న‌ప‌డుతుంది. అంద‌రూ అత‌ని పాత్రను విల‌న్ అని అనేలా డిజైన్ చేశారు. అయితే, ఇప్పుడు త‌న పాత్ర గురించి నేను చెప్పకూడ‌దు. రేపు సినిమా చూసి మీరే తెలుసుకోవాలి. ✪ టీమ్ గురించి.. ఈ సినిమాలో న‌టించిన నాని, అదితి, సుధీర్ అంద‌రితో మంచి అనుబంధం ఉంది. ప్రొఫెష‌న‌ల్‌గానే కాదు.. వ్యక్తిగ‌తంగానూ వారు నాకు మంచి స్నేహితులు. ఇక డైరెక్టర్ మోహ‌న్‌కృష్ణ గారితో ఇది వ‌ర‌కే ప‌నిచేశాను. ఆయ‌న న‌టీన‌టుల ఎంపిక స్క్రిప్ట్‌ను బ‌ట్టే చేసుకుంటారు. కాబట్టి న‌న్ను ఈ సినిమాలో ఎంపిక చేసుకున్నారంటే ఆ పాత్రకు నేను న్యాయం చేస్తాన‌నే ఆయ‌న భావించి ఉంటారు. ప్రతి ఒక్కరూ వారి పాత్రల‌ను గొప్పగా చేశారు. ఓ మంచి సినిమాలో భాగ‌మ‌య్యాన‌ని న‌మ్మకంగా చెప్పగ‌ల‌ను. ✪ నానితో అనుబంధం.. నానితో మంచి అనుబంధం ఏర్పడింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ త‌న‌కు నాకు మంచి ఫ్రెండ్‌. నాకు ఏదైనా కథ నచ్చితే.. తనతో డిస్కస్ చేస్తుంటాను. అలాగే త‌న సినిమాల్లోని పాత్రల గురించి నాతో డిస్కస్ చేస్తుంటాడు. నాని యాక్టర్‌గా ఓ పాత్రను ఒప్పుకున్నాడంటే దాన్ని తెరపై తీసుకురావడానికి ఇంకా గొప్ప ప్రయత్నం చేస్తారు. త‌ను చాలా విషయాల్లో నాకు ఇన్‌స్పిరేషన్. ✪ లాక్‌డౌన్ స‌మ‌యంలో.. లాక్‌డౌన్ స‌మ‌యంలో అనే కాదు.. రెగ్యులర్‌గా నేను కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటాను. పుస్తకం చ‌దువుతుంటాను. ఏదైనా సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకుంటూనే ఉంటాను. నేను చేస్తున్న, చేయాల‌నుకున్న సినిమాల స్క్రిప్ట్ డెవ‌ల‌ప్‌మెంట్స్ గురించి డిస్కస్ చేస్తుంటాను. లాక్‌డౌన్ స‌మ‌యంలో కుటుంబంతో గ‌డ‌ప‌డాన్ని బాగా ఎంజాయ్ చేశాను. ✪ అదితి గురించి.. అదితిరావు హైద‌రి స్వీటెస్ట్ ప‌ర్సన్.. గొప్ప న‌టి. త‌నైనా, నేనైనా, మ‌రెవ‌రైనా మా పాత్రలకు న్యాయం చేయాల‌నే ప్రయ‌త్నించాం. గొప్పగా న‌టించడానికి ప్రయ‌త్నించాం. అలా చేశాం కాబ‌ట్టే సినిమా బాగా వ‌చ్చింది. ✪ స్టార్ డ‌మ్ గురించి.. స్టార్ డమ్ గురించి నేను అస్సలు ఆలోచించ‌ను. ఇప్పుడు నేనున్న ఈ స్థాయిని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓ మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు అని నేను భావిస్తాను. ✪ ఓటీటీ అవ‌కాశాలు.. ఈ గ్యాప్‌లో నేను మూడు తెలుగు స్క్రిప్ట్స్ విన్నాను. అవ‌న్నీ డెవ‌ల‌ప్‌మెంట్స్‌లో ఉన్నాయి. వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను. ఇప్పుడు చాలా మంది ఓటీటీల్లో న‌టిస్తున్నారు. న‌న్ను ఓటీటీలో న‌టించ‌మ‌ని ఎవ‌రూ అడ‌గ‌లేదు. అవ‌కాశం వ‌స్తే ఆలోచిస్తాను. ✪ ద‌ర్శక‌త్వం.. ప్రస్తుతానికి నేను న‌టిని మాత్రమే. నన్నెవ‌రూ పిలిచి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వరు. నేను అవ‌కాశం కోసం వెళ్లాల్సి ఉంటుంది. అయితే వెంట‌నే సినిమా డైరెక్షన్ చేసేయ‌ను. షార్ట్ ఫిలింస్ చేస్తాను. అలా క్రమంగా సినిమా డైరెక్ట్ చేస్తాను. ✪ నిర్మాత‌ల‌కు సహకరిస్తాను.. సినిమా బ‌డ్జెట్‌లు, ఫైనాన్స్ విష‌యాలు నాకు తెలియ‌వు. ‘వి’ సినిమా లాక్‌డౌన్ కంటే ముందే పూర్తయ్యింది. ఈ సినిమా నిర్మాత‌ల‌కు న‌టిగా మా టీమ్‌తో క‌లిసి స‌పోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడున్న ప‌రిస్థితులు అలాగే కొన‌సాగ‌వు. త్వర‌గానే అంతా సెట్ అవుతుంది. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో నేను నిర్మాత‌ల‌కు సపోర్టివ్‌గానే ఉంటాను. ✪ నెపోటిజం.. నెపోటిజం వ‌ల్ల న‌టిగా నేను ఎలాంటి స‌స‌మ్యలు ఫేస్ చేయ‌లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bez1ej

Google Pay Spotted With NFC-Based Card Payments Feature in India

Google Pay in India is seen allowing some users to add their NFC-powered credit and debit cards as a payment method in addition to the existing bank account option. The new development would help...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jigS26

అన్నకు ప్రేమతో.. ఆయన లేరంటే మనసు ఒప్పుకోవట్లేదు.. బాలకృష్ణ భావోద్వేగం

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చైతన్య రథసారధి, మాజీ మంత్రి నందమూరి రెండో వర్థంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అకాల మరణం ఎప్పటికీ తీరని లోటంటూ గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హరికృష్ణకు నివాళులు అర్పించారు. అలాగే హరికృష్ణ తమ్ముడు, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి అన్నయ్యకు నివాళులర్పించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో బాలయ్య అన్నయ్యను గుర్తు చేసుకుంటూ భావోద్వేగమైన పోస్టు చేశారు. ‘‘తెలుగుదేశం స్థాపించిన తొలి దినాల్లో నాన్న గారికి చేదోడు వాదోడుగా ఉంటూ చెతన్య రథసారధి అయిన మా అన్న నందమూరి హరికృష్ణ గారు మన మధ్యనుంచి దూరం అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది అంటే నమ్మశక్యం కావటం లేదు మనస్సు అంగీకరించటం లేదు. నాన్నకు తగ్గ తనయుడు, తెలుగుదేశం పార్టీ తొలి శ్రామికుడు అన్నయ్య హరికృష్ణ గారికి నా నివాళులు అర్పిస్తూ... జోహార్ నందమూరి హరికృష్ణ’’ అని బాలకృష్ణ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అలాగే టీడీపీ చీఫ్ చంద్రబాబు సైతం హరికృష్ణకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘‘నందమూరి హరికృష్ణ గారంటే ఆపన్నులకు అండగా నిలిచే ఆత్మీయత, క్రమశిక్షణ, నిరాడంబరతలకు ప్రతిరూపం. హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆయన స్మృతికి నివాళులు’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2G8zNy6

ఐబ్రోస్ ఒత్తుగా, నల్లగా మారాలంటే ఇలా చేయండి చాలు..

కళ్ళను మరింత అందంగా హైలైట్ చేయడానికి ఐ బ్రోస్ ఎంతో హెల్ప్ చేస్తాయి. కాబట్టి, ఐ బ్రోస్ గురించి కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఐ బ్రోస్ ను ఇంపార్టెంట్ ఫేషియల్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్స్ కు అలాగే ఎక్స్ప్రెషన్స్ లో ఐ బ్రోస్ గొప్ప రోల్ ప్లే చేస్తాయి. ఈ ఐబ్రోస్ అనేవి మీ లుక్ ను ఎలివేట్ చేయడానికి ఎంత హెల్ప్ చేస్తాయో వీటి గురించి శ్రద్ధ తీసుకోకపోతే లుక్ ను పాడుచేస్తాయి. ఐబ్రోస్ ను రెగ్యులర్ గా ట్రిమ్ చేసుకోవాలి. అలాగే, షేప్ చేసుకోవాలి. కాఫీ: మీ ఐబ్రోస్ లైట్ కలర్ లో ఉన్నట్టయితే వాటికి డార్క్ లుక్ ఇవ్వడానికి కాఫీ టింట్ హెల్ప్ చేస్తుంది. కాఫీ పౌడర్ అనేది ఐబ్రోస్ కు బ్రౌనర్ షేడ్ ను ఇస్తుంది. కాఫీపౌడర్ అలాగే పెట్రోలియం జెల్లీను తీసుకోండి. కాస్తంత కొబ్బరినూనె కూడా అవసరం. వీటన్నిటినీ బౌల్ లో బాగా కలపండి. థిక్ జెల్ గా అయ్యేవరకు కలపండి. ఇప్పుడు ఇంకో కంటైనర్ లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసి గంటపాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయండి. ఐబ్రోకు డార్క్నెస్ ను ఇచ్చే సొల్యూషన్ రెడీ ఐపోయినట్టే. ఇప్పుడు దీన్ని అప్లికేటర్ సహాయంతో ఐబ్రోస్ హెయిర్ పై అప్లై చేయండి. హెన్నా హెన్నాతో కూడా ఐబ్రోస్ ను హైలైట్ చేసుకోవచ్చు. కొంతమంది జెట్ బ్లాక్ కలర్ ను ప్రిఫర్ చేయకపోతే నేచురల్ బ్లాక్ షేడ్ కోసం హెన్నాను ప్రిఫర్ చేస్తారు. హెన్నా వల్ల ఐబ్రోస్ థిక్ గా కనిపిస్తాయి. ఈ రెమెడీ కోసం హెన్నాపౌడర్ తో పాటు కొంత నిమ్మరసం అవసరమవుతుంది. 10 నుంచి 15 రోజులవరకు దట్టమైన ఐబ్రో లుక్ ను అందించేందుకు ఈ రెండు పదార్థాలు హెల్ప్ చేస్తాయి. ఆ తరువాత మీరు మళ్ళీ ప్రాసెస్ ను రిపీట్ చేయాలి. రెండు టీస్పూన్స్ హెన్నాను ఒక బౌల్ లో కలపాలి. ఆ తరువాత కొన్ని చుక్కల నిమ్మరసాన్ని మిక్స్ చేయాలి. పేస్ట్ ను తయారుచేయాలి. ఐబ్రోస్ పై అప్లై చేయాలి. నలభై నిమిషాల తరువాత వాష్ చేయాలి. హెన్నా స్కిన్ పై మరకలు కలిగించకుండా ఉండాలంటే ఐబ్రో ఏరియా చుట్టూ టేప్ తో కవర్ చేయండి. ఐ బ్రోస్ పేస్ట్ ను వాచ్ చేసేశాక ఈ టేప్ ను రిమూవ్ చేయండి. యాక్టివేటెడ్ చార్కోల్: ఐబ్రోస్ ను మరింత దట్టంగా మార్చేందుకు ఇది ఒక ప్రభావవంతమైన ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. మీకు కావాల్సినదల్లా చార్కోల్ క్యాప్సూల్. అలాగే కొంత కోకో పౌడర్. అలోవెరా జెల్ కూడా అవసరమే. యాక్టివేటెడ్ చార్కోల్ క్యాప్సూల్ ను ఒక బౌల్ లోకి తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ కోకో పౌడర్ అలాగే ఒక టీస్పూన్ అలోవెరా జెల్ ను తీసుకోండి. దట్టంగా పేస్ట్ లా మార్చండి. వీటిని ఒక బాటిల్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయండి. ఇది కొన్నివారాల వరకు అలాగే ఉంటుంది. ఈ సమయంలో దీన్ని కనీసం ఐదు సార్లు వాడవచ్చు. నేచురల్ రెమెడీస్ఐబ్రోస్ దట్టంగా మారేందుకు కొన్ని రెమెడీస్ ను పాటించవచ్చు. అవేంటంటే...1. క్యాస్టర్ ఆయిల్: ఇది పాత పద్దతే. కానీ ఎంతో ప్రభావవంతమైనది. ఐబ్రోస్ థిక్ గా మారేందుకు హెల్ప్ చేస్తుందిది. ఇందులో ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే మినరల్స్ లభిస్తాయి. హెయిర్ ఫాలికల్స్ కు పోషకాలనిస్తాయి. ఐబ్రోస్ రూట్స్ కి క్యాస్టర్ ఆయిల్ ను ప్రతిరోజూ అప్లై చేస్తే ఫలితం ఉంటుంది. హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. దాంతో, ఐబ్రోస్ థిక్ గా అలాగే స్ట్రాంగ్ గా మారతాయి. కొన్నిచుక్కల క్యాస్టర్ ఆయిల్ ను తీసుకుని ఐబ్రోస్ పై ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేయాలి. ముప్పై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత మేకప్ రిమూవర్ తో తుడిచేయాలి. వెచ్చటినీళ్లతో ఫేస్ ను వాష్ చేసుకోవాలి. ఐతే, క్యాస్టర్ ఆయిల్ ను వాడేముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. 2. కొబ్బరినూనె: కొబ్బరినూనె కండిషనర్ గా అలాగే మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. ప్రతి రోజూ కొబ్బరినూనెను ఐబ్రోస్ పై అప్లై చేస్తే మంచి రిజల్ట్ స్ వస్తాయి. వారంలో ఒకటి రెండు సార్లు వాడినా రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. దూదిని తీసుకుని కొబ్బరినూనెలో ముంచి దాంతో ఐబ్రోస్ పై ఆయిల్ ను అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఫేస్ ను వాష్ చేసుకోవాలి. 3. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ మరియు ఈ ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్ కు హెల్ప్ చేస్తాయి. ఆలివ్ ఆయిల్ డ్రాప్స్ ను ఫింగర్ టిప్స్ పై పోసి జెంటిల్ గా ఐబ్రోస్ పై మసాజ్ చేయాలి. రెండు గంటల తరువాత వాష్ చేసుకోవాలి. ఇలా రోజులో ఒక్కసారి చేస్తే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. సరైన ఐబ్రో షేప్ అనేది ఐస్ ను సరిగ్గా ప్రెజంట్ చేయగలవు. మీకు సూట్ అయ్యే షేప్ కాకుండా వేరే ఎదో షేప్ ను మీరు కన్సిడర్ చేస్తే మీ వయసుకంటే ఎక్కువ వయసు కనిపించే అవకాశం ఉంది. అలాగే, కోపంతో పాటు అలసట కలిగిన లుక్ వస్తుంది. ఐతే, ప్రత్యేకంగా ఇదే రైట్ షేప్ అని ఏదీ లేదు. ముఖానికి, అలాగే ఐ షేప్ కు తగినట్టుగా ఐబ్రోస్ ను షేప్ చేసుకోవాలి. ఐబ్రోస్ థిక్నెస్ కూడా మీ లుక్ ను ఎలివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కొంతమంది తమ ఐబ్రోస్ ను థిక్ గా ఉంచుకోవడాన్ని ప్రిఫర్ చేస్తారు. టైమ్ టు టైమ్ షేప్ చేసుకుంటారు. హెయిర్ గ్రోత్ కూడా కొంచెం దట్టంగా ఉండేలా చూసుకుంటారు. సెలూన్ లో రైట్ టూల్స్ తో ప్రొఫెషనల్స్ హెల్ప్ తో ఈ రిజల్ట్ వస్తుంది. ఐతే, ఇంట్లో కూడా థిక్ లుకింగ్ ఐబ్రో లుక్ ను సొంతం చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా కొన్ని టెక్నీక్స్ పై ఫోకస్ పెట్టడం. మరి అవేంటో తెలుసుకుందామా .. ఇలా ఇంట్లోనే ఐబ్రోస్ గురించి కేర్ తీసుకుంటే ఐబ్రోస్ మీ ఫేషియల్ ఫీచర్స్ ను బాగా ఎలివేట్ చేస్తాయి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2EGIJdg

TikTok Rival Triller Says Made $20 Billion Bid With Centricus for Assets

Triller executive chairman Bobby Sarnevesht said on Friday that the short-video app had made a $20 billion offer with investment firm Centricus Asset Management for the assets of rival TikTok that...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lvEWAk

నాగ్ బర్త్‌ డేకి చైతూ సర్‌ప్రైజ్.. ‘మనం’ దర్శకుడితో కొత్త మూవీ టైటిల్ ఫిక్స్

టాలీవుడ్ మన్మథుడు బర్త్ డే పురస్కరించుకుని అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు నాగ్ తనయుడు అక్కినేని నాగచైతన్య. ‘మనం’ చిత్రంతో అక్కినేని ఫ్యామిలీకి ఎవర్ గ్రీన్ చిత్రం అందించిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు నాగచైతన్య. ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ నాగార్జునకు బర్త్ డే విషెష్ అందించారు నాగార్జున. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నాగచైతన్యకు ఇది 20వ మూవీ కావడం విశేషం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రంలో చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో చైతూ సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఫిదా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల మరోసారి తన లక్కీ హీరోయిన్ సాయి పల్లవి రిపీట్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2G9LSmH

Poco X3 Confirmed to Feature a 64-Megapixel Primary Camera

Poco X3 64-megapixel camera sensor has been confirmed by a company executive on Twitter. The new confirmation comes days after the rumour mill claimed the primary camera details of the Poco X3. The...

from NDTV Gadgets - Latest https://ift.tt/32BQjhx

Apple Agrees to Pay $9.75 Million to Settle Powerbeats 2 Issues Lawsuit

Apple has agreed to pay $9.75 million to settle a class-action lawsuit in relation to charging issues with the company's Powerbeats 2 wireless earphones. Apple is denying all allegations, but still...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jnGASO

Chadwick Boseman, Black Panther Star, Dies at 43 After Battle With Cancer

Chadwick Boseman, star of the ground-breaking superhero movie Black Panther, has died after a private four-year battle with colon cancer, his publicist told AFP Friday.

from NDTV Gadgets - Latest https://ift.tt/31DJAEA

Friday 28 August 2020

Elon Musk Wants YOU to Build a Brain-Computer Interface

Elon Musk isn't content with electric cars, shooting people into orbit, populating Mars and building underground tunnels to solve traffic problems. He also wants to get inside your brain with...

from NDTV Gadgets - Latest https://ift.tt/31Anv9Y

TikTok Celebrities Criminally Charged After LA House Parties

TikTok celebrities Bryce Hall and Blake Gray are facing criminal charges after they hosted recent parties in the Hollywood Hills despite the city's ban on large gatherings during the coronavirus...

from NDTV Gadgets - Latest https://ift.tt/2YIJ9XR

Facebook Failure to Remove Militia Page a 'Mistake': Zuckerberg

Facebook Chief Executive Officer Mark Zuckerberg took responsibility and faulted his company for not removing the page and event for a militia group before two people were killed at a protest in...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jpNLdk

Apple Blocks Fortnite Maker Epic Games From Game Developer Tools

Apple said Friday it has followed through on its decision to block the maker of Fortnite from developer tools needed to update games on its mobile devices.

from NDTV Gadgets - Latest https://ift.tt/3lwubO8

‘వైల్డ్ డాగ్’ లుక్‌తో సర్ ప్రైజ్ చేసిన నాగార్జున.. NIA ఏజెంట్‌గా అలీ రెజా

నేడు టాలీవుడ్ మన్మథుడు బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘వైల్డ్ డాగ్’ సెకండ్‌ లుక్‌ని విడుదల చేశారు. టైటిల్ రోల్‌లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’ చిత్రంలో నాగార్జున.. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించబోతున్నారు. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజా పోస్టర్‌లో నాగార్జున గన్ గురిపెట్టి సీరియల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా ఎన్ ఐ ఏ ఏజెంట్‌గా.. హీరోయిన్ ఆర్య పండిండ్ రా స్పెషల్ ఏజెంట్‌గా కనిపిస్తున్నారు. త్వరలో ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32BFITN

Nagarjuna బ‌ర్త్ డే స్పెష‌ల్ : ప్రియ‌మైన మ‌న్మ‌థుడు.. పురుషోత్త‌ముడెలా?‌

"కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కనురెప్పలకే మాటొస్తే" సీతారాముడు రాస్తున్నాడు.. ఆమ‌ని వ‌ర్ణాల‌ను వేటూరి వివ‌రిస్తున్నాడు. ఈ రెంటి న‌డుమా..ఎన్నో సంతోషాలను గుర్తుతెచ్చుకుని త‌న పండుగ పుట్టిన రోజు పండుగ‌కు మ‌రో అర్థం వెతుకుతున్నాడు కింగ్ . నాన్న దిద్దిన ఓన‌మాలు.. రాఘ‌వుడు చేయించిన పాద పూజ‌లు ఏఎన్నార్ కు సెంటిమెంట్లు లేవు.. రాఘ‌వేంద్ర‌రావుకు సెంటిమెంట్ పండాల్సిందే అన్న‌ది ప‌ట్టు.. అలా ఓ స‌‌న్నివేశం.. అల్లాత‌త్వము న అల‌రారే రామ‌క‌థ.. అని రాశారు వేద‌వ్యాస.. సీన్ తీస్తున్నారు.. ఇప్ప‌టివ‌ర‌కూ నాన్న‌కు పాద‌పూజ చేయ‌లేదు ఇప్పుడు నీవు చేయాలి.. ఈ స‌న్నివేశాన చేయాలి.. అంటూ రాఘ‌వేంద్ర‌రావు(రాఘ‌వుడు)..చెప్పారు.. నాగార్జున‌కు (రామ‌దాసు పాత్ర‌ధారికి) అలా శ్రీ‌రామ దా సు చిత్రంలో క‌బీరు పాత్ర‌ధారి ఏఎన్నార్ కాళ్లు క‌డిగి నెత్తిన నీళ్లు చ‌ల్లుతాడు. నాన్నంటే అది.. కృష్ణా తీరాన నాన్న... కృ ష్ణా తీరం నుంచి భాగ్య న‌‌గ‌రి వ‌ర‌కూ నాన్న.. నాన్న.. ర‌మ‌ణుడి దారిలో న‌డి చాడు .. ముళ్ల‌పూడి రమ‌ణుడి దారిలో న‌డిచాడు.. నాన్న చెప్పిన దారిలో నాగార్జున న‌డిచాడు.. నాన్న పురుషోత్త‌ముడ‌య్యాడు.. పురుషోత్త‌ముడి క‌థ‌కు కార‌కంగా నిలిచాడు కొడుకు.. ప‌గ‌లే గ‌డిచినా రాత్రే విడిచినా ఈ నాన్న ద‌గ్గ‌ర ఆ కొడుకు ఓన‌మాలు నేర్చు కుంటూనే ఉంటాడు. అత‌డు అక్కినేని నాగార్జున నేడు జ‌న్మ‌దినం.. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాకుళం వాసి, ర‌చ‌యిత ర‌త్న‌కిశోర్ శంభుమ హంతి వెల్ల‌డిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం ఇది. క‌న్నుల్లో నీ రూప‌మే ... కొత్త షో స్టార్ట్ అవుతుంది.. సీజ‌న్ నాలుగు అని పేరు పెట్టారు.. బిగ్ బాస్ రానున్నాడు.. అంత‌కుమునుపో త‌రువాతో ఇంకొన్ని కొత్త ప‌నుల‌కు శ్రీ‌కారం దిద్దాడు. నిదరెందుకే నిజ‌మెందుకే ఈ క‌ల‌ల గాలి నాకు హాయి ఊయ‌లే అని పాడుకున్నాడు.. ఓ పాట‌లో విన్న ‌విధంగా ఇప్పుడిలా గుర్తుకువ‌స్తున్నాయా వాక్యాలు.. క‌న్నుల్లో త‌న రూపాన్నీ దాచుకుని.. మ‌ది దాచుకున్న ర‌హ‌స్యాల‌ను వెల్ల డించాడు.. నిన్నే పెళ్లాడ‌తా అని అన్నాడు..కృష్ణ వంశీతో ఆ సిని మా..ఇంత‌కూ.. ఈ సోగ్గాడికి ఇప్పుడు వయ‌స్సెంత.. మ‌రి! భాష మౌనం అయితే భావం ఏమౌతుంద‌ని.. ఆ భావమే పాటవుతుంది.. అలాంటి శ్వాసల్లో .. అలాంటి పాట‌ల్లో ఎదిగి ఒదిగాడు.. న్యూ ఏజ్ ఫిల్మ్ కు కేరాఫ్ అయ్యాడు. ఆ క‌వి అన్న‌ట్లే ఎంద‌రో నీలి క‌న్నుల్లో తేలియాడాడు.. గ్రీకువీరుడ‌య్యాడు.. అక్కినేని రాకుమార డ‌య్యాడు.. రామ‌దాసుడ‌య్యాడు.. అన్న‌మ‌య్య సినిమాతో మ‌రొక మ లుపున‌కు చేరుకుని ఏడు కొండ‌ల వాడి దీవెన‌లందుకు న్నాడు.. సినిమా బాగున్నా బాగుండ‌క పోయినా వాటి ఫ‌లితాల‌కు సం బంధం లేదు.. అయినా ఈ రాకుమారుడు వెన్నెల్లో ఆడ పి ల్లల‌తో ఆడుకున్నాడు.. అంద‌మ‌యిన ప్రేమ కావ్యాల‌కు చిరునా మాలు రాసి అంతా తానే అయ్యాడు. ఆ పాటల్లో ప‌ల్లెలు పచ్చందనాలూ, ఆ పాటల్లో కొన్ని ఆధునిక సంప్ర‌దాయాలూ, ఆ సినిమాల‌లో కొన్ని ప్ర‌యోగ‌రీతులు ఎంతో పేరు తెచ్చాయి. ఎంతో ఉన్నతుణ్ని చేసేందుకు స‌హ‌క‌రించాయి. టెలివిజ‌న్ మాధ్య‌మాన ..ఓ సారి చిరూతో అన్నారాయ‌న ఇలా మీరూ నాతో డ‌బ్బులు పెట్టండి ఏం కాదు మంచి లాభాలొస్తాయి అని! ఆ మాట న‌చ్చి మాటీ వీ అధిప‌తిగా చిరు నిలిచారు. నిమ్మ‌గ‌డ్డ మొద‌లైన దిగ్గ‌జ వ్యాపారుల‌తో క‌లిసి ఆ సంస్థ‌ను ఉన్న‌తికి తీసుకువెళ్లారు. మ‌రోవైపు టెలివిజ‌న్ మాధ్య‌మాల‌కే ఓ సంచ‌ల‌నంగా నిలిచి మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనే కార్య‌క్ర‌మానికి రూపుదిద్దారు. సామాన్యుల క‌థ‌ల ‌కు క‌న్నీళ్ల‌కు వారి జీవితాల‌కు కొన్ని అర్థాలు వెతికి వారిలో కొత్త ఉత్సాహం నింపారు.. సామాన్యులంతా అక్క‌డ సెల‌బ్రిటీలు అ య్యారు.. సెల‌బ్రిటీలూ ఈ షో చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. నాగార్జున బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అవును! ఎవరు కాద‌న్నారు..కానీ కొన్ని జీవితాల‌కు బ్యాక్ బోన్ కూడా! ఓ షోలో ఓ పార్టిసిపెంట్ త‌న స్వ‌హ‌స్తాల‌తో చెప్పులు కుట్టి బ‌హుమ‌తిగా ఇస్తే గుండెల‌కు హ‌త్తుకున్నాడు. సాలూరు స్వ‌స్థ‌లంగా ఉండే ఓ సాఫ్ట్ వేరు కుర్రాడి జీవితాన్ని అంద‌రికీ చెప్పి స్ఫూర్తినింపాడు.ఇలా ఎన్నో.. ఆ ఇద్ద‌రు మార్చారు శివ సినిమా లేక‌పోతే ఆయ‌న లేడు.. వెరీ రొటీన్ రామూ లేక‌పోతేనే శివ లేదు.. ఇంకా రొటీన్.. ఎవ‌రు లేక‌పోయినా ఆ సినిమా లే దు ఇది పెర్ఫ‌క్ట్ .. ఇంజినీరింగ్ చ‌దివిన కుర్రాడు ఒక‌డు.. ఇంకొక‌డూ అదే బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చిన వాడు.. విజ‌య‌వాడ కాలేజీ గుర్తుల‌తో సినిమా.. ఇళయ‌రాజా ప్రాణం పోశాడు.. మ‌ళ్లీ ప్రాణం పోశాడు ఈసారి గీతాంజ‌లితో.. మ‌ణి మ‌ళ్లీ లైఫ్ ఇచ్చాడు.. ఆ ఇద్దరూ లేకుంటే.. అంద‌మ‌యిన జీవితానికి ఎన్ని అర్థాలు వెతికి తీరేవాడా! వారే జీవితానికో మ‌లుపు.. వారు మ‌రింత మెరుగుద‌లకు కార ణం. ఈవేళ ఇంకొన్ని కొత్త ప్ర‌యత్నాల్లో ఆయ‌న ఉన్నారు. మంచి మామ, మంచి నాన్న ఈ రెండూ మంచిత‌నాలూ ఆయ‌నలో ఉన్నాయి. అవే అక్కినేని వారింటి వార‌సుడికి వెల‌లేని సంప‌ద‌లు కావాలి... నాగార్జున అను న‌వ యువ సామ్రాట్..కు జ‌న్మ‌దిన శు భాకాంక్ష‌లు.. సౌంద‌ర్యాలు చిందే యామిని వేళ‌ల్లోనూ.. సంధ్యా కాంతుల్లో శ్రీ‌ర‌స్తుల స‌రిగ‌మ‌ల్లోనూ..ఇంకొన్నింటిని పోగేస్తూ.. మధురిమ‌లు వింటూ వింటూ.. - ర‌త్న‌కిశోర్ శంభుమహంతి


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lt5Jx8

Realme 7 Specifications Leaked Ahead of September 3 Launch

Realme 7 specifications have been allegedly leaked, ahead of its India launch on September 3. The leak follows the Realme 7 Pro specifications leak that was shared by the same tipster on Twitter.

from NDTV Gadgets - Latest https://ift.tt/2G6s6IL

Google Duo Video Calls to Be Available on Android TV Soon

Google Duo will be coming soon on Android TV for beta in the form of a native app, through which you'll be able to directly initiate one-on-one and group video calls from your TV via Google Duo.

from NDTV Gadgets - Latest https://ift.tt/2QyZWYW

Dell's Quarterly Results Beat Estimates on Remote Work Boost

Dell on Thursday posted a smaller-than-expected drop in quarterly revenue and beat profit estimates on robust demand for its notebooks and software products for remote work and online learning.

from NDTV Gadgets - Latest https://ift.tt/3b6A6Vi

The King's Man Release Date Delayed by Over Five Months

The King's Man will be late. Disney has delayed Matthew Vaughn's period prequel to the Kingsman series by over five months, with The King's Man release date pushed back from September 18 to...

from NDTV Gadgets - Latest https://ift.tt/2D7bu2r

Redmi 9i Said to Launch in India Soon, May Be a Rebranded Redmi 9A

Redmi 9i may be Xiaomi's next budget friendly offering in the Redmi 9 series in India. It is expected to be a rebranded Redmi 9A that launched in Malaysia back in June, along with the Redmi 9C.

from NDTV Gadgets - Latest https://ift.tt/3lto0KG

Tesla Nevada Factory Was Target of 'Serious' Cyber-Attack: Elon Musk

Elon Musk said on Thursday that a Tesla factory in Nevada was the target of a "serious" cyber-security attack, confirming a media report that claimed an employee of the company helped the FBI thwart...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QxdMuF

Samsung Galaxy Z Fold 2 Set to Launch on September 1

Samsung Galaxy Z Fold 2 is set to receive an official announcement at the Unpacked Part 2 virtual event on September 1. Meanwhile, the Samsung UK retail site has been spotted spilling the beans on the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2YG7Iod

Sony Xperia 5 II Specifications, Renders Leaked Ahead of Launch

Sony Xperia 5 II full details have been leaked. A report says that the phone will sport a 6.1-inch display, Snapdragon 865 SoC, 8GB of RAM, 128Gb of storage and a triple rear camera setup.

from NDTV Gadgets - Latest https://ift.tt/3b3WX3R

GoPro Launches Live Streaming Service for Plus Subscribers

GoPro said on Thursday its premium GoPro Plus subscribers can now live stream their treks, rides, and swims directly on to its website.

from NDTV Gadgets - Latest https://ift.tt/34FP9o3

Thursday 27 August 2020

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్.. 14 మందిలో ఐదుగురు యాంకర్లు!

బిగ్ సీజన్ 4 ఎప్పుడన్నదానిపై క్లారిటీ ఇస్తూ స్టార్ మా అఫీషియల్ ప్రోమో విడుదల చేయడంతో ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6 సాయత్రం 6 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానుంది. తెలుగు టెలివిజన్‌లోఅత్యుత్తమమైన రేటింగ్స్ సాధించి వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అదిపెద్ద నాన్ ఫిక్షన్ షో బిగ్ బాస్‌ను ఈసారి వినూత్న తరహాలో అందించనున్నారు. వంద రోజులకు పైగా బుల్లితెర అభిమానులకు వినోదాన్ని పంచనున్నారు. అయితే ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఇక సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్నదానికి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా నోయల్, టీవీ 9 దేవి నాగవల్లి, రఘు మాస్టర్, దేత్తడి హారిక తదితరులు పేర్లు గట్టిగా వినిస్తుండగా.. రీసెంట్‌గా 14 మందితో కూడి లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. 1. టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి (TV9 News Presenter Devi) 2. యాంకర్ లాస్య మంజునాథ్ (anchor lasya manjunath) 3. జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash) 4. గంగవ్వ (YouTube Gangavva) 5. కొరియోగ్రాఫర్ కమ్ డాన్స్ మాస్టర్ అమ్మా రాజశేఖర్ (Amma Rajasekhar) 6. సింగర్ నోయల్ (Noel Sean) 7. హీరోయిన్ మొనాల్ గుజ్జార్ (Actress Monal Gajjar) 8. యాంకర్, యూట్యూబ్ సంచలనం దేత్తడి హారిక (Dethadi Harika) 9. యాంకర్ అరియానా గ్లోరీ (Anchor Ariyana Glory) 10. యాంకర్ తనూజా పుట్టాస్వామి (Anchor Thanuja Puttaswamy) 11. టీవీ నటుడు సయ్యద్ సోహైల్ (Syed Sohel Ryan) 12. యూట్యూబ్ స్టార్ మెహబూబా దిల్ సే (mehaboob dil se) 13. కరాటే కళ్యాణి (Karate Kalyani) 14. డైరెక్టర్ సూర్య కిరణ్ (Director Surya Kiran) అయితే ఈ 14 మందిలో సగానికిపైగా యాంకర్లు.. టీవీ ఇండస్ట్రీలకు చెందినవారే కాగా.. గతంతో పోల్చుచుంటే కాస్త సినీ గ్లామర్ తగ్గినట్టుగానే అనిపిస్తుంది. అయితే ఇది లిస్ట్‌లో ఉన్నవాళ్లు షోలు కనిపిస్తారా లేదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకూ ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31xRnUr

రిజర్వేషన్లు తీసుకోవడం అంటే అడుక్కుతినడమే: పూరీ కామెంట్స్‌పై దళిత సంఘాల ఆగ్రహం

‘పేదలకు ఓటు హక్కు తీసేయాలి.. నిరక్షరాస్యులకు ఓటు పీకేయాలి.. తెల్ల రేషన్ కార్డులు ఉన్నోడు ఓటుకి అనర్హుడు. పేద పిల్లలకు ఉచిత విద్య ఉండకూడదు.. రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఉండకూడదు.. పుట్టాం కదా ఓటు గుద్దేస్తాం అంటే కుదరదు. లీడర్స్ జీవితాలను తాగుబోతుల చేతుల్లా ఎలా పెడ్తాం’.. ఈ మాటలు ఎవరో తాగుబోతు తాగి వాగుతున్నవి కాదు.. సన్సేషనల్ డైరైక్టర్ నోటి నుంచి వచ్చిన మంటపుట్టించే మాటలు. లాక్‌డౌన్ వేళ సినిమా షూటింగ్స్ లేక ఖాళీగా ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోడ్‌కాస్ట్ ఆడియోలతో తన అభిప్రాయలు తెలియజేస్తున్నారు. తాజాగా దేశంలో ఉన్న పేదలు, రిజర్వేషన్లపై సంచలన కామెంట్స్ చేశారు. అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, అబ్దుల్ కలాం, రజినీకాంత్ వీళ్లందరూ పేద కుటుంబంలోనే పెట్టారు. పేదోడిగా పుట్టడం తప్పు కాదు.. పేదోడిగా చావడం తప్పు. ఈ దేశంలో గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్‌లు తీసుకుని చాలామందికి పేదోడిగా బతకడం అలవాటైపోయింది. గవర్నమెంట్ వాళ్లకి సాయం చేయడం కరెక్ట్ కాదు. అందుకే చిన్న చిన్న మార్పులు రావాలి. వైట్ కార్డ్ ఉన్న వాళ్లకు ఓటు హక్కు రద్దు చేయాలి. నీ జీవితమే నీకు బరువుగా ఉన్నప్పుడు ఒక లీడర్ జీవితం నీ చేతిలో ఎలా పెట్టమంటావ్ అని అడగాలి. నీకు రేషన్ కార్డ్ కావాలంటే ఓటు ఫెసిలిటీ కోల్పోతావ్ అని చెప్పాలి. చెప్తే వాడికి ఏది అవసరమో అదే తీసుకుంటారు. అప్పుడు నిజంగా కష్టంలో ఉన్నవాడు వైట్ కార్డ్ తీసుకుంటాడు. ఓటు హక్కు కావాలనుకున్నవాడు దాని కోసం కష్టపడతాడు. ఓటు హక్కు లేకపోతే సారా పేకెట్ ఉండదు. సారా ప్యాకెట్‌తో లీడర్‌ని డిసైడ్ చేసే బ్యాచ్ ఎలక్షన్‌కి ముందే కట్ అయిపోద్ది. లేకపోతే మన నాయకుల జీవితాలు తాగుబోతుల చేతుల్లో ఉంటాయి. పేద పిల్లలకు మినిమమ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం గవర్నమెంట్ బాధ్యత. కాని ఉన్నత విద్య చదువుకోవాలంటే లోను ఇచ్చి దాన్ని రీప్లేస్ చేయాలని గవర్నమెంట్ అడగాలి. వాడు ఉద్యోగం చేసి గవర్నమెంట్ అప్పు తీర్చాలి. గవర్నమెంట్ ఫండ్ రూపాయితో సహా వస్తుంది. అప్పుడే స్టూడెంట్స్ ఒళ్లు దగ్గర పెట్టుకుని చదువుతారు. అలాగే రిజర్వేషన్లు కూడా కులాన్ని బట్టి ఇవ్వకూడదు.. పేదోడు ఏ కులంలో ఉన్నా.. సపోర్ట్ చేయాలి. వాళ్ల పిల్లలు చదువుకునేలా చేయాలి. బూత్‌లో ఓటేసే ప్రతి ఒక్కడు అవగాహనతో ఉండాలి. నిరక్షరాస్యులకు ఓటింగ్ తీసేయాలి. ఓటు వేయాలి అంటే మినిమమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. పుట్టాం కదా గుద్దేస్తాం అంటే.. కుదరదు. అందరూ ఓటు హక్కు సంపాదించుకోవాలి. ప్రభుత్వాలని లీడర్స్‌ని అడుక్కోవడం మానేద్దాం. ప్రపంచంలో ఏ జంతువు మరే జంతువు దగ్గర చేయి చాచదు. తిండి కోసం కష్ట పడుతుంది లేదంటే చస్తుంది. నీ జాతిని తిడితే నీకు కోపం వస్తుంది కదూ.. మరి అదే జాతిని కించపరుస్తూ పేదోడిలా ప్రభుత్వం ముందు నిలబడటం తప్పుకాదా?? కష్టపడు.. నీ జాతి తలెత్తుకునేలా చేయి.. మా జాతికి రిజర్వేషన్లు వద్దు.. వేరే వాడికి ఇవ్వండి అని చెప్పేలా ఉందాం.. అప్పుడు మారుతుంది ఇండియా. కాళ్లు చేతులు బాగున్నప్పుడు మన చేతులు చాచొద్దు. నా ఒక్క కుటుంబాన్ని నేను చూసుకోలేనా?? ఆ ట్రైన్ పేరు ఏంటి గరీబ్ ఎక్స్ ప్రెస్‌నా?? నా దేశంలో అలాంటి పేరు తీసెయ్.. నా సాంప్రదాయం ఏంటి సంస్తృతి ఏంటి?? నాదేశంలో ఇలాంటి పేరు ఏంటి?? నీ యబ్బా.. అని అందరం చెప్పేలా ఉందాం.. జన గణ మన’ ఓ రేంజ్‌లో స్పీచ్ ఇచ్చారు దర్శకుడు పూరీ జగన్నాథ్. అయితే పూరీ కామెంట్స్‌పై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సిన ఓ దర్శకుడు ఒక వర్గాన్ని టార్గెట్ చేసి రాజ్యాంగాన్నే హేళన చేయడం దారుణం అని పూరీకి కౌంటర్లు ఇస్తున్నారు. పేదల ఏమైపోతారని ఆలోచించకుండా.. లీడర్ ఏమైపోతారని ధనిక వర్గాల కోసం తపన పడుతున్న పూరీపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. Read Also: పూరీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పలు దళిత సంఘాలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుండగా.. రాజేష్ మహాసేన దళిత నాయకుడు పూరీని బండబూతులు తిడుతూ ప్రశ్నలు సంధించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘పూరీ జగన్నాథ్ దళితుల పట్ల ఎంత విషం దాచుకున్నాడో ఆయన మాటలను బట్టి అర్థమౌతుందని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లంటే నీకు అంత చులకనా?? తెల్ల రేషన్ కార్డు ఉంటే ఓటు హక్కు తీసేయాలని అంటున్నావ్.. అదే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లు నీ సినిమాలు చూడకపోతే.. బొచ్చు పట్టుకుని రోడ్డు మీదికి వస్తావ్.. నీ సినిమాలు చూసేది చప్పట్లు కొట్టేది.. హంగామా చేసిది.. మాస్ ఆడియన్స్.. మాస్ ఆడియన్స్ అంటే తెల్లరేషన్ కార్డ్ ఉన్నవాళ్లే.. మల్టీ ప్లెక్స్‌లలో సినిమాలు చూసేవాళ్లు కాదు. చదువులేని వాడికి ఓటు హక్కు ఉండకూడదంటున్నావ్ సరే.. మరి చదువుకోని వాడు పోటీ చేయకూడదని చెప్పగలవా?? చదువుకోని వాడి చేతిలో ఒక లీడర్ భవిష్యత్ ఎలా పెట్టాలనా?? చదువులేని వాడి చేతిలో ప్రజల జీవితాలు ఎలా పెట్టాలని ఆలోచించవా? ఆ ప్రశ్న కనుక వేశావ్ అనుకో.. ఇండస్ట్రీ నుంచి బయటకు గెంటేస్తారు. లీడర్లపై మాట్లాడలేక పేదలపై మాట్లాడతావా? రిజర్వేషన్లు కులాన్ని బట్టి కాక.. పేదరికాన్ని బట్టి ఇవ్వాలా?? మంచిదే కాని.. దాంతో పాటు అసలు కులం ఎందుకు ఉండాలి? రిజర్వేషన్లు రద్దు చేయాలన్నావ్ బాగానే ఉంది. మరి కులాన్ని రద్దు చేయాలని నీ నోటి నుంచి ఎందుకు రాలేదు? పుట్టుకతో వాడు అంటరాని వాడు.. తక్కువ వాడు అయినా పర్లేదు కాని.. నీ కులం అలాగే ఉండాలి.. కులం వల్ల వచ్చే రిజర్వేషన్లు వద్దా?? అసలు నువ్ మనిషివేనా?? ఒక జంతువు ఇంకో జంతువు దగ్గర చేయి చాపదా? పూరీ.. ఒక జంతువు ఇంకో జంతువు చేత ఎక్స్ పోజింగ్ చేయించి బతుకుతుందా?? జంతువు జంతువులాగే బతుకుతుంది.. దానికి కులం ఉండదు, మతం ఉండదు, లంచం ఉండదు.. తక్కువ ఎక్కువ ఉండదు.. మరి మనుషుల్లో ఇవన్నీ ఎందుకు ఉన్నాయి. ముందు అవి పోవాలి కదా..? అది మాట్లాడావా? పూరీ.. ? హీరోయిన్లు తొడల్ని చూపించి బతికే నువ్వు.. తెల్లరేషన్ కార్డ్ ఉన్న పేదల గురించి మాట్లాడతావా?? వాళ్లు సారా పేకెట్ల కోసం ఓటు వేస్తారని మాట్లాడే వెధవ్వి నువ్వు.. కనీసం నీకు కొంచెమైనా జాలి ఉందా.? వాళ్లని తాగుబోతులని అంటావా?? నువ్ తాగి తందనాలు ఆడవా? రిజర్వేషన్లు లేని వాళ్లు తాగడం లేదా?? తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవాళ్లే తాగుతున్నారా?? అంతెందుకు సినిమా ఫీల్డ్‌లో మీ దర్శకుల్లో ఎంతమంది దర్శకులు ఎస్సీ ఎస్టీ వాళ్లు ఉన్నారు? అసలు వాళ్లని రానిస్తున్నారా?? నీ హీరోయిన్లు తొడలపై డబ్బులు సంపాదిస్తున్నావ్ కాబట్టి.. నీ కొడుకుని చదివిస్తున్నావ్.. మరి రిక్షా తొక్కేవాడు కొడుకు పనిచేయకపోతే ఏం చేయాలి? అందుకే పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారు. వీళ్లలో చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువగా ఉన్నారు. వాళ్ల కోసమే రిజర్వేషన్లు. ఉన్నత విద్యకు గవర్నమెంట్ డబ్బులు తీసుకోవాలా? ఈ బోకు సలహాలు ఇస్తున్నావ్.. రాజ్యాంగం రాసిన వాళ్లకు ఇవన్నీ తెలియవా?? ప్రపంచాన్ని చదివిన వాళ్లురా వాళ్లు. వాళ్లని విమర్శించే స్థాయికి బూతు సినిమాలు తీసే నువ్ ఎదిగావా? అసలు దళితులు గురించి వాళ్ల జీవన విధానం గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే చెప్పుతో కొడతాం అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు దళిత సంఘ నాయకులు. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jp7ae6

Resident Evil Netflix Series Announced, Set Across Two Timelines

Resident Evil is officially coming to TV, Netflix has announced. Constantin Film will produce the Resident Evil Netflix series with Andrew Dabb (Supernatural) as showrunner, and Bronwen Hughes (The...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gzr18L

Infinix Zero 8 With Helio G90T SoC, 90Hz Display Refresh Rate Launched

Infinix Zero 8 has been launched in Indonesia. It will go on sale starting August 31 and is priced at IDR 3,099,000 (roughly Rs. 15,700) for a limited time.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YY4eOb

Facebook Says Apple Rejected Its Attempt to Tell Users About App Store Fees

Facebook on Thursday said that Apple rejected its attempt to tell users the iPhone maker would take a 30 percent cut of sales in a new online events feature, forcing Facebook to remove the message to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lmSiPo

Walmart Joins Microsoft Bid to Buy TikTok

Walmart said Thursday it had teamed with Microsoft to buy TikTok, the Chinese-owned short-form video app that has come under fire from the administration of US President Donald Trump.

from NDTV Gadgets - Latest https://ift.tt/3jqzkFB

Amazon Launches Its First Fitness Band 'Halo' That Also Gauges Happiness

Amazon on Thursday unveiled the Halo wristband that goes beyond simply tracking activity to gauging how happy a person is by the sound of their voice.

from NDTV Gadgets - Latest https://ift.tt/3gCtyz8

'In the short-term, the markets will remain volatile'

'There is still scope for selective stockpicking.'

from rediff Top Interviews https://ift.tt/2EHFanf

Review: Made-in-India Raji Is a Feminist Fable and a Strong Debut

Our review of Raji: An Ancient Epic, a video game inspired by Indian mythology that follows Raji as she battles demons with the help of Hindu gods. Raji is out now on Nintendo Switch, and coming soon...

from NDTV Gadgets - Latest https://ift.tt/2D9nC2U

'China is enlarging the spectrum of war'

'They will try more rounds of military level talks and move it to the diplomatic and political domain to see if there is a possibility of a solution -- and like the CDS said if that does not happen, we are prepared.'

from rediff Top Interviews https://ift.tt/2QCUDHD

'Govt is going back on its commitment to the states'

'Because of the COVID-19 pandemic situation today, the revenues of the states have gone down, the GST money is not coming and all the states combined have lost more than Rs 365,000 crore in revenue.'

from rediff Top Interviews https://ift.tt/3hHC69m

Realme Narzo 10A on Sale in India Today via Flipkart, Realme.com

The Realme Narzo 10A base 3GB RAM + 32GB storage variant carries a price tag of Rs. 8,999 while its 4GB + 64GB storage model is available at Rs. 9,999. Both the models come in So Blue and So White...

from NDTV Gadgets - Latest https://ift.tt/3hBz2LP

దీపావళి పండుగపై ధనరాజ్ నీఛమైన కామెంట్స్.. హిందూ సంఘాల ఆగ్రహంతో క్షమాపణ

ఈ మధ్యకాలంలో టీవీ షోలు మరీ బూతు షోలుగా మారిపోయాయి. ఎంటర్ టైన్మెంట్ పేరుతో అక్రమ సంబంధాలు, బాడీ షేమింగ్ నేపథ్యంలోనే ఎక్కువగా పంచ్‌లు వేసుకుంటూ కామెడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జబర్దస్త్ లాంటి పాపులర్ కామెడీ షోలో ఈ తరహా వల్గర్ కామెడీ ఎక్కువగా కనిపిస్తూ ఉండగా.. ఇటీవల జీ తెలుగులో ప్రారంభమైన ‘’ కామెడీ షోలో డబుల్ మీనింగ్ డోస్ బాగా ఎక్కువైంది. ముఖ్యంగా , వేణులు బూతు పంచ్‌లతో రెచ్చిపోతున్నారు. ఫ్యామిలీతో కలిసి చూడాలంటే ఇదేం కామెడీరా బాబూ అనేట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే కేవలం డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు కాకుండా హిందువుల పండుగలపై కూడా కుళ్లు జోకులు వేసి వారి మనోభావాలపై దెబ్బకొడుతున్నారు. తాజాగా ‘అదిరింది’ స్కిట్‌లో భాగంగా కమెడియన్ ధనరాజ్.. దీపావళి పండుగపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీపావళి పండుగకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. ‘దీప అనే అమ్మాయి.. వలీ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతో దీపావళి అనే పేరు వచ్చిందని వ్యాఖ్యానించాడు. హిందువుల పండుగపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు చేయడంతో చాలా మంది ధనరాజ్‌ని ఏకిపారేశారు. ఈ షో చూసిన ప్రేక్షకులతో పాటు.. హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ధనరాజ్ స్పందించాడు. కామెడీ కోసమే ఇలా చేశానని.. దయచేసి క్షమించాలని కోరాడు ధనరాజ్. భవిష్యత్‌లో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానని.. హిందువుల పండుగను కించపరచడం తన ఉద్దేశం కాదని.. ఈ ఇష్యూ ఇంత సీరియస్ అవుతుందని ఊహించలేదంటూ క్షమాపణ కోరారు కమెడియన్ ధనరాజ్. ఇక తాజాగా విడుదలైన ‘అదిరింది’ ప్రోమోలో ధనరాజ్ మాత్రమే కాకుండా వేణు కూడా వల్గర్ పంచ్‌లతో రెచ్చిపోతున్నారు. పెళ్లి కాకకాకముందు ఓన్లీ ‘F’ మాత్రమే చేసేవాడిని అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వేసి జడ్జీలను పకా పకా నవ్విస్తున్నాడు. ప్రేక్షకులు మాత్రం ఈ బూతు కామెడీకి చెవులు మూసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lqv23a

Acharya: ముదిరిన ‘ఆచార్య’ కాపీ వివాదం.. చిరంజీవి వద్దకు పంచాయితీ, కోర్టుకి వెళ్తున్న కొరటాల

‘నీకో దండం మహా ప్రభో.. కథ నువ్ అనుకున్నది.. ఊహించుకుంటున్నది కాదు.. అసలు ఆ బ్యాక్ డ్రాప్ కానేకాదు.. తండ్రీ కొడుకులు ఉండరు.. దేవాదాయశాఖకి నిధులకు సంబంధించినది కానే కాదు.. ఈ కథ నేను చిరంజీవి గారితో రెండేళ్ల నుంచి ట్రావెల్ అవుతూ రాసిన కథ.. దేవుడి దయవల్ల ఈ కథలో చిరంజీవి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి సరిపోయింది కాని.. నీ పిచ్చి మాటలు చూస్తే ఎవరికైనా అనుమానం వచ్చేది.. కావాలంటే రాసిఇస్తా.. ప్రపంచం ముందు చెప్తున్నా’ అంటూ దర్శకుడు ‘ఆచార్య’ కాపీ ఇష్యూపై సీరియస్‌గా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ మూవీ ‘ఆచార్య’ కథ నాదే అంటూ సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చాడు అప్ కమింగ్ దర్శకుడు రాజేష్ మండూరి. 18 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్‌గా చాలా సినిమాలకు పనిచేశానని చెప్తున్న రాజేష్.. రీసెంట్‌గా బి.గోపాల్-గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాకి అసిస్టెంట్‌గా పనిచేశారట. అంతకు ముందు దాదాపు తొమ్మిది మంది దర్శకుల దగ్గర పనిచేశారట. ఇక డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు 2017లో పెద్దాయన అనే కథను రాసుకుని నందమూరి బాలయ్యతో తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ కథను రిజిస్టర్ కూడా చేయించుకున్నాడట. అయితే ఇటీవల తన మిత్రుడు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ద్వారా మైత్రీ మూవీ మేకర్స్‌ వారికి కథను నెరేట్ చేయగా.. వాళ్లు విని కథను రికార్డ్ చేసుకుని కొత్త దర్శకుడితో ఇంత భారీ సినిమాను చేయలేం అని చిన్న కథ ఏదైనా ఉంటే చెప్పమని కోరారని.. అయితే ఇలాంటి హేవీ కథకు కొరటాల శివ అయితే బాగుంటుందని డైరెక్షన్ మీరు కాకుండా ఆయనతో చేయడానికైతే మీ కథను తీసుకుంటామని కోరారని తెలిపాడు ఈ దర్శకుడు. అయితే ఈ కథను ఇవ్వనని అక్కడ నుంచి వచ్చేశానని.. ఆ తరువాత నా ప్రయత్నాల్లో నేను ఉండి.. చెన్నై గెలాక్సీ హాస్పటల్ కుమార్ గారికి నా కథను చెప్పా. తమిళంలో ఆయన రెండు సినిమాలు చేశారు. సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే అయిపోయిందని బాలయ్యను మరో మూడు నెలల తరువాత చేద్దాం అని చెప్పడంతో డైలాగ్ వెర్షన్ రాసుకుంటుండగా.. 2019 అక్టోబర్ 4న సాయంత్రం చిరంజీవి-కొరటాల కాంబినేషన్‌లో ఫస్ట్ లుక్ టైటిల్ విడుదల చేశారని అది చూసి షాకై తాను మోసపోయిన విషయాన్ని రైటర్స్, డైరెక్టర్ అసోషియన్ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిపారు రాజేష్. ఈ సందర్భంగా తనను మోసం చేసిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికూమర్ పైన మైత్రీ మూవీస్ పైన కొరటాల పైన తీవ్ర ఆరోపణలు చేశారు రాజేష్. రవికుమార్ బినామీ సంస్థే మైత్రీ అని వారి ద్వారానే కథ కొరటాలకు వెళ్లిందని.. ఈ ముగ్గురు స్నేహితులు కావడంతో ‘ఆచార్య’ కథ నా దగ్గర నుంచి కొట్టేశారంటూ ఆరోపించారు. అయితే ‘ఆచార్య’ కాపీ ఇష్యూపై రాజేష్ మీడియాకెక్కడంతో దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఓ టీవీ చర్చలో రాజేష్‌తో మాట్లాడిన ఆయన.. ఈ కథ రాజేష్ చెప్పింది కాదని తెలిపారు. ‘ఆచార్య కథ ఇప్పటికే రిజిష్టర్ అయ్యిందని.. కథను మార్చే ఛాన్స్ లేదని రాజేష్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నాడని.. ఈ ఇష్యూని చిరంజీవి గారి దృష్టికి తీసుకుని వెళ్తానని.. ఇంతవరకూ వచ్చింది కాబట్టి కోర్టుకి వెళ్లి లీగల్‌గా యాక్షన్ తీసుకుంటా అంటూ ఆవేశంగా మాట్లాడిన కొరటాల.. యువ దర్శకుడు రాజేష్‌ని బ్లేమ్ చేయొద్దని హెచ్చరించారు. అయితే రాజేష్ మాత్రం.. భగవద్గీత మీద ఒట్టేసి చెప్తున్నా ఆచార్య కథ నాదే.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. కొరటాల కో డైరెక్టరే నాకు ఈ విషయం చెప్పారు.. ఫస్ట్ లుక్ బ్యాక్ డ్రాప్ కూడా నేను రాసిన కథలోదే అంటూ వాదించారు. ఈ విషయంలో కొరటాల కోర్టుకి వెళ్లినా.. జైలులో పెట్టించినా వెనకడుగు వేయనని.. అవసరమైతే జైలుకి వెళ్లి అక్కడ కూర్చుని కొత్త కథ రాసుకుంటానని ప్రాణాలైనా వదిలేస్తానంటూ రాజేష్ గట్టిగా చెప్తున్నారు. అయితే నేను తీసే ఆచార్య కథ నువ్ అనుకున్నదే అని ఎలా అనుకుంటావ్.. ఆ కథ ఇది కాదని నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా కదా అంటూ కొరటాల ఎంత చెప్పినా రాజేష్ మాత్రం పాత పాటే పాడుతూ కొరటాలను మరింత ఇరిటేట్ చేయడంతో ఈ ఇష్యూ చిరంజీవి దగ్గరే తేల్చుకుంటామని.. కోర్టుకి వెళ్తున్నట్టు తెలిపారు కొరటాల.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32ys97K

Canon Cameras Now Support Automatic Backup to Google Photos

Canon's image.canon app on Android and iOS now supports automatic backup to Google Photos. This lets you backup pictures taken with a compatible Canon camera directly to Google's cloud service.

from NDTV Gadgets - Latest https://ift.tt/34yEviN

iPhone 12 Pro Max Tipped to Come With LiDAR Sensor, 120Hz Refresh Rate

iPhone 12 Pro Max is also tipped to come with smaller bezels, a larger display that makes the wide notch 'appear' smaller, and flat slightly curved edges for a smooth overall design. The device is...

from NDTV Gadgets - Latest https://ift.tt/32vAU2o

TikTok CEO Kevin Mayer Quits After Less Than Three Months

TikTok Chief Executive Officer Kevin Mayer has left the company, less than three months after he joined the hit short video app, and US General Manager Vanessa Pappas will replace him on an interim...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jbdd6a

Netflix Cancels Altered Carbon

Altered Carbon is dead for good. Netflix has cancelled the futuristic sci-fi series after two seasons, which were led by Joel Kinnaman and Anthony Mackie, respectively. Altered Carbon was more...

from NDTV Gadgets - Latest https://ift.tt/32nzu9S

Samsung Galaxy M51 India Launch Teased by Amazon

Samsung Galaxy M51 launch in India has been teased by Amazon. The online marketplace has created a microsite that gives us a glimpse of the new Samsung phone.

from NDTV Gadgets - Latest https://ift.tt/2D1vQtJ

Google Location-Tracking Surveillance Tactics Troubled Its Own Engineers

Google's own engineers were troubled by the way the company secretly tracked the movements of people who didn't want to be followed until a 2018 investigation uncovered the shadowy surveillance,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lnbgp7

DJI Osmo Mobile 4 With Magnetic Mount, Gesture Control Launched

DJI Osmo Mobile 4 has been launched and is currently on sale in the US. It comes with impressive features like magnetic mounting, gesture control, and more. It is priced at $149 (roughly Rs. 11,000).

from NDTV Gadgets - Latest https://ift.tt/2YDJKdn

Facebook Says Apple Privacy Changes Will Muck Up Online Ads

Facebook is pushing back on new Apple privacy rules for its mobile devices. The rules require apps to ask users for permission to collect data on what devices they are using and to let ads follow them...

from NDTV Gadgets - Latest https://ift.tt/32ynmTC

Facebook Removes Accounts of 17-Year-Old Arrested Over US Shootings

Facebook on Wednesday removed accounts of a teenager accused of a deadly shooting spree during protests in the US city of Kenosha, along with pages of a local militia.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YCJM57

Wednesday 26 August 2020

అవన్నీ చూసి అతనికి పడిపోయా.. అయినా కాలేజీ రోజుల్లో కామనే కదా! ఇస్మార్ట్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో మాస్ పర్‌ఫార్‌మెన్స్‌తో సత్తా చాటింది . అందాల ఆరబోతతో పాటు ఆకట్టుకునే అభినయం కనబర్చి యువత మనసు దోచేసింది. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ అమ్మడికి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మాంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అయిన ఈ భామ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కాలేజీ రోజుల్లో క్రష్ గురించి చెబుతూ ఓపెన్ అయింది. అప్పట్లో ఓ స్టార్ హీరో మాయలో పడిపోయానని చెప్పి షాకిచ్చింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనే విషయానికొస్తే ఆయనే . ఆ హీరో మాయలోనే పడిపోయానని చెబుతోంది నభా నటేష్. చిన్నప్పటి నుంచే షారుఖ్ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన నటించిన 'కుచ్ కుచ్ హోతా హై' సినిమా అయితే ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదని ఆమె చెప్పింది. కాలేజీ రోజుల్లో షారుఖ్ ఆకర్షణలో పడిపోయా.. అయినా కాలేజీ రోజుల్లో ఇవన్నీ కామనే కదా! అంటూ సీక్రెట్స్ రివీల్ చేసిన నభా.. ఆయనతో నటించే అవకాశం వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రెడీ అనేస్తా అని చెప్పుకొచ్చింది. ఇక.. మీ మనసు దోచుకోవాలనుకునే కుర్రాడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? అనే ప్రశ్నపై బదులిచ్చిన నభా నటేష్.. తనకు ఎప్పుడూ జోక్స్ వేస్తూ నవ్వించే వాడన్నా, జోవియల్‌గా ఉండే వాడన్నా చాలా ఇష్టమని తెలిపింది. అలాంటి వాడినే మొగుడిగా ఎంచుకుంటానని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన 'సోలో బ్రతుకే సో బెటర్', బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'అల్లుడు అదుర్స్' సినిమాల్లో నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hxb5W1

Go Behind the Scenes of Christopher Nolan's Tenet in New Video

Tenet is out in cinemas in several parts of the world this week, and Warner Bros. has released a nine-and-a-half-minute behind-the-scenes featurette to further hype up Christopher Nolan's epic...

from NDTV Gadgets - Latest https://ift.tt/32voNSJ

Realme 7 Series Set to Launch in India on September 3

Realme 7 Pro and Realme 7 are set to launch in India on September 3, Realme on Thursday revealed through an invite sent to the media. The Realme 7 series has also been teased for a faster experience.

from NDTV Gadgets - Latest https://ift.tt/2D3gNQh

Airtel, Vodafone Lose Over 94 Lakh Subscribers in May: TRAI

TRAI report suggests that Bharti Airtel saw a decrease of 47.428 lakh subscribers whereas Vodafone Idea saw a loss of 47.263 lakh subscribers in the month of May. Collectively, Vodafone Idea and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2QughOk

Dota 2 The International Prize Pool Hits Record $34.4 Million

Dota 2's The International esports tournament has reached a prize pool of $34.4 million and is still growing. This prize pool is funded by Battle Pass purchases made by players.

from NDTV Gadgets - Latest https://ift.tt/31xM5Ip

iPhone Users Won't Get Fortnite Updates as Epic Games Digs In

Fortnite will not get updates on iPhones after Epic Games decried Apple's App Store "monopoly" and said it will not remove a direct payment feature it recently enabled.

from NDTV Gadgets - Latest https://ift.tt/3lnonXu

Alibaba Said to Put India Investment Plan on Hold Amid China Tensions

Alibaba has put on hold plans to invest in Indian companies, two sources aware of the plans said, amid souring business relations and rising political tension between China and India after a clash on...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lpJ0ly

సోనూసూద్ ఆశ్చర్యం: 31 వేలకు పైగా విన్నపాలు.. అందరికీ సాయం చేయలేనంటూ ట్వీట్, క్షమించాలని

సోనూ సూద్ .. ఆపద వస్తే ఆదుకునే కనిపించే దేవుడిలా మారిపోయారు. సమస్య ఏదైనా సరే చిటికెలో స్పందిస్తూ మన్ననలు పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారికి కూడా సాయం చేశారు. అయితే అతనికీ కూడా ఒక సమస్య వచ్చింది. సాయం చేయాలని వేలాది మెయిల్స్ రావడంతో.. ఆయనే ఆశ్చర్యపోయారు. మెయిల్స్ వివరాలు, సమస్యలకు సంబంధించి ఇవాళ ట్వీట్

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/2Q7h9IH

బెదిరింపులు తట్టుకోలేక పోతున్నా.. నన్ను చంపేయాలని చూస్తున్నారు.. బోరున విలపించిన టీవీ నటి

కుంకుం భాగ్య సీరియల్ ఫేమ్, టీవీ నటి (19) తనకు ప్రాణహాని ఉందంటూ బోరున విలపించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో పోస్ట్ చేస్తూ ఆవేదన చెందింది. తన తండ్రే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, చంపేస్తా అని వార్నింగులిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాలని కోరింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన తండ్రి రామ్ రతన్ శంఖధార్ తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారని, 28 ఏళ్ల ఓ వ్యక్తితో తన వివాహం జరిపించాలని చూస్తుండగా తాను నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తృప్తి శంఖధార్ చెప్పింది. తన జుట్టు పట్టుకుని లాగుతూ దారుణంగా కొట్టారని, అయితే పోలీసులు తన ఫిర్యాదును స్వీకరించడం లేదని.. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె తీవ్ర ఆవేదన చెందింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Also Read: కాగా ఈ వీడియోపై స్పందించిన రాయ్ బరేలి పోలీసులు తమకు సదరు నటి నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఆమె సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మరవైపు నటి తృప్తి శంఖధార్ తండ్రి రామ్ రతన్ శంఖధార్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. తృప్తి శంఖధార్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘ఓయ్ ఇడియట్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.‌


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31wGGS5

సోనూసూద్ ఆశ్చర్యం: 31 వేలకు పైగా విన్నపాలు.. అందరికీ సాయం చేయలేనంటూ ట్వీట్, క్షమించాలని

సోనూ సూద్ .. ఆపద వస్తే ఆదుకునే కనిపించే దేవుడిలా మారిపోయారు. సమస్య ఏదైనా సరే చిటికెలో స్పందిస్తూ మన్ననలు పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారికి కూడా సాయం చేశారు. అయితే అతనికీ కూడా ఒక సమస్య వచ్చింది. సాయం చేయాలని వేలాది మెయిల్స్ రావడంతో.. ఆయనే ఆశ్చర్యపోయారు. మెయిల్స్ వివరాలు, సమస్యలకు సంబంధించి ఇవాళ ట్వీట్

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/2CO6MGI

Ramu Motion Poster: ఆకాశంలో ఓ మెరుపు.. సింపుల్‌గా సినిమాపై ఆసక్తిరేకెత్తించిన ఆర్జీవీ

గత కొన్నేళ్లుగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ ఎవ్వరికీ అర్థంకాని వినూత్న ఆలోచనలు చేస్తూ తనకు నచ్చినట్లుగా ముందుకెళ్తున్నారు . ఇక ఈ మధ్య కాలంలో అయితే సెటైరికల్, అడల్ట్ కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ తానే అన్నట్లుగా దూసుకుపోతున్నారు. దీంతో వర్మను టార్గెట్ చేస్తూ ఆయన జీవితాన్ని వెండితెరపై చూపించడానికి కొందరు దర్శకులు సినిమాలు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో వేరే ఎవరో ఏంటి? నేనే నా బయోపిక్ మీ ముందుంచుతా.. ఇప్పటివరకు నా జీవితం మొత్తాన్ని 3 పార్టులుగా తెరకెక్కిస్తా అని రీసెంట్‌గా ప్రకటించిన వర్మ తాజాగా పార్ట్- 1 ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ని చాలా సింపుల్‌గా కేవలం సీరియస్ లుక్‌తో రిలీజ్ చేశారు. జోరువానలో ఆకాశంలో మెరుపులాంటి వ్యక్తి ఆర్జీవీ అన్నట్లుగా ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేసి మోషన్ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌పై ఉన్న ఇంటిలిజెంట్‌, బోల్డ్, వియర్డ్, డెవిల్‌, జీనియస్‌, ఎసెంట్రిక్‌, ఇడియట్‌, సోషల్ రాడికల్‌, ఫిలాసఫర్, ఇమ్మోరల్‌, గస్టీ, డ్రంకర్డ్‌ అనే పదాలను చూస్తుంటే ఆర్జీవీ మెంటాలిటీ మొత్తం ఈ సినిమాల్లో చూపించనున్నారని తెలుస్తోంది. Also Read: బొమ్మాకు మురళి నిర్మాణంలో రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో దొరసాయి తేజ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. మొత్తం మూడు పార్ట్‌లు.. ప్రతి పార్ట్ రెండు గంటల నిడివితో ఉండనుంది. అంటే ఆర్జీవీ జీవిత కథను ఏకంగా 6 గంటలు ప్లాన్ చేశారన్నమాట. మొదటి భాగం 'రాము- రామ్ గోపాల్ వర్మ ఆరంభం', రెండో భాగం 'రామ్ గోపాల్ వర్మ అండర్ వరల్డ్‌తో ప్రేమాయణం', మూడవ పార్ట్ 'ఆర్జీవీ- ది ఇంటెలిజెంట్ ఇడియట్' అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ln3hIM

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd