సూపర్ డూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ ఎన్నో భారీ సినిమాలు రూపొందించిన బడా నిర్మాత దగ్గుబాటి ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్గా ఆయన నిర్మాణంలో వచ్చిన 'నారప్ప' సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడంతో సురేష్ బాబు స్టెప్స్పై సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి కన్ను పడింది. దీంతో ఆయనతో ఇంటర్వూస్ చేస్తున్న మీడియా సంస్థలు పలు విషయాలపై ఆయన నుంచి సమాచారం సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అమ్మాయిలతో ఎఫైర్స్, మద్యం సేవించడం లాంటి అంశాలపై ఓపెన్ అయ్యారు సురేష్ బాబు. చిన్ననాటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగిన సురేష్ బాబు.. తండ్రి రామానాయుడు వారసత్వాన్ని కొనసాగుతూ నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో తన మార్క్ చూపిస్తున్నారు. మూవీ మొఘల్ రామానాయుడు ఆయన్ను హీరో చేద్దామనుకున్నా తండ్రి వెళ్లిన దారినే ఎంచుకొని నిర్మాతగా మరో హిస్టరీ క్రియేట్ చేశారు దగ్గుబాటి సురేష్ బాబు. ఎప్పుడూ సినిమా, మూవీ ప్రొడక్షన్ గురించే ఆలోచించే ఆయన తాజా ఇంటర్వ్యూలో అమ్మాయిలతో ఎఫైర్స్ గురించి మాట్లాడటం జనాల్లో హాట్ ఇష్యూ అయింది. కెరీర్ పట్ల తాను చిన్నప్పటి నుంచే ఓ ఆలోచనలో ఉన్నానని, అందుకే నటన వైపు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నా ఆ దిశగా అడుగులు వేయలేదని సురేష్ బాబు తెలిపారు. అలా ఈ రోజు తాను సాధించాలనుకున్నది సాధిచానని అన్నారు. తన పిన్ని భర్తను చూసి తాగడం అనేది జీవితంలో అలవాటు చేసుకోకూడదని ఫిక్సయ్యానంటూ ఓపెన్ అయ్యారు. పిన్ని భర్త మద్యం సేవించడం వల్లనే ఆమె జీవితం నాశనం అయిపోయిందని, ఆ పరిస్థితులు చూసే అలాంటి అలవాట్లను దగ్గరకు రానీయలేదని చెప్పారు. ఇకపోతే అవకాశం ఉన్నా కూడా ఎవరితో ఎఫైర్ పెట్టుకోలేదని సురేష్ బాబు చెప్పడం గమనార్హం. జీవితంలో ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తనకు వచ్చే భార్యకు అన్యాయం చేయొద్దనే ఎలాంటి ఎఫైర్స్ జోలికి వెళ్లలేదని ఆయన తెలిపారు. తనకు వచ్చే భార్య మరొకరితో ఎఫైర్ పెట్టుకుంటే దానిని భరించగల శక్తి లేదు కాబట్టి తాను కూడా అలాంటి ఆలోచనలకు చాలా దూరంగా ఉన్నానని సురేష్ బాబు అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fprFYB
No comments:
Post a Comment