Saturday, 28 August 2021

‘అవి వినడం సంతోషంగా ఉంది’.. సుధీర్‌బాబు సినిమాపై.. ప్రభాస్ దర్శకుడి ప్రశంసల వర్షం

డైనమిక్ హీరో హీరోగా.. ‘పలాస 1978’ ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్‌తో రన్‌ అవుతోంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు పాజిటివ్ రివ్యూనే ఇస్తున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు సెంటిమెంట్‌ కూడా అదిరిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. హీరోయిన్‌గా ఆనంది నటించగా.. సీనియర్ హీరో నరేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఓ విషాదమైన ప్రేమగాథ అయినప్పటికీ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా మామూలుగా చేయలేదు. సినిమా టైలర్‌ని సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా.. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు సినిమా యూనిట్. సుధీర్‌ బాబుకి ఉన్న ఇమేజ్‌తో పాటు ఇవన్నీ కూడా సినిమాకు ఎంతో ప్లస్‌ అయ్యాయి. అయితే రీసెంట్ ఈ సినిమాని మహేష్‌బాబు తన ఇంట్లోని మినీ థియేటర్‌లో వీక్షించారు. ఇది చూసిన మహేష్ ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉంది అని.. ప్రతి ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేశారు అని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఈ సినిమాకు మరో ప్రముఖ వ్యక్తి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన మరెవరో కాదు.. ‘కేజీఎఫ్’ సినిమాతో యావత్ దేశాన్ని కుదిపేసిన దర్శకుడు . ఈ సినిమాను చూసిన ప్రశాంత్ మొదట తన మిత్రుడు.. ఈ సినిమా నిర్మాత విజయ్ చిల్లాకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా గురించి మంచి విషయాలు వినడం ఆనందంగా ఉంది అని ఆయన అన్నారు. అంతేకాక.. దర్శకుడు కరుణ కుమార్‌ని కూడా ఆయన అభినందించారు. మొత్తం టీమ్ అంతా కలిసి సినిమాని హిట్ చేశారు అని పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DsROAb

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...