Friday 27 August 2021

‘మహేష్ సినిమా చూస్తున్నారు.. ఏమంటారో మరి’..: ఆసక్తికర ట్వీట్ చేసిన సుధీర్ బాబు

డైనమిక్ హీరో హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్'. ‘పలాస 1978’ ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. మంచి యాక్షన్, డైలాగ్స్‌తో సాగే ఈ ట్రైలర్ చూసి.. సినిమాపై ఎన్నో అంచనాలను పెంచుకున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ని సుధీర్ బాబు బావ, సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో విడుదల చేయించారు చిత్ర యూనిట్. ఇక ఆ తర్వాత ప్రమోషన్స్‌లో కూడా మంచి జోష్ చూపించారు. ‘బాహుబలి’, యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ని ఈ సినిమా ప్రమోషన్స్‌లోకి దించారు. చిత్ర యూనిట్‌తో ఆయనతో ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇప్పించారు. దీంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇక శుక్రవారం (ఆగస్టు 27న) సినిమా విడుదల అయింది. అయితే ఈ సినిమా ఓ విషాదమైన ప్రేమగాథ అయినప్పటికీ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొదటి షో పడినప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఓ వ్యక్తి నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు సుధీర్ బాబు. ఆయన మరెవరో కాదు.. సూపర్‌స్టార్ మహేష్‌ బాబు. మహేష్ తాజాగా.. తన ఇంట్లోని మినీ థియేటర్‌లో ఈ సినిమాను వీక్షించారు. ఇందుకు సంబంధిచిన ఫోటోను సుధీర్‌బాబు స్వయంగా తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మహేష్ సినిమా చేస్తున్నారు.. ఏం అంటారో మరి’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే ఈ సినిమాపై మహేష్ నుంచి రివ్యూ వచ్చే అవకాశం ఉంది. మహేష్ నుంచి పాజిటివ్ రివ్యూ వస్తే.. సినిమాకు మరింత హైప్ పెరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yo1doX

No comments:

Post a Comment

'We want to be trust marker for the fintech industry'

'So, we would work with our members to ensure that we as an SRO create some sort of due diligence for fintechs.' from rediff Top I...