Monday, 23 August 2021

అతన్ని గట్టిగా వాటేసుకున్న మెగా డాటర్.. ఎవరో గుర్తుపట్టండి అంటూ నిహారిక ప్రశ్న! పిక్ వైరల్

సినిమాల పరంగా సక్సెస్ అందుకోలేక పోయినా సోషల్ మీడియా పరంగా భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది మెగా డాటర్ నిహారిక. చెప్పుకోవాలంటే పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత అనేలా ప్రస్తుతం ఆన్ లైన్ హవా నడిపిస్తోంది. మ్యారేజ్ సెట్ అయినప్పటి నుంచి మొదలు ఎప్పటికప్పుడు తన, తన ఫ్యామిలీ అప్‌డేట్స్ నెటిజన్లతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే మెగా ఇంట జరిగిన రాఖీ సంబరాలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన నిహారిక.. ఓ వ్యక్తిని గట్టిగా వాటేసుకొని ఫొటో దిగింది. అంతేకాదు అతనెవరో మీరే గుర్తు పట్టండి అని ఓ ప్రశ్న వేసింది. అన్నాచెల్లల అనుబంధాన్ని తెలిపే రాఖీ పండగ సందర్భంగా మెగా ఇంట సంబరాలు మిన్నంటాయి. మెగా హీరోలకు వారి సోదరీమణులు రాఖీలు కట్టి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు మాధవి, విజయ దుర్గలు రాఖి కట్టారు. వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్‌లకు సుస్మిత, శ్రీజ, నిహారిక రాఖీ కట్టారు. ఈ వేడుకలో నాగబాబు కూతురు నిహారిక స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఎప్పుడూ అల్లరి అల్లరిగా సందడి చేసే మెగా డాటర్ అన్నయ్యలతో సరదాగా గడిపింది. అయితే పవన్ కళ్యాణ్ తనయుడు అకీరాకు కూడా మెగా డాటర్స్ రాఖీ కడితే బాగుండేదని పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఫీలింగ్స్ బయటపెట్టారు. ఇంతలో వారికి ఖుషీ చేసేలా ఓ పోస్ట్ వదిలింది నిహారిక. ''కాస్త ఆలస్యం.. కానీ బిగ్ బేబీ బ్రదర్‌తో రాఖీ సెలబ్రేషన్ చాలా ఆనందంగా ఉంది'' అంటూ ఓ ఫొటో అభిమానుల ముందుంచింది. ఇందులో ఆరడుగుల బుల్లెట్టు వెనుకకు తిరిగి ఉండగా ప్రేమగా సోదరుడిని వాటేసుకుని కనిపించింది నిహారిక. పైగా ఇతనెవరో గుర్తుపట్టండి అని ఆమె ప్రశ్నించడంతో 'జూనియర్ పవర్ స్టార్' అంటూ మోత మోగిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sU8z2F

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....