Sunday, 1 August 2021

డైరెక్టర్ కాకముందు ఆ పని చేసేవాడిని.. తన గురించి ఆసక్తికర అంశాలు పంచుకున్న డైరెక్టర్ మారుతి

‘ఈరోజుల్లో’, ‘బస్‌స్టాప్’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు డైరెక్టర్ . చేసిన సినిమాలు కొన్నే అయినా.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అది కాక ‘ప్రేమ కథా చిత్రమ్’ అనే సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమాలో ఆయన పండించిన కామెడి ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేసింది. దీంతో ‘జంధ్యాల’ తర్వాత కామెడీ డైరెక్టర్ అంటే ఈయనే అని అంతా ఫిక్స్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా.. రాశీ ఖన్నా హీరోయిన్‌గా ‘ప్రతిరోజు పండగే’ అనే సినిమాతో మారుతి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం ఆయన గోపిచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’, దాంతో పాటు సంతోష్ శోభన్ హీరోగా ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలు రెండు కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో పాటు.. మంచి కథాంశంని బేస్ చేసుకొని ఉంటాయన సినిమా పోస్టర్లు చూస్తే తెలుస్తోంది. తాజాగా మారుతి ఓ ప్రముఖ ఛానెల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలు వెల్లడించారు, అందరిలాగానే తాను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను అని మారుతి పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకూ తాను స్టిక్కరింగ్ మరియు ఆర్టిస్ట్‌గా పని చేశానని ఆయన వెల్లడించారు. అలాగే తాను డైరెక్టర్ అవ్వడానికి ముందు స్కెచింగ్ నుంచి స్టోరీ బోర్డింగ్ చేసేవాడనని తెలిపారు. అయితే ఇలా తనకు దొరికిన అవకాశాలను ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకున్నానని చెప్పిన మారుతి.. త్వరలో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని హామీ ఇచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CdSjxE

No comments:

Post a Comment

FM: 'Focus Of Budget Was To Keep Stable Growth Going'

'We kept this Budget on a larger plank, rather than on one incident, however serious.' from rediff Top Interviews https://ift.tt/F...