Friday 31 December 2021

CES 2022 to Now End a Day Earlier Than Planned as Omicron Cases Surge

CES 2022 will now end a day earlier than planned, the organiser of the event said, after companies including Amazon and GM dropped out of attending in person due to Omicron concerns.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pGwD98

Apple Faces CCI Antitrust Probe Over Alleged Abuse of App Market

The Competition Commission of India (CCI) ordered a detailed probe against Apple for alleged unfair business practices with respect to its App Store.

from NDTV Gadgets - Latest https://ift.tt/3qHBqGD

Chiranjeevi : ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్‌.. ఊర‌మాస్ లుక్‌లో చిరంజీవి.. ‘భోళా శంక‌ర్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

మెగాస్టార్ తన ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులకు కొత్త సంవత్సరం ట్రీట్‌ను ఇచ్చారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. లిస్టులో భోళా శంక‌ర్ సినిమా కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా నుంచి కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. మోష‌న్ పోస్ట‌ర్‌లో చిరంజీవి యంగ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. చేతికి క‌డియం, తాయెత్తులు క‌ట్టుకుని ప‌క్కా ఊర‌మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో రివేంజ్ డ్రామా కూడా న‌డుస్తుంటుంది. చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో ప్ర‌ముఖ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా క‌నిపించ‌నుంది. కోల్‌క‌త్తా బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఇందులో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఓ మాస్ లుక్‌కి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌యారు చేసి చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌కు కాబోయే భ‌ర్త పాత్ర‌లో హీరో నాగ‌శౌర్య క‌నిపించ‌నున్నార‌నే వార్త‌లు కూడా రీసెంట్‌గా వినిపించాయి. త‌మిళ చిత్రం వేదాళంకు ఇది రీమేక్‌. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా పేరుతో రీమేక్ చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేస్తామని ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. మ‌రో వైపు బాబీ డైరెక్ష‌న్‌లోనూ రూపొందుతోన్న చిత్రంలో చిరంజీవి హీరోగా న‌టిస్తున్నారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న గాడ్ ఫాద‌ర్ షూటింగ్ సెట్స్‌పై ఉంది. ఇవ‌న్నీ కాకుండా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌డానికి చిరం.జీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sOcfF5

How to Watch Harry Potter: Return to Hogwarts in India, USA, UK, and Around the World

Harry Potter: Return to Hogwarts releases New Year's Day, January 1, 2022 worldwide. You can watch it online on Amazon Prime Video in India, HBO Max in USA, Spain and Nordic, NOW TV, Sky Max and Sky...

from NDTV Gadgets - Latest https://ift.tt/3pJjHiQ

The Gadgets We Can't Wait to Buy in 2022

Happy New Year! The Gadgets 360 staff presents what's on their 2022 tech wishlist: iPhone 13s, PlayStation 5, Xbox Series X, MacBook Air M1 and Pro M1 Max, Apple TV 4K, along with Amazon Fire TV...

from NDTV Gadgets - Latest https://ift.tt/3HssbRc

RRRలో బైక్ సీన్ ట్రోలింగ్‌... స్పందించిన ఎన్టీఆర్!

లార్జ‌ర్ దేన్ లైఫ్ సినిమాగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న గురించి ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. బాహుబ‌లితో తెలుగు సినిమా స‌త్తానే కాదు, ఇండియ‌న్ సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటిన డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమా కావ‌డంతో అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ అగ్ర కథానాయ‌కులైన ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు హీరోలుగా న‌టించారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. యూనిట్ అంతా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నారు. RRR నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత పెంచాయే త‌ప్ప త‌గ్గించ‌లేదు. ఈ సినిమా ట్రైల‌ర్‌లో ఓ స‌న్నివేశం ఉంది. అందులో వేగంగా వ‌చ్చే బుల్లెట్ బండిని భీమ్ పాత్ర‌ధారి అంటే ఓ చేత్తో ఆపేసి పైకెత్తుతాడు. ట్రైల‌ర్ చాలా బావుంద‌ని చాలా మంది చెప్పారు. అయితే, కొంద‌రు ఆ స‌న్నివేశాన్ని ట్రోల్ కూడా చేశారు. ఈ ట్రోలింగ్స్‌పై హీరో ఎన్టీఆర్ స్పందించారు. కేర‌ళ‌లో జ‌రిగిన RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక‌రు బైక్ ఎత్తే స‌న్నివేశంపై ఎన్టీఆర్‌ను ప్ర‌శ్నించారు. ప్ర‌శ్న‌కు ఎన్టీఆర్ బ‌దులిస్తూ..ఈ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు నేను కూడా డైరెక్ట‌ర్ రాజ‌మౌళిని హీరో బుల్లెట్ బండిని పైకి ఎత్తేయడ‌మేంటి? అని ప్ర‌శ్నించాను. ‘మ‌నిషి చాలా ఎక్కువ ఆనందంలో, ఆవేశంలో ఉన్న‌ప్పుడు అసాధ్యం అనుకున్న ప‌నుల‌ను కూడా కొన్నింటిని చేసేస్తాడు. అలాంటి ఎమోష‌న‌ల్ సీన్‌లో భాగంగానే భీమ్ పాత్ర‌ధారి బుల్లెట్ బండిని ఒంటి చేత్తే ఆపేస్తాడు’ అని జక్కన్న సమాధానం ఇచ్చారు. RRRలో బండిని చేత్తో ఆపేసే సీన్ ఎందుకు వ‌స్తుంద‌నేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని ఈ సందర్భంగా అన్నారు ఎన్టీఆర్. 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ఇంకా అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, శ్రియాశ‌ర‌న్‌, సముద్ర ఖ‌ని త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా విడుద‌ల గురించి అంద‌రూ ఎదురుచూస్తున్నారు. డివివి ఎంటైర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mINuGb

Thursday 30 December 2021

LIGER Glimpse: వి ఆర్ ఇండియన్స్ అంటూ గర్జించిన విజయ్ దేవరకొండ.. వీడియో అదుర్స్

హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' మూవీ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వదిలి విజయ్ దేవరకొండ అభిమానుల్లో జోష్ నింపారు. పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ వీడియో విడుదలైన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇండియన్ బాక్సర్‌గా విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ ఎంట్రీ హైలైట్ అయింది. ముంబై చాయ్ వాలా బాక్సింగ్ పోటీకి వెళ్లి 'వి ఆర్ ఇండియన్స్' అంటూ గొంతెత్తి చెప్పడం సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. పవర్‌‌ఫుల్‌ బాడీతో విజయ్ దేవరకొండ రింగ్‌ లోకి దిగే సీన్‌ రోమాలు నిక్కబొడిచేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజయ్ మ్యానరిజం ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ కొత్త సంవత్సర కానుక అదిరిందని చెప్పుకోవచ్చు. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న లైగర్ సినిమాకు 'సాలా క్రాస్ బ్రీడ్' అనే పవర్‌ఫుల్ ట్యాగ్ లైన్‌ పెట్టారు పూరి. బాక్సింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో ఈ సినిమాను రూపొందించారని తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో అర్థమవుతోంది. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో ముఖ్యపాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లైగర్ సినిమా నిర్మాణంలో ఛార్మి భాగమైంది. వచ్చే ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FUnH5q

'Aditya Chopra says '83 is your finest'

'A friend of mine said she grew up not liking cricket. She hated cricket.'

from rediff Top Interviews https://ift.tt/3Hg7nwm

Samsung Galaxy Fold, Note 10 Series to Get Stable One UI 4: Report

Samsung will be continuing to seed its stable One UI 4 update to more of its devices. According to a report, the latest ones on the list to get the new update are the first-gen Galaxy Fold and Galaxy...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mKFGDQ

'Remember, always, the virus doesn't want to die'

'If you think you think you're going to booster yourself out of the pandemic, in COVID-19's case, you can forget it.'

from rediff Top Interviews https://ift.tt/3FM2UkO

Tesla Recalls Nearly Half a Million Cars Over Safety Issues

Tesla is recalling more than 475,000 of its Model 3 and Model S electric cars to address rear-view camera and trunk issues that increase the risk of crashing, the US road safety regulator said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3eJH6Kp

Six Tablets for Working or Learning Remotely

​​​​​

from NDTV Gadgets - Latest https://ift.tt/3pG3QRZ

RRR: టైటిల్ సీక్రెట్ రివీల్.. అందుకే ఆ పేరు పెట్టామంటూ రాజమౌళి ఓపెన్

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. భారీ బడ్జెట్ కేటాయించి ఎంతో గ్రాండ్‌గా తెరక్కెక్కించిన ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సినిమా పట్ల ఉన్న క్రేజ్ రెట్టింపు చేస్తూ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. అన్ని భాషల్లోని ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూ తనదైన ప్రమోషన్ స్ట్రాటజీతో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ హిందీ షోలో పాల్గొన్న రాజమౌళి.. RRR టైటిల్ సీక్రెట్స్ వెల్లడించారు. ఈ మూవీ ప్రారంభించినపుడు ఏ టైటిల్‌ పెట్టాలో అర్థం కాలేదని, ఆ తర్వాత కొన్ని రోజులకు RRR అనుకున్నామని రాజమౌళి తెలిపారు. , , రాజమౌళి పేర్లు కలిసొచ్చేలా ఈ ప్రాజెక్టును RRR అని పిలవాలనుకున్నామని, అదే కోణంలో RRR హ్యాష్‌ట్యాగ్‌తో సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇచ్చామని, అయితే ఈ పేరుకు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో సినిమాకు అదే పేరు కన్ఫర్మ్ చేశామని రాజమౌళి చెప్పారు. RRR అంటే 'రౌద్రం రణం రుథిరం' అని ఫుల్ చెప్పారు జక్కన్న. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ రేంజ్‌లో ఈ మూవీ రూపొందించారు. ఇప్పటికే విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ రికార్డులు తిరగరాస్తూ మూవీ రిలీజ్‌కి ముందే RRR సత్తా ఏంటనేది తెలియజేశాయి. పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్, శ్రీయ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా వాయిదా పడుతుందనే రూమర్స్ షికారు చేస్తున్నప్పటికీ అలాంటిదేమీ లేదని అంటోంది చిత్రయూనిట్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mGJ1UA

Wednesday 29 December 2021

Samsung, Micron Warn China Lockdown Could Affect Memory Chip Production

Samsung and Micron, two of the world's largest memory chip makers, warned that a COVID-19 lockdown in the Chinese city of Xian could affect their chip manufacturing bases in the area.

from NDTV Gadgets - Latest https://ift.tt/32zjmq4

'What we need now is spending'

'The classic thing we need as a country is the virtuous cycle where you have robust demand which leads to more capital spending which in turn leads to more job creation and more money in the hands of people.'

from rediff Top Interviews https://ift.tt/3mKIUau

Elon Musk's SpaceX Raises Over $337 Million in Fresh Funding

Elon Musk's SpaceX has raised $337.4 million (roughly Rs. 2,515 crore) in equity financing, the rocket company disclosed in a regulatory filing.

from NDTV Gadgets - Latest https://ift.tt/3JqlO2F

టికెట్స్ రేట్లు తగ్గించడం కాదు.. రాజమౌళికి రివార్డ్ ఇవ్వాలి: ఆర్జీవీ ఇంట్రస్టింగ్ కామెంట్స్

తెలుగోడి సత్తా ఏంటనేది ప్రూవ్ చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన ఘటన సొంతం. తెలుగు కళాకారుల్లో ఎంతో టాలెంట్ ఉందని, భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించి భారీ వసూళ్లు రాబట్టవచ్చని 'బాహుబలి' సినిమాతో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చేశారు జక్కన్న. ఇదే విషయాన్ని ప్రస్తావనకు తెస్తూ ఆంధ్ర ప్రదేశ్ టికెట్స్ రేట్స్ ఇష్యూపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు . ఈ మేరకు రాజమౌళిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ టికెట్స్ రేట్స్ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నాని లాంటి సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటిపై ఏపీ పొలిటీషియన్స్ వేసిన కౌంటర్స్ తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ ఇష్యూ లోకి ఎంటరైన రామ్ గోపాల్ వర్మ.. ఎప్పటిలాగే లాజిక్స్ మాట్లాడుతూ ఏపీ టికెట్ రేట్స్‌కి దర్శక ధీరుడు రాజమౌళికి లింక్ పెడుతూ మాట్లాడారు. హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ స్పైడర్ మ్యాన్‌కి పెట్టిన ఖర్చులో 100వ వంతుతో రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు. ఈ సినిమాతో తన బాహుబలి సినిమా హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీని మించిన రెస్పాన్స్ తెచ్చుకుందని ప్రూవ్ చేశాడాయన. ప్రొడ్యూసర్‌తో ఖర్చు పెట్టించడంలో ఆ రోజు తెలుగు సినిమాకు ఉన్న కెపాసిటీని రెండు మూడంతలు చేస్తూ ధైర్యం చేశారు. అది ఫ్లాప్ అయితే నిర్మాతకు నష్టపోతాడు, రాజమౌళికి కాస్త బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుంది. కానీ అది సక్సెస్ కావడం వల్ల ఈ రోజు తెలుగు సినిమా గురించి యావత్ ప్రపంచం చెప్పుకుంటోంది. మంచి సినిమా చేస్తే సక్సెస్ అవుతుందని రాజమౌళి ప్రూవ్ చేయడం వల్లే మొన్నటి కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలకు దారి చూపించినట్లయింది. దీని వల్ల రెవెన్యూ పెరుగుతుంది. ప్రభుత్వానికి టాక్స్ రూపంలో లాభం చేకూరుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో అలాంటి టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం టాక్స్ బెనిఫిట్ ఇవ్వాలి. టికెట్స్ రేట్స్ తగ్గించడం పక్కనబెట్టి రాజమౌళికి రివార్డ్ ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాలకు రాజమౌళి చేసిన సేవను డబ్బుతో కొలవలేం. ఆ ఘనత ఎప్పటీకీ నిలిచిపోతుంది'' అన్నారు రామ్ గోపాల్ వర్మ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3za2nq2

Omicron in India: 'Surge likely in January'

'Whether the substantial hybrid immunity present in India can protect against severe consequences of the disease remains to be seen.'

from rediff Top Interviews https://ift.tt/3sKfJIG

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై రాజమౌళి క్రేజీ కామెంట్స్.. మెగా, నందమూరి అభిమానులతో గోల పెట్టించిన జక్కన్న

దర్శక ధీరుడు రాజమౌళిది ఎల్లలు దాటిన క్రేజ్. బాహుబలి సిరీస్‌తో తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన జక్కన్న.. మరో ప్యాన్ ఇండియా మూవీ RRRతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఆ అంచనాలకు రెట్టింపు చేసేలా చిత్ర ప్రమోషన్స్ చేపడుతున్నారు . ఇందులో భాగంగా గత వారం మొత్తం బాలీవుడ్‌లో ప్రోమోట్ చేసిన టీమ్ నిన్న (సోమవారం) రాత్రి కేరళలో సందడి చేసింది. కేరళలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏర్పాటు చేసి అక్కడి అభిమానుల్లో జోష్ నింపారు రాజమౌళి. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ.. ''నిర్మాత దానయ్య గారు నాతో ఓ సినిమా చేసేందుకు 13 సంవత్సరాలుగా ఎదురుచూశారు. ఆయనతో బిగ్గెస్ట్ సినిమా చేస్తానని చెప్పి RRR చేశాను. నా కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. నేను చేసిన సినిమాల గురించి దేశవ్యాప్తంగా చెప్పుకోవడం చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. నేను రూపొందించిన ‘ధీర, ఈచ, బాహుబలి’ చిత్రాలకు కేరళ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు RRR సినిమాకు అంతకుమించిన ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నా. కేరళతో నాకు మంచి అనుబంధం ఉంది. ‘సింహాద్రి’ సినిమాను ఇక్కడ సుమారు 25 రోజుల పాటు షూట్ చేశాం. కేరళ ప్రజలు చాలా సపోర్ట్ చేశారు. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను. తెలుగు సూపర్ పవర్ హౌసెస్, మై బ్రదర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్ , రామ్ చరణ్‌లను మీ ముందుకు తీసుకొస్తున్నా. RRR సినిమాకు కూడా మీ లవ్, సపోర్ట్ అందుతుందని నమ్ముతున్నా'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mGbEBa

Tuesday 28 December 2021

'They have turned majority of Hindus to Muslim haters'

'A Muslim is lynched somewhere, and you forward the video of the lynching through WhatsApp.'

from rediff Top Interviews https://ift.tt/3JmAX58

PUBG: New State Anti-Cheat Update Will Tackle Gamers Playing With Cheaters

PUBG New State has implemented new measures to prevent cheating in the popular battle royale game. The anti-cheat system in the game has been updated to target players who intentionally play in a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3sCCfmF

Paris Hilton Enters Metaverse With 'Paris World' on Roblox

Paris Hilton has launched Paris World, a virtual world on Roblox, where visitors can explore digital replicas of her Beverly Hills estate and its dog mansion, stroll a boardwalk inspired by the neon...

from NDTV Gadgets - Latest https://ift.tt/3FCuOzD

Ferrari Partners With Blockchain Firm Velas to Create Collectibles for Fans

Ferrari, the luxury automobile manufacturer, said on Monday that it has signed a multi-year accord with Swiss technology firm Velas Network to create digital content for its fans.

from NDTV Gadgets - Latest https://ift.tt/32G1UQo

AMD and P&G After Google and Microsoft Pull Out of CES Over Omicron Fears

AMD, Procter & Gamble, and Micro-Star International are among the latest companies to pull out of the CES event -taking place in-person in Las Vegas in January 2022 - over Omicron fears.

from NDTV Gadgets - Latest https://ift.tt/3EzkVRN

ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ.. ఇరగదీసిన జూనియర్ సమంత.. వీడియో వైరల్

సోషల్ మీడియా కారణంగానే ఫేమ్ కూడగట్టుకొని జూనియర్ సమంతగా నెటిజన్లకు సుపరిచితమైంది . అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తనదైన ఆటతీరుతో బుల్లితెర ఆడియన్స్ మనసు దోచుకుంది. దీంతో బిగ్‌బాస్ షో తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. అప్పటిదాకా కొందరికే తెలిసిన అషు రెడ్డి.. బిగ్ బాస్ తర్వాత ప్రతి ఒక్కరికీ చేరువైంది. సినిమా ఆఫర్లు కూడా పెట్టేస్తూ బిగ్ సెలబ్రెటీగా మారింది. ఇక మరోవైపు తన అసలైన అస్త్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలతో నెటిజన్లను ఫిదా చేస్తోంది అషు రెడ్డి. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా సెన్సేషన్ అవుతున్న సాంగ్ 'ఉ అంటావా మావ... ఉఊ అంటావా మావ' పాటకు స్టెప్పులేసింది అషు. ఆమె చేసిన ఈ సాంగ్ ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో ఆన్ లైన్ మాధ్యమాలు షేక్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ మూవీలోని ‘ఉ అంటావా మావ... ఉఊ అంటావా మావ’ పాట ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూస్తున్నాం. హీటు పుట్టించే మేకోవర్‌తో సమంత కాలుకదిపిన ఈ ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మారు మోగుతోంది. పలువురు ఈ సాంగ్ స్పూఫ్ వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే సాంగ్‌ రీ క్రియేట్ చేస్తూ హంగామా చేసింది జూనియర్ సమంత అషు రెడ్డి. అచ్చం సమంత లాంటి కట్టుబొట్టుతో స్టెప్పేసి అభిమానులను మరింత హుషారెత్తించింది అషు. సమంతను మించి అన్నట్లుగా ఈ బిగ్ బాస్ బ్యూటీ వేసిన స్టెప్స్ వీడియోలో హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ మధ్యే సంచనల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మతో బోల్డ్‌ ఇంటర్య్వూలో పాల్గొని సోషల్‌ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది అషు రెడ్డి. మనసులో ఏదీ దాచుకోకుండా అన్ని విషయాలపై ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఒక్కసారిగా అషు క్యారెక్టర్, ఆమె ఓపెన్‌నెస్ జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mHpQdf

'Room for more correction in equities'

'At current valuations, we believe large-caps offer better downside support.'

from rediff Top Interviews https://ift.tt/3qyFzg0

iPhone 13 Users Demand Noise Cancellation Option Offered in Earlier Models

iPhone 13 users are demanding Apple to add a dedicated noise cancellation option that is available on earlier models. The iPhone maker has, however, not yet addressed the user demand.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mBBDcX

'This is advantageous to our enemies'

'Instead of developing the capacity, capability and strength to fight our external enemies, we are turning our own people against each other.'

from rediff Top Interviews https://ift.tt/3EvxpKl

Monday 27 December 2021

Alibaba Pushed by China to Design Its Own Chips to Promote Self-Reliance

To help make China a self-reliant "technology superpower," the ruling Communist Party is pushing the world's biggest e-commerce company to take on the tricky, expensive business of designing its...

from NDTV Gadgets - Latest https://ift.tt/3sDHxhD

చచ్చిపోయా.. ఆ వీడియో షేర్ చేస్తూ సమంత రియాక్షన్! మనసులోని స్ట్రాంగ్‌ ఫీలింగ్స్ బయటపెట్టిందిలే..

పట్టలేని ఆనందం వచ్చినా, ఆపుకోలేని దుఃఖం వచ్చినా.. చచ్చిపోయారా బాబు అనేది సాధారణంగా సగటు మనిషి నోట పలికే మాట. స్టార్ హీరోయిన్ కూడా అచ్చం అలాగే ఫీల్ అవుతోంది. తాను రీసెంట్‌గా చేసిన ఐటెం సాంగ్ రెస్పాన్స్ చూసి ఆనందం తట్టుకోలేక 'డెడ్' అనేసింది సామ్. ఈ మేరకు తనలోని స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆ ఒక్క పదం రూపంలో బయటపెడుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది సమంత. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీర్చిదిద్దిన 'పుష్ప' సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ''ఉ అంటావ మావ.. ఉ ఊ అంటావ మావ'' అంటూ హీటెక్కించింది సామ్. దీంతో జనరల్‌గా సుక్కు ఐటెం సాంగ్‌కి ఉండే డిమాండ్‌ని 100 రెట్లు పెంచేసింది ఈ సాంగ్. అల్లు అర్జున్‌తో కలిసి సమంత చేసిన డాన్సింగ్ మూమెంట్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక యూట్యూబ్‌లో ఈ సాంగ్ సృష్టిస్తున్న అలజడి అంతాఇంతా కాదు. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మోత మోగుతోంది. చిన్న- పెద్ద అనే వయసు బేధం, ఆడ- మగ అనే లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరి పెదాలపై ఇదే సాంగ్ కదలాడుతోంది. ఎంతోమంది ఈ పాటను స్ఫూప్‌ వీడియోలు చేశారు. సాంగ్ రీక్రియేట్‌ చేసి రీల్స్‌, షార్ట్స్‌ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి వీడియో వైరల్ అయింది. తన తల్లి ‘హు( Who)’ అనే ఇంగ్లీష్ పదాన్ని నేర్పే ప్రయత్నం చేస్తుంటే ఆ పాప మాత్రం క్యూట్‌గా ‘ఉ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావ’ అని పాడేస్తోంది. అయితే ఈ వీడియో సమంత కంట పడటంతో సంతోషం పట్టలేక దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ 'డెడ్' అని ట్యాగ్ లైన్ జత చేసింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఇది చూసి క్రెడిట్ అంటే ఇలా ఉంటుంది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sIe6en

'I have raised Rs 90,000 crore'

'The ship has been stabilised.'

from rediff Top Interviews https://ift.tt/3sEmE5R

OneWeb Launches 36 Satellites Into Orbit From Kazakhstan

OneWeb launched 36 communications satellites into space from the Baikonur cosmodrome in Kazakhstan, live broadcasts showed.

from NDTV Gadgets - Latest https://ift.tt/3z4wqPV

తారక్‌ది చైల్డిష్ మెంటాలిటీ.. చరణ్ లాంటి మైండ్ సెట్ ఎక్కడా చూడలేదు: రాజమౌళి ఓపెన్ కామెంట్స్

కెరీర్ ఆరంభంలో ఉన్న తారక్‌తో పోల్చితే ఇప్పటి తారక్‌లో ఎన్నో వేరియేషన్స్ చూస్తున్నాం. అంచెలంచెలుగా తన నటన, డాన్స్ ప్రతిభను మెరుగుపర్చుకొని అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నారు . అయితే తారక్‌లోని ఆ ట్రాన్స్‌ఫర్‌మేషన్, ఆ ఎనర్జీకి కారణం దర్శక ధీరుడు అంటుంటారు. ఎప్పుడైతే 'యమ దొంగ' సినిమాలో తారక్ రూపాన్ని మార్చేస్తూ తెరపై ప్రెజెంట్ చేశారో అప్పటినుంచి జర్నీ తిరుగేలేకుండా సాగుతోంది. తాజాగా అలాంటి తారక్‌పై అదే రాజమౌళి ఓపెన్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్, హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమా RRR రూపొందించి పలు భాషల్లో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు జక్కన్న. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేపడుతున్న ఆయన.. గత రాత్రి చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయ నిధి స్టాలిన్, శివ కార్తికేయన్, ఆర్బీ చౌదరిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ వేదికపై RRR సినిమాను ఉద్దేశిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాకంటే తానే సీనియర్‌ అని తారక్‌ ఎప్పుడూ గొడవ పడుతుంటాడని, తారక్‌ ప్రేమను తట్టుకోవటం చాలా కష్టమని రాజమౌళి అన్నారు. ఉదయం 7 గంటలకు సెట్‌కు రమ్మంటే 6 గంటలకే వచ్చేస్తాడు కాబట్టి నీకు టైమ్ సెన్స్ లేదని తారక్‌ని ఎప్పుడూ తిడుతుంటానంటూ సరదా కామెంట్ చేశారు జక్కన్న. తారక్‌ది లయన్‌ పర్సనాలిటీ, చైల్డ్‌ మెంటాలిటీ అని చెప్పిన రాజమౌళి.. ఇలాంటి నటుడు దొరకడం భారతీయ చలన చిత్ర పరిశ్రమ అదృష్టమంటూ ఆయన ఎనర్జీని ఆకాశానికెత్తారు. ఇకపోతే ఎలాంటి ఒత్తిడి లేకుండా క్లియర్‌ మైండ్‌తో సెట్‌కు వచ్చే వ్యక్తి రామ్ చరణ్ అని, అతన్ని ‘మై హీరో’ అంటుంటానని రాజమౌళి చెప్పారు. ‘మీకేం కావాలి. దాన్ని నేను ఎలా చేయగలను’ అని ఆలోచించే మెంటాలిటీ చెర్రీదని, ఇలాంటి మెంటాలిటీని నేను ఎవరిలోనూ చూడలేదని చెప్పారు. చరణ్‌, తారక్‌.. ఈ ఇద్దరిలో దక్షిణ ధ్రువం ఒకరైతే ఉత్తర ధ్రువం మరొకరు. ఈ రెండు ధ్రువాలు RRR అనే అయస్కాంతానికి అతుక్కునందుకు తనకెంతో సంతోషంగా ఉందని జక్కన్న చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3JqTFJ4

How to Pre-Order PlayStation 5's Last Restock of 2021 in India

PS5 India December 28 restock - for the Rs. 49,990 Blu-ray PlayStation 5 - available at Amazon, Croma, Flipkart, GameLoot, Games The Shop, Reliance Digital, Sony Center ShopAtSC, and Vijay Sales.

from NDTV Gadgets - Latest https://ift.tt/3z2EEbx

Sunday 26 December 2021

Pushpa Making Video: తెర వెనుక పుష్పరాజ్ కష్టం.. అబ్బుర పరుస్తున్న ఆన్ లొకేషన్ సీన్స్

స్టైలిష్ స్టార్ మాస్ గెటప్ వేస్తే ఆ బీభత్సం ఎలా ఉంటుందనేది ప్రేక్షకులకు నేరుగా చూపించేశారు సుకుమార్. ఆయన దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు బన్నీ. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుండటంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసి తెర వెనుక పుష్పరాజ్ సహా చిత్రబృందం పడిన కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సోషల్ మీడియా వేదికగా ఆదివారం విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పుష్పరాజ్ యాక్షన్ సీన్స్ మొదలుకొని, సాంగ్స్ మేకింగ్, కీలక సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలు చూపించారు. అడవిలో వేసిన సెట్స్‌, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్ల సమన్వయం ఇలా అన్ని కోణాలను టచ్ చేస్తూ ఈ వీడియో వదిలారు. పుష్ప సెట్స్‌పై ఉండగా ఈ మూవీ షూటింగ్ చూసేందుకు వచ్చిన దర్శకుడు వి.వి. వినాయక్‌, అల్లు అర్జున్‌ తనయ అర్హలను ఈ వీడియోలో చూపించి బన్నీ అభిమానులను మరింత హూషారెత్తించారు. అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమాతో ఆయన మాస్ యాంగిల్ బయటపడింది. ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా ఈ మూవీ హవా నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంస్థల సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన నటించగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రెండో భాగాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపారు డైరెక్టర్ సుకుమార్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FzqUY0

Crypto 2021 - the Year That Was: Gains and Losses of Top Cryptocurrencies

Cryptocurrency is quickly evolving into an indisputable disruption for many traditional financial services and sectors globally, but while 2021's been a year of plenty wins for the crypto community,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3HdSTNl

James Webb Space Telescope Sets Off on Million-Mile Voyage

James Webb Space Telescope on December 25 blasted off into orbit, headed to an outpost 930,000 miles from Earth, after several delays caused by technical hitches.

from NDTV Gadgets - Latest https://ift.tt/3sBVUDo

అనుష్కతో నవీన్ పోలిశెట్టి.. ఫస్ట్ లుక్‌ రిలీజ్.. జాతి రత్నం డబుల్ ట్రీట్!!

విలక్షణ కథలతో సెలక్టెడ్ సినిమాలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు హైదరాబాదీ కుర్రోడు . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగుతెరపై కాలుమోపిన ఈ కుర్ర హీరో రీసెంట్‌గా 'జాతి రత్నాలు' సినిమాతో తెగ అట్రాక్ట్ చేశారు. తనదైన నాచురల్ నటనతో ఆకట్టుకొని అన్నివర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ మూవీ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా కాస్త గ్యాప్ తీసుకొని మరీ కథల ఎంపిక చేసుకున్నారు నవీన్. ఈ నేపథ్యంలోనే ఒకేసారి రెండు సినిమాలతో బరిలోకి దిగుతున్నారు. నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి ఆయన రెండు కొత్త సినిమాల ప్రకటన రావడం విశేషం. పుట్టిన రోజున ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇచ్చిన నవీన్.. ఓ సినిమాలో అనుష్కతో తెర పంచుకోబోతున్నారు. శెట్టి చేయబోయే తదుపరి సినిమాలో నవీన్ భాగం కాబోతున్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన చేసింది యూవీ క్రియేషన్స్ బ్యానర్. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయన అభిమానుల్లో జోష్ నింపారు మేకర్స్. రా రా కృష్ణయ్య దర్శకుడు మహేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారని, ఇందులో అనుష్క శెట్టి నాలుగు పదుల వయసులో ఉన్న మహిళగా కనిపించనుందని సమాచారం. అయితే ఆమె కంటే వయసులో చిన్నవాడైన నవీన్ పోలిశెట్టి ఆమె ప్రేమలో పడటం, ఆ తర్వాత చోటుచేసుకునే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ఇన్‌సైడ్ టాక్. ఇకపోతే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫర్చ్యూన్‌ 4సినిమాస్‌ బ్యానర్లపై మరో సినిమాకు కమిటయ్యారు నవీన్ పోలిశెట్టి. అయితే ఆయన బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. నవీన్‌కి సంబంధించి ఈ రెండు అప్‌డేట్స్ చూశాక ఆయన ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో నవీన్ సందడి మామూలుగా ఉండబోదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సో.. చూడాలి మరి ఈ రెండు సినిమాలతో జాతి రత్నం ఎలాంటి హిట్స్ ఖాతాలో వేసుకుంటారనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sBhis8

'Everybody's going to get infected'

'In the likelihood that Omicron is circulating, you have a much greater chance of getting infected now, than you did during the Age of Delta.'

from rediff Top Interviews https://ift.tt/3H8Pj76

'Election results will shock Akhilesh'

'The people of Uttar Pradesh have already made up their mind to puncture the Samajwadi Party's cycle, kick away the Bahujan Samaj Party's elephant, and remove shadows of the already-vanished hand of the Congress.'

from rediff Top Interviews https://ift.tt/3HcxXGt

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయకుడు మృతి

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ సింగర్, నటుడు (73) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. తన వృత్తి పరమైన జీవితంలో గాయకుడిగా పలు పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు మాణిక్య వినాయగం. త‌మిళ‌నాడులోని మైలాడుతురైలో 1943 డిసెంబరు 10న జన్మించిన మాణిక్య వినాయగం అత‌ని మేన‌మామ‌, ప్రమఖ సింగర్ ఎస్‌ జయరామన్ వ‌ద్ద సంగీత విద్యనభ్యసించి 2001 సంవత్సరంలో సినీ రంగంలో అడుగుపెట్టారు. ‘దిల్‌’ అనే తమిళ చిత్రంతో గాయకుడిగా కెరీర్ ఆరంభించారు. అప్పటినుంచి కెరీర్ మొత్తంలో అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటలు పాడిన ఘనత ఆయన సొంతం. దాదాపు దక్షిణాది అన్ని భాషల్లో తన గాత్రాన్ని వినిపించి ప్రేక్షకులను మెప్పించారు మాణిక్య వినాయగం. సినిమా పాటలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, జానపద గీతాలను కూడా ఆలపించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ‘శంకర్‌ దాదా MBBS’ చిత్రంలోని ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’ పాటతో టాలీవుడ్‌ ప్రేక్షకులను మైమరిపించారు. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ చిత్రసీమలో తనదైన ముద్రవేశారు మాణిక్య వినాయగం. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qpJ8oA

అనసూయ టచ్ చేసింది!.. గాల్లో తేలిపోయిన అభిమాని

బుల్లితెర అయినా వెండితెర అయినా అడుగు పెడితే సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక అనసూయ లాంటి గ్లామరస్ బ్యూటీలు బయటకు వస్తే జనాలు ఎలా ఎగబడతారో అందరికీ తెలిసిందే. కరోనా, ఒమిక్రాన్ వంటివి కూడా జనాలను ఆపలేవు. అలా ఖమ్మంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనసూయ కోసం ఆమె అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. ఇక అనసూయతో ఫోటోలు దిగేందుకు, సెల్ఫీల కోసం నానా రకాల పాట్లు పడ్డారు. అయితే కొంత మందికి అనసూయకు అవకాశం ఇచ్చింది.. ఇంకొంత మందికి ఇవ్వలేకపోయింది. అనసూయ ఖమ్మంలో సందడి చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ అభిమాని మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నాడు. అనసూయ తన చేతిని తాకిందంటూ గాల్లో తేలిపోయాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. అలా అభిమాని సంబరపడిపోవడంపై అనసూయ స్పందించింది. అయ్యో శానిటైజ్ చేసుకోండి అని అనసూయ కౌంటర్ వేసింది. మొత్తానికి అనసూయ తన చేతిని తాకడంతో ఆ అభిమాని మాత్రం గాల్లో తేలిపోయాడు. అనసూయ ఈ మధ్య సినిమాతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాక్షాయణిగా అనసూయ కనిపించింది. కానీ పుష్ప సినిమాతో అనసూయ ఏమంత ప్రభావం చూపించలేదు. రంగమ్మత్తలాంటి బలమైన పాత్ర మాత్రం అనసూయకు పడలేదనిపిస్తోంది. ఈ మధ్య అనసూయ జబర్దస్త్ షోలో కూడా కనిపించడం లేదు. ఈ వారం అనసూయకు బదులుగా రష్మీ వచ్చింది. వచ్చే వారం కూడా అనసూయ స్థానంలో రష్మీనే రాబోతోందని ప్రోమోను బట్టి తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EsMyvY

‘ఫోకస్’ పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. హీరోయిన్‌గా అషూ రెడ్డి

బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి.. సినిమాల్లో చాలా తక్కువగా నటించారు. బిగ్ బాస్ షో కంటే ముందుగానే ఛల్ మోహన రంగ అనే సినిమాలో కనిపించారు. బిగ్ బాస్ షో అనంతరం అంతగా సినీ అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ హీరోయిన్‌గా రాబోతోన్నారు. విజయ్‌ శంకర్‌ హీరోగా, అషూ రెడ్డి హీరోయిన్‌గా స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్‌ ‘ఫోకస్‌’ అనే సినిమాను చేస్తున్నారు. ఉత్కంఠ‌భ‌రిత‌మైన స్క్రీన్‌ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘ఫోకస్‌’ మూవీ తెరకెక్కుతోంది. ప్ర‌ముఖ న‌టి మ‌ణిర‌త్నం కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. బిగ్ బాస్ ఫేమ్ అషూరెడ్డి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విజయ్‌ శంకర్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తుండగా సుహాసిని మణిరత్నం జడ్జ్‌ పాత్రలో నటిస్తున్నారు. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, సూర్య భగవాన్‌ ఇతర ముఖ్య‌ పాత్రల్లో కనిపిస్తారు. ‘ఫోకస్‌’ అని టైటిల్ పెట్ట‌డంతోనే తమ సినిమాపై ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్‌ ఫోకస్‌ కూడా పడిందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. మర్డర్‌ మిస్టరీ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు తమ చిత్రం కొత్త తరహా అనుభూతిని ఇస్తుందనీ, సినిమా గురించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర ద‌ర్శ‌కుడు సూర్య‌తేజ తెలిపారు. అంతే కాకుండా అషూ తన ఇన్ స్టాగ్రాంలో ఓ పోస్ట్ చేశారు. రేపు (డిసెంబర్ 27) ఉదయం 11:55 గంటలకు సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని అషూ చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mylrcq

మోసాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు కేసు పెట్టారు: క‌రాటే క‌ళ్యాణి

కొన్నాళ్లు ముందు సైదాబాద్ ప‌రిధిలోని సింగ‌రేణి కాల‌నీలో ఓ మైన‌ర్ బాలిక హ‌త్య‌కు గురైంది. ఆ హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను క‌ళ్యాణి వెల్ల‌డించే ప్ర‌య‌త్నాలు ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. దీనికి సంబంధించిన ఏల్ల‌మ్మ బండ‌లోని తూటం శెట్టి నితేష్ అనే వ్య‌క్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేటుగా కంప్లైంట్ దాఖ‌లు చేశారు. కంప్లైంట్‌ను ప‌రిశీలించిన కోర్టు క‌రాటే క‌ళ్యాణిపై కేసు న‌మోదు చేయాల‌ని జ‌గ‌ద్గిరి గుట్ట పోలీసులను ఆదేశించింది. ఆదేశాల ప్ర‌కారం పోలీసులు క‌ళ్యాణిపై కేసు న‌మోదు చేశారు. దీనిపై న‌టి కరాటే క‌ళ్యాణి వివ‌ర‌ణ ఇస్తూ మాట్లాడారు. ఓ ఆధ్యాత్మిక సంస్థ హిందూ మ‌తం పేరుతో ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు వ‌సూల చేస్తుంటే ప్ర‌శ్నించినందుకు త‌న‌పై త‌ప్పుగా వార్త‌లు రాయించి ట్రోల్ చేస్తున్నారంటూ క‌ళ్యాణి మండిపడ్డారు. క‌రాటే క‌ళ్యాణి మాట్లాడుతూ ‘‘శివ‌శ‌క్తి ఆధ్యాత్మిక చైత‌న్య వేదిక అనే సంస్థ‌ను స్టార్ట్ చేసిన క‌రుణాక‌ర్ సుగుణ‌, క‌ళ్యాణ్ కుమార్ చెట్ల‌ప‌ల్లి వంటి తొమ్మిది దీన్ని స్టార్ట్ చేశారు. కొంత మందిని బ‌య‌ట‌కు పంపేసి ఐదుగురు మాత్ర‌మే ఇప్పుడు డైరెక్ట‌ర్స్‌గా ఉంటూ వ‌స్తున్నారు. వీళ్లు 2020లో ఆఫీస్ స్టార్ట్ చేయాల‌ని చెబుతూ కోటి రూపాయ‌లు ఫండ్స్ క‌లెక్ట్ చేశారు. ఆఫీస్ అంతా స్టార్ట్ అయ్యింద‌ని చెప్పిన త‌ర్వాత మ‌ళ్లీ ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలోనే కోటిన్న‌ర రూపాయలు ఫండ్ క‌లెక్ష‌న్స్ కోసం రెడీ అయ్యారు. ప్ర‌శ్నించినందుకు మాపై ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ట్రోలింగ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. వారు చేసిన పనులకు మా సాక్ష్యాధారాలున్నాయి. ఈ కేర్ ప్రై.లి. సెంట‌ర్‌, శివ శ‌క్తి ఫౌండేష‌న్‌, శివ శ‌క్తి ఆధ్యాత్మిక చైత‌న్య వేదిక అనే మూడు సంస్థ‌లు క‌లిసి గేమ్ ఆడుతున్నాయి. మోసం జ‌రుగుతుంద‌ని నేను ప్ర‌శ్నిస్తే.. నాపై వ్య‌క్తిగ‌తంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇప్పుడున్న దేవిరెడ్డి ఆనంద్ రెడ్డికి ఆర్‌బీఎల్ బ్యాంకులో రెండున్న‌ర కోట్ల రూపాయ‌లు అప్పులున్నాయి. దాన్ని తీర్చ‌డం కోసం ఫండ్ రైజింగ్ పేరుతో గేమ్‌లాడుతున్నారు. నిధుల‌ను ప‌క్క దారి ప‌ట్టిస్తున్నారు. కార్పొరేట్ లెవ‌ల్లో మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రుగుతుంది. వారి మోసాల‌ను ప్ర‌శ్నించినందుకు న‌న్ను తిట్టారు. నాపై త‌ప్పుడు కేసులు పెట్టారు. నేను బాలిక కుటుంబానికి స‌పోర్ట్ చేయ‌డానికి వెళితే, నేను హ‌త్య కేసులో ఇరుక్కున్నానంటూ త‌ప్పుగా ట్రోల్ చేశారు. నేను ఏ హ‌త్య కేసులో ఇరుక్కున్నానో చెప్పాలి. ఆధారాల‌తో పోరాటం చేస్తుంటే బెదిరిస్తున్నారు’’ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Hhghd3

Manchu Lakshmi : కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది!.. మంచు లక్ష్మీ ట్వీట్ వైరల్

నెట్టింట్లో ఎంతటి ట్రోలింగ్‌కు గురవుతుందో అందరికీ తెలిసిందే. మంచు లక్ష్మీ షేర్ చేసే ఫోటోలు, వేసే ట్వీట్లు, చేసే కామెంట్లు అన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. ఇక మంచు లక్ష్మీ కనిపెట్టే కొత్త పదాలు, వాటిపై సోషల్ మీడియాలో జరిగే చర్చలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య మంచు లక్ష్మీ కొత్త విద్యలు నేర్చుకుంటోంది. కలరి విద్యను మంచు లక్ష్మీ ప్రత్యేకంగా నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మంచు లక్ష్మీ తన కొత్త సినిమా కోసమే ఇలాంటి విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటోందని తెలుస్తోంది. తాజాగా మంచు లక్ష్మీ కొన్ని ట్వీట్లు వేసింది. ఇన్ని రోజులు ఫ్యామిలీతో కలిసి ఉన్నాను.. ఇకపై నా కోసం కొంత సమయం కేటాయించుకునేందుకు వెళ్తున్నాను అంటూ చెప్పేసింది. కానీ ఎక్కడికి వెళ్తుందనే విషయాన్ని మాత్రం వెళ్లడించలేదు. ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఎదురుచూసిన మంచు లక్ష్మీ.. ఆకలి వేయకపోయినా కూడా అక్కడ తినేసిందట. ఎందుకంటే ఆ ఫ్లైట్ టికెట్ కొనేందుకు తన కిడ్నీలు అమ్ముకునేంత పరిస్థితి వచ్చిందట. అందుకే ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా కూడా తింటున్నానని చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ వేసిన ఆ ట్వీట్‌కు జనాలు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అంటే నువ్ కూడా మా కులమే అక్కా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.. అవును బాబు, మా డాడీ రిచ్.. కానీ నేను కాదు అంటూ మంచు లక్ష్మీ రిప్లై ఇచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3z7mm96

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ సర్ ప్రైజ్ గిఫ్ట్... న్యూ ఇయర్ రోజున పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి పండగే!

పవర్ స్టార్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘’.ఇందులో రానా ద‌గ్గుబాటి కూడా మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నారు. ఈయ‌న పాత్ర పేరు డానియ‌ల్ శేఖ‌ర్‌. ఇద్ద‌రి పాత్ర‌ల‌కు సంబొంధించిన క్యారెక్ట‌ర్స్ ఎలివేష‌న్ ప్రోమోలు కూడా విడుద‌లై మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అంటే ఎలాంటి అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, సాంగ్స్ ఈ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచుతూనే వ‌స్తున్నాయి. కాగా.. ఈ అంచాల‌ను మ‌రింత పెంచ‌డానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. అది కూడా కొత్త సంవ‌త్స‌రం రోజున‌. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ను మ‌రింత స్ట్రాంగ్‌గా ఇవ్వాల‌నుకున్నారు. అందు కోసం ‘భీమ్లా నాయక్’ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓ భారీ ప్లాన్ చేశారు. అందులో భాగంగా డిసెంబ‌ర్ 31న ఓ పాట‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆ ఏముందిలే పాటే కదా! అని అనుకోకండి బాబూ.. ఈ పాట‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడారు. సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ సినిమాలో పాట రిలీజ్ అంటేనే ఫ్యాన్స్ చేసే హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడిన పాట‌.. అది కూడా న్యూ ఇయ‌ర్ రోజున రిలీజ్ అవుతుందంటే అభిమానుల చేసే హడావుడి మ‌రో రేంజ్‌లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే ‘భీమ్లా నాయక్’ సినిమాకు అద్భుత‌మైన ట్యూన్స్ అందించిన మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్‌, స్వ‌యంగా పవ‌న్ క‌ళ్యాణ్ పాడుతున్న పాట‌కు ఎలాంటి ట్యూన్ అందించారో తెలియాలంటే మాత్రం మ‌రో ఐదు రోజులు ఆగాల్సిందే. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్’ను ముందుగా సంక్రాంతి బ‌రిలోకి, జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌ని ముందుగా నిర్మాత‌లు భావించారు. అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. కానీ RRR, రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు భారీ ఎత్తున విడుద‌ల‌వుతుండ‌టంతో స‌ద‌రు నిర్మాత‌లు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ‘భీమ్లా నాయక్’ నిర్మాత‌ల‌ను క‌లిసి రిక్వెస్ట్ చేయ‌డంతో ‘భీమ్లా నాయక్’ వాయిదా ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ‘భీమ్లా నాయక్’ను శివ రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్నారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న భీమ్లా నాయ‌క్ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, మాట‌ల‌ను అందించారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప‌వ‌న్ జోడీగా నిత్యామీన‌న్‌.. రానా ద‌గ్గుబాటి జోడీగా సంయుక్తా మీన‌న్ న‌టించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eqqSpC

Saturday 25 December 2021

‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలో అలాంటి సీన్.. ప్రాక్టీస్‌ చేసినా వణుకు పుట్టింది: కృతి శెట్టి ఓపెన్

‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది యంగ్ హీరోయిన్ . బేబమ్మ పాత్రతో తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. యాక్షన్‌తో పాటు రొమాంటిక్ సీన్స్‌లోనూ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఆమెకు ఆ తర్వాత వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా విడుదలైన నాని ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమా లోనూ కీర్తిగా అదరగొట్టింది ఈ కన్నడ బ్యూటీ. ఈ ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ చిత్రంలో నాని, సాయి పల్లవి నటనలతో పాటు కృతి శెట్టి నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కీర్తిగా తన క్యారెక్టర్‌కి కృతి శెట్టి పూర్తి న్యాయం చేసిందనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ చిత్రంలోని తన రోల్ గురించి, తదుపరి సినిమాల ప్రణాళికల గురించి ఓపెన్ అయింది కృతి. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నానని, ఇంగ్లిష్‌ సినిమాలు, మోడ్రన్‌ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని ఆ స్టైల్లో నటించానని కృతి చెప్పింది. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెబుదామనుకున్నాని, అయితే వాయిస్‌‌లో బేస్ సూట్‌ కాకపోవడంతో చెప్పలేకపోయానని తెలిపింది. ఇక ఈ సినిమాలోని సిగరెట్ స్మోకింగ్ సీన్ గురించిన విషయాలు పంచుకున్న కృతి.. మొదట ఈ సీన్ తీసేయండని చెప్పానని, అయితే అది కీర్తి, నువ్వు కృతి.. తేడా ఉండాలి కదా? అని డైరెక్టర్ చెప్పడంతో చేయక తప్పలేదని తెలిపింది. అయితే ఈ సీన్ కోసం ప్రత్యేకంగా నికోటిన్ లేని సిగరెట్లు తెప్పించి షూట్ చేశారని చెప్పింది. సిగరెట్లను ఎలా తాగాలో మూడు రోజులు ప్రాక్టీస్‌ చేసినా కూడా తొలి రోజు షూట్‌లో తన చేతులు భయంతో వణికిపోయాయని చెప్పుకొచ్చింది కృతి శెట్టి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EsFC1M

ఓర్నీ.. ఒమిక్రాన్ కంట్రోల్ చేయడానికి ఆర్జీవీ ఐడియా.. RRRకి లింకు పెట్టిన వర్మ!

సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే వారిలో కాంట్రవ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఒక‌రు. నిత్యం ఏదో ఒక కార‌ణంతో వార్త‌ల్లో ఉండే ఈ కాంట్రవ‌ర్సీయ‌ల్ డైరెక్ట‌ర్ ఈసారి సోష‌ల్ మీడియాలో చాలా డిఫ‌రెంట్‌గా రియాక్ట్ అయ్యారు. అది కూడా ప్రభుత్వాల‌కు ఒమిక్రాన్‌ను కంట్రోల్ చేసే ఐడియాను షేర్ చేయ‌డం ద్వారా. ఇంత‌కీ ఒమిక్రాన్‌ను కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌భుత్వాల‌కు ఆర్జీవీ ఇచ్చిన ఐడియా ఏంటో తెలుసా? RRR సినిమా. ఒమిక్రాన్‌కు RRRకి ఉన్న లింకేంటి? అనే సందేహం రాక మాన‌దు. అస‌లు విష‌యం ఏంటని తెలియాలంటే ఆర్జీవీ చేసిన ట్వీట్ చూడాల్సిందే. ‘‘ఒమిక్రాన్‌ను కంట్రోల్ చేయాలనుకునే ప్ర‌భుత్వానికి ఓ గొప్ప ప‌థకాన్ని చెప్పాల‌నుకుంటున్నాను. RRR సినిమా చూడాల‌నుకునే ప్రేక్ష‌కులు త‌ప్ప‌నిస‌రిగా డబుల్ డోస్ వ్యాక్సినేష‌న్ తీసుకోవాల‌ని చెప్పాలి. అలా డ‌బుల్ డోస్ వ్యాక్సినేష‌న్ వేసుక‌న్న వారినే థియేట‌ర్స్‌లోకి అనుమ‌తిస్తామ‌ని అంటే RRR చూడాల‌నుకునే కోరిక ఉన్న వారంద‌రూ డ‌బుల్ డోస్ వ్యాక్సినేష‌న్ వేసుకుంటారు’’ అని వ‌ర్మ తెలిపారు. రామ్ గోపాల్ వ‌ర్మ చెప్పిన ఈ ఆలోచ‌న చాలా బావుంద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. అలా ప్ర‌భుత్వం చేస్తే చాలా మంది డ‌బుల్ డోస్ వేసుకుంటార‌ని అంటున్నారు. మ‌రికొంద‌రైతే ఇప్ప‌టికే ఆ సినిమాను చూడాల‌ని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మ‌ళ్లీ ఆంక్ష‌లు పెట్ట‌కండి అని అంటున్నారు. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్మ ప్ర‌స్తుతం కొండా దంపతుల మీద కొండా అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆర్జీవీ ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీల‌కు తెర లేపుతారో చూడాలి. మరో వైపు కారణంగా పాన్ ఇండియా మూవీస్ RRR, రాధే శ్యామ్ వాయిదా పడే అవకాశం ఉందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించడం.. థియేటర్స్‌ ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం జరిగింది. ఈ కారణంగా భారీ చిత్రాలు వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి వీటిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32iLIox

ఈ ప్రపంచం చాలా కఠినమైంది పద్మ.. నువ్వే లేకుంటే! నాగబాబు ప్రేమ బాణం

టాలీవుడ్‌లో మెగా బ్రదర్ నాగబాబుది ఓ ప్రత్యేకమైన జర్నీ. వెండితెర మొదలుకొని బుల్లితెర, ఆన్ లైన్ వేదికల వరకు ఆయన హంగామా నడుస్తుంటుంది. ఓ పక్క నటుడిగా కొనసాగుతూనే మరోపక్క నిర్మాతగా సత్తా చాటుతున్నారు . ఇక మెగా ఫ్యామిలీ మెంబెర్‌గా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు వృత్తిపరమైన, కుటుంబ పరమైన విషయాలను అభిమానులతో పంచుకునే ఆయన తాజాగా ఓ ప్రేమ బాణం విసురుతూ తన భార్యపై ఉన్న అమితమైన ప్రేమను బయటపెట్టారు. తన కుటుంబమంటే ఎంతో ఇష్టపడే నాగబాబు.. కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారికపై ప్రేమ కురిపిస్తూ చాలా సార్లు పోస్టులు పెట్టారు. కుటుంబమే ఆశగా, శ్వాసగా భావించే ఆయన తాజాగా భార్య పద్మజను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేయడంతో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేడు ( డిసెంబర్ 26) నాగబాబు సతీమణి పద్మజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెబుతూ కేక్‌ కట్‌ చేయించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు నాగబాబు. ''ఎంతో కఠినమైన ప్రపంచం ఇది. నా జీవితంలో నువ్వే లేకపోయుంటే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడం మరింత కష్టమయ్యేది. నిత్యం నాతో ప్రేమగా మెదులుతూ, నీ ముందుచూపుతో అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేసినందుకు ధన్యవాదాలు. ప్రియాతి ప్రియమైన పద్మ.. నీకు జన్మదిన శుభాకాంక్షలు'' అని పేర్కొంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు నాగబాబు. ఈ పోస్ట్ చుసిన మెగా ఫ్యాన్స్ నాగబాబు సతీమణికి బర్త్ డే విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. రోజాతో కలిసి ‘జబర్దస్త్ కామెడీ షో’తో ట్రెండ్ క్రియేట్ చేశారు నాగబాబు. లాఫింగ్ స్టార్‌గా బుల్లితెరపై ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఊహించని విధంగా జబర్దస్త్ వీడిన నాగబాబు.. ఆ తర్వాత 'అదిరింది' అనే షో చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో యూట్యూబ్ వేదికగా పలు విషయాలు చెబుతూ మరో ట్రాక్ రెడీ చేసుకున్నారు ఈ మెగా బ్రదర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mui1HF

How to Use Hide My Email on iPhone, iPad: Follow These Steps

In this article, we are giving a step-by-step guide on how you can use Hide My Email on your Apple device.

from NDTV Gadgets - Latest https://ift.tt/3FxpopA

35 సంవత్సరాలుగా మా రెండు కుటుంబాల మధ్య పోరు..! ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

రాను రాను మల్టీస్టారర్ సినిమాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దిగ్గజ దర్శకులు, అగ్ర హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపుతుండటం ప్రేక్షక వర్గాల్లో నూతనోత్సాహం నింపుతోంది. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ , మెగా పవర్ స్టార్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం . గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ ఎట్టకేలకు ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ విషయంలో తనదైన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు జక్కన్న. పలు భాషల్లో ఈ ప్యాన్ ఇండియా సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అన్ని భాషా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పేలా ప్రమోషన్స్ చేపడుతున్నారు. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ RRR విశేషాలతో హైప్ పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. RRR సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చే అవకాశాలున్నాయా అనే విషయమై ఎన్టీఆర్‌ ఆసక్తికరంగా స్పందించారు. ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చొ లేదో తెలియదు కానీ మా రెండు కుటుంబాల మధ్య 35 సంవత్సరాలుగా పోరు నడుస్తోందని అన్నారు. అయినా తామిద్దరం (రామ్ చరణ్- ఎన్టీఆర్) మంచి స్నేహితులని తెలిపారు. తమ మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటుందని చెప్పిన యంగ్ టైగర్.. RRR తర్వాత దేశంలోని గొప్ప నటీనటులంతా ఒకే తాటి పైకి వస్తారని, భారీ మల్టీస్టారర్‌ సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని అన్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌ భాగమయ్యారు. స‌ముద్ర ఖ‌ని, శ్రియా శ‌ర‌న్ కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిసన్ డూడి కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. RRR మూవీ కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qst7Oz

Friday 24 December 2021

iQoo 9, iQoo 9 Pro Launching on January 5, Leaked Poster Shows

iQoo 9, iQoo 9 Pro launch in China is scheduled for January 5, according to a leaked poster. The Vivo sub-brand also shared an image showing the back half of the smartphone. Separately, a tipster...

from NDTV Gadgets - Latest https://ift.tt/32vGjdl

టాలీవుడ్ స్టార్స్ ... క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు సంతోషంగా సంబరంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌న టాలీవుడ్ స్టార్స్ సోష‌ల్ మీడియా ద్వారా . అభిమానుల‌కు, సినీ ప్రేక్ష‌కుల‌కు, శ్రేయోభిలాషులు, స‌న్నిహితుల‌కు క్రిస్మ‌స్ అభినంద‌న‌ల‌ను తెలియ‌జేశారు. చిరంజీవి: అంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు. ఈ మ్యాజిక్ క్రిస్మ‌స్ మ‌నంద‌రి జీవితాల్లో న‌వ్వుల‌ను సంతోషాల‌ను నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. అలాగే త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌యుడు చ‌ర‌ణ్‌, మ‌న‌వరాళ్ల‌తో క‌లిసి అంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ వీడియో విడుద‌ల చేశారు. మ‌హేష్‌: మేరీ క్రిస్మ‌స్‌. ఈ పండుగ మీ అంద‌రికి ఆనందాల‌ను తీసుకొచ్చి సంతోషాల‌ను వెల్లివిరియించాల‌ని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ :అంద‌రికీ మేరి క్రిస్మ‌స్‌ ర‌వితేజ‌: అంద‌రికీ హ్యాపీ క్రిస్మ‌స్‌ ర‌వితేజ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు చెప్ప‌డ‌మే కాకుండా త‌ను చేస్తున్న ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాల‌కు సంబంధించిన పోస్ట‌ర్స్ విడుద‌ల చేశారు. శ‌ర‌త్ మండ‌వ‌: త‌మ‌న్‌: శివ కార్తికేయ‌న్‌: పారుల్ యాద‌వ్‌:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qlHjcs

పవన్ కళ్యాణ్‌తో ‘శ్యామ్ సింగరాయ్ 2’.. థియేటర్స్ పగిలిపోతాయ్: డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్

‘టాక్సీవాలా’తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్. ఆయ‌న డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ‌రాయ్‌’. నేచుర‌ల్ స్టార్ హీరోగా న‌టించారు. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాహుల్ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ‘శ్యామ్ సింగ‌రాయ్‌’కు తాను ఆశించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని రాహుల్ సాంకృత్యాన్ తెలిపారు. ఇదే స‌మ‌యంలో త‌న‌కు ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయాల‌ని ఉంద‌ని మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట పెట్టారు. ‘‘ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారిలో ఓ ఫైర్ ఉంటుంది. ఆయ‌న‌కు బ‌ల‌మైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయ‌నంటే నాకెంతో అభిమానం. ఆయ‌న‌తో ప‌వ‌ర్ ఫుల్ సినిమాలు చేస్తే థియేట‌ర్స్ ప‌గిలిపోతాయి. ఆయ‌న ఒప్పుకుంటే ఆయ‌న‌తో శ్యామ్ సింగ‌రాయ్ 2 సినిమా చేయాల‌ని ఉంది. అలాంటి ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల్లో ఆయ‌న్ని చూడాల‌ని ఆయ‌న అభిమానులు ఎదురు చూస్తుంటారు’’ అన్నారు. కోల్‌క‌తా బ్యాక్ డ్రాప్‌లో సాగే శ్యామ్ సింగ‌రాయ్ మూవీ. 1970 బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెర‌కెక్కింది. పున‌ర్జ‌న్మ‌ల నేపథ్యం కూడా దీనికి మిక్స్ చేసి తెరకెక్కించారు. విప్ల‌వాత్మ‌క భావాలున్న యువ‌కుడు శ్యామ్ సింగ‌రాయ్‌. బుల్లెట్ కంటే అక్ష‌రం ఎంతో ప‌దునైంద‌ని త‌ను భావిస్తుంటాడు. త‌న ర‌చ‌న‌ల‌తో యువ‌తలో స్ఫూర్తిని నింపడ‌ట‌మే కాదు, దేవ‌దాసీ వ్య‌వ‌స్థ‌పై ఎదురు తిరిగి దాన్ని కాల‌రాస్తాడు. ఇలాంటి ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను నాని క్యారీ చేసిన తీరుకి ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డొన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా విడుద‌లైంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mtjTAM

Pawan Kalyan : పవన్ - మహేష్ మల్టీస్టారర్... పవన్ దంపతులకు థాంక్స్ చెప్పిన నమ్రత!

ఇప్పుడు టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ హ‌వా కొన‌సాగుతోంది. పాన్ ఇండియా మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఆర్ఆర్ఆర్‌లోనూ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే అభిమానులు మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అదెవ‌రిదో కాదు, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుల‌ది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌హేష్ బాబు బ‌య‌ట ఎక్క‌డా ఎక్కువ‌గా క‌లుసుకోరు కానీ, ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. క్రిస్మ‌స్ సమ‌యంలో మ‌హేష్‌కి ప‌వ‌న్ ఆయ‌న స‌తీమ‌ణి అన్నాలెజినోవా బ‌హుమ‌తులు పంపారు. ఈ విష‌యాన్ని మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేస్తూ ప‌వ‌న్ దంప‌తులకు అభినంద‌న‌లు తెలిపారు. న‌మ్ర‌త షేర్ చేసిన ఈ విష‌యంపై ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అటు మ‌హేష్ బాబు ఫ్యాన్స్ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్స్ త‌మ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. ప‌వ‌న్ - మ‌హేష్ క‌లిసి మ‌ల్టీస్టారర్ మూవీలో న‌టించాల‌న్నారు. దీనికి న‌మ్ర‌త‌నే చొర‌వ తీసుకుని సాధ్య‌మ‌య్యేలా చూడాల‌ని కూడా ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో కోర‌డం విశేషం. ప‌వ‌న్ - మ‌హేష్ క‌లిసి సినిమా చేస్తే, వ‌చ్చే బాక్సాఫీస్ రిసౌండ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి ఫ్యాన్స్ కోరిక‌ను న‌మ్ర‌త శిరోద్క‌ర్ ప‌ట్టించుకుని వారి మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌డానికి ముంద‌డుగు వేస్తారా? అనేది చూడాలి. ఇది వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన జ‌ల్సా చిత్రంలో ప‌వ‌న్ పాత్ర‌కు సంబంధిచిన బ్యాగ్రౌండ్ స్టోరిని మ‌హేష్ బాబు వాయిస్‌లో వినిపించేలా చేసి ఫ్యాన్స్ అంతులేని కిక్‌ను అందించారు త్రివిక్ర‌మ్‌. మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబుల‌తో మ‌ల్టీస్టార‌ర్‌ను ఏ డైరెక్ట‌ర్ సాకారం చేస్తారో చూడాలి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ భీమ్లా నాయ‌క్‌, హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రంతో బిజీగా ఉంటే మ‌రో వైపు మ‌హేష్ స‌ర్కారు వారి పాట చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ep5wZO

James Webb Space Telescope to Launch Today: When, How to Watch Live

NASA's largest space telescope launch countdown has begun. The James Webb Space Telescope will be launched today on Christmas Day, December 25, and space enthusiasts can watch all the action live.

from NDTV Gadgets - Latest https://ift.tt/3myA1kl

ప్రభాస్ అలా అన్నప్పుడు పక్కన పెట్టాలనుకున్నాను : ‘ఆది పురుష్’ డైరెక్టర్ ఓం రౌత్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీస్‌లో ఒక‌టి. మ‌న ఇతిహాసం రామాయ‌ణంను ద‌ర్శ‌కుడు ఆది పురుష్‌గా తెర‌కెక్కిస్తున్నారు. టాక్ టెక్నాల‌జీతో రూపొందుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో ప్ర‌భాస్ రాముడు.. కృతిస‌న‌న్ సీత‌.. సైఫ్ అలీఖాన్ రావ‌ణాసురుడు.. పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమా ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఆగ‌స్ట్ 11, 2022లో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమా గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ ఓం రౌత్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. ‘‘రామాయ‌ణం 7 వేల సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన క‌థ‌. వాల్మీకి రామాయ‌ణాన్ని నా కోణంలో చూపించ‌బోతున్నాను. అలాగే మొత్తం రామాయ‌ణాన్ని మూడు గంట‌ల్లో చూపించ‌డం అంటే క‌ష్ట‌త‌రం. కాబ‌ట్టి, ఓ కీల‌క భాగాన్ని మాత్ర‌మే అందులో చూపించ‌బోతున్నాం. అదేంట‌నేది వెండితెర‌పై చూడాల్సిందే. దాన్ని మాటల్లో చెప్పాలంటే క‌ష్టం. స్క్రిప్ట్ రాసుకున్న త‌ర్వాత రాముడుగా ఎవ‌రైతే బావుంటార‌నుకోగానే నాకు ప్ర‌భాస్‌గారే గుర్తుకొచ్చారు. ఆ పాత్ర చేయాలంటే స్వ‌చ్చ‌మైన మ‌న‌స్సున్న న‌టుడు కావాలి. క‌ల్మ‌షం లేని వ్య‌క్తిత్వం ఆయ‌న క‌ళ్ల‌లో క‌నిపిస్తుండాలి. అవ‌న్నీ నాకు ప్ర‌భాస్‌లో క‌నిపించాయి. స్క్రిప్ట్ విన్న త‌ర్వాత ప్ర‌భాస్ చేయ‌న‌ని అనుంటే, స్క్రిప్ట్‌ను ప‌క్క‌న పెట్టేద్దామ‌ని అనుకున్నాను. కానీ విన్న వెంట‌నే ప్ర‌భాస్‌గారు ఓకే చెప్పారు. ఆది ప‌రుష్‌లో మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీని వాడుతున్నాం. క‌థానుగుణంగా ఇందులో వ‌న్య ప్రాణుల‌ను కూడా చూపించాల్సి ఉంటుంది. అందుకోసం బ‌డ్జెట్ పెరిగినా ఈ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీని ఉప‌యోగించాల‌ని అనుకున్నాను. రేపు సినిమాను వెండితెర‌పై చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుడు ఓ కొత్త అనుభూతికి లోన‌వుతాడు’’ అన్నారు. అంతే కాదు.. విడుదల తేది గురించి మాట్లాడుతూ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పూ ఉండ‌బోద‌ని తెలిపారు. ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ ..సంక్రాంతి సందర్భంగా జనవరి 14, 2022లో విడుదలవుతుంది. ఇదొక పీరియాడిక్ లవ్ స్టోరి. ఇది కాకుండా సలార్ మూవీ చిత్రీకరణను ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. ఇది కూడా పూర్తి కావస్తుంది. అలాగే మరో వైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్‌ను కూడా ప్రభాస్ షురూ చేసిన సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FmUY9j

Thursday 23 December 2021

'The Hindu vote is not united'

'Today in Uttar Pradesh all big parties like Samajwadi Party, BJP or even Bahujan Samaj Party are out to woo smaller parties as they know the Hindu votes are getting divided.'

from rediff Top Interviews https://ift.tt/3EjpOyk

CoinSwitch Kuber Lists New Crypto Assets for Indian Investors

​​​​​

from NDTV Gadgets - Latest https://ift.tt/33OwBDv

'భీమ్లా నాయక్' వాయిదాపై నిహారిక రియాక్షన్.. చరణ్‌ చెల్లెలిగా కాదు ఓ ఆడియన్‌గా చెబుతున్నా..!

ఈ ఏడాది సంక్రాంతికి పలు భారీ సినిమాలు సిద్దమైన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా కరోనా కారణంగా థియేటర్స్‌కి వెళ్లని ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ హీరోలు రెడీ అయ్యారు. అయితే బిగ్గెస్ట్ ప్యాన్‌ ఇండియా సినిమాల విడుదల ఒకేసారి ఉండటంతో ప్రేక్షకుల నడుమ ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పడం కోసం నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చి '' సినిమా రిలీజ్ వాయిదా వేశారు. అయితే జనవరి 7న RRR, జనవరి 14న రాధే శ్యామ్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై రియాక్ట్ అయింది మెగా డాటర్ . ప్యాన్‌ ఇండియా స్థాయిలో RRR, రాధే శ్యామ్ విడుదల నేపథ్యంలో భీమ్లా నాయక్ పోటీ నుంచి తప్పుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమాను ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ కలిగించడమే గాక రాజమౌళిపై ట్రోల్స్‌కి కారణమైంది. అయితే ఈ విషయమై స్పందించిన నిహారిక.. 'బాబాయ్‌ రావడం ఆలస్యం అవుతుందేమో కానీ.. బాక్సాఫీస్‌ బద్దలు కొట్టడం పక్కా' అంటూ మెగా అభిమానుల్లో జోష్ నింపింది. 'రావడం కాస్త లేటు అవ్వొచ్చు. కానీ రావడం మాత్రం పక్కా' అని మా బాబాయ్‌ ఓ సినిమాలో చెప్పినట్టు గానే 'భీమ్లా నాయక్ విడుదల కాస్త ఆలస్యం కావొచ్చు. కానీ బాక్సాఫీస్‌ బద్దలు కొట్టడం పక్కా' అని చెప్పింది నిహారిక. ఇదే క్రమంలో RRR మూవీ గురించి కూడా మాట్లాడిన ఆమె.. తారక్‌ అన్నయ్య ఎనర్జీ వేరే లెవెల్ అంటూ ఎన్టీఆర్‌ని తెగ పొగిడేసింది. ఆయన భార్య ప్రణతి తన క్లాస్‌మేట్‌ అని చెప్పింది. RRR ట్రైలర్‌ చూసిన వెంటనే చరణ్‌ అన్నని ప్రత్యేకంగా అభినందనలు తెలిపానని చెప్పింది. చరణ్‌ చెల్లెలిగా కాదు ఓ ఆడియన్‌గా చెబుతున్నా 'థియేటర్‌లో ఆ ట్రైలర్‌ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచింది' అని నిహారిక చెప్పడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qpARkm

'Govt wants disruption of Parliament'

'The PM says he believes in discussion and debate, then why are discussions and debates not being allowed in Parliament?'

from rediff Top Interviews https://ift.tt/3ss9yZD

Minnal Murali Movie Review: Super Hero, Super Mediocre

Minnal Murali movie review: Tovino Thomas-led Malayalam-language superhero movie is overambitious to a fault, packing in too much and unable to deliver on most counts. Download Minnal Murali from...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qmAwPx

వస్తున్నాం.. వచ్చేస్తున్నాం! నాగ చైతన్యతో యంగ్ హీరోయిన్.. నాగార్జున పోస్ట్ అర్థం అదేనా?

సీనియర్ హీరో అక్కినేని నేటికీ అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ మన్మథుడిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌తో ఆకట్టుకుంటున్నారు. పంచె కట్టినా, జీన్స్ వేసినా వెండితెరపై ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫిదా అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. ఇదే బాటలో వెళుతున్న నాగార్జున తాజాగా తన లేటెస్ట్ మూవీ '' ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుంచే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపారు నాగ్. నాలుగేళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ సాధించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా ఈ 'బంగార్రాజు' మూవీ రాబోతోంది. చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య జంటగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదట నిర్మాతలు. అందుకు తగ్గట్టు ఇప్పటివరకు విడుదల చేసిన 'బంగార్రాజు' అప్‌డేట్స్, సాంగ్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు గానీ షూటింగ్ కంప్లీట్ కాలేదని, సో.. ఇంకా ఆలస్యం కావొచ్చనే టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా నాగ చైతన్య- కృతి శెట్టి కలిసి మాస్ స్టెప్పేస్తున్న ఓ స్టిల్ షేర్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు నాగార్జున. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని, ఇది పండగ లాంటి సినిమా.. త్వరలోనే మీ ముందుకు రాబోతుందని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ తండ్రీ కొడుకులు సంక్రాంతి బరిలో నిలువబోతున్నారా? అనే పాయింట్ చర్చల్లో నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో జీ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. రొమాన్స్, ఎమోషన్స్, అన్నిరకాల కమర్షియల్ అంశాలతో ఈ సినిమా రూపొందించారట. నాగార్జున, నాగ చైతన్యలు తాత మనవడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుండటం సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పింది. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3muFrN4

Shyam Singha Roy Twitter Review: పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్' రూపొందింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాను 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెరకెక్కించారు. దేవదాసీ పాత్రలో సాయిపల్లవి నటించగా, టైటిల్ రోల్ నాని చేశాడు పోషించారు. నేడు (డిసెంబర్ 24) విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్, యూఎస్‌లో ప్రీమియర్స్ చూసిన పబ్లిక్ ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ రివ్యూస్ పోస్ట్ చేస్తున్నారు. అందులో కొన్నింటి ఆధారంగా ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాని డిఫరెంట్ క్యారెక్టర్‌తో 'శ్యామ్ సింగరాయ్' రూపంలో బరిలోకి దిగారు. ఈ సినిమాకు ఆయన రోల్ మేజర్ అసెట్ అయిందనే టాక్ వస్తోంది. రాహుల్ డైరెక్షన్, నాని- సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి తన నటనతో ఇరగదీసిందనే టాక్ బయటకొచ్చింది. వాళ్ళిద్దరి ప్రేమ కథను అద్బుతంగా తీర్చిదిద్దారని అంటున్నారు. ఫస్టాఫ్ కాస్త సాగదీతగా అనిపించినా, సెకండాఫ్ బాగా వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్, సాంగ్స్, కొన్ని మాస్ సన్నివేశాలతో పాటు నాని- సాయి పల్లవి జోడీ ఈ సినిమాలో హైలైట్ అయ్యారని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అనే టాక్ రావడం విశేషం. మొత్తంగా చూస్తే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందనే చెప్పుకోవాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pnMJEe

Wednesday 22 December 2021

How Chirag Patil got to play his dad in '83

'Ranveer Singh is on a different level, he is a super human.'

from rediff Top Interviews https://ift.tt/3mrM8zP

Amazon Sues Enforcement Directorate to Quash Future Group Deal Investigation

Amazon is taking India's Enforcement Directorate to court, seeking to quash an investigation into one of its 2019 deals, a court filing shows.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pkhoCq

RGV: పుష్పను సాకుగా చూపుతూ సెటైరికల్ ట్వీట్.. నెట్టింట రచ్చ రచ్చ

టాలెంట్ సంగతి అటుంచితే తన సినిమాలతో, ముక్కుసూటి మాటలతో వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. సమాజంలో జరిగే పలు విషయాలపై తన అభిప్రాయాలను చెప్పడానికి ఎప్పుడూ ముందుండే ఆర్జీవీ తాజాగా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీల టాపిక్ తీస్తూ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ' ది రైజ్' దేశ వ్యాప్తంగా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. బన్నీ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో ఈ సినిమా హిందీ వర్షన్ కలెక్షన్స్‌పై ప్రతి ఒక్కరి దృష్టి పడింది. అయితే హిందీలో 'పుష్ప' సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. మరోవైపు ఈ సినిమాకు పోటీగా హాలీవుడ్ మూవీ `స్పైడర్ మ్యాన్ నో వే హోమ్` బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. దీంతో ఈ రెండు సినిమాలపై కన్నేసిన ఆర్జీవీ.. బాలీవుడ్‌పై సెటైరికల్ ట్వీట్ వదిలారు. ఎప్పటిలాగే తనదైన కోణంలో చిత్ర విచిత్రంగా మెసేజ్ ఇస్తూ పుష్ప సినిమాను సాకుగా చూపుతూ బాలీవుడ్ ఇండస్ట్రీపై టాలీవుడ్ పంజా విసురుతోందని చెప్పే ప్రయత్నం చేశారు. స్పైడర్‌మాన్, పుష్ప హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ.. హాలీవుడ్ వెనుక పరుగెడుతున్న బాలీవుడ్‌ని, టాలీవుడ్ వెంటాడుతోందని అర్థం వచ్చేలా మెసేజ్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇక ఆర్జీవీ సినిమాల విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `దిశ ఎన్ కౌంటర్` ఆధారంగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని `ఆశ ఎన్ కౌంటర్` పేరుతో జనవరి 1న రిలీజ్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pltMCb

'Opposition MPs have become agents of unrest'

'Today, we being the majority pass a law and if the Opposition parties do not like it, they throw files at the Chair, and beat up women marshals.'

from rediff Top Interviews https://ift.tt/3qdpUlS

అప్పట్లో 30 రూపాయల జీతం.. నాతో బాలకృష్ణ ఆ మాటన్నారు! ఓపెన్ అయిన తమన్

ప్రెజెంట్ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరంటే ముందుగా వినిపించే పేరు . సౌత్ ఇండియన్ స‌క్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అగ్ర హీరోలకు హుషారెత్తే మ్యూజిక్ అందిస్తున్నారు తమన్. 'అల.. వైకుంఠపురములో' సినిమాకు బాణీలు కట్టి రికార్డులు తిరగరాసిన ఆయన.. ఇటు తెలుగు అటు తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారారు. అగ్ర హీరోలు, అగ్ర దర్శకుల సినిమాలకు బెటర్ ఛాయిస్ అవుతూ బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా '' ప్రోగ్రాం గెస్టుగా విచ్చేసి కాసేపు సరదా సరదాగా మాట్లాడుతూనే తన వ్యక్తిగత విషయాలపై నోరువిప్పారు తమన్. తనకు ఫ్లాప్ వస్తే ఎందుకు వచ్చిందా అనేది నేర్చుకుంటాను. అలాగే సక్సెస్ వచ్చినా కూడా ఆ సక్సెస్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాను అని చెప్పిన తమన్ తనపై జరిగే ట్రోల్స్ గురించి ఆసక్తికరంగా స్పందించారు. అలాగే తన లైఫ్‌లో ఎదిగిన విధానం, పడిన కష్టాలు తదితర విషయాలపై ఓపెన్ అయ్యారు. తన మొదటి సినిమా హీరోగా వచ్చిన 'భైరవద్వీపం' అని చెప్పిన తమన్.. ఆ సినిమాకు డ్రమ్మర్‌గా పనిచేశానని తెలుపుతూ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. అప్పట్లో తన జీతం 30 రూపాయలు అని చెప్పిన తమన్.. ఇప్పుడు అదే బాలకృష్ణ గారి 'అఖండ'కి సంగీత దర్శకుడిగా చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అఖండ మ్యూజిక్ అవుట్‌పుట్ చూశాక 'ఈ సినిమాకి నువ్వు కూడా హీరోవే' అని తనతో బాలకృష్ణ అన్నారని చెప్పారు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి చేరుకోవడానికి 20 ఏళ్ల పైన సమయం పట్టిందని తమన్ పేర్కొన్నారు. అప్పట్లో శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన 'బాయ్స్' సినిమాలో ఒక చిన్న రోల్ చేసిన తాను ఇప్పుడు చరణ్‌తో ఆయన చేస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తుండటం గర్వంగా ఉందని తమన్ అన్నారు. తనకు ఇళయరాజా గారు హార్ట్ అయితే ఏఆర్ రెహమాన్ గారు బ్రెయిన్ అని తమన్ చెప్పడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3JgmqYz

'Omicron is a very, very obvious case for boosters'

'An individual who maybe has had two vaccines, or has had two vaccines, and a booster, is going to be pretty well protected.'

from rediff Top Interviews https://ift.tt/33SfuRn

Tuesday 21 December 2021

Moto G Stylus (2022) Price, Specifications, Renders Surface Online

Motorola is reportedly gearing up to launch Moto G Stylus (2022) in June next year. Ahead of the official announcement, a fresh leak offers insights into the design, price, and renders of Moto G...

from NDTV Gadgets - Latest https://ift.tt/3pl7pNr

Tesla Model Y Receives Top Safety Pick+ Designation From US Group

The Insurance Institute for Highway Safety (IIHS) said the 2021-22 Tesla Model Y received its Top Safety Pick+ designation.

from NDTV Gadgets - Latest https://ift.tt/3suWYbU

Blackberry Rides Strong Cybersecurity Demand to Beat Revenue Estimates

BlackBerry beat Wall Street estimates for third-quarter revenue, helped by sustained demand for its cybersecurity and IoT products.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ms6zfX

Realme GT 2 Series Launch Confirmed for January 4

Realme GT 2 series has been scheduled to launch on January 4 in China and is also said to have its global debut. The smartphone series has been reconfirmed to be powered by the Snapdragon 8 Gen 1 SoC....

from NDTV Gadgets - Latest https://ift.tt/3Eo4gjT

OnePlus 10 Pro Design Tipped by Concept Renders Ahead of January Launch

OnePlus 10 Pro concept renders have been spotted online in a video, showing off the smartphone's design in Black, Green, Purple, and Silver, along with the large rear camera module. OnePlus has...

from NDTV Gadgets - Latest https://ift.tt/33JbZMV

Perfectly Preserved Dinosaur Embryo Found Inside Fossilised Egg

Paleontologists have found a never-seen-before fossil of a complete baby dinosaur curled up inside its egg. The fossil showed the remarkable similarities between theropod dinosaurs and the birds they...

from NDTV Gadgets - Latest https://ift.tt/3FwjAfG

'India is in the mid of a compelling investment cycle'

'Good investment opportunities should not be missed.'

from rediff Top Interviews https://ift.tt/3yMqOdb

Char Dham Project will 'complicate army movement'

'This is probably why the late General Bipin Rawat, who hails from the Garhwal Himalaya, said that the existing roads are fine with the army.'

from rediff Top Interviews https://ift.tt/3Jaslyf

Elon Musk, Jack Dorsey Mock Web3 on Twitter

Elon Musk and Jack Dorsey dismissed the so-called Web3 and criticised the involvement of venture capital firms such as Andreessen Horowitz in building out what some have called the next phase of the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3egBUO8

సెకండ్ హ్యాండ్ ఐటమ్ సమంత.. అప్పనంగా 50 కోట్లు కొట్టేసింది! దిమ్మతిరిగే కౌంటరిచ్చిన స్టార్ హీరోయిన్

అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత.. నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. అక్కినేని కుటుంబంతో కట్ చేసుకోవడాన్ని తప్పుబట్టిన కొందరు ఆమెపై తెగ ట్రోల్స్ చేశారు. అయితే వాటన్నింటినీ తిప్పికొట్టి తన కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టిన సమంతకు తాజాగా మరోసారి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సమంతపై వల్గర్ కామెంట్ చేశాడు ఓ నెటిజన్. ఇది సామ్ దృష్టికి రావడంతో సదరు నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేసింది. నాగ చైతన్యతో సమంత విడాకుల ఇష్యూపై ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆమె కోట్లలో భరణం తీసుకుందంటూ పెద్ద ఎత్తున రూమర్స్ నడిచాయి. అయితే తాజాగా అదే అంశాన్ని లెక్కలోకి తీసుకొని షాకింగ్ కామెంట్ చేశాడు ఓ నెటిజన్. 'విడాకులు తీసుకుని చెడిపోయిన సెకెండ్ హ్యాండ్ ఐటమ్ సమంత. ఓ జెంటిల్మెన్ దగ్గర ఆమె 50 కోట్ల రూపాయలు బ్లాక్ మనీగా తీసుకుంది' అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ చూసిన సమంత.. అతనిపై విరుచుకుపడుతూ దిమ్మతిరిగే కౌంటరిచ్చింది. ‘నీ ఆత్మకు ఆ దేవుడు శాంతి కలిగించాలి’ అంటూ కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇలాంటి సందర్భాల్లో సమంత డేరింగ్‌నెస్‌ ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'ఇలాంటి సందేశాలను ఇలా తిప్పికొట్టాల్సిందే. సూపర్ సమంత' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవలే విడుదలైన 'పుష్ప' చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసి యావత్ భారత దేశాన్ని ఉర్రూతలూగించింది సమంత. ఈ సాంగ్‌పై పలు వివాదాలు రాజుకున్నా కూడా యూట్యూబ్ రికార్డ్స్ తిరగరాస్తుండటం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FnKTJo

Facebook, Twitter Drop CES Plans Over COVID-19 Concerns

Facebook parent Meta, Twitter, and Pinterest separately said they will not send teams to CES 2022 in Las Vegas as concerns grow about the Omicron variant of the coronavirus.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ElxmR7

అల్లు అర్జున్ విసిరి కొట్టేశారు! అంతటా విలన్‌ అయిపోయా.. సునీల్ ఎమోషనల్ కామెంట్స్

అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ. '' భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దాడి చేస్తోంది. తొలుత డివైడ్ టాక్ వచ్చినా ఆ తర్వాత తేరుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బన్నీ నటనతో పాటు సుకుమార్ నేరేషన్, ఇతర నటీనటుల యాక్టింగ్‌పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఎంతో సంతోషంలో ఉన్న చిత్రయూనిట్ డిసెంబర్ 21వ తేదీన తిరుపతిలో మాసివ్ సక్సెస్ పార్టీ నిర్వహిచారు. ఈ వేదికపై కమెడియన్ తన ఫీలింగ్స్ బయటపెట్టారు. 'అందాల రాముడు' సినిమాలో హీరోగా నటించినపుడు తన జర్నీ ఇక్కడి నుంచే మొదలైందని గుర్తు చేసుకున్న సునీల్.. ఇప్పుడు 'పుష్ప' చిత్రంతో విలన్‌గా కూడా ఇక్కడి నుంచే జర్నీ మొదలుకావడం ఆనందంగా ఉందని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్లే అంతా జరిగిందని, ఒక్క తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా అదే వైబ్రేషన్ రావడం పుష్ప సినిమా స్పెషల్‌గా మారిందని అన్నారు. ''ఈ ఒక్క సినిమాతో అన్ని భాషల్లో విలన్ అయిపోయాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుక్కు డార్లింగ్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. ఒక భాషలో కాదు అన్ని భాషల్లో ఒకేసారి గుర్తింపు తెచ్చుకో అంటూ బన్నీ గారు నన్ను విసిరి కొట్టేసారు. నన్ను సీరియస్ పాత్రలో కూడా చూసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని సునీల్ అన్నారు. కాగా 'పుష్ప' సినిమాలో సునీల్ క్యారెక్టర్‌ని చాలా డిఫరెంట్‌గా తీర్చిదిద్దారు సుకుమార్. వెండితెరపైకి మంగళం శ్రీనుగా తీసుకొచ్చి ఆయనలోని వేరియేషన్స్ బయటపెట్టారు. ఈ క్యారెక్టర్‌లో సునీల్ నటనకు గాను ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FlqyV0

'Modi's credentials are at stake in UP'

'There is a famous saying here that 'the way to Delhi passes through Lucknow'.'

from rediff Top Interviews https://ift.tt/32t4EQQ

నా వెనక ఉంది నువ్వే.. ఎంత పేరొచ్చినా ఆ క్రెడిట్ నీదే డార్లింగ్! అల్లు అర్జున్ ఎనర్జిటిక్ స్పీచ్

హీరోగా దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'పుష్ప' భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ దాడి చేస్తోంది. తొలుత ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బన్నీ నటనతో పాటు సుకుమార్ నేరేషన్, ఇతర నటీనటుల యాక్టింగ్‌పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఎంతో సంతోషంలో ఉన్న చిత్రయూనిట్ డిసెంబర్ 21వ తేదీన తిరుపతిలో మాసివ్ సక్సెస్ పార్టీ నిర్వహిచారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇక వేదికపైకి వచ్చిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని డైలాగులతో సభా ప్రాంగణాన్ని హూషారెత్తించారు. మరోసారి రష్మికపై తన ఇష్టాన్ని బయటపెడుతూ సుకుమార్‌పై ప్రశంసలు గుప్పించారు. డార్లింగ్ అంటూ ఆయనపై ఎంతో ప్రేమ చూపించారు. చిత్తూరు యాసలో మాట్లాడుతూ అక్కడి అభిమానులతో గోల పెట్టించారు. ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ 'పుష్ప' తొలి సక్సెస్ వేడుక చిత్తూరులో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ''ఇవాళ నా నటనకు, సినిమాకు ఎంత పేరొచ్చినా.. ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్‌దే. ఏడు కొండల వెంకన్న స్వామి మీ అందరి వెనక ఎలా ఉన్నాడో.. సుక్కు నా వెనక అలా ఉన్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చాడు. ఇక ఖర్చు విషయంలో తగ్గేదే లే అంటూ ప్రోత్సహించారు మా చిత్ర నిర్మాతలు. నా తోటి నటీనటుల ప్రోత్సాహం వల్లే సినిమాలో నేనంత బాగా నటించగలిగాను. సునీల్, అనసూయా చాలా బాగా నటించారు. నాకు అందరి సపోర్ట్ దక్కింది. నేను చిత్తూరు యాస నేర్చుకోవడంలో జష్వంత్‌, ప్రవీణ్‌, చిట్టేటి మోహన్‌ ఎంతో సహాయం చేశారు. ఇది ప్రేక్షకుల విజయం. పుష్ప మూవీని ఇంత బాగా ఆదరిస్తున్న సినీప్రియులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా'' అన్నారు అల్లు అర్జున్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EpVmmk

Monday 20 December 2021

పెళ్లి ఒక‌రితో.. ఫ‌స్ట్ నైట్ ఇంకొక‌రితో అనిపిస్తుంది.. బాలీవుడ్‌పై త‌మ‌న్ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌, బిజియెస్ట్‌, స‌క్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే ఠ‌క్కున్న మ‌న మ‌న‌సులో మెదిలే పేరు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోని అగ్ర హీరోలంద‌రి సినిమాల‌కు ప‌నిచేసి.. ప‌ని చేస్తున్న ఈ సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రీసెంట్‌గా సీనియ‌ర్ క‌మెడియ‌న్‌, న‌టుడు అయిన అలీతో స‌ర‌దాగా ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు త‌మ‌న్‌. ఆరో త‌ర‌గ‌తి వర‌కు మాత్ర‌మే చ‌దువుకున్న త‌ను అస‌లు మ్యూజిక్ రంగంలోకి ఎందుకు వ‌చ్చాన‌నే దానిపై మాట్లాడిన త‌మ‌న్‌. బాలీవుడ్‌లో సినిమాల‌కు సంగీతం చేయ‌డం గురించి మాట్లాడిన మాట‌లు ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌కు వ‌ర్క్ చేశారు క‌దా, మ‌రి బాలీవుడ్‌లో ఎందుకు సినిమాలు చేయలేదు అని అలీ ప్ర‌శ్నించిన‌ప్పుడు త‌మ‌న్ మాట్లాడుతూ ‘‘గోల్ మాల్, సింబా, సూర్యవంశీ చిత్రాలకు పనిచేశాను. ఒక్కో సినిమాకు అక్క‌డ ఆరు మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ ఎలా ప‌నిచేస్తారో అర్థం కావ‌డం లేదు. ఓ రీల్ రీ రికార్డింగ్ చేయ‌మ‌నో, ఓ పాట చేయ‌మ‌నో అడుగుతారు. అలా చేయ‌డం నా వ‌ల్ల కావ‌డం లేదు. అంటే.. పెళ్లి ఒక‌రితో ఫ‌స్ట్ నైట్ ఇంకొక‌రితో లాగా అయిపోతుంది’’ అని కాస్త కటువుగానే సమాధానం ఇవ్వడంతో ఖంగు తినడం అలీ వంతైంది. అలాగే రీసెంట్‌గా బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు కూడా త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎందుకు అంత ఎక్కువ‌గా ఇచ్చావు అన‌గానే, దేవుడు గుడిలో దేవుడుని చూపిస్తున్నప్పుడు డ‌ప్పులు కొడ‌తారు క‌దా, అక్క‌డ‌కు వెళ్లి సౌండ్ త‌గ్గించ‌మ‌ని అడుగుతారా? లేదు కదా, అలాగే ఇక్క‌డ బాల‌కృష్ణ‌ను చూస్తే శివుడుని చూస్తున్న‌ట్లు అనిపించింది అని స‌మాధానం ఇచ్చారు త‌మ‌న్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qh6Mn4

'70% of my work in the film was gone!'

'I got an offer to do a cameo in Jassi Jaisi Koi Nahin.'

from rediff Top Interviews https://ift.tt/3J5S62Q

Parler to Expand Into NFTs to Tap Into the Burgeoning Digital Asset

Parler said it will expand its business into NFTs, in a move that underpins the rapid growth of the digital asset in recent months.

from NDTV Gadgets - Latest https://ift.tt/3H0wYZV

అల్లు అర్జున్ ఫైర్ పుట్టించాడన్న Samantha.. వైరల్ అవుతున్న పోస్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘పుష్ప ది రైజ్‌’. శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కింది. డిసెంబ‌ర్ 17న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ వ‌సూళ్ల ప‌రంగా ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌లేదు. బ‌న్నీ కెరీర్‌లో క‌లెక్ష‌న్స్ ప‌రంగా ది బెస్ట్ అనిపించుకుంటూ దూసుకెళుతోంది. బ‌న్నీ డైలాగ్ డెలివ‌రీ, యాక్టింగ్‌, సుకుమార్ టేకింగ్, ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌, ఆర్ట్ వ‌ర్క్ ఇలా సినిమా గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. వీటన్నింటీతో పాటు అంద‌రూ మాట్లాడుకుంటున్న మ‌రో ఎలిమెంట్ సినిమాలోని ఐటెం సాంగ్ గురించి. సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్స్ కామ‌న్‌గా ఉంటాయి క‌దా, అందులో కొత్తేమీ అనుకోకండి. ఇప్ప‌టి వ‌ర‌కు స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించ‌ని స్టార్ హీరోయిన్ స‌మంత ఐటెమ్ భామ‌గా క‌నిపించారు. పుష్ప ది రైజ్‌లో స‌మంత చేస్తార‌న‌గానే పాట ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రిలో తెలియ‌ని క్రేజ్ వ‌చ్చింది. సినిమా విడుద‌ల త‌ర్వాత కూడా ‘ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ‌..’ అంటూ అంద‌రూ స‌ద‌రు పాట‌ను పాడుకుంటున్నారు. ఒకానొక స‌మయంలో ఈ పాట‌ను తీసేయాల‌ని కూడా కేసులు పెట్టిన మ‌గ‌వారు లేక‌పోలేదు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌లైన పుష్ప ది రైజ్ మూవీకి ఎలాంటి క్రేజ్ వ‌చ్చిందో, అలాంటి క్రేజే ‘ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ‌..’ పాట‌కు వ‌చ్చింది. ఈ పాట గురించి స‌మంత ఇన్‌స్టా వేదికగా స్పందించారు. హీరో అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ‘‘అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ అలా ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రతి సెకను తన నటనతో సిల్వర్ స్క్రీన్‌పై మంట పుట్టించారు. గొప్ప న‌టుడు. త‌ను స్క్రీన్‌పై ఉన్న‌ప్పుడు చూపు తిప్పుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఈ సినిమా కోసం త‌ను ప్ర‌త్యేక‌మైన యాస నేర్చుకోవ‌డ‌మే కాకుండా, భుజాన్ని ఓ వైపు వంచి చేసిన పెర్ఫామెన్స్ నిజంగా అద్భుతం. త‌న న‌ట‌న చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యాను’’ అన్నారు. అంతే కాకుండా తను పుష్ప ది రైజ్ సినిమాలో చేసిన ‘ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ‌..’ సాంగ్ గురించి మాట్లాడుతూ మంచి సినిమాలు, ఆకట్టుకోని సినిమాలు చేశాను. ఏ సినిమా చేసినా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవాల‌ని ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశాను. అయితే సెక్సీగా క‌నిపించ‌డం అనేది హార్డ్ వ‌ర్క్‌లో మ‌రో లెవ‌ల్‌’’ అని తెలియ‌జేసింది చెన్నై బ్యూటీ స‌మంత‌. Also Read :


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eckK4a

The Top Tech Gift Ideas for Christmas 2021

​​​​​

from NDTV Gadgets - Latest https://ift.tt/33QU33f

పద్ధతిగా లేదు.. అభిమానులకు ఎన్టీఆర్ వార్నింగ్!

స్టార్ హీరోల‌కు అభిమానులే కొండంత అండ‌. వారి బ‌ల‌మే ఎక్స్‌పెరిమెంట్స్ చేయ‌డానికి ధైర్యాన్ని ఇస్తుంటుంది మ‌న క‌థానాయ‌కుల‌కు. అలాంటి అభిమాన గ‌ణం మెండుగా ఉన్న టాలీవుడ్ అగ్ర హీరోల్లో యంగ్ టైగ‌ర్ ఒక‌రు. ఆయ‌న ఎప్పుడు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఇత‌రుకు ఆద‌ర్శంగా నిల‌వాల‌ని అభిమానుల‌కు చెబుతుంటారు. ఈ అగ్ర క‌థానాయ‌కుడు న‌టించిన లేటెస్ట్ మూవీ RRR. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కూడా మ‌రో హీరోగా న‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న భారీ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, రామారావు క‌లిసి సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా ముంబైలో గ్రాండ్‌గా జ‌రిగింది. బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ ఈ వేడుక‌కి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ ముంద‌స్తు వేడుక కోసం తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క నుంచి బ‌స్సులో బ‌య‌లు దేరారు. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌, అటు రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ముంబై న‌గ‌రంలో చేసిన హడావుడి మామూలుగా లేదు. RRR Pre Release Eventను ఓ ఆడిటోరియంలో ప‌రిమిత సంఖ్య‌లోని అభిమానుల స‌మ‌క్షంలో నిర్వ‌హించారు. అయినా కూడా అక్క‌డ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేశారు. కొంద‌రు అయితే ఏర్పాటు చేసిన బారికేడ్ల‌ను దాటి లోప‌లికి రావ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఇది కాస్త అక్క‌డున్న ఇత‌ర సెల‌బ్రిటీల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. ప‌రిస్థితిని అర్థం చేసుకున్న ఎన్టీఆర్ రంగంలోకి దిగి, మైక్ అందుకున్నారు. ఇది ప‌ద్ధ‌తిగా లేదు.. అంద‌రూ కింద‌కు దిగుతారా లేదా? కింద‌కు దిగండి.. రాష్ట్రం కానీ రాష్ట్రం వ‌చ్చాం. అంద‌రూ మ‌న గురించి మంచిగా మాట్లాడుకోవాలి. అంద‌రూ ప‌ద్ధ‌తిగా కింద‌కు దిగండి అని స్పీట్ వార్నింగ్ ఇస్తూనే అభ్య‌ర్థించారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. RRR సినిమా విష‌యానికి వ‌స్తే ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. 1920 నేప‌థ్యంలో న‌డిచే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ఇది. బాహుబ‌లి వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, శ్రియా శ‌ర‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దితరులు న‌టించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pb0cPL

Sunday 19 December 2021

రామ్‌చ‌ర‌ణ్‌కు థాంక్స్ చెబుతూ RRR ప్రీ రిలీజ్‌లో ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌..వీడియో వైరల్

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు రాజమౌళి రూపొందించిన చిత్రం RRR. బాహుబ‌లితో తెలుగు సినిమా స‌త్తాను బాలీవుడ్‌లోనే కాదు..ప్ర‌పంచానికి చాటారు. ఆయ‌న డైరెక్ష‌న్‌లో ఇప్పుడు వ‌స్తోన్న చిత్రం RRR. ఇండియానే కాదు.. ఎంటైర్ వ‌ర‌ల్డ్ ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. బాహుబ‌లి త‌ర్వాత త‌న నుంచి రాబోయే సినిమాలు ఎలా ఉండాలో నిర్ణ‌యించుకున్న జ‌క్క‌న్న అందుకు త‌గిన‌ట్లే ప్లాన్ చేసుకుని సినిమాను అనౌన్స్ చేశారు. బాక్సాఫీస్ పోరులో నువ్వా నేనా అని పోటీ ప‌డే మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ హీరోలుగా సినిమా అంటే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అంతే కాదండోయ్‌.. ఎవరూ ఊహించ‌ని విధంగా చరిత్ర‌లో ఎప్పుడూ క‌లుసుకోని ఇద్ద‌రు పోరాట యోధులు కొమురం భీమ్‌, అల్లూరి సీతా రామ‌రాజు క‌లుసుకుని వారి భావాల‌ను ఇచ్చి పుచ్చుకుని, స్నేహం చేయ‌డం, గొడ‌వ ప‌డ‌టం వంటి చేస్తే ఎలా ఉంటుంద‌నే అనే ఊహాత్మ‌క‌ పాయింట్‌తో RRR సినిమాను తెర‌కెక్కించారు మ‌న జ‌క్క‌న్న‌. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్స్‌, ప్రోమోలు, ట్రైల‌ర్ అన్నీ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచేస్తూ వ‌చ్చాయి. ఆదివారం ముంబైలో ఘ‌నంగా జ‌రిగింది. బాలీవుడ్ నుంచి స‌ల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. వీరిద్ద‌రూ అస‌లు సెట్స్‌లో ఎలా ఉండేవారు అనే అనుమానం ప్రేక్ష‌కుల‌కు ఉండిపోయింది. అది కూడా రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రెస్ మీట్‌లో తీర్చేశారు. ఎంత స‌ర‌దాగా ఉండేవారో చెప్పుకొచ్చారు రాజ‌మౌళి. RRR మేకింగ్ స‌మయంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి షూటింగ్స్‌కు రావడం, సెట్స్‌లో క‌లిసి సంద‌డి చేయ‌డం వంటి ప‌నులు చేశారు. ఇద్ద‌రి మ‌ధ్య అప్ప‌టికే ఉన్న స్నేహ బంధం మ‌రింత‌గా బ‌ల‌ప‌డింది. త‌మ మ‌ధ్య ఉండే స్నేహం గురించి RRR Pre Release Eventలో ఎన్టీఆర్ చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. చ‌ర‌ణ్‌తో ఉన్న బాండింగ్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘మేం ఇది వరకే మంచి స్నేహితులం. ఇప్పుడు కూడా మంచి స్నేహితులం. భ‌విష్య‌త్తులోనూ మంచి స్నేహితులుగానే ఉంటాం. రామ్ చ‌ర‌ణ్‌కు స్పెష‌ల్ థాంక్స్‌. త‌ను మంచి స్నేహితుడుకి, బాస‌ట‌గా నిలిచాడు. ఇక అభిమానులే ఇచ్చిన ధైర్యంతోనే ముందుకు న‌డిచాం’’ అన్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRపై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yJVI5G

YouTube TV Reaches Deal to Restore Access to Disney Channels

YouTube began restoring access to Walt Disney channels on its platform on Sunday, after the companies reached a distribution agreement to end a two-day blackout.

from NDTV Gadgets - Latest https://ift.tt/3meyGPB

Apple Seeks Dismissal of India Apps Market Antitrust Case

Apple has asked CCI to throw out a case alleging abuse of market power in the apps market, saying it is too small a player in the country where Google is dominant, a filing shows.

from NDTV Gadgets - Latest https://ift.tt/32kKRmB

వామ్మో ఐటెం సాంగ్ ట్రోలింగ్స్‌పై సమంత ట్వీట్.. దెబ్బకు సైలెంట్ అయిపోవాల్సిందే !

స‌మంత స్సీడు మామూలుగా లేదు. విడాకుల వ్య‌వ‌హారం త‌ర్వాత స‌మంత దృక్ప‌థం పూర్తిగా మారిపోయింది. త‌న రూట్‌లో తాను వెళ్లాల‌ని అనుకుంటోంది. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా కామెంట్స్ చేసిన నోరు మెద‌ప‌డం లేదు. అంతెందుకు.. నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత‌పై ఎన్నో ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. ఒకానొక సంద‌ర్భంలో ఆమె కోర్టు మెట్లు ఎక్కినా, త‌ర్వాత తేరుకుకుని కాస్త జాగ్ర‌త్తలు తీసుకుని మీడియాను జాగ్ర‌త్త‌గా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత నాగ చైత‌న్యతో విడాకుల గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు అదంతా అయిపోయిన వ్య‌వ‌హార‌మ‌ని, తాను దాని గురించి ఇక‌పై మాట్లాడాల‌ని అనుకోవ‌డం లేద‌ని సింపుల్‌గా తేల్చేసింది. స‌మంత‌లో అంత‌లా మార్పు వ‌చ్చింది. అలాగే రీసెంట్ టైమ్స్‌లో స‌మంత పుష్ప ది రైజ్ చిత్రంలో ‘ఊ అంటావా మావ‌..’ అనే ఐటెం సాంగ్‌లో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈ సాంగ్‌లోని సింగ‌ర్ ఇంద్రావ‌తి చౌహాన్ హాస్కీ వాయిస్, స‌మంత అందాల కుర్ర‌కారుకి బాగా క‌నెక్ట్ అయ్యాయి. దాంతో సాంగ్‌కు చాలా మంచి స్పందన వ‌చ్చింది. కొంద‌రు అయితే ఈ సాంగ్‌పై, స‌మంత‌పై ట్రోలింగ్స్ కూడా చేయ‌డం స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా కొంత మంది యువ‌కులు ఊ అంటావా అనే సాంగ్‌పై ఓ వీడియో చేసి దాన్ని నెట్టింట పోస్ట్ చేశారు. వీడియో గ‌మ‌నిస్తే అందులో యువ‌కుడు ఎగ్జామ్ ఉంది క‌దరా.. అంటే, అదే భ‌యంగా ఉందిరా ఎగ్జామ్‌లో ఎక్క‌డ ఊ అంటావా మావ‌.. ఉ ఉ అంటావా సాంగ్ రాసేస్తానేమోన‌ని అంటున్నాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అయ్యింది. అది స‌మంత దృష్టికి కూడా వ‌చ్చింది. అయితే స‌మంత దాన్ని చాలా ఈజీగా తీసుకుని రీ ట్వీట్ చేస్తూ లాఫింగ్ ఎమోజీల‌ను పోస్ట్ చేసింది. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. స‌మంత ఇన్ డైరెక్ట్‌గా ట్రోలింగ్ బాబుల‌కు మీ ప‌ని న‌న్నేం ఇబ్బంది పెట్ట‌ద‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది మ‌రి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఇప్పుడు స‌మంత య‌శోద అనే పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోంది. అలాగే పిలిప్ జాన్ దర్శకత్వంలో అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ చేస్తుంది. ఇందులో ఆమె ట్రాన్స్‌జెండ‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండం విశేషం. ఇది కాకుండా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక బాలీవుడ్ ఎంట్రీ కూడా త్వ‌ర‌లోనే ఇచ్చేయనుంద‌ని స‌మాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3H0NFES

RRR Pre Release Eventలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు స‌ల్మాన్ ఖాన్ వార్నింగ్‌..

ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న భారీ చిత్రం RRR. కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా జ‌న‌వ‌రి 7, 2022న విడుద‌ల‌వుతుంది. ప్ర‌స్తుం సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ చాలా వేగంగా, ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతూ వ‌స్తున్నాయి. భారీ బ‌డ్జెట్‌, తారాగ‌ణంతో చేసిన సినిమా కావ‌డంతో జ‌క్క‌న్న అండ్ టీమ్ సినిమాను ప్ర‌మోట్ చేయ‌డంలో ప్ర‌తి విష‌యాన్ని వ‌దిలి పెట్ట‌డం లేదు. ఆదివారం ముంబైలో గ్రాండ్ లెవ‌ల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. దీనికి బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో స‌ల్మాన్ ఎంట్రీ అదిరిపోయింది. జిలుగుల వెలుగు కాంతిలో క్రేన్‌తో అమ‌ర్చిన స్పెష‌ల్ వాహ‌నంలో పై నుంచి కింద‌కు దిగి మాస్ ఎంట్రీ ఇచ్చారు సల్మాన్ భాయ్. ఇక స్టేజ్‌పై ఆయ‌న RRR ఎంటైర్ యూనిట్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఎన్టీఆర్ న‌ట‌న‌ను ఎంతగానో ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పిన ఆయ‌న రామ్ చ‌ర‌ణ్‌లా హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్‌ను తాను చూడ‌లేద‌ని అన్నారు. RRR గురించి ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంద‌ని చెప్పిన సల్మాన్.. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని, RRR విడుదలైన నాలుగు నెలల వరకు మ‌రో సినిమా రిలీజ్ కాకుండా ఉంటే బావుంటుంద‌ని అన్నారు. అంటే ఇన్ డైరెక్ట‌ర్‌గా ఈ కండ‌ల వీరుడు RRR సినిమాకు ఎదురు లేదు, ఎదురు రాకండి అని వార్నింగ్ ఇచ్చేశారు. RRR Pre Release Eventను ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ చేయ‌డం విశేషం. RRR Pre Release Eventను టీవీల్లో వీక్షించాల‌ని ఎంతో మంది అభిమానులు ఆశ ప‌డ్డారు. కానీ నిర్వాహ‌కులు అందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. డిసెంబ‌ర్ 31న ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ ఛానెల్‌లో సద‌రు ప్ర‌సారం అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక RRR సినిమా విషయానికి వ‌స్తే ఇది రూ.400 కోట్లతో రూపొందిన భారీ బ‌డ్జెట్ మూవీ. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ వంటి బాలీవుడ్ న‌టులు.. హాలీవుడ్ స్టార్స్ కూడా ఇందులో న‌టించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీ ఇది. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా కావ‌డంతో RRRపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pbLVCA

Realme GT 2 Series Launch Today: How to Watch Livestream

Realme GT 2 series launch is taking place today (December 20). The launch will be livestreamed on YouTube and is expected to include the Realme GT 2 Pro. The smartphone is confirmed to have the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3GXjhep

Saturday 18 December 2021

Here's All You Need to Know About Spotting Scopes for Birding

A spotting scope is a compact high-power optimised tool for detailed observation of distant objects and looks like a small telescope. It always requires a tripod to set it up and obtain maximum...

from NDTV Gadgets - Latest https://ift.tt/3p7PIRa

పుష్ప ప్రభంజనం.. వసూళ్ల వేటలో టాప్ గేరేసిన పుష్పరాజ్.. రేర్ ఫీట్‌తో సరికొత్త రికార్డు

ఐకాన్ స్టార్ హీరోగా రూపొందించిన భారీ సినిమా 'పుష్ప' థియేటర్లలో హవా నడిపిస్తోంది. తొలుత డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా భేష్ అనిపించుకుంటోంది. వసూళ్ల వేటలో టాప్ గేరేసి దూసుకుపోతున్నారు లారీ డ్రైవర్ పుష్పరాజ్. ఈ పాత్రలో అల్లు అర్జున్ నటనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుండగా.. నిర్మాతలకు కాసుల పంట పండుతోంది. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్ కలెక్షన్స్ పరంగా రేర్ ఫీట్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో దేశవిదేశాల్లోని బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకొని ఆతృతగా ఎదురుచూశారు. ఆ అంచనాల నడుమ డిసెంబర్ 17న విడుదలైన పుష్ప సినిమాకు అన్ని చోట్ల భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా యూఎస్ ఆడియన్స్ ఈ సినిమాకు నీరాజనం పలికారు. విదేశీ తెరపై పుష్పరాజ్ సందడికి కాసుల వర్షం కురిసింది. ప్రీమియర్స్ మొదలుకొని తొలి రెండు రోజులు అదే పరిస్థితి. మొత్తంగా యూఎస్ లోని 248 లొకేషన్స్‌లో విడుదలైన 'పుష్ప ది రైజ్'.. అన్ని సెంటర్లలో కలిపి ప్రీమియర్స్ ద్వారానే 543,603 డాలర్స్ రాబట్టారు. ఆ తర్వాత తొలి రోజుకు గాను 426,944 డాలర్స్, రెండో రోజుకు గాను మరో 345,218 డాలర్స్ వసూలయినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో మొత్తంగా తొలి రెండు రోజుల్లో 1,315,765 డాలర్స్‌తో దాదాపు 10 కోట్లకు పైగా వసూలు చేశాడు పుష్పరాజ్. దీంతో ఈ సంవత్సరం USAలో హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన తెలుగు చిత్రంగా 'పుష్ప' సరికొత్త రికార్డు నమోదు చేసింది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పుష్పరాజ్ ప్రభంజనం కొనసాగుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yDEqqU

How to Share Google Photos From Your Android Smartphones and Tablets

Google Photos allows users to back up and store their images online, and access them on other devices. Users can also share their images and videos with family and friends. Here are four easy ways how...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qbUvAf

ఐటెం సాంగ్ అనగానే సమంత ఫీలింగ్స్.. ఆ మాటతో గ్రీన్ సిగ్నల్! సీక్రెట్స్ రివీల్ చేసిన సుకుమార్

గ్రామీణ నేపథ్యంలో ‘రంగస్థలం’ సినిమా చేసి సూపర్ హిట్‌ అందుకున్న డైరెక్టర్ .. తన క్రియేటివిటీకి మరింత పదును పెట్టి అదే కోణంలో ‘పుష్ప’ సినిమా రూపొందించారు. అల్లు అర్జున్‌- రష్మిక మందన హీరోహీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో అల్లు అర్జున్ నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతుండగా.. చేసిన స్పెషల్ సాంగ్ రచ్చకు తెరలేపింది. ఈ సాంగ్‌పై పలు వివాదాలు నడుస్తున్నా కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తూ వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. సుకుమార్ స్టైల్ టేకింగ్‌, ఐటెం సాంగ్‌లో సమంత గ్లామర్ చూసి హుషారెత్తిపోతున్నారు ఆడియన్స్. క్లాస్, మాస్ అనే తేడాలేకుండా ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఊ అంటావ మావ ఉ ఉ అంటావా మావ‌.. అంటూ సాగిన ఈ పాట‌లో సమంత అందాల ప్ర‌ద‌ర్శ‌న హద్దులు దాటిందనే వారు చాలామందే ఉన్నారు. అయితే ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన సమంత వెండితెరపై ఓ స్పెషల్ సాంగ్ చేయడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పుష్ప మూవీ విడుదల అనంతరం శనివారం రోజు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడిన సుకుమార్‌.. పుష్ప విశేషాలతో పాటు సమంత ఐటెం సాంగ్ సీక్రెట్స్ బయటపెట్టారు. సమంత తొలిసారి ఐటెం సాంగ్ చేసింది కదా.. వెంటనే ఒప్పుకుందా? అనే ప్రశ్నపై బదులిచ్చారు సుకుమార్. ఈ పాట గురించి సమంతకు చెప్పగానే తనకు కరెక్ట్‌ కాదని ఆమె చెప్పిందని తెలిపారు. అయితే నటిగా ఇది మీకు కొత్తగా ఉంటుందని, ఈ సాంగ్ మీకు బాగా యాప్ట్ అవుతుందని చెప్పి తానే సమంతను ఒప్పించినట్లు సుక్కు ఓపెన్ అయ్యారు. ‘రంగస్థలం’సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ప్రస్తావన తీసుకొచ్చినా కూడా సమంత 'నో' చెప్పిందని, ఆ తర్వాత తన మాటపై నమ్మకంతో ఓకే చెప్పి ఈ సాంగ్ చేసిందని సుకుమార్ చెప్పారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో ''ఆర్య‌, ఆర్య 2'' సినిమాల తర్వాత 'పుష్ప' ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందించారు. కూలీ వాడిగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ సిండికేట్‌కు నాయకుడిగా ఎలా ఎదిగాడ‌నే క‌థాంశంతో కథ నడిపించారు. ఇక ఈ సినిమాకు రెండో భాగంగా 'పుష్ప ది రూల్' పేరుతో మరో సినిమా కూడా తెరకెక్కనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32j3rfa

How to Preview a WhatsApp Voice Message Before Sending

We are here providing a step-by-step guide to let you use WhatsApp voice message preview on your device.

from NDTV Gadgets - Latest https://ift.tt/30ILiqG

బాహుబలి- 3పై రాజమౌళి కీలక వ్యాఖ్యలు.. అసలు విషయం బయటపెడుతూ సెన్సేషన్

ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి క్రియేట్ చేసిన అలజడి గురించి ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ తెలుసు. ఓ తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి తెలుగోడి సత్తాను శిఖరమెక్కించ్చింది బాహుబలి సినిమా. దర్శక ధీరుడు దర్శకత్వంలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పలు రికార్డులు తిరగరాసి ఇండస్ట్రీలోని దాదాపు అన్ని రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అలాంటి ఈ సినిమా మూడో భాగం కూడా వస్తుందంటే ఇక ప్రేక్షకుల ఆనందానికి అవధులుంటాయా? అలాంటి కీలక విషయంపై రియాక్ట్ అయ్యారు జక్కన్న. ప్రస్తుతం సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి.. ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. జనవరి 7వ తేదీన ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ ఉన్న నేపథ్యంలో మీడియా ముందుకొస్తూ పలు విషయాలపై స్పందిస్తున్నారు. అయితే రీసెంట్‌గా జరిగిన ఓ సమావేశంలో RRR మూవీతో పాటు బాహుబలి-3కి సంబంధించిన ప్రశ్న ఆయనకు ఎదురుకావడంతో ఊహించని సమాధానమిచ్చారు. బాహుబలి-3 ఉంటుందన్నట్లుగా హింట్ ఇచ్చి హూషారెత్తించారు జక్కన్న. బాహుబలి సినిమా తమ యూనిట్ మొత్తానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని, తప్పకుండా బాహుబలి లాంటి సినిమా కథను కొనసాగించే అవకాశం ఉందని రాజమౌళి చెప్పడం విశేషం. బాహుబలి సినిమాలోని పాత్రలు, కథనం కూడా మరో సినిమా చేసేందుకు నమ్మకాన్ని కూడా కలిగిస్తాయని అన్నారు. మూడో భాగం ఉంటుందని చెప్పగలను కాకపోతే ప్రస్తుతం RRR సినిమా గురించి తప్ప మరో విషయం మాట్లాడలేనని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అంశం చర్చకు రావడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. కాగా, RRR మూవీ తరవాత రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రానుంది. ఈ సినిమా కోసం జక్కన్న మరో రెండు మూడేళ్లు టైమ్ తీసుకుంటరాని చెప్పవచ్చు. ఆ తర్వాత ప్రభాస్‌తో ఓ ప్రాజెక్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో.. అదే బాహుబలి సినిమాకు మూడో భాగం కానుందా? లేదా అనేది ఇప్పటికైతే సస్పెన్స్. ఇకపోతే జక్కన్న తెరకెక్కిస్తున్న RRR మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా, కొమురం భీం రోల్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Edk4pE

NBK 107కి ఇట్రెస్టింగ్ టైటిల్... డైరెక్టర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుద్దా!

నంద‌మూరి అంద‌గాడు బాల‌కృష్ణ లేటెస్ట్ మూవీ ‘అఖండ‌’తో భారీ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత అత్యంత భారీ హిట్ అయిన సినిమా ఇది. వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించి బాల‌కృష్ణ కెరీర్‌లోనే టాప్ మోస్ట్ మూవీగా నిలిచింది. బాల‌య్య త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ చేస్తున్న 107వ సినిమా ఇది. మ‌రో వైపు ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన గోపీచంద్ మ‌లినేని.. బాల‌కృష్ణ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు స్టోరిని డెవ‌ల‌ప్ చేశారు. లేటెస్ట్‌గా సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు గోపీచంద్ మ‌లినేని వేట పాలెం అనే టైటిల్‌ను పెట్టాల‌ని గోపీచంద్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. బాల‌య్య‌కు కూడా ఈ టైటిల్ న‌చ్చింద‌ట‌. త్వర‌లోనే టైటిల్‌ను అధికారికంగా కూడా అనౌన్స్ చేయ‌బోతున్నార‌ట‌. క్రాక్ సినిమాను గోపీచంద్ మ‌లినేని, వేట పాలెం బ్యాక్ డ్రాప్‌లోనే తెర‌కెక్కించారు. మ‌రోసారి అదే సెంటిమెంటును ఫాలో అవుతూ మ‌రోసారి అదే బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేస్తున్నార‌ట‌. క‌థ‌ను అనుస‌రించే వేట పాలెం అనే టైటిల్‌ను నిర్ణ‌యించార‌ట‌. అఖండ సినిమాలో డ‌బుల్ రోల్‌తో మెప్పించిన బాల‌కృష్ణ మ‌రోసారి డ్యూయెల్ రోల్‌లో అల‌రించ‌బోతున్నార‌ట‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ కార‌ణంగా అఖండ చిత్రీక‌ర‌ణ పూర్తి కావ‌డంలో ఆల‌స్య‌మ‌వ‌డంతో NBK 107 షూటింగ్ స్టార్ట్ కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టింది. ఆ త‌ర్వాత కొన్ని వారాల ముందు బాల‌కృష్ణ భుజానికి ఆప‌రేష‌న్ అయ్యింది. దాంతో ఆయ‌న రెస్ట్ తీసుకుంటున్నారు. దాని కార‌ణంగా NBK 107 చిత్రం సెట్స్‌పై వెళ్ల‌డానికి మ‌రి కాస్త స‌మ‌యం తీసుకుంది. ఈ గ్యాప్‌లో బాల‌కృష్ణ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో త‌ను ప్రారంభించిన టాక్ షో అన్ స్టాప‌బుల్‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు ఎపిసోడ్స్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. రీసెంట్‌గా గోపీచంద్ మ‌లినేని, ర‌వితేజ‌ల‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను కూడా పూర్తి చేశార‌ని స‌మాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Fp1fBz

Friday 17 December 2021

సినిమా పాత్రల కోసం అలాంటి పనులు చేయనంటున్న రకుల్ ప్రీత్ సింగ్

.. ఫిట్‌నెస్ ఫ్రీక్ అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ అమ్మ‌డు త‌న లుక్‌, ఫిట్‌నెస్‌పై ఫోక‌స్ పెడుతుంటారు. అందుకే మూడు ప‌దులు వ‌య‌సు దాటినా గ్లామ‌ర్ ప‌రంగా కుర్ర హీరోయిన్స్‌కు ఇప్ప‌టికీ పోటీ ఇస్తుంటుందీ సొగ‌స‌రి. సినిమా పాత్రల గురించి మట్లాడుతూ ఓ సందర్భంలో ఆమె ఎలాంటి పాత్రలను చేయనో వివరించింది. ఇంతకీ రకుల్ ఎలాంటి పాత్రలు చేయరు. ఎందుకు చేయరు అనే వివరాల్లోకి వెళితే.. ఓ ఓ ఇంట‌ర్వ్యూలో రకుల్ పాత్రల ఎంపిక గురించి ప్ర‌శ్నిస్తే ‘‘సాధార‌ణంగా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌డానికి యాక్ట‌ర్స్ ఆస‌క్తి చూపుతుంటారు. నేను కూడా అందుకు సిద్ధ‌మే. అయితే పాత్ర కోసం బ‌రువు పెర‌గాల‌న‌డం, త‌గ్గాల‌నడం అంటే మాత్రం ఆ పాత్ర చేయ‌లేను. వెంట‌నే బ‌రువు పెర‌గ‌డం, ఆ వెంట‌నే బ‌రువు త‌గ్గ‌డం అనేది నా వ‌ల్ల కాదు. అది స‌హ‌జంగా జ‌ర‌గాల్సిన ప్ర‌క్రియ‌. అలా వెంట‌నే బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గ‌డం వ‌ల్ల అది శ‌రీరంపై ఎక్కువ ప్ర‌భావాన్ని చూపిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుక‌నే నేను అలాంటి త‌ప్పులు చేయ‌ను. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాను. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గడం వంటి పాత్ర‌లు చేయ‌మ‌ని న‌న్ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేదు’’ అని అన్నారు ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్. పుష్క‌ర కాలంగా హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో 2011లో వచ్చిన కెరటం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఘన విజయం సాధించడంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ర‌కుల్‌. అక్క‌డి నుంచి శ‌ర‌వేగంగా సినిమాలు చేస్తూ వ‌చ్చారు. ముఖ్యంగా మ‌హేశ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి అగ్ర హీరోలంద‌రితో న‌టించారు స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను ఎంజాయ్ చేశారు. అలాగే ఆమె ఓ వైపు సినిమాలు, మ‌రో వైపు ఫిట్‌నెస్ రంగంలో రాణిస్తూ బిజీగా కూడా ఉన్నారు ర‌కుల్‌. ఎఫ్ 45 అనే జిమ్ సెంట‌ర్‌ను కూడా ర‌కుల్ నిర్వ‌హిస్తున్నారు. అలాగే వీలునప్పుడల్లా సోష‌ల్ మీడియాలోనూ త‌న ఫిట్‌నెస్ ర‌హ‌స్యాలు, యోగ గురించి చెబుతూ యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలుగులో రీసెంట్‌గా ఆమె వైష్ణ‌వ్ తేజ్‌తో న‌టించిన కొండ‌పొలం చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇప్పుడామె తెలుగులో ఏ సినిమాలు చేయ‌డం లేదు. ఇటీవల ర‌కుల్ ప్రీత్ సింగ్‌, బాలీవుడ్ న‌టుడు, నిర్మాత అయిన జాకీ భ‌గ్నానీని పెళ్లి చేసుకుంటున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా అందరికీ రివీల్ చేశారు. అయితే ర‌కుల్ ప్రీత్, జాకీ భ‌గ్నానీ పెళ్లిపై జ్యోతిష్కుడు వేణుస్వామి పెద‌వి విరిచారు. వీరిద్దరూ పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌ర‌ని, వెళ్లినా విడిపోతారు. ఓ కేసు విష‌యంలో ర‌కుల్ జైలుకు వెళ్లే అవ‌కాశాలున్నాయ‌ని వేణుస్వామి తెలియ చేయ‌డం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30BsadY

Elon Musk's Stock Sale Twitter Poll Lands Tesla Into an Investor Lawsuit

A Tesla investor has filed a lawsuit over CEO Elon Musk's Twitter poll on stock sale that pulled down Tesla's share price by about a quarter.

from NDTV Gadgets - Latest https://ift.tt/3p7L8T0

Pushpa : పుష్పరాజ్‌కి సైబరాబాద్ పోలీసులు ప్రశ్న.. అవెక్కడ అని ప్రశ్న.. వైరల్ అవుతున్న ట్వీట్

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘పుష్ప ది రైజ్‌’. ఇందులో ఆయ‌న పాత్ర పేరు పుష్ప‌రాజ్‌. ఈయ‌న్ని ఇప్పుడు సైబ‌రాబాద్ పోలీసులు ప్ర‌శ్నించారు. అదేంటి? బ‌న్నీ ఎప్పుడు సైబ‌రాబాద్ పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లాడు? ఈ మ‌ధ్య పుష్ప రిలీజ్ స‌మ‌యంలో కేసులు న‌మోదు అయ్యాయి క‌దా.. వాటి కార‌ణంగానే పోలీసులు బ‌న్నీని ప్ర‌శ్నించారా? అనే సందేహం కూడా రాక మాన‌దు. అయితే పుష్ప‌రాజ్‌ను సైబ‌రాబాద్ పోలీసులు ప్ర‌శ్నించింది. ట్విట్ట‌ర్ ద్వారా. ఇంత‌కీ ఏమ‌ని ప్ర‌శ్నించారు అనే విష‌యం తెలుసుకోవాల‌ని ఉందా? అస‌లు విష‌యం ఏంటంటే.. సైబ‌రాబాద్ పోలీసులు సినిమాల ద్వారా ప్ర‌జ‌ల‌కు సందేశాలు ఇస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు ‘’ సినిమా ద్వారా కూడా మరో మెసేజ్ ఇచ్చారు సైబ‌రాబాద్ పోలీసులు. అది కూడా ప్ర‌శ్న రూపంలో.. పుష్ప మూవీలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన ఫ‌హాద్ ఫాజిల్ పాత్ర ట్రైల‌ర్‌లో పార్టీ లేదా? పుష్ప అని అంటాడు.. దానిపై చాలా మీమ్స్ కూడా వ‌చ్చాయి. ఇప్పుడు సైబ‌రాబాద్ పోలీసులు దాన్ని పాజిటివ్ యాంగిల్‌లో ఉప‌యోగించుకున్నారు. అదెలాగంటే.. పుష్ప సినిమాలో బ‌న్నీ బైక్ తోలే పోస్ట‌ర్ ఉంది. అందులో ఆయ‌న హెల్మెట్ వేసుకోడు.. బైక్‌కి సైడ్ మిర్ర‌ర్స్ ఉండ‌వు. ‘హెల్మెట్‌, సైడ్ మిర్ర‌ర్స్ లేవా పుష్ప‌.. ’ అంటూ ఫహాద్ ఫాజిల్ ప్రశ్నించేలా మీమ్‌ పోస్టర్‌ను త‌యారు చేసిన సైబ‌రాబాద్ పోలీసులు దాన్ని త‌మ అధికారిక వెబ్ సైట్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు హెల్మెట్ ధ‌రించండి, రే వ్యూ మిర్ర‌ర్ ఫిక్స్ చేసుకుని సుర‌క్షితంగా ఉండండంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు స‌ద‌రు ట్వీట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ట్రెండింగ్‌లో ఉన్న సినిమాను.. అందులో అంశాన్ని ఉప‌యోగించుకుని ప్ర‌జ‌ల‌కు మెసేజ్ ఇచ్చేలా చేసిన సైబ‌రాబాద్ పోలీసుల క్రియేటివిటీకి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. పుష్ప ది రైజ్ సినిమా అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌లైంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ బ్యాడ్ కాప్‌గా న‌టించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3p5hJZv

Amazon Fined Rs. 200 Crore, Future Group Deal Suspended

Amazon's 2019 investment in Future Group that got approval from India's antitrust regulator has now been suspended. The Competition Commission of India said in a fresh order that Amazon "suppressed...

from NDTV Gadgets - Latest https://ift.tt/3e1kzbF

RRRలో ఎన్టీఆర్ ఉప‌యోగించిన‌ బైక్ వివ‌రాలు.. దాని కోసం జక్కన్న ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించిన భారీ బ‌డ్జెట్ మూవీ RRR. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడు ఎంటైర్ యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఆదివారం (డిసెంబ‌ర్ 19)న ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జ‌ర‌గబోతుంది. బాలీవుడ్ సెల‌బ్రీటీలు ఈ వేడుక‌కి హాజ‌రు కాబోతున్నారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, అండ్ టీమ్ ముంబైకి చేరుకున్నారు. అక్క‌డి మీడియాకి ప్ర‌త్యేక‌మైన ఇంట‌ర్వ్యూలు ఇచ్చే ప‌నిలో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సాధార‌ణంగా రాజ‌మౌళి త‌న ప్ర‌తి సినిమాలో ప్ర‌తి చిన్న విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి తెర‌కెక్కిస్తుంటారు. ముఖ్యంగా హీరోల లుక్స్‌తో పాటు వారు ఉప‌యోగించే వ‌స్తువులను కూడా రాజ‌మౌళి స్పెష‌ల్‌గా డిజైన్ చేయిస్తుంటారు. RRR సినిమాలో రామ్ చ‌ర‌ణ్ గుర్రాన్ని ఉప‌యోగిస్తే.. ఎన్టీఆర్ మోటార్ బైక్‌ను ఉప‌యోగించారు. ఎన్టీఆర్ బైక్ మోడల్ గురించి రాజ‌మౌళి చాలా రీసెర్చే చేశారు. దీని పేరు వెలో సెట్ మోటార్ బైక్‌. బ్రిట‌న్‌కు చెందింది. ఈ కంపెనీ హెడ్ ఆఫీసు బ‌ర్మింగ్ హామ్‌లో ఉంది. ఇక ఎన్టీర్ ఉప‌యోగించిన బైక్‌ 1934కి చెందిన ఎమ్ సిరీస్ మోడ‌ల్‌లా క‌నిపిస్తుంది. ఇక వెలోసెట్ మోటార్ బైక్ కంపెనీ 1920 నుంచి 1950 వ‌ర‌కు అంత‌ర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో టాప్‌గా ఉండేది. 350 సీసీ, 500 సీసీ బైకుల‌ను త‌యారు చేసింది. 1971లో ఈ కంపెనీ బైకుల ఉత్ప‌త్తిని పూర్తిగా ఆపేసింది. RRR కోసం ఎన్టీఆర్‌కు బైక్ కావాల‌నుకున్న‌ప్పుడు రాజ‌మౌళి అప్ప‌ట్లో బైకుల ఉత్ప‌త్తి చేయ‌డంలో ఎవ‌రు టాప్‌.. వారు త‌యారు చేసిన మోడ‌ల్స్ ఏంటి అనే వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి..ఇప్పుడున్న మోటార్ బైకునే అప్ప‌టి మోడ‌ల్‌లో క‌నిపించేలా దాదాపు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్టి మార్పులు, చేర్పులు చేసి మార్చారు. RRRలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ఇంకా అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్, శ్రియా శ‌ర‌న్‌, స‌ముద్ర ఖ‌ని స‌హా హాలీవుడ్‌కి చెందిన ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి వంటి స్టార్స్ న‌టించారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌లుసుకోని ఇద్ద‌రూ యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిపై యుద్ధం చేస్తే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న‌ల్ క‌థాంశంతో రూపొందిన చిత్ర‌మే RRR. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3IZIBSR

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd