సెన్సిబుల్ సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములకు ఓ ప్రతేకత ఉంది. ఆయన తెరకెక్కించిన ఆనంద్, హ్యాపీడేస్, లైఫ్ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా వంటి ఫ్యామిలీ చిత్రాలతో పాటు లీడర్ వంటి పొలిటికల్ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం లవ్స్టోరి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ నెల 24న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాను పూర్తి చేయగానే ధనుశ్తో ఈ డైరెక్టర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. లేటెస్ట్ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ధనుశ్తో తాను చేయబోయేది థ్రిల్లర్ మూవీ అని తెలిపారు. మల్లీ లింగ్వువల్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నానని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. అలాగే తాను గతంలో రానాతో చేసిన లీడర్ సినిమాకు సీక్వెల్ను చేయాలనుకుంటున్నానని, ఆ విషయంపై త్వరలోనే రానాను కలుస్తానని శేఖర్ కమ్ముల తెలిపారు. అంటే అంతా ఓకే అయితే లీడర్ 2 రావడం పక్కా. మరి ఈ సీక్వెల్ కొనసాగింపుగా ఉంటుందా? లేదా కొత్త పొలిటికల్ యాంగిల్లో సాగుతుందా? అని చూడాలి. ఇక్కడొక విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంది. అదేంటంటే, థ్రిల్లర్ జోనర్ శేఖర్ కమ్ములకు అంతగా కలిసొస్తుందా అని. ఎందుకంటే గతంలో నయనతారతో అనామిక అనే థ్రిల్లర్ సినిమాను డైరెక్ట్ చేశారు. హిందీలో బ్లాక్బస్టర్ హిట్ అయిన ఆ సినిమా దక్షిణాదిన మాత్రం డిజాస్టర్గా నిలిచింది. అయితే ఇప్పుడు మరోసారి తనకు కలిసిరాని జోనర్లో ధనుశ్తో సినిమా చేయబోతున్నారు. మరి ఈసారైనా శేఖర్ కమ్ముల సక్సెస్ అవుతాడేమో చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ztzTWW
No comments:
Post a Comment