Thursday, 30 September 2021

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై థమన్ అప్‌డేట్.. ‘అతనికి థాంక్స్’ అంటూ ట్వీట్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు . కామెడీ, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను అలరిస్తారు ఆయన. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఈ నెల 10వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఐకియా-కేబుల్‌బ్రిడ్జ్ దాటిన త‌ర్వాత మైండ్‌స్పేస్ జంక్ష‌న్ ప్రాంతంలో సాయితేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు ఆయన్ని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగింది అని తెలియగానే మెగా ఫ్యామిలీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అంటూ వాళ్లు కంగారు పడ్డారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు ఆయన్ని వెళ్లి పరామర్శించి.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పారు. ఆ తర్వాత వైద్యులు ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించి.. సాయి ధరమ్ కాలర్ బోన్‌ విరిగిందని.. దానికి శస్త్ర చికిత్స చేశామని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సాయి ధరమ్ ఆరోగ్యం గురించి వాళ్లు అభిమానులుకు అప్‌డేట్స్ ఇస్తున్నారు. అయితే తాజాగా మ్యూజిక్ డైరక్టర్ సాయి ధరమ్ ఆరోగ్యంపై సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు అప్‌డేట్ ఇచ్చారు. ‘మన అందరి ప్రార్థనలు ఫలించాయి.. నా మిత్రుడు సాయి థరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నాడు.. అతని హెల్త్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చినందుకు సతీష్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరో రెండు రోజుల్లో నా మిత్రుడిని కలుసుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ థమన్ ట్వీట్ చేశారు. థమన్ చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్‌లు హీరోహీరోయిన్లుగా జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రిపబ్లిక్’. ఈ సినిమా ఆక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Y3D3nq

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...