Thursday, 30 September 2021

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. 'ఆచార్య' నుంచి కీలక అప్‌డేట్

కరోనా కష్టకాలం నుంచి సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వాయిదాపడ్డ సినిమాలు ఒక్కొక్కటిగా సెట్స్ మీదకొచ్చి షూటింగ్స్ ఫినిష్ చేసుకుంటున్నాయి. ఈ లిస్టులో , పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు నటిస్తున్న పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. వీటి కోసం వేయికన్నులతో ఆతృతగా ఎదురుచూస్తోంది టాలీవుడ్ లోకం. ఈ నేపథ్యంలో తాజాగా మెగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఓ వార్త మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూనే చిత్రంలో ఎంతో కీలకమైన సిద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే టాకీ పార్టు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ జరుగుతోందని విన్నాం. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్న అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. అయితే ఈ చిత్ర రిలీజ్ విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది. దసరా కానుకగా విడుదల కానుందని, లేదు లేదు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించబోతున్నారని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' రిలీజ్ విషయంలో దర్శకనిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్సయినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ బాణీలు కడుతున్నారు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌తో ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారట కొరటాల.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zVtzrr

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...