Tuesday, 28 September 2021

తాతయ్య ఏడుస్తూ నాగార్జున గురించి ఆ మాట చెప్పారు.. ఆ నాటి విషయాన్ని బయటపెట్టిన సాయి పల్లవి

నాగ చైతన్య- జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన '' సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంతా ఊహించినట్లుగానే మంచి సక్సెస్ అందుకోవడంతో హైదరాబాద్‌లోని హోటల్ 'ట్రైడెంట్'లో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో నాగ చైతన్య, సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ కాగా.. ముఖ్య అతిథిగా నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. ''మా సక్సెస్ మీట్ కు వచ్చిన పెద్ద వాళ్లందరికీ థాంక్స్. నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వస్తారు. ఆయన గురించి అప్పుడు చెప్పాలని అనుకున్నాను. మా తాతయ్య అన్నమయ్య సినిమా ఒక వంద సార్లు చూసి ఉంటారు. ఆయనతో పాటు మేమూ చూశాం. ఆ సినిమా చూసినప్పటి నుంచి మీరంటే ఇష్టం, అభిమానం ఏర్పడ్డాయి. అన్నమయ్య సినిమా చూసి తాతయ్య ఏడుస్తుంటే, ఆయన నటిస్తున్నారు తాతయ్య ఏడవకు అన్నాను. కానీ తాతయ్య అన్నారు ఇప్పుడు నటిస్తుండొచ్చు , గానీ గత జన్మలో నాగార్జున యోగి అయి ఉంటారు అన్నారు. అప్పటి నుంచి మీ సినిమాలు టీవీలో వస్తే ఛానెల్ మారుస్తాను. ఎందుకంటే తాతయ్య దృష్టిలో మీరు ఎప్పుడూ అన్నమయ్యే. ఇవాళ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు థాంక్స్. దర్శకుడు శేఖర్ గారు చెప్పినట్లు నైతికంగా మనమంతా కరెక్ట్‌గా ఉండాలని టీమ్ మొత్తం పాటించాం. ఈ సినిమా ద్వారా అమ్మాయి తరుపున నిలబడి శేఖర్ గారు ఫైట్ చేశారు. సినిమా మేకింగ్ లోనూ ఆయన మా కోసమే మాట్లాడేవారు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి అంశంలో లవ్ స్టోరి మ్యాజిక్ చేసింది. ప్రొడ్యూసర్స్‌‌కు థాంక్స్. థియేటర్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. లవ్ స్టోరితో మళ్లీ సినిమాను ఆస్వాదిస్తున్నాం. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో జరిగినట్లు నాకు అయింది అని చెప్పేందుకు అమ్మాయిలకి ఒక ధైర్యాన్ని లవ్ స్టోరి ఇచ్చింది'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EZNolf

No comments:

Post a Comment

'Consumers should not pay higher taxes for clean tech'

'We are not asking for incentives, but at least taxation can be aligned such that the rupee tax on consumers remains the same.' fr...