గత కొన్ని వారాలుగా హీరోయిన్ సమంతకు సంబంధించిన ప్రతి నిమిషం జనాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఓ వైపు సమంత- నాగ చైతన్య విడాకులపై ఓ రేంజ్లో పుకార్లు షికారు చేస్తుండగా.. స్నేహితులతో కలిసి ఆమె చేస్తున్న ఎంజాయ్ హాట్ టాపిక్ అవుతోంది. అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఎక్కువగా ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తూ చిల్ అయిన ఆమె.. ఇప్పుడు చైతూ లేకుండా ఒంటరిగా జాలీ ట్రిప్స్ వేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సామ్ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్గా మారాయి. రీసెంట్గా తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘శాకుంతలం’ కంప్లీట్ చేసిన .. ప్రస్తుతం వెకేషన్స్తో ఎక్కువ సమయం గడుపుతోంది. తనకెంతో ఇష్టమైన వారితో టూర్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే శిల్పా రెడ్డితో కలిసి గోవా ట్రిప్ వేసిన ఈ బ్యూటీ.. రీసెంట్గా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇక వీకెండ్ రావడంతో తోటి హీరోయిన్లు కీర్తి సురేష్, త్రిష, కళ్యాణి ప్రియదర్శన్లతో కలిసి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తన గ్యాంగ్తో కలిసి చిల్ అయినప్పటి పిక్ షేర్ చేసిన సామ్..''అద్భుతమైన సాయంత్రం. ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేశాం. థాంక్యూ త్రిష, కీర్తి సురేష్, '' అని పేర్కొంది. ఈ ఫొటోస్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. వావ్, సూపర్, ఎంజాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే సినిమా చేస్తున్న సమంత.. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక సినిమాలకు కాస్త విరామం ఇస్తానని చెబుతుండటం, చైతూతో గ్యాప్పై చెక్కర్లు కొడుతున్న రూమర్స్ జనాల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3AtGt0Q
No comments:
Post a Comment