Monday 20 September 2021

నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం.. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన హీరోయిన్

కరోనా కష్టకాలం మొదలు సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ తన తండ్రిని కోల్పోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ స్వయంగా ట్వీట్ చేసింది నందిత శ్వేత. నిన్న (సెప్టెంబర్ 19) నందిత శ్వేత తండ్రి శివ స్వామి (54) కన్నుమూశారు. దీంతో నందిత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన నందిత.. ''నా తండ్రి శ్రీ శివ స్వామి 54 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా'' అని ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నందిత శ్వేత క్లోజ్ ఫ్రెండ్ అయిన సినీ నటి ఐశ్వర్య రాజేష్ రియాక్ట్ అవుతూ.. 'సారీ నందిత.. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ నీపై ఉంటాయి' అని పేర్కొంది. తెలుగుతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ తన కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది నందిత శ్వేత. 'నంద లవ్స్ నందిత' అనే కన్నడ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. 2016 సంవత్సరంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి ఫేమ్ పొందింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XAZ6SC

No comments:

Post a Comment

'India is at the heart of what we are doing'

'For us, it's "keep moving and keep building a critical mass", which is commensurate with the size of the country.' ...