Sunday, 21 February 2021

స‌త్యదేవ్, త‌మ‌న్నా జంటగా ‘గుర్తుందా శీతాకాలం’.. కీలక పాత్రలో సుహాసిని

యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ప్రతి ఒక్కరూ త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్పటికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్, ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్షకుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శేఖ‌ర్ - భావ‌న‌ర‌వి, ఎమ్.ఎస్.రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. స‌త్యదేవ్, త‌మ‌న్నాతో పాటు మేఘా ఆకాష్, కావ్యశెట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి కూడా బాగానే పెరిగింది. ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లోనూ ఈ సినిమాపై ప్రత్యేక ఆస‌క్తి నెల‌కొంది. క‌న్నడ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టేల్’ ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ‘గుర్తుందా శీతాకాలం’ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో సత్యదేవ్, తమన్నా ఒకర్నొకరు రొమాంటిక్‌గా చూసుకుంటూ చేతులు కలుపుకుని ఉన్నారు. ఈ ఫోటో అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చేస్తుంది. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుందని తెలిపారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో సీనియర్ నటి సుహాసిని కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్, తమన్నాతో కలిసి సుహాసిని ఉన్న ఫోటోను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా లక్ష్మీ భూపాల్ డైలాగులు రాశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37BddsH

No comments:

Post a Comment

Why Pakistan Has Launched A War Against Afghanistan

'Islamabad feels it has no alternative, but to address the challenges from the Afghan-Taliban through an open war.' from rediff To...