Friday 26 February 2021

ఆ మాటంటూ స్టార్ హీరోయిన్ భయపడింది.. వెంటనే కాజల్‌కి కాల్ చేయడంతో! సీక్రెట్ చెప్పిన మంచు విష్ణు

గత కొన్నేళ్లుగా కెరీర్‌లో సరైన హిట్ పడక సతమతమవుతున్న .. ఓ భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సారి ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టాలని 'మోసగాళ్లు' సినిమాతో బరిలోకి దిగుతున్నారు. 50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. చిత్రంలో మంచు విష్ణుకి చెల్లెలిగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు విష్ణు. ఈ సినిమాలో సిస్టర్ పాత్రకు మొదట ప్రీతీ జింటాను అనుకున్నామని, కానీ అమెరికాకు సంబంధించిన మనీ స్కామ్ స్టోరీ అనగానే ఆమె నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటించలేను. ఇలాంటి సినిమా చేస్తే నన్ను కొడతారు. నా ఫ్యామిలీ మొత్తం యూఎస్‌లో ఉంటోందని ఆమె చెప్పారని విష్ణు పేర్కొన్నారు. దీంతో కాజల్‌కు ఫోన్ చేయడంతో వెంటనే ఒప్పుకుందని ఆయన తెలిపారు. రిస్క్ అని తెలిసినా కూడా మోసగాళ్ళు సినిమా నా మార్కెట్ పరిధిని బ్రేక్ చేయగలదనే నమ్మకం ఉందని విష్ణు తెలిపారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణు, కాజల్‌లతో పాటు సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషించారు. అయితే కాజల్ రోల్ చిత్రానికి మేజర్ అసెట్ కానుందని సమాచారం. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఇటీవలే చిరంజీవి రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aYEAiE

No comments:

Post a Comment

'We want to be trust marker for the fintech industry'

'So, we would work with our members to ensure that we as an SRO create some sort of due diligence for fintechs.' from rediff Top I...