Sunday, 28 February 2021

ఈ కథలో పాత్రలు కల్పితం: రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈ రోజుల్లో సినిమాను రూపొందించడం ఒకెత్తయితే.. దాన్ని జనాలకు తెలిసేలా ప్రమోట్ చేయడం మరో ఎత్తు. అందుకే ఈ జనరేషన్ మేకర్స్ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరోలు, స్టార్ దర్శక నిర్మాతలతో పాటు రాజకీయ నాయకుల సహకారం పొందుతూ తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మొన్నా మధ్య '' అనే పాటను వైఎస్ షర్మిల చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అది బాగానే వర్కవుట్ కావడంతో ఈ సారి మంత్రి చేతుల మీదుగా లీజ్ డేట్ పోస్టర్‌ను వదిలారు. పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌, సాంగ్స్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన తెచ్చుకున్నాయి. డిఫరెంట్ టైటిల్ కావడంతో జనం అట్రాక్ట్ అయ్యారు. ఒక్కో అప్‌‌డేట్‌తో మూవీపై అంచనాలు పెంచేసిన యూనిట్.. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇటీవలే సెన్సార్ పనులను జరుపుకున్న ఈ సినిమాను మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేశారు. సినిమా టైటిల్ చాలా వెరైటీగా ఉందని చెప్పిన తలసాని.. చిత్రయూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sx8Wyw

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...