Thursday 4 February 2021

ఏకంగా సీఎంతో మెగా మేనల్లుడి ఫైట్.. వివాదాస్పద అంశాన్ని వెలికితీస్తున్న సాయి ధరమ్ తేజ్!

మెగా మేనల్లుడు వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఆ మధ్య వరుస ఫ్లాపుల తర్వాత 'చిత్రలహరి' సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కిన ఆయన ఇటీవలే 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు '' అంటూ ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ స్టోరీలైన్ ఇదేనంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. 'ప్రస్థానం' ఫేం దేవకట్టా దర్శకత్వంలో ఈ ‘రిపబ్లిక్' సినిమా రూపొందుతోంది. భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా మేనల్లుడి కెరీర్‌లో 14వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని పొలిటికల్ నేపథ్యంలో రొమాంటిక్ అంశాలు జోడించి తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ పాత్ర పోషిస్తున్నాడని తెలియగా.. తాజా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమా ఏలూరు సమీపంలో ఉండే కొల్లేరు సరస్సుకు సంబంధించిన వివాదాస్పద కాన్సెప్ట్‌తో సాగుతుందని, కలెక్టర్‌గా పని చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ఈ అంశంపై పోరాటం చేస్తారని సమాచారం. కొల్లేరు సరస్సు పూర్వ వైభవం కోసం ఏకంగా సీఎంతో ఫైట్ చేస్తారట మెగా మేనల్లుడు. చిత్రంలో సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుండటం విశేషం. ఈ చిత్రాన్ని జూన్ 4వ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LpoRz8

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...