బాలీవుడ్లో సూపర్ హిట్ సాధించిన ‘పింక్’ సినిమా రీమేక్గా పవర్స్టార్ పవన్కళ్యాణ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘’. ఈ రోజు(ఏప్రిల్ 4న)న శిల్పకళా వేదికగా ఘనంగా జరిగింది. అయితే వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం దర్శకుడు , నిర్మాత ఏఎమ్ రత్నం ఈ ఈవెంట్కి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారయ్యారు. ఈ సందర్భంగా క్రిష్.. ఫ్యాన్స్లందు పవన్కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ‘మొన్న షూటింగ్ జరుగుతోంది.. లంచ్ టైంలో నోటిఫికేషన్స్ చూద్దామని ట్విట్టర్ ఓపెన్ చేశాను. అందులో వచ్చిన మెసేజ్లు చూసి నాకు ఆశ్చరం కలిగింది. ఎండలు బాగా ఉన్నాయి మా హీరోని జాగ్రత్తా చూసుకోండి అంటూ ఫ్యాన్స్ నాకు మెసేజ్ చేశారు. ప్రపంచంలో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతుంటాయి.. ఇక టాలీవుడ్లో పవన్కళ్యాణ్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమైంది. ఇలాంటి గొప్ప కథను పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్లినందుకు దిల్ రాజుకి శతకోటి ధన్యవాదాలు’ అని అన్నారు. అనంతరం నిర్మాత ఏఎమ్ రత్నం మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్తో నేను మూడు సినిమాలు చేశాను. ఖుషీ, బంగారం తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్లు నిర్మిస్తున్నాను. ఆయన ఓ నటుడిగా కంటే ఓ వ్యక్తిగా నాకు ఎంతో ఇష్టం. పవన్ కళ్యాణ్ గతంలో నటించిన ఖుషీ, గబ్బర్సింగ్లు రీమేక్లే ఇప్పుడు వకీల్ సాబ్ కూడా రీమేకే. అయితే అది ఏ సినిమా రీమేక్ అయినా.. ఆ సినిమా పాత్రని పవన్ తన స్టైల్లోకి మార్చుకుంటారు. పవన్ కళ్యాణ్ చేస్తే అవి రీమేక్గా కనిపించవు’’ అని అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fCEfVz
No comments:
Post a Comment