Sunday, 25 April 2021

అది ఇప్పుడు చాలా అవసరం.. వ్యాక్సినేషన్‌పై మహేష్ బాబు కామెంట్స్

ప్రస్తుతం సెకండ్ వేవ్ దెబ్బకు దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. కరోనా విజృంభణను చూసి ప్రపంచ దేశాలు సైతం వణికిపోతోన్నాయి. మన దేశం మీద ఇప్పటికే ఆంక్షలు విధించారు. అమెరికా సైతం సాయం చేసేందుకు ముందువెనకా ఆలోచిస్తోంది. అయితే ఇలాంటి తరుణంలోనూ కరోనా వ్యాక్సిన్‌పై పలు రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. దేశంలో విస్తరిస్తోన్న కరోనాకు అడ్డు కట్టవేసేందుకు భారత ప్రభుత్వం ప్రోగ్రాంను చేపట్టింది. ముందుగా 45 ఏళ్లకు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. అయితే వ్యాక్సిన్ మీదున్న అనుమానాలతో కొందరు దూరంగా ఉండిపోయారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపింది. అయితే ఈక్రమంలో వ్యాక్సిన్ మీదున్న అపోహలను పోగొట్టేందుకు సెలెబ్రిటీలను రంగంలోకి దింపుతున్నారు. తాజాగా వ్యాక్సినేషన్ గురించి చెప్పుకొచ్చారు. తాను వ్యాక్సిన్ వేసుకున్నానని సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్కొన్నారు. నా వంతు బాధ్యత పూర్తయింది..నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. ప్రస్తుతం ఈ సెకండ్ వేవ్ అందరినీ బాధిస్తోంది.. ఇలాంటి సమయంలోనే మనకు వ్యాక్సిన్ అత్యవసరం. 18 ఏళ్లు నిండిన అందరూ కూడా మే 1 నుంచి వ్యాక్సిన్ వేయించుకోండి.. అందరూ జాగ్రత్తగా ఉండండి అని మహేష్ బాబు కోరారు. సర్కారు వారి పాట షూటింగ్‌లో పాల్గొన్న మహేష్ బాబుకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని క్లారిటీ వచ్చింది. తన చిత్రయూనిట్‌లో కరోనా రావడంతో ప్రస్తుతం మహేష్ బాబు క్వారంటైన్‌కు పరిమితమయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RT5PUv

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....