Saturday, 24 April 2021

కరాటే కళ్యాణికి ‘నంది’ పాయే.. జగన్‌పై విమర్శలు బాబుపై పొగడ్తలు.. అప్పుడు సీఎం ఎవరు బాబీ అంటూ ఏకేస్తున్నారు!

టాలీవుడ్ నంది అవార్డులు సందడి కనిపించి చాలా ఏళ్లైంది.. ప్రభుత్వం ప్రకటించే ఈ అవార్డుల విషయంలో పెద్ద రచ్చే జరుగుతుంది. టాలెంట్‌కి తగ్గట్టుగా కాకుండా.. రికమండేషన్‌లు, ప్రభుత్వం పట్ల ఎవరు సానుకూలంగా ఉంటే వాళ్లకి ఈ నందులు వరిస్తుంటాయనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. ఇక నందుల్ని ఎరగా వేసి హీరోల అభిమానుల్ని తమవైపు తిప్పుకునే సినీ-పొలిటికల్ ట్రిక్స్ కూడా ఇంతకు ముందు చూశాం. అయితే తనకు రావాల్సిన నంది ఇంకా రాలేదంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసింది సినీనటి, బిగ్ బాస్ ఫేమ్ . ‘గోరంత దీపం’ సీరియల్‌లో తాను నటనతో ఇరగదీసినందుకు అప్పటి ప్రభుత్వం తనకు నంది అవార్డుని ప్రకటించిందని.. అయితే ఇప్పటివరకూ దాన్ని ఇవ్వలేదని ఆ సీరియల్‌లో తన గెటప్‌కి సంబంధించిన ఫొటోని షేర్ చేసిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది కళ్యాణి. ‘‘ఈ పిక్స్ చూస్తే 2013కి వెళ్లిపోయా.. సన్నగా అయ్యాను.. అప్పుడు నాకు బాగా పేరుతో పాటు బెస్ట్ విలన్ 2014 సంవత్సరంకి గాను నంది అవార్డు కూడా వచ్చింది.. కానీ అప్పటికి సీఎంగా గారు ఉన్నారు. ఆయన దిగిపోయే నాటికి అనౌన్స్ చేశారు. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇంతవరకు జగన్ గారి ప్రభుత్వం ఇవ్వకుండా అందరికి బాధకు గురిచేశారు. సీరియల్ గోరంత దీపం.. అందులో నేర్చుకొని మరీ తెలంగాణ మండలీకంలో మాట్లాడేదాన్ని.. నాకు నా పేరు ఇష్టం మాణిక్యము. మళ్ళీ ఇలా ఎప్పటికి అవ్వగలను. ఇంకొక విశేషం ఏమిటంటే.. సావిత్రిగారు గోల్డ్ వేసుకునేవారు అంటారు.. మళ్ళీ నేను ఈ సీరియల్ కోసం నేను వేసుకొని ఆభరణాలు అన్నీ బంగారం. నా కార్‌లో పెట్టెల్లో ఉండేవి.. అప్పుడు అందరూ అనేవారు భయం లేదా అని. రెండు మూడు పోయేసరికి బుద్ది వచ్చి.. ఇప్పుడు మానేశా వేసుకోవడం. అవి కూడా ఇప్పుడు లేవు తెసేసా... నిజంగా చెపితే మాణిక్యం ఎప్పుడు సూపర్ కదా..!’ అంటూ పోస్ట్ పెట్టింది కరాటే కళ్యాణి. అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు. ‘నీ లెక్కల్లో 2013 అన్నావ్.. నాలుగేళ్ళకి ప్రకటన చేశారు అంటున్నావ్.. 2017- 2019 దాకా బాబే ఉన్నాడుగా.. మధ్యలో జగన్ ఎందుకు వచ్చాడు బాబి.. నువ్వు నీ పెయిడ్ పోస్టులు.. సెక్క భజన సేసుకో సోమాజిగూడాలో’ అంటూ ఘాటుగా రియాక్ట్ అవ్వగా.. కరాటే కళ్యాణ్ రిప్లై ఇచ్చింది. ‘పిచ్చి పులక మాటలు ఆపు.. సీరియల్ చేసిన సంవత్సరం ఎవ్వరూ ఇవ్వరు. అది పరిగణలోకి తెసుకున్నది 2016 లేక 2017లో. ఆతరువాత ఉన్న ఆయన ఇవ్వలేదు. ఈయన వచ్చాక అసలు ఇవ్వలేదు. కనీసం కళాకారులు గురించి బాబు ఏదైనా చేశారు. ఇప్పుడు సాంస్కృతిక శాఖలో నిధులు లేవు అని మొత్తం వాళ్ళకి తిండికి కూడా లేదు. అందరికి ఇస్తారు కానీ కళాకారులకు ఇవ్వరా.. ముందు కనుక్కో బాబూ ఆ తరువాత అర్ధం అవుతుంది.. చంద్రబాబు కళాకారులకు చాలానే చేశారు’ అంటూ నాటి సీఎంపై ప్రశంసలు కురిపించింది కరాటే కళ్యాణి. దీంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయారు.. చంద్రబాబు కళాకారులకు చాలా చేశారా?? ఏం చేశారో చెప్పుచ్చుగా.. 2013 అంటావ్.. 16 అంటావ్.. 17 అంటావ్.. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా?? అయినా దేశం మొత్తం కరోనాతో చస్తుంటే.. నీకు బెస్ట్ విలన్‌ అవార్డ్ రాలేదని ఏడుస్తున్నావ్.. మళ్లీ నువ్వొక ధర్మ పరిరక్షకురాలివి’ అంటూ కరాటే కళ్యాణి పోస్ట్‌పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అయితే కరాటే కళ్యాణి సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలో తిరుమల డిక్లరేషన్ విషయంతో జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tO8IUX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....