Monday, 4 May 2020

జలగల్లా రక్తం తాగుతున్నారు.. వెంటనే చర్యలు తీసుకోవాలి.. నాగబాబు వైరల్ ట్వీట్

కొన్ని వెబ్‌సైట్స్ ఇష్టారీతిలో వార్తలు రాస్తున్నాయంటూ టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఎలాంటి ప్రామాణికత లేకుండా అసత్య వార్తలు ప్రచారం చేస్తూ, గాసిప్స్ సృష్టిస్తూ రచ్చ చేసే వెబ్‌సైట్లు కొన్ని ఉన్నాయని పేర్కొంటూ నేరుగా వీడియో ద్వారా సందేశమిచ్చి సంచనలం సృష్టించారు విజయ్ దేవరకొండ. ఈ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ విజయ్‌కి అండగా నిలుస్తోంది. ఇప్పటికే హీరో మహేష్‌తో పాటు అల్లరి నరేష్, రవితేజ, డైరెక్టర్లు హరీశ్ శంకర్, క్రిష్, అనిల్ రావిపూడి, కొరటాల శివలు ఆయనను సపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా బ్రదర్ స్పందిస్తూ విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసిన అయన.. ''హాయ్‌ విజయ్.. కిల్ ఫేక్ న్యూస్, కిల్ గాసిప్ వెబ్‌సైట్స్ అంటూ నీవు మాట్లాడిన మాటలకు నేను మద్దతు తెలుపుతున్నా. ఇలాంటి వెబ్‌సైట్లపై స్పందించడంలో ఇప్పటికే సినీ పరిశ్రమ చాలా ఆలస్యం చేసింది. సినీ పరిశ్రమ రక్తాన్ని వాళ్ళు జలగల్లా పీల్చేస్తున్నారు. నీ ప్రతిస్పందనకు కృతజ్ఞతలు. చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది'' అని పేర్కొన్నారు. కరోనా కల్లోలంతో ఉపాధిలేక తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా 'ది దేవరకొండ ఫౌండేషన్' స్థాపించి అందులో 'మిడిల్ క్లాస్ ఫండ్'తో సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై కొన్ని వెబ్‌సైట్లు తప్పుడు కథనాలు ప్రచురించాయని ఫైర్ అవుతూ విజయ్ ఓ వీడియో పోస్ట్ చేయడంతో ఈ ఇష్యూ టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fjtLYs

No comments:

Post a Comment

'Kejriwal Needs To Learn From Modi'

'The entire party is centred around one man and that is Arvind Kejriwal.' from rediff Top Interviews https://ift.tt/1G9NLJS