Monday, 4 May 2020

హంద్వారా అటాక్: అమరవీరులకు మహేష్ సహా హీరోల నివాళి

జమ్మూకశ్మీర్‌లోని హంద్వారాలో ఈనెల 3న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత్ ఐదుగురు సైనికులను కోల్పోయింది. ఉగ్రవాదులతో జరిగిన ఈ పోరులో కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనుజ్ సూద్, నాయక్ రమేశ్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ సింగ్, పోలీస్ శాఖకు చెందిన సబ్ ఇన్స్‌పెక్టర్ షకీల్ ఖాజీ వీరమరణం పొందారు. బంధీలుగా ఉన్న సామాన్య ప్రజలను రక్షించే రక్షించే క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టి ఈ ఐదుగురు అమరులయ్యారు. ఈ వీర సైనికులకు టాలీవుడ్ హీరోలు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తున్నారు. మొదటిగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా అమర వీరులకు నివాళులర్పించారు. ‘‘హంద్వరా దాడి - మన దేశానికి చీకటి సమయం. మన సైనికుల ధైర్యం, మన దేశాన్ని రక్షించాలనే సంకల్పం అసాధారణం. మన‌ కోసం విధి నిర్వహణలో మరణించిన సైనికుల గౌరవార్థం మౌనం పాటిస్తున్నాను. జ‌వాన్ల కుటుంబానికి, వారి సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను. ఈ స‌మ‌యంలో మ‌న ప్రేమ‌, ధైర్యం వారికి ఎంతో అవ‌స‌రం. జైహింద్’’ అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మహేష్ బాబుతో పాటు నితిన్, సాయి ధరమ్ తేజ్ కూడా వీర సైనికులకు ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ‘‘మన ఆర్మీ సైనికులు విధి నిర్వహణలో భాగంగా హంద్వారాలో వీరమరణం పొందారని విని నమ్మలేకపోయా. షాక్‌కు గురయ్యాను. ఇలాంటి నిరుత్సాహకర సమయంలో ఈ వార్త మరో పెద్ద షాక్. వారి ఆత్మలకు శాంతి చేకూరాలి. ఇలాంటి దు:ఖ సమయంలో వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని నితిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్.. ‘‘హంద్వారా దాడిలో అమరులైన వీర సైనికులు, పోలీస్ అధికారికి వందనాలు. ఆదర్శవంతమైన వారి శౌర్యం, ధైర్యం, త్యాగం దేశభక్తికి నిర్వచనం. తమ ప్రియమైనవారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా సైనికులకు నివాళులర్పించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2xwuogl

No comments:

Post a Comment

'Bengali Nationalism May Help Mamata Retain Power'

'If the BJP becomes our political identity, our political face, if we are represented by the BJP, then what happens to our identity as B...