Friday 10 December 2021

ఖూనీ చేస్తున్నామని రాజమౌళి వద్దన్నారు...నేను కూడా జక్కన్నపై గర్జించేశా: ఎన్టీఆర్

పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందిన చిత్రం RRR. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. తార‌క్‌, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ మంచి న‌టులు. కానీ ఓ విష‌యంలో వారిద్ద‌రూ త‌ను అనుకున్న ఔట్‌పుట్‌ను ఇవ్వ‌డం లేద‌ని, ఖూనీ చేస్తున్నార‌ని రాజ‌మౌళి భావించి వ‌ద్ద‌న్నారు.. అలాగే మ‌రో సంద‌ర్భంలో కూడా రాజ‌మౌళిపై గ‌ర్జించాన‌ని అన్నారు. అస‌లు రాజ‌మౌలి ఎందుకు శాటిస్పై కాలేదు.. ఎన్టీఆర్ ఎందుకు గ‌ర్జించారు? అనే వివ‌రాల్లోకి వెళితే.. 10 భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న సినిమాను పాన్ ఇండియా మూవీగా 5 భాష‌ల్లో రూపొందిస్తే.. మ‌రో 5 భాష‌ల్లో సినిమా డ‌బ్బింగ్ అవుతూ ప్రంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. అయితే ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ స‌హా హిందీ భాష‌ల్లో మాత్ర‌మే న‌టీన‌టులు డ‌బ్బింగ్ చెప్పారు. మ‌ల‌యాళంకు డ‌బ్బింగ్ చెప్పలేదు. మ‌ల‌యాళంకు చెందిన ఆర్టిస్టులు డ‌బ్బింగ్ చెప్పారు. శ‌నివారం జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో RRR టీమ్ సభ్యులు పాల్గొన్నారు. అసలు మలయాళంలో ఎందుకు డ‌బ్బింగ్ చెప్ప‌లేదు.. అని అడిగిన ప్ర‌శ్న‌కు తార‌క్ స‌మాధాన‌మిస్తూ..‘‘5 భాష‌ల్లో మ‌ల‌యాళం మిన‌హా మిగిలిన నాలుగు భాష‌లు తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళంలో మేమే డ‌బ్బింగ్ చెప్పుకున్నాం. డ‌బ్బింగ్ ఎక్స్‌ప‌ర్ట్స్ కూడా మేం డ‌బ్బింగ్ చెబుతున్న స‌మయంలో మాతో పాటు ఉండేవారు. అయితే మ‌ల‌యాళంలో డ‌బ్బింగ్ చెబుతున్న‌ప్పుడు మాత్రం మేం దాన్ని ఖూనీ చేస్తున్నామ‌ని రాజ‌మౌళిగారు భావించి మ‌ల‌యాళ డ‌బ్బింగ్ ఆర్టిస్టుల‌తోనే చెప్పించారు’’ అన్నారు. అలాగే సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సన్నివేశంలో చిత్రీకరించిన పులి గ్రాండించడం.. దానికి ప్రతిగా ఎన్టీఆర్ గ‌ర్జించే స‌న్నివేశం ఉంది. దాన్నెలా చిత్రీక‌రించారు. అని వేసిన ప్ర‌శ్న‌కు యంగ్ టైగ‌ర్ ఆన్స‌ర్ ఇస్తూ ‘‘పులి సన్నివేశం చిత్రీకరించే సమయంలో కనిపించని పులి రాజమౌళిగారే. ఆయన లేరక్కడ. అలా గర్జిస్తూ ముందుకు వచ్చింది ఆయన అనుకన్నాను. సరే! ప‌రిచ‌య‌స్థుడే క‌దా అని నేను కూడా ఓ అరుపు అరిచాను’’ అన్నారు. గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీగా RRRను నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రాజ‌మౌళి తెరకెక్కించారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో అంద‌రూ సినిమా గురించి ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yiiukU

No comments:

Post a Comment

'We Lost So Many Things In This War'

'The war ended in 2009 and I believe the new generation of Tamils don't know what was going on there.' from rediff Top Intervi...