Thursday 9 December 2021

Akhanda Vijayotsava Jathara Live : బాలయ్యకు స్టేజ్ మీదే సాష్టాంగ నమస్కారం.. పూర్ణదే అతి అనుకుంటే.. ఉదయ భానుది అంతకు మించి!

అఖండ సినిమా ఎంతలా దూసుకుపోతోందో అందరికీ తెలిసిందే. వారం రోజుల్లోనే బాలయ్య బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లోకి వచ్చింది. తాజాగా విజయోత్సవ జాతరను ఏర్పాటు చేశారు. ఇందులో బాలయ్యపై ఉదయభాను తన భక్తిని చాటుకుంది. ఈ ఈవెంట్‌లో పూర్ణ ఏకంగా బాలయ్యకు అందరి ముందే సాష్టాంగ నమస్కారం చేసింది. దీంతో పూర్ణ మీద ఉదయభాను ఎమోషనల్ అయింది. కరెక్ట్‌గా చెప్పావంటూ ఉదయభాను తన భక్తిని చాటుకుంది. పూర్ణ మాట్లాడుతూ.. ‘అఖండ విజయం మాది. ఇది ప్రేక్షకుల విజయం. అందరి అభిమానులు ఈ సినిమాను చూసి హిట్ చేశారు. ఇలాంటి మంచి పాత్రను ఇచ్చినందుకు బోయపాటి గారికి థ్యాంక్స్. ఇలాంటి పెద్ద సక్సెస్‌ను నా పదహారేళ్ల కెరీర్‌లో చూడలేదు. శ్రీకాంత్ గారు నన్ను భయపెట్టినా కూడా మీ అందం ముందు ఆ భయం తెలియలేదు. బాలయ్య గారి గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఇంత కంటే ఎక్కువ చెప్పలేను. ఈ సినిమా, అఘోర పాత్ర నన్ను వెంటాడింది. మీలాంటి వారితో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. బాలయ్య బాబుకు ఎవ్వరూ దిష్టి పెట్టకూడదు’ అని చెప్పేసింది. ఇక పూర్ణ చేసిన సాష్టాంగ నమస్కారమే ఎక్కువైందంటే.. మాత్రం మరో లెవెల్‌కు వెళ్లింది. అయితే పూర్ణ మాట్లాడిన అనంతరం ఉదయ భాను ఎమోషనల్ అయింది. బాలయ్య గారి గురించి పూర్ణ చెప్పినవన్నీ అక్షర సత్యాలేనని ఉదయ భాను. ఎవరు ఏం అనుకున్నా పర్లేదు.. ఇంకో షో రాపోయినా పర్లేదు.. బాలయ్య బాబు ఒక్కడే.. ఒక్కడే బాలయ్య.. ఆయనకు ఎవ్వరూ సాటి రారు అంటూ బాలయ్యపై భక్తిని చాటుకుంది ఉదయభాను.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lQJJ18

No comments:

Post a Comment

'BJP Micromanaged 48 Seats We Won'

'Every Haryana assembly seat has its own unique problems to earn victory for a political party and you as a politician need to know what...