తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అక్కడి రాజకీయాల్లో సినీ తారల సందడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 6) తమిళనాడులో జరుగుతున్న ఎలక్షన్స్లో సినీతారలు తమ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒక్కొక్కరుగా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని ఓటు వేస్తున్నారు. సినీ తారల రాకతో అక్కడి మీడియా వర్గాల కెమెరా క్లిక్స్ వారిపైనే పడుతున్నాయి. నేటి ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన పోలింగ్.. పోలీస్ సెక్యూరిటీ నడుమ సాగుతోంది. సాధారణ జనంతో పాటు సెలబ్రిటీలు ఓటేసి వెళుతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ అందరికంటే ముందే ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకొని తన వేలికి పెట్టిన సిరా ఇంకు చూపించారు. రాధికా శరత్ కుమార్, ఉదయనిధి స్టాలిన్, హీరో సూర్య, అతని తమ్ముడు కార్తీ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ తమ ఓటు వేశారు. ఇకపోతే హీరో అజిత్ తన సతీమణి షాలినితో కలిసి తిరువాన్మయూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన రాకతో పోలింగ్ కేంద్రం వద్ద అభిమానులు పోటెత్తారు. సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడడంతో అజిత్ కాసింత అసహనానికి గురైనట్లు సమాచారం. ఇక హీరో విజయ్ అయితే నెవర్ బిఫోర్ అనేలా తన ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు సైకిల్పై వచ్చి ఓటేసి వెళ్లారు. ఓ సాధారణ వ్యక్తిలా ఆయన సైకిల్ మీద రావడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. హీరో కమల్ హాసన్ కూడా తన కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్లతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PXNWDh
No comments:
Post a Comment