Sunday, 19 April 2020

ఈ చీకటి ఉండిపోదు... మనో ధైర్యం ఇస్తున్న మంచు మనోజ్ పాట

కరోనా వైరస్ కారణంగా సినీతారలు నడుం బిగిస్తున్నారు. వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో అద్భుతమైన పాటను విడుదల చేశారు. కరోనా వైరస్ వేళ ప్రపంచం ఎలా మారిపోయిందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పాడు. అదేవిధంగా వైరస్ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారి సేవల్ని కొనియాడాడు. లాక్ డౌన్ పాటించడం ఎంత ముఖ్యమన్న విషయాన్ని కూడా పాట రూపంలో తెలిపాడు. అంతేకాకుండా ఈ చీకటి ఎన్నో రోజులు ఉండదని.. త్వరలో మన జీవితాల్లో వెలుగు వస్తుందని మనో ధైర్యాన్ని ఇచ్చాడు. మంచు మనోజ్ పాటకు... మంచు లక్ష్మీ కూతురు సైతం గళం కలిపింది. చిన్నారి విద్య నిర్వాణ సైతం మామయ్య కలిసి పాట పాడింది. ఎంతో ముచ్చటగా విద్య సైతం పాడిన పాటకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పాటకు లిరిక్స్ కాశర్ల శ్యాం అందించారు. అచు రాజమణి సంగీతం అందించారు. అంతేకాకుండా పాట అనంతరం ఓ మెసేజ్ కూడా ఇచ్చారు మంచు మనోజ్. కరోనా వైరస్ తో గుళ్లు, చర్చి, మసీదుల్లో ఉండే దేవుళ్లే క్వారంటైన్ పాటిస్తున్నారన్నాడు. అలాంటి సమయంలో స్టెతస్కోప్ పట్టుకున్న డాక్టర్, లాఠీ పట్టుకున్న పోలీస్, తుపాకి పట్టుకున్న ఆర్మీ, నాగలి పట్టుకున్న రైతు, చీపురు పట్టుకున్న పారిశుధ్య కార్మికుడు మన కోసం మనల్ని ఆదుకునేందుకు దేవుళ్ల రూపంలో వచ్చారన్నాడు, దయ చేసి వారికి సహకరించడని విజ్ఞప్తి చేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ak5b60

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....