Saturday, 25 April 2020

బాలకృష్ణపై యాంకర్ రవి కామెంట్స్.. అలాంటివి సరికాదంటూ!!

బుల్లితెర యాంకర్‌గా చేస్తూనే భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న వ్యక్తుల్లో పేరు ముందువరుసలో ఉంటుంది. అప్పట్లో ‘సమ్‌థింగ్ స్పెషల్’ అంటూ ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ చూపించిన ఆయన.. ఆ తర్వాత ‘‘పటాస్, ఢీ’’ లాంటి ప్రోగ్రామ్స్ చేసి రెచ్చిపోయాడు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన రవి, తాజాగా ఓ మీడియాకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా , పవన్ కళ్యాణ్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానెప్పుడూ కష్టాన్నే నమ్ముకుంటానని చెప్పాడు యాంకర్ రవి. నటుడిగా ఎదగాలనే ఉద్దశ్యంతో యాంకరింగ్ వృత్తిలోకి వచ్చానని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన టార్గెట్ వైపే దృష్టిపెడుతూ సాగిపోతున్నానని చెప్పాడు. ఎలాగైనా వెండితెరపై టాలెంట్ చూపించాలని చిన్నప్పటినుంచే ఓ కోరిక ఉండేదని చెప్పుకొచ్చాడు. తనకు గురువు చిరంజీవి గారే అని, స్వయంకృషితో పైకి రావడమే లక్ష్యంగా బుల్లితెరపై అడుగుపెట్టానని అన్నాడు. నాగార్జున సహాయంతో యాంకరింగ్ మొదలుపెట్టానని చెప్పాడు. ఆ తర్వాత బాలకృష్ణ గురించి మాట్లాడిన రవి.. ఎవడెవడో సోషల్ మీడియాలో ఆయనపై నెగెటివ్ కామెంట్స్ చేయడం సరికాదని అన్నాడు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ ఏజ్‌లో కూడా మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారని, వాళ్లకు ఎన్ని బాధలున్నా, ఎన్ని నొప్పులున్నా భరించి మనల్ని నవ్విస్తుంటే అలా కెమెంట్స్ చేయొద్దని అన్నాడు. బాలకృష్ణే కాదు మహేష్, రామ్ చరణ్ సహా మనల్ని ఎంటర్‌టైన్ చేసే హీరోలంతా దేవుళ్ళతో సమానమని రవి చెప్పడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ పక్కన తమ్ముడిగా ఛాన్స్ వస్తే మీ ఫీలింగ్స్ ఏంటని అడగగా.. తమ్ముడిగా ఏంటి నాయనా! ఆయన పక్కన పనోడిలా ఛాన్స్ వచ్చినా చేస్తానని అన్నాడు రవి. పవన్ కళ్యాణ్‌ని అన్నయ్యా అని పిలిచే అవకాశం వచ్చిందంటే అదో డిఫెరెంట్ ఫీలింగ్ అని చెప్పాడు. పవన్ తోనే కాదు ఏ హీరోతో ఛాన్స్ వచ్చినా అదే ఫీలింగ్ ఉంటుందని రవి తెలిపాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S89ECO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....