Monday, 27 April 2020

మల్లెపూలు పెట్టుకున్న మంచు లక్ష్మీ.. సోషల్ మీడియలో ఫోటో

లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక సినీ సెలబ్రిటీల కూడా షూటింగులు బంద్ కావడంతో ఇంటి పట్టునే ఉంటున్నారు. టైమ్ దొరకడంతో కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతున్నారుజ. కరోనా లాక్‌డౌన్ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. రెండు జడలు వేసుకొని మల్లెపూలు పెట్టుకున్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆమె తల్లి ఆమెను అప్యాయంగా ముద్దు కూడా పెడుతున్నారు. ఈ ఫోటోను మంచు లక్ష్మీ స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ అమ్మ మల్లె పూలు పెడుతోంది. మా తోటలో పూసిన పూలు ఇవి’ అని కామెంట్ కూడా దానికి యాడ్ చేశారు. తాజాగా మంచు లక్ష్మీ తన గార్డెన్‌లో మామిడి చెట్టు ఎక్కిన వీడియో కూడా షేర్ చేశారు. ఇన్నాళ్లు బిజీగా ఉన్న తాను... ఇప్పుడు మొక్కలతో మాట్లాడడం స్టార్ట్ చేశానన్నాడరుజ తన ఇంటి పెరటిలో ఉన్న మామిడి చెట్టును ఆమె ఇప్పటి వరకు పట్టించుకోలేదని తెలిపారు.ఇప్పుడు ఆ మామిడి చెట్టునే కాకుండా తన పెరటిలో ఉన్న మొక్కలన్నిటినీ ఫ్యామిలీ మెంబర్స్‌గా భావిస్తూ.. రోజూ వాటితో మాట్లాడుతూ.. వాటికోసం కాసేపు సమయం కేటాయిస్తున్నాని తెలిపారు ఈ విషయాలన్నీ తెలుపుతూ ఇన్‌స్టాలో వీడియో కూడా పోస్ట్ చేశారు. మంచు లక్ష్మీ, తెలుగు ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఒక్కగానొక్క కుమార్తె. ఈమె కూడా అనేక సినిమాల్లో నటించింది. అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి. దొంగల ముఠా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాకుండా మంచు లక్ష్మీ అనేక షోలు కూడా చేస్తున్నారు. ల


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yLr558

No comments:

Post a Comment

Pradyut Bordoloi On Why He Quit Congress To Join BJP

'I could have accepted the humiliation if I wanted to remain as an MP. But I decided to leave.' from rediff Top Interviews https:/...