Sunday, 26 April 2020

ఒంటిపై నూలుపోగు లేకుండా రెచ్చిపోయిన తమన్నా.. అందాలకు అదొక్కటే అడ్డు

మిల్కీ బ్యూటీ తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఒంటిమీద బట్టలు లేకుండా కేవలం పిల్లో మాత్రమే అడ్డు పెట్టుకొని క్లీవేజ్ కిక్కిచ్చింది. తన లేలేత ప్రాయాన్ని షో చేస్తూ అలా నేలపై పడుకొని యువతను కైపెక్కించింది మిల్కీ బ్యూటీ. పిల్లో ఛాలెంజ్‌లో భాగంగా ఈ ఫీట్ చేసింది తమన్నా. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. ఈ కారణంగా ఇంటికే పరిమితమైన తారలంతా ఏదో ఒక పని చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలంతా 'బీ ది రియల్ మెన్' ఛాలెంజ్ కొనసాగిస్తూ ఇంటిపనులు చేస్తుండగా, హీరోయిన్స్ '' కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఛాలెంజ్ స్వీకరించిన పాయల్ రాజ్‌పుత్ పిల్లో అడ్డుపెట్టి అందాలు ఆరబోసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమన్నా కూడా అదే పని చేసి యువతను ఎంటర్‌టైన్ చేసింది. తమన్నా షేర్ చేసిన ఈ పిల్లో పిక్ చూసి నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. పాయల్‌ని ఆదర్శంగా తీసుకొని ఇలా చేస్తున్నావా?, అయినా ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయడం సరికాదు అంటూ కొందరు స్పందిస్తుండగా.. వావ్, సూపర్, తమన్నా అందాలు అదరహో అంటూ ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నైట్ పార్టీ సాంగ్‌లో దుమ్మురేపిన తమన్నా.. ప్రస్తుతం గోపీచంద్ సరసన సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమై కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో తనది పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్ అని చెప్పింది తమన్నా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KCkaxT

No comments:

Post a Comment

'Consumers should not pay higher taxes for clean tech'

'We are not asking for incentives, but at least taxation can be aligned such that the rupee tax on consumers remains the same.' fr...