Thursday 11 February 2021

అబ్బాయిలు జాగ్రత మీ కా*** మీరే జాగ్రత వహించాలి: ట్విట్టర్‌లో రచ్చ చేస్తున్న ఉప్పెన 'కటింగ్ సీన్'

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు హీరోగా పరిచయమవుతూ ''తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమానే అయినా ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నడుమ (ఫిబ్రవరి 12) సినిమా విడుదల సందర్భంగా గత రాత్రి ఓవర్‌సీస్‌లో ఉప్పెన షోస్ పడ్డాయి. ఈ షోస్ చూసిన జనం అంతా బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను, హీరోహీరోయిన్లు వైష్ణవ్ తేజ్- కృతి శెట్టి కెమిస్ట్రీని పొగిడేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ గురించైతే ట్విట్టర్‌లో ట్వీట్స్ మోగిపోతున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ సీన్ గురించే చర్చించుకుంటున్నారు. నిజానికి 'ఉప్పెన' ట్రైల‌ర్ రిలీజ్ కాగానే ఈ చిత్ర క్లైమాక్స్ గురించిన చర్చలు మొదలయ్యాయి. ఈ సీన్‌లో హీరో వైష్ణవ్ తేజ్‌ని చంపేస్తారనే అనుమానం అందరికీ వచ్చింది. అయితే దీనిపై సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వచ్చారు మేకర్స్. మరోవైపు ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారని చిరనేజీవి చెప్పడం, సాయి ధరమ్ తేజ్ కూడా దీనిపైనే ఫోకస్ చేసి మాట్లాడటంతో అంతా క్లైమాక్స్ సీన్ కోసం ఎదురుచూసి నిజంగానే షాక్ అయ్యారని తాజా ట్వీట్స్‌ని బట్టి తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ సీన్‌లో హీరో మర్మాంగం కటింగ్ చేసే సీన్ పెట్టేశారట. ఈ సీన్ కన్నీళ్లు పెట్టించిందట. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ సీన్ గురించిన మీమ్సే కనిపిస్తున్నాయి. కొందరైతే ఏకంగా ఈ సీన్ వీడియో తీసి పెట్టేస్తుండటంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది. సినిమా టాక్ సంగతి పక్కనబెట్టేసి అందరూ క్లైమాక్స్ సీన్ గురించే డిస్కషన్స్ చేస్తుండటం గమనార్హం. 'అబ్బో ఉంది రోయ్.. రచ్చే' అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే 'అబ్బాయిలు జాగ్రత మీ కా*** మీరే జాగ్రత వహించాలి' అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tLwMIt

No comments:

Post a Comment

'The EV Market Is Hotting Up'

'A lot of players such as Maruti and Hyundai are entering the market in the first and the second quarters of 2025.' from rediff To...