Saturday, 19 December 2020

నమ్రతకు చెప్పేశారు కానీ మహేష్ బాబు మాత్రం వినలేదు.. టాలెంటెడ్ హీరో బయటపెట్టిన 'మేజర్' ఫ్యాక్ట్

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజే వేరు. క్లాస్, మాస్ ఆడియన్స్‌తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ వ్యక్తులు ఆయన సినిమాలకు పెద్దపీట వేస్తుంటారు. స్టార్ కిడ్‌గా సినీ గడప తొక్కినప్పటికీ తన పర్‌ఫార్‌మెన్స్‌తో అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకొని సూపర్ స్టార్ అయ్యారు మహేష్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే తన భార్య సహకారంతో నిర్మాతగా మారిన ఆయన.. ప్రస్తుతం టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా 'మేజర్' సినిమా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడవిశేష్ ఓ ఆసక్తికర నిజాన్ని బయటపెట్టారు. ఇటీవలే విడుదలైన 'మేజర్' మూవీ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మేజర్ సినిమా గురించి మాట్లాడుతూ ఓపెన్ అయ్యాడు హీరో అడవిశేష్. మహేష్ బాబుతో పాటు ఆయన సతీమణి నమ్రత తనపైనే పూర్తి నమ్మకం పెట్టారని, అందుకే బెస్ట్ అవుట్‌పుట్ రావాలని తనపై ప్రెజర్ ఉందని ఆయన అన్నాడు. మేజర్ స్క్రిప్ట్‌ని నమ్రత విన్నారు గానీ మాత్రం వినలేదని చెప్పాడు. మనం గొప్ప సినిమా చేస్తున్నామని నమ్రత చెప్పడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా నటించడం ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పాడు. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మేజర్ సినిమాను సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో అడవిశేష్, శోభితా ధూళిపాళ, బాలీవుడ్ బ్యూటీ సైయీ మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34qcjO6

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....