Monday, 28 December 2020

Kareema Begum: ఏఆర్ రెహమాన్‌కు మాతృ వియోగం

ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు‌ ఏఆర్‌ రెహమాన్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సోమవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని విడిచారు. కరీమాకు నలుగురు సంతానం కాగా.. రెహమాన్ చిన్నవాడు. తొమ్మిదేళ్ల వయసులోనే రెహమాన్ తండ్రి ఆర్‌కే శేఖర్‌ చనిపోగా.. ఇప్పుడు తల్లిని కూడా కోల్పోయారు. Also Read: శేఖర్ మరణం తర్వాత కరీమాబేగం (కస్తూరి శేఖర్)తో కలిసి రెహమాన్ (దిలీప్) ఇస్లాం మతం స్వీకరించి పేర్లు మార్చుకున్నారు. రెహమాన్‌కు తల్లితో అనుబంధం ఎక్కువ. ఈ విషయాన్ని ఆయన అనేక ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. తాను కెరీర్లో ఎదిగే క్రమంలో ప్రతి కీలక ఘట్టంలో తల్లి నిర్ణయాలు, మద్దతు ఉన్నాయని వెల్లడించేవారు. కరీమా బేగం మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్థున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2L3ZB0w

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....