Wednesday, 30 December 2020

భర్త నాగ చైతన్యతో సమంత న్యూ ఇయర్ ట్రిప్.. గోవాలో చిల్ కాబోతున్న రొమాంటిక్ జోడీ

ప్రపంచానికే ఎన్నో అనుభవాలను నేర్పుతూ కష్ట సుఖాలంటే ఎలా ఉంటాయో తెలిపిన 2020కి నేటితో ముగింపు పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలకు వీడ్కోలు చెబుతూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు కానీ ఈ 2020కి వీడ్కోలు చెప్పడం ప్రత్యేకం అంటున్నారు జనం. ఇకపోతే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కోలా ప్లాన్ చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలంతా వారి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి 2021 సంవత్సరానికి వెల్కమ్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవాను వేదికగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు భర్త నాగ చైతన్యతో కలిసి గోవా పయనమైంది సామ్. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం చైసామ్ జోడీ కెమెరా కంటికి చిక్కింది. ఇద్దరూ ముఖానికి మాస్కులు ధరించి గోవా బయల్దేరారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ సమయం దొరికినప్పుడల్లా అలా అలా షికార్లు కొట్టే ఈ అక్కినేని జోడీ గోవాలోని ప్లష్‌ రిసార్ట్‌లో న్యూ ఇయర్‌ వేడుకలను ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటి నుంచి జనవరి మొదటి వారం ముగిసేవరకు ఈ ఇద్దరూ అక్కడే ఎంజాయ్ చేయనున్నారని తెలుస్తోంది. 2017 సంవత్సరంలో చైసామ్ గోవాలో ఒక్కటైన సంగతి తెలిసిందే. అందుకే వారిద్దరికీ గోవా ఎంతో ప్రత్యేకం. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవాలో సందడి చేయాలని ఫిక్స్ అయ్యారట అక్కినేని దంపతులు. సో.. చూస్తుంటే 2021 ఆరంభంలోనే ఈ జోడీ రొమాంటిక్ పిక్స్ మరోసారి సోషల్ మీడియాకు షేక్ చేయడం ఖాయమే అనిపిస్తోంది కదూ!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34X19kq

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...