Monday 28 December 2020

‘ఉదయ్‌కిరణ్ బ్రతికుంటే లెక్క వేరే ఉండేది’: డైరెక్టర్ వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు

‘చిత్రం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఉదయ్‌ కిరణ్ చాలా తక్కువ సమయంలోనే లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. వరుస హిట్లతో ఓ సమయంలో అగ్ర హీరోలకు సైతం షాకిచ్చాడు. అయితే అవకాశాలు తగ్గడంతో డిప్రెషన్‌కు గురైన ఆయన ఆత్మహత్య చేసుకుని యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా సక్సెస్ అయిన .. ఇప్పుడు బ్రతికుంటే ఆయన మార్కెట్ విలువ రూ.400కోట్లు ఉండేదని చెబుతున్నారు దర్శకుడు . Also Read: ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే, శ్రీ రామ్ సినిమాలు చేశారు వీఎన్ ఆదిత్య. ఇందులో ‘మనసంతా నువ్వే’ బ్లాక్‌ బస్టర్ హిట్ సాధించగా, శ్రీరామ్.. యావరేజ్‌గా ఆడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆదిత్య.. ఉదయ్‌ కిరణ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. Also Read: ‘హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుసగా మూడు సూపర్ హిట్లు సొంతం చేసుకున్నాడు ఉదయ్. ఇప్పుడు గానీ అలా జరిగుంటే ఆయన మార్కెట్ రూ.400కోట్లకు చేరేది. ‘నువ్వు నేను’ సినిమా కోటిన్నరతో తీస్తే రూ.14 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే ‘మనసంతా నువ్వే’ సినిమాకు రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.16 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అప్పట్లో ఉదయ్‌ కిరణ్ రేంజ్ అలా ఉండేది. అలాంటి స్టార్ ఇప్పుడు ఉంటే ఇండస్ట్రీలో పరిస్థితి వేరేలా ఉండేది. అయితే ఉదయ్ కిరణ్ అంత చిన్న వయసులో ఈ లోకాన్ని వీడి వెళ్లిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆత్మహత్యకు నాలుగు రోజుల ముందే నాతో ఫోన్లో మాట్లాడాడు’ అని ఆదిత్య చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3b2inkf

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz