Friday, 25 December 2020

పవన్ రీమేక్ మూవీ... సాయిపల్లవి రెమ్యునరేషన్‌ విని షాకైన మేకర్స్!

పవర్‌స్టార్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వకీల్‌ సాబ్‌’ నటిస్తున్న ఆయన ఆ తర్వాత మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్‌లో నటిస్తారు. ఈ సినిమా ప్రారంభం కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. కథ ప్రకారం... పవన్‌ది పోలీసాఫీసర్‌ పాత్ర కాగా.. రానా ఎక్స్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందులో రానా సరసన ఐశ్వర్య రాజేష్‌ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆమెది చిన్న పాత్రే అయినప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇక పవన్ సరసన సాయిపల్లవిని తీసుకోవాలని యూనిట్ అనుకుంటోందట. ఇటీవలే దర్శక నిర్మాతలు సాయిపల్లవిని సంప్రదించగా ఏకంగా రూ.2కోట్లు డిమాండ్ చేసిందట. ఈ సినిమా మొత్తమ్మీద సాయిపల్లవికి నాలుగైదు సీన్లు మాత్రమే ఉంటాయట. అయినప్పటికీ ఆ సన్నివేశాలు కీలకమైనవి కావడంతోనే ఈ బ్యూటీ భారీ మొత్తంలో డిమాండ్ చేసిందట. అయితే అంత రెమ్యునరేషన్ ఇచ్చిన సాయిపల్లవిని తీసుకోవాలా? లేక వేరే హీరోయిన్‌ని సంప్రదించాలా? అన్న సందిగ్ధంలో పడిందట యూనిట్?. మరి పవన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Maa2jZ

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O