Saturday 31 October 2020

తొలిసారి ఆయనను అక్కడే కలిశా..! బ్రేక్ ఇవ్వడానికి కారణమిదే: పూజా హెగ్డే

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇటీవలే అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురములో’ సినిమా చేసి బుట్టబొమ్మగా కీర్తించబడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సరసన చిందేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. 2016 సంవత్సరంలో ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్‌ తెరపై కూడా అడుగుపెట్టారు. ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో బాలీవుడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం తెలుగు తెరపై సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై రియాక్ట్ అవుతూ తన ఫీలింగ్స్ బయటపెట్టారు పూజా. సినీ నటులు అన్నాక తొలి సినిమాను చాలా కీలకంగా భావిస్తుంటారని, తనను బాలీవుడ్ మొదటి సినిమా ‘మొహంజోదారో’ డిజాస్టర్ భాధ పెట్టిందని పూజా హెగ్డే తెలిపారు. ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో తన గుండె పగిలినంత పనైందని ఆమె చెప్పారు. అందుకే కొంతకాలం బాలీవుడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చానని, ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనలతో మూడేళ్ల తర్వాత రెండో సినిమా ‘హౌస్‌ఫుల్‌ 4’తో సక్సెస్ సాధించి తృప్తి చెందానని ఆమె పేర్కొన్నారు. Also Read: టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నా బాలీవుడ్ తెరకు మూడేళ్ల గ్యాప్ ఇచ్చిన పూజా.. తిరిగి 2019 లో ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాలో నటించారు. మళ్ళీ ఇప్పుడు ర‌ణ‌వీర్ సింగ్‌తో క‌లిసి 'స‌ర్క‌స్' అనే కామెడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కాగా రోహిత్ శెట్టి సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు పూజా. కొన్నేళ్ల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో తొలిసారి రోహిత్‌ శెట్టిని కలిశానని.. ఇప్పుడు ఆయన సినిమాలోనే నటించే అవకాశం రావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నానని పూజా పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌తో కలిసి 'రాధేశ్యామ్‌' చిత్రంలో అలాగే అక్కినేని అఖిల్‌తో క‌లిసి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TJDxtw

Mahesh Babu: థాయ్‌లాండ్‌లో మహేష్ బాబు అలా..! కమలాయ ఎఫెక్ట్ అంటున్న నమ్రత

కరోనా మహమ్మారి దాడితో దేశం మొత్తం అతలాకుతలమైంది. అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడింది. దాదాపు నాలుగు నెలల పాటు ఏ ఒక్కరూ గడపదాటి బయటకురాని పరిస్థితి చూశాం. ఆ తర్వాత నెమ్మదిగా లాక్‌డౌన్ సడలింపులు వస్తుండటంతో ప్రజలంతా ఎవరి పనిలో వారు నిమగ్నమవుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ పాత ఫోటో షేర్ చేసి సర్‌ప్రైజ్ చేశారు ఆయన సతీమణి . కరోనాకి ముందు సమ్మర్‌ వెకేషన్‌కి వెళ్లినప్పటి ఫొటో ఇది అని పేర్కొన్నారు. పాత ఫోటోనే అయినా రేర్ పిక్ కావడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అయింది. పైగా ఈ పిక్‌లో టోపీ పెట్టుకుని.. చాలా సంతోషంగా కనిపిస్తున్న మహేష్ డిఫరెంట్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఎప్పుడూ మహేష్‌ని‌ ఇలా కనిపించకపోవడంతో ఈ పిక్ చూసి తెగ మురిసిపోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. థాయ్‌లాండ్‌లోని కమలాయ రిసార్ట్, అందులోని స్పా అంటే మహేష్‌ బాబుకు ఎంతో ఇష్టమని తెలుపుతూ ఈ రేర్ ఫోటో షేర్ చేశారు నమ్రత. ఈ మేరకు ప్రీ కోవిడ్ డైరీస్ అనే హ్యాష్ ట్యాగ్ జతచేశారు. Also Read: ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరూ' మూవీతో సక్సెస్ అందుకున్న ఆయన మరికొద్ది రోజుల్లో 'సర్కారు వారి పాట' సినిమా రెగ్యులర్ షూట్‌లో పాల్గొనబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eceLLY

iPhone 12 Camera Module Can't Be Replaced by Third-Party Technicians: Report

iPhone 12 reparability test by iFixit reveals that the camera module on the latest Apple offering is not swappable. If the iPhone 12 camera module is transferred to another iPhone 12, it becomes...

from NDTV Gadgets - Latest https://ift.tt/35O2auF

Rajashekar Health: వైద్యుల పర్యవేక్షణలో రాజశేఖర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ రిపోర్ట్

కరోనా సోకడంతో సీనియర్ హీరో ఇటీవలే హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన మెల్లగా కోలుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన ఐసియూలోనే ఉండటంతో రాజశేఖర్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు (శనివారం) ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తాజా రిపోర్ట్‌లో వెల్లడించారు. అనారోగ్యం నుంచి ఆయన కోలుకుంటున్నారని, ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా మెరుగు పడుతున్నాయని తెలిపారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు. Also Read: ఇటీవలే తనతో పాటు తన ఫ్యామిలీ మొత్తం (ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత) కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొనడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే జీవిత, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటోంది సినీ లోకం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HK7I1k

స్కిన్ టైప్‌ని బట్టి టోనర్ ఎంచుకోవడమెలా..

మీకు స్కిన్ కేర్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆల్రెడీ సీటీఎం రొటీన్ గురించి తెలిసే ఉంటుంది. సీటీఎం అంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. ఇది చాలా ఈజీగా ఫాలో అవ్వగలిగే మూడు స్టెప్స్ ఉన్న రొటీన్. ఈ రొటీన్ ప్రతి రోజూ ఫాలో అయితేనే దాని బెనిఫిట్స్ మనం పొందగలం. అయినా, చాలా మంది క్లెన్సింగ్ చేస్తారు, మాయిశ్చరైజ్ చేస్తారు, కానీ టోనింగ్ మర్చిపోతారు. క్లెన్స్ చేశాక టోనింగ్ కూడా చేస్తేనే మాయిశ్చరైజర్ బెనిఫిట్స్ పొందగలరు. కానీ, టోనర్ సెలెక్ట్ చేసుకోవడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. మీ కి తగిన టోనర్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. మీ స్కిన్ ఎర్రబడుతూ, డ్రై పాచేస్ వస్తూ, ఇరిటేషన్, పీలింగ్, క్రాకింగ్ ఉంటే, దురద ఉంటే మీది డ్రై స్కిన్ అయ్యి ఉండే ఛాన్స్ ఎక్కువ. మీ స్కిన్ షైనీగా మెరుస్తూ ఉండి, టిష్యూతో తుడిస్తే టిష్యూ మీద ఆయిల్ వస్తే మీది ఆయిలీ స్కిన్. మీ టీ జోన్ మాత్రం ఆయిలీ గా ఉంటే మీది కాంబినేషన్ స్కిన్. స్కిన్ టైప్‌ని బట్టి టోనర్.. మీది డ్రై స్కిన్ అయితే ఆల్కహాల్ బేస్డ్ టోనర్స్‌కి దూరంగా ఉండాలి. కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ, క్రీం బేస్ కానీ ఉన్న హైడ్రేటింగ్ టోనర్ తీసుకోండి. ఆయిలీ స్కిన్ అయితే మీరు అప్లై చేసుకున్నాక మీకు హెవీగా అనిపించకూడదు. అలాగే స్టికీగా కూడా ఉండదు. ఇన్‌గ్రీడియెంట్స్ లో ఆయిల్ లేని రిఫ్రెషింగ్, మరియు జెంటిల్ టోనర్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెన్సిటివ్ స్కిన్ ఇన్‌గ్రీడియెంట్స్‌లో శాలీసిలిక్ ఆసిడ్ ఉన్న టోనర్‌ని చూజ్ చేసుకోవాలి. ఎస్ఎల్ఎస్, పారాబెన్స్ ఉన్న టోనర్స్ నుండి దూరంగా ఉండాలి. మీది యాక్నే ప్రోన్ స్కిన్ అయితే ఆల్కహాల్ లేని టోనర్ ని ఎంచుకోండి. అలాగే ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్ ఉన్న టోనర్స్ మృదువుగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇందు వల్ల ఎలాంటి ఫ్లేకీనెస్ లేకుండా స్కిన్ గ్లోయీగా క్లీన్ గా ఉంటుంది. టోనర్ అప్లై చేసిన మొదటి రెండు, మూడు సెకన్లు కొద్దిగా టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుందంటే టోనర్‌లో పీహెచ్ లెవెల్ సరిగ్గా ఉందని అర్ధం, అంటే, కొద్దిగా ఎసిడిక్‌గా ఉందన్నమాట. ఈ ఎసిడిక్ క్వాలిటీ సెన్సిటివ్ స్కిన్‌కి కూడా జెంటిల్ గానే ఉంటుంది. యాక్నే ప్రోన్ స్కిన్ వారికి శాలీసిలిక్ ఆసిడ్ ఉన్న టోనర్ రికమెండ్ చేసినా సెన్సిటివ్ స్కిన్ వారికి మాత్రం ఈ ఇన్‌గ్రీడియెంట్ కొద్దిగా హార్ష్ గా, ఇరిటేటింగ్ గా ఉంటుంది. మరి ఏం ఉండాలి..
  • విచ్ హ్యాజిల్ - ఈ పూల మొక్కని ఎప్పటి నుండో స్కిన్ కేర్ లో యూజ్ చేస్తున్నారు. ఇందువల్ల స్కిన్ టోన్ ఒకేలా ఉంటుంది, నాచురల్ ఆయిల్స్ బ్యాలెన్స్ అవుతాయి, పోర్స్ అన్‌క్లాగ్ అవుతాయి.
  • గ్రీన్ టీ - గ్రీన్ టీ తాగడానికి మాత్రమే కాదు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వలన స్కిన్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది.
  • అలో వెరా - అలో వెరా స్కిన్ ని చల్లబరుస్తుంది. టోనర్ లో ఇది ఉంటే హైడ్రేటింగ్ గా ఉంటుంది. టెంపరరీ డిస్‌కంఫర్ట్, రెడ్‌నెస్ ని తగ్గిస్తుంది.
  • టీ ట్రీ ఆయిల్ - ఇది కూడా పోర్స్ ని అన్‌క్లాగ్ చేయడానికే వాడతారు. అసలు పోర్స్ కనబడకుండా చేయగలదీ టీ ట్రీ ఆయిల్.
  • రోజ్ వాటర్ ఆయిల్ - ఇది నాచురల్ గా ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ ని టైట్ చేస్తుంది.
బెనిఫిట్స్.. టోనర్ వాడడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవి: 1. పోర్స్ ని చిన్నగా కనబడేలా చేస్తుంది. ఫలితంగా మీ స్కిన్ స్మూత్ గా, మంచి పాలిష్డ్ లుక్ తో ఉంటుంది. స్కిన్ కి మంచి మెరుపుని ఇస్తుంది. 2. టోనర్స్ పొల్యూషన్ నుండీ, ఇతర వాతావరణ పరిస్థితుల నుండీ స్కిన్ ని కాపాడేటట్లుగా ఫార్మ్యులేట్ చేస్తారు. 3. ఫేషియల్ టోనర్ స్కిన్ ని రిజువినేట్ చేస్తుంది. స్కిన్ కి టైట్, ఫర్మ్ లుక్ ని ఇస్తుంది. రోజూ రెండు సార్లు టోనర్ వాడి చూడండి, ఎఫెక్ట్ ఇమ్మీడియెట్ గా మీకే తెలుస్తుంది. 4. మీ డైలీ రొటీన్ ని మొదలు పెట్టడానికీ, కంప్లీట్ చేయడానికీ సీటీఎం మంచి ఆప్షన్. అది ఎమేజింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. 5. స్కిన్ ని చల్లబరుస్తుంది. ఎలాంటి ఎర్రదనమైనా తగ్గిస్తుంది. 6. ఆయిల్, మేకప్ రిమూవ్ చేయడనికి హెల్ప్ చేస్తుంది. స్కిన్ ని నాచురల్ గా క్లీన్ చేస్తుంది. 7. ఫేషియల్ టోనర్ వలన స్కిన్ మంచి హైడ్రేటింగ్ గా ఉంటుంది. పైగా ఇది మాయిశ్చర్ రిటెయిన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో, ఇంక మీకు సరిపోయే ఫేషియల్ టోనర్ ని తెచ్చుకుని మీ స్కిన్ కి మంచి గ్లో ని ఇవ్వండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2HLXHQK

విడుదలకు రెడీ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మెరిసే మెరిసే'.. అంతా సిద్ధం!!

ప్రస్తుతం యూత్‌ని అలరించే సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అది చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుందంటే చాలు యూత్ ఆడియన్స్ అంతా ఆదరించి ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసేస్తున్నారు. తాజాగా అదేబాటలో అందరినీ ఆకట్టుకునే కథాంశంతో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది '' మూవీ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఫినిష్ చేసుకొని విడుదలకు రెడీ అయింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు నెలకొల్పింది. హీరోహీరోయిన్ల స్టైలిష్ లుక్స్ యువతను ఆకట్టుకున్నాయి. కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాత వెంకటేష్ కొత్తూరి ఈ 'మెరిసే మెరిసే' మూవీ నిర్మిస్తున్నారు. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన కథాంశానికి పదునుపెట్టి పవన్ కుమార్.కె దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో హుషారు ఫేమ్ హీరోగా నటిస్తుండగా, గతంలో 'మళ్ళీ మళ్ళీ చూశా' సినిమాతో అలరించిన హీరోయిన్‌గా నటిస్తోంది. Also Read: మెరిసే మెరిసే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేశామని, అతి త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పిన డైరెక్టర్ పవన్ కుమార్.. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల నటన మేజర్ అట్రాక్షన్ అవుతుందని, ఇద్దరూ చాలా బాగా నటించారని చెప్పారు. తమ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని ఆయన తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37WX0z3

బిగ్ బాస్ రేటింగ్.. పాయే నాగ్‌తో సహా అందరి పరువూ పాయే!

దేశంలోనే నెంబర్ వన్ ఛానల్ అని నాగార్జున డబ్బా కొట్టారు కానీ.. 42వ వారానికి సంబంధించిన బార్క్ రేటింగ్ చూస్తే స్టార్ మా ఛానల్ 839523 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. స్టార్ ఉత్సవ్ 1287627 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ రేటింగ్ విషయానికి వస్తే.. స్టార్ మా ఛానల్ సత్తా చూపించింది. 786282 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ రేటింగ్ బిగ్ వల్ల వచ్చింది కాదు.. కార్తీకదీపం, వదినమ్మ, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్స్‌తో వచ్చిందే. తాజా బార్క్ రేటింగ్స్ చూస్తే బిగ్ బాస్ నిర్వాహకులకు దిమ్మ తిరిగిపోద్ది.. ‘బిగ్ బాస్ సీజన్ 4 తోపు.. దమ్ముంటే ఆపు’ బిగ్ బాస్ కంటెస్టెంట్లు తొడలు వాచేలా కొట్టుకుంటున్నా.. హోస్ట్ నాగార్జున.. ఎనిమిది కోట్ల ఓట్లు.. టాప్ రేటింగ్.. నంబర్ వన్ ఛానల్ అని చెప్తున్నా.. ఈ బుధవారం రేటింగ్ చూస్తే అవన్నీ నిజమేనా అనే సందేహాలు రాక మానవు. గత బుధవారం అంటే సెప్టెంబర్ 21న హైదరాబాద్ బార్క్ రేటింగ్ బిగ్ బాస్‌కి వచ్చిన రేటింగ్ కేవలం 3.73. బిగ్ బాస్ హిస్టరీలోనే బహుషా ఇదే తక్కువ రేటింగ్ అయ్యి ఉండొచ్చు. కార్తీకదీపం సీరియల్ అయితే ఏరోజూ కూడా 18.56కి తక్కువ కాకుండా రేటింగ్ వస్తోంది. ఇక బిగ్ బాస్‌కి ప్రారంభ ఎపిసోడ్‌ 18.5 టీవీఆర్ రేటింగ్ సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత కుప్పకూలుతూ వస్తోంది. రెండోవారం వీకెండ్‌లో 11.00 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇక వీక్ డేస్‌లో అయితే మరీ వీక్ అయ్యి 8.35కి పడిపోయింది. అంటే కార్తీకదీపం సీరియల్‌కి వస్తున్న రేటింగ్‌లో సగం కూడా సాధించలేకపోతుంది బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ రేటింగ్ 3.73‌కి పడిపోయింది (అక్టోబర్ 21 రేటింగ్). ఇది వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో నిర్వాహకులకే కాదు.. హోస్ట్ నాగార్జునకు కూడా అవమానమే. కార్తీకదీపం, వదినమ్మ, గృహలక్ష్మి సీరియల్స్ వరకూ అవసరం లేదు.. కనీసం దేవత, చెల్లెలి కాపురం లాంటి సీరియల్స్‌ని కూడా బిగ్ బాస్ బీట్ చేయలేకపోతుంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కంటెస్టెంట్స్ విషయంలో పక్షపాతం లేకుండా ఓటింగ్ ప్రకారం ఎమినినేషన్ జరిపి పోయిన క్రెడిబిలిటినీ దక్కించుకుంటే బిగ్ బాస్ రేటింగ్ పుంజుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ ఒకరిద్దరు కంటెస్టెంట్స్‌కి లాభం చేకూర్చేలా పులిహోర టాస్క్‌లు పెడితే రేటింగ్ మరింత దిగజారడం ఖాయమే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mC0rPO

Atmanirbhar Apps Launched by Mitron to Promote Indian Apps

Mitron, the homegrown short-form video sharing app, has launched Atmanirbhar Apps on Google Play as a platform to discover apps made In India for varied services and needs. Atmanirbhar Apps looks to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kJDHgl

Google Meet Rolling Out Custom Background Feature for Desktop: How to Use

Google Meet has started rolling out a new feature that allows desktop users to change their backgrounds during a video call. The platform has introduced a set of default images that video callers can...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mR4Xu3

ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా... విదేశీయులూ ఫిదా

ఒక భాషలో హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం చూస్తూనే ఉంటాం. కొన్ని సినిమాలను ఒకట్రెండు భాషల్లో తెరకెక్కిస్తే.. మరికొన్నింటిని ఇంకా ఎక్కువ భాషల్లోనూ తీస్తుంటారు. అయితే తెలుగు తెరపై స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన ఓ సినిమా ఏకంగా ఆరు భారతీయ భాషలు, రెండు విదేశీ భాషల్లో రీమేక్ చేశారంటే నమ్మగలమా?. ఆ సినిమానే సిద్ధార్థ, జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ‘’. ఈ సినిమాలో సిద్ధార్ధ్, త్రిష నటన ఎప్పటికీ మర్చిపోలేనిది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం, ఎమ్మెస్ రాజు నిర్మాణం ఈ సినిమా విజయాన్ని మరో మెట్టు ఎక్కించాయి. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాను ఆ తర్వాత తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, హిందీ భాషలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లోనూ రీమేక్ చేయగా అక్కడా విజయం సాధించింది. దీంతో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు చిత్రంగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి కలెక్షన్లు, ప్రశంసలతో పాటు అవార్డులు కూడా భారీగా వచ్చాయి. తెలుగులో ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు ఐదు నంది అవార్డులు, 9 ఫిలింఫేర్ అవార్డులు, రెండు సంతోషం అవార్డులు కూడా వచ్చాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kWI3k0

Samsung Galaxy S21 Ultra Render Show Penta Rear Camera Setup

Samsung Galaxy S21 Ultra leaks have been abundant, and the latest round comprise details on possible production commencement and an updated render that shows rear camera tweaks to the most premium...

from NDTV Gadgets - Latest https://ift.tt/2HTEHAf

Amazon Tells India Regulator Its Partner Future Retail Is Misleading Public

Amazon has complained to India's market regulator that its local partner Future Retail misled shareholders by incorrectly saying it was complying with its contractual obligations to the US e-commerce...

from NDTV Gadgets - Latest https://ift.tt/3e9CjkA

Apple to Replace Faulty AirPods Pro Earbuds For Free

AirPods Pro earbuds will be replaced by Apple for free following sound issues. The tech giant has confirmed that a small percentage of AirPods Pro units may be faulty and could be experiencing audio...

from NDTV Gadgets - Latest https://ift.tt/2HPSp6U

బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా ఆయన చనిపోయారు.. నాకు చెప్పకుండా దాచారు, ఇంటికి వెళ్లేసరికి: దివి

బిగ్ బాస్ హౌస్‌కి రావడం ద్వారా సెలబ్రిటీగా మారింది ‘మహర్షి’ ఫేమ్ దివి. మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన హీరోయిన్‌గా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అందం, అభినయం, ఆకర్షించే రూపం ఉన్న దివి బిగ్ బాస్ హౌస్‌లో గ్లామర్ బ్యూటీగా సత్తా చాటి ఏడోవారం ఎలిమినేట్ అయ్యింది. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దివి తన ఇంట్లో జరిగిన విషాద సంఘటనను ప్రేక్షకులతో పంచుకుంది. టీచింగ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన దివి.. సినిమాల్లోకి రావడానికి వాళ్ల పేరెంట్స్ ఒప్పుకోలేదట. కానీ వాళ్ల తాతయ్య ఆమెను ప్రోత్సహించి సినిమాల్లోకి రావడానికి కారణ మయ్యారట. అయితే తన మనవరాలి సక్సెస్ కోసం ఎదురుచూసిన తాతయ్య.. తాను బిగ్ బాస్ హౌస్ నుంచి తిరిగి వచ్చేసరికి చనిపోయారని చెప్పింది దివి. ఆమె మాట్లాడుతూ.. ‘నేను చదువుకున్నది ఒకటి.. చేస్తున్నది వేరు.. నేను ఎంటెక్ చేశా.. కానీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నాకు ఈ ఫీల్డ్ అంటే ఎంత ఇష్టం అంటే.. నటించడం అనేది కొన్నాళ్లు మాత్రమే చేయగలం. కానీ ఆ తరువాత కూడా ఈ ఫీల్డ్‌ని వదలాలని అనుకోవడం లేదు. డైరెక్షన్, ప్రొడక్షన్ ఇలా ఏదైనా చేసి సినిమా ఫీల్డ్‌లో ఉండాలని ఫిక్స్ అయ్యా. నాకు సినిమా అంటే పిచ్చి. మొదట్లో మా పేరెంట్స్‌కి నేను సినిమా ఫీల్డ్‌కి వెళ్తానంటే ఇష్టపడలేదు. కానీ వాళ్లని కూర్చోబెట్టి మొత్తం చెప్పా.. అర్థం చేసుకున్నారు. మా డాడీకి కూడా యాక్టింగ్ అంటే ఇష్టం. మా తాతయ్య చాలా అందంగా ఉంటారు.. అప్పట్లో జగ్గయ్య గారితో పాటు యాక్ట్ చేయడానికి చెన్నై నుంచి లెటర్ వచ్చింది. కానీ ఆ విషయం ఇంట్లో చెప్తే.. తాతయ్యని వాళ్ల నాన్న పరుగెట్టించి కొట్టారట. నీకు యాక్టింగ్ అవసరమా? అని. కాని ఇప్పుడు మా తాతయ్య నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ సక్సెస్ చూడకుండానే మా తాతయ్య చనిపోయారు. మొన్న బిగ్ బాస్ నుంచి ఇంటికి వెళ్లేసరికి తాతయ్య చనిపోయినట్టు తెలిసింది. నేను బిగ్ బాస్‌లో ఉన్న మొదటి వారంలో ఇది జరిగింది. నేను బాధపడతానని చెప్పలేదు. తాతయ్య నా గెలుపు కోసం ఎప్పుడూ ప్రేయర్ చేస్తుంటారు.. ఇవన్నీ చూస్తే ఆయన చాలా సంతోషించేవారు. కానీ నేను బిగ్ బాస్ నుంచి ఇంటికి వెళ్లేసరికి అమ్మమ్మ కనిపించింది.. అమ్మమ్మా తాతయ్య ఎక్కడ అనేసరికి ఏడ్చేసింది. నాకు అర్థం కాలేదు.. ఫస్ట్ నామినేషన్ అప్పుడు ఆయన చనిపోయారు. బిగ్ బాస్‌లో ఏడు వారాలు ఉన్నాను.. ఎలా గడిచాయో నాకే తెలియదు.. టైం చిటికెలో అయిపోయినట్టుగా ఉంది. అప్పుడప్పుడూ కొంత ఇబ్బందిగా ఉండేది కానీ.. సరదా సరదా గడిచిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది .


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kLyxQG

Friday 30 October 2020

13ఏళ్లకే రజినీకాంత్‌కు తల్లిగా నటించిన శ్రీదేవి.. ఏ సినిమానో తెలుసా?

అతిలోక సుందరి శ్రీదేవి.. తనదైన అందం, నటనతో తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోనూ ఆమె ఎన్నో సినిమాల్లో నటించి హిట్ పెయిరా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఓ సినిమాలో రజినీకి సవతి తల్లిగా నటించింది. అదీ 13ఏళ్ల వయసులోనే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. Also Read: కె.‌బాల‌చం‌దర్‌ తెర‌కె‌క్కిం‌చిన ‌‘మూండ్రు ముడిచ్చు’‌ సినిమాలో 1976లో విడుదలైంది. ఇందులో కమల్‌హాసన్, స్నేహితులు. ఇద్దరూ శ్రీదేవిని ప్రేమించగా ఆమె మాత్రం కమల్‌ను ఇష్టపడుతుంది. ఈ క్రమంలోనే కమల్ చనిపోగా.. దానికి కారణంగా రజినీయే అని ఆమె భావిస్తుంది. దీంతో అతడిపై పగ తీర్చుకునేందుకు రజినీ తండ్రిని పెళ్లి చేసుకుని సవతి తల్లిగా మారుతుంది. ఆ తర్వాత‌ వచ్చిన అనేక సినిమాల్లో రజినీకాంత్, శ్రీదేవి జంటగా నటించి మెప్పించారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37YCUo6

Google Faces November Deadline for Initial Response to US Antitrust Case

Alphabet's Google must tell a district court how it will respond to a federal antitrust lawsuit by mid-November, with the two sides making initial disclosures later in the month, US Judge Amit Mehta...

from NDTV Gadgets - Latest https://ift.tt/35RVHPc

Russian Hackers Said to Have Targeted California, Indiana Democratic Parties

The group of Russian hackers accused of meddling in the 2016 US presidential election earlier this year targeted the email accounts of Democratic state parties in California and Indiana, and...

from NDTV Gadgets - Latest https://ift.tt/380CRrQ

Twitter Unfreezes New York Post Account Following Republican Backlash

Twitter said on Friday it had changed its policy and lifted a freeze it placed on the account of the New York Post after the newspaper published articles about Democratic presidential candidate Joe...

from NDTV Gadgets - Latest https://ift.tt/37XeuLR

బ్రతికుండగానే తాను చనిపోయానని చెప్పుకున్న హీరో.. కారణమిదే

అందాల నటుడు భౌతికంగా లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఆంధ్ర సోగ్గాడు చిరస్థాయిగా నిలిచిపోయారు. తనను అందంగా చూసిన ప్రేక్షకులు ముసలితనంగా చూడలేరన్న భావనతో స్వచ్ఛందంగానే సినిమాలకు స్వస్తి పలికారాయన. కాలేజీలో చదువుతున్నప్పుడే శోభన్‌బాబుకు ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలంటే పిచ్చి. కాలేజీకి డుమ్మా కొట్టి మరీ సినిమాలు చూసేవారంట. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘కీలుగుర్రం’ ఆయన చూసిన మొదటి సినిమా. మల్లీశ్వరి సినిమాను ఏకంగా 22సార్లు చూశారంట. డిగ్రీ పూర్తయ్యాక మద్రాసులో లా కోర్సులో జాయిన్ అయిన ఖాళీ సమయాల్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు. 1959లో ఎన్టీఆర్‌తో ‘దైవ బలం’ అనే సినిమాలో మొదటగా నటించారు. ఆ తర్వాత భక్త శబరి, భీష్మ, అభిమన్యు, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న, మనుషులు మారాలి, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం, డాక్టర్ బాబు, సోగ్గాడు, గోరింటాకు, శ్రావణ సంధ్య, దేవత, కార్తీకదీపం, ముందడుగు, మహాసంగ్రామం స్వయంవరం, సంపూర్ణ ప్రేమాయణం, సంసారం, సర్పయాగం లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సోగ్గాడిగా నిలిచిపోయారు. కోడె త్రాచు, ఇల్లాలు ప్రియురాలు వంటి చిత్రాలతో కోదండరామిరెడ్డి, శోభన్‌బాబు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సినీ పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చేసినప్పటికీ శోభన్‌బాబు మద్రాసులోనే ఉండిపోయారు. ఓసారి కోదండరామిరెడ్డి మద్రాస్ వెళ్లినప్పుడు శోభన్‌బాబును కలిశారట. ఏంటి సినిమాలు చేయడం లేదు.. నీ అభిమానులు ఫీలవుతున్నారు.. అని కోదండరామిరెడ్డి అడిగారట. అందుకు ఆయన స్పందిస్తూ..‘ ఆ అందాల నటుడు శోభన్‌బాబు ఎప్పుడో చనిపోయాడు. జుట్టు ఊడిపోయి, ముడతలు పడిన శరీరంతో నేను తెరపై కనిపించడం ఇష్టం లేదు. అందుకే ఇంట్లో ఉండాలనుకుంటున్నారు. నా అభిమానులు వచ్చినప్పుడు కూడా... ‘నేనింక సినిమాల్లో నటించను, ఎంతో దూరం నుంచి నా కోసం రాకండి’ అని చెప్పేశానంటూ కోదండరామిరెడ్డితో చెప్పారంట శోభన్‌బాబు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oCVKXT

TikTok Ban: US Judge Blocks Commerce Department Order to Bar App

A US judge in Pennsylvania blocked a US Commerce Department order set to take effect on November 12 that would have effectively barred Chinese-owned app TikTok from operating in the United States.

from NDTV Gadgets - Latest https://ift.tt/2THicRq

'This regime wants to make India a dictatorship'

'By manipulating India's electoral laws, the aim of the Modi government is to weaken democracy to such an extent that it ultimately crumbles.'

from rediff Top Interviews https://ift.tt/34L3VcO

మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్... రోజాపై ఆసక్తికర కామెంట్

ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు ఆయనకు మధ్య కొంతకాలం క్రితం టీవీ లైవ్ డిబేట్‌లో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నామన్న సోయి లేకుండా ఇద్దరూ బూతులతో రెచ్చిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరికి మాటలు లేవు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరు హాయిగా నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. Also Read: ఆ ఫోటోను తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ... చాలాకాలం తర్వాత గారినిక కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని, ఆమెకు ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. కొంతకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రోజా వ్యాఖ్యల నేపథ్యంలో వీరిద్దరి మధ్య మాటలయుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31Xyl9P

Laxmii, IPL 2020 Final, and More on Disney+ Hotstar in November

Laxmmi Bomb / Laxmii, The Mandalorian season 2, IPL 2020 final, Lego Star Wars Holiday Special, The Wonderful World of Mickey Mouse, Marvel's 616, Inside Pixar, Grey's Anatomy season 17, His Dark...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JhRyfL

ఒక్క ఎపిసోడ్ కూడా చూడకుండానే చేశా..అంతా మామ వల్లే: సమంత

బిగ్‌బాగ్-4 సీజన్‌లో మెరుపులా దర్శనమిచ్చింది అక్కినేని వారి కోడలు సమంత. దసరా రోజును ఏకంగా మూడు గంటల పాటు హోస్టింగ్‌ చేసి మామను మించిన కోడలు అంటూ బుల్లితెర ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంది. మరికొంతమంది అయితే నాగార్జున కంటే సమంతే బాగా హ్యాండిల్ చేసిందని, ఆమెను వ్యాఖ్యాతగా కొనసాగించాలంటూ డిమాండ్ కూడా చేశారు. లేకపోతే బిగ్‌బాస్-5 సీజన్‌కు ఆమెను పూర్తిస్థాయిలో హోస్ట్‌గా తీసుకోవాలని సూచనలు కూడా చేసేస్తున్నారు. అయితే ఇంత పెద్ద రియాలిటీ షోను అంత బాగా హ్యాండిల్ చేసిందంటే.. ఆమె రోజూ బిస్‌బాస్ షో చూస్తూ హార్డ్‌వర్క్ చేసిందని అందరూ అనుకున్నారు. Also Read: అయితే తాను షో చేసేటప్పటికి బిగ్‌బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని చెప్పింది సమంత. బిస్‌బాస్‌‌కు హోస్టింగ్‌ చేయడంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించింది. ‘ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అనుభవం. ‘బిగ్‌బాస్’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం మామగారి వల్లే హోస్ట్‌గా వచ్చా. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు ముందు నేను ఎన్నో భయాలను అధిగమించాల్సి వచ్చింది. ఇంతకుముందు నేను ఏ కార్యక్రమానికీ హోస్ట్‌గా వ్యవహరించలేదు. తెలుగు పెద్దగా రాదు. ఇంతకు ముందు బిగ్‌బాస్‌ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. నా మీద నమ్మకముంచి నన్ను పోత్సహించినందుకు ధన్యవాదాలు మామ. ఆ ఎపిసోడ్ తర్వాత నాపై ప్రేమ కురిపించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ అని సమంత పేర్కొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35Q6t8D

మారేడుమిల్లి ఫారెస్ట్‌కి వెళ్తున్న ‘పుష్ప’... భారీ షెడ్యూల్‌కు ఏర్పాట్లు

సుకుమార్- అల్లు అర్జున్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘’ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికోసం యూనిట్ అడవిలోకి ప్రవేశించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 6 నుంచి షురూ కాబోతోందని తెలుస్తోంది. ఇందుకోసం మారేడుమిల్లి ఫారెస్ట్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ కావడంతో కచ్చితంగా అడవుల్లోనే ఎక్కువ భాగం చిత్రీకరించాల్సి ఉంది. ఇందులో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ అనే యువకుడిగా మాస్‌ పాత్రలో కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందానా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఇద్దరూ చిత్తూరు యాసలో ట్రైనింగ్‌ తీసుకున్నారు. మారేడుమిల్లి అడవుల్లో నెల రోజుల పాటు కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా షూట్ చేయనున్నట్లు యూనిట్ చెబుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/320WKeu

HeyMelody App Lets You Download Updates for OnePlus and Oppo Earbuds

HeyMelody app early access version has been published by OnePlus on Google Play. The app provides OTA update services for OnePlus Buds and OnePlus Buds Z, Oppo Enco W51 earbuds and Oppo Enco X...

from NDTV Gadgets - Latest https://ift.tt/2GhndwY

Verizon Sub-Brand Yahoo Launches Its First Smartphone for $50

Verizon sub-brand Yahoo has launched its first smartphone with Yahoo Mobile service that offers unlimited talktime, text and 4G LTE data for $40 (roughly Rs. 2,900). The smartphone is ZTE Blade A3Y,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mxaKoj

TikTok Countersues Rival Video App Triller in Patent Defence

TikTok and its parent firm ByteDance have fired back in court against a patent lawsuit by rival video-sharing app Triller, in a move aimed at heading off infringement claims.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ehfZpi

Call of Duty: Black Ops Cold War PC System Requirements Revealed

Call of Duty: Black Ops Cold War PC system requirements have been revealed by Activision and Treyarch, and the first thing that stands out is the game's massive size: 175GB for all game modes, and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ebt9nF

Netflix Raises Monthly Subscription Charges for US Customers

Netflix raised monthly charges in the US for its standard and premium subscription plans, a move that sent the company's shares climbing nearly five percent.

from NDTV Gadgets - Latest https://ift.tt/3kFDD0U

Thursday 29 October 2020

Punarnavi Marriage: పునర్నవి పెళ్లిపై రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ రియాక్షన్.. ఒక్క పోస్ట్‌తో మళ్లీ హాట్ టాపిక్‌

పునర్నవికి పెళ్లి కాబోతుంటే రాహుల్ సిప్లిగంజ్‌కి ఏం సంబంధం.. అన్నయ్యా!! వదినకు పెళ్లంట అంటూ రాహుల్ సిప్లింగజ్ ఫ్యాన్స్ ఒకటే మెసేజ్‌ల బాదుడు బాదుతున్నారు. దీంతో చెర్రెత్తికొచ్చిన ఓరి బాబోయ్.. ఆ ఆపండ్రోయ్.. ఎవరిదో ఎంగేమ్ మెంట్ అయితే నన్నెందుకు ట్యాగ్ చేస్తుర్రూ రా భై.. ఉన్న పోరీలతోనే సరిపోతలేదు నాకు.. ఇంక ఎక్స్ ట్రా ఫిట్టింగ్‌లు నాకెందుకు నాయనా’ అంటూ దండాలు పెట్టేస్తూ ఫేస్ బుక్‌ స్టోరీలో ఫన్నీ పోస్ట్ పెట్టాడు. అయితే రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు ఎన్ని దండాలు పెట్టినా ఏం ప్రయోజనం.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నన్నాళ్లూ పునర్నవితో గట్టిగానే పులిహోర కలిపాడు. ఇద్దరూ రొమాన్స్‌లు ముద్దులు అబ్బో హౌస్‌లో వీళ్ల బంధం ఫెవికాల్ కంటే బలమైనదే. ఇక రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాక.. తన విజయంలో పునర్నవికి భాగస్వామ్యం కల్పించాడు. బయటకు వచ్చిన తరువాత కూడా ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న వార్తలకు బలం చేకూర్చుతూ ఎక్కడ చూసినా ఈ ఇద్దరే కనిపించేవారు. ఏ టీవీ షోలో చూసినా ఈ ఇద్దరే. దీంతో ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అటు రాహుల్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయిన తరువాత ఏర్పాటు చేసిన స్పెషల్ మ్యూజికల్ షోలో పునర్నవి-రాహుల్‌లను అన్నయ్య వదినా అంటూ వాళ్ల ఫాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హంగామా చేశారంటే వీరిద్దరి బంధాన్ని ఎంత బలంగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ తరువాత కాలంలో ఏమైందో ఏమో కానీ.. పున్నూ-రాహుల్‌ల మధ్య గ్యాప్ వచ్చింది. హౌస్‌లో ఎవరూ లేక పునర్నవితో ఉన్నా.. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్లది ఆమె ఫ్రెండ్ సర్కిల్ వేరు.. నా ఫ్రెండ్ సర్కిల్ వేరు అంటూ రాహుల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక పునర్నవి కూడా ఇదే తరహాలో స్పందించి రాహుల్‌ జస్ట్ ఫ్రెండ్ అని రూమర్లను కొట్టిపారేసింది. అయితే వీళ్లిద్దరూ విడిపోయినా.. ఫ్యాన్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నారు. ఈ ఇద్దరూ ఎక్కడ కనిపించినా లవ్, మ్యారేజ్ ప్రశ్నలు ఎదురయ్యేవి. ఇదిలా ఉంటే.. పునర్నవి భూపాలం తనకు పెళ్లి కుదిరినట్టు నిన్న సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. తనకు నిశ్చితార్థం అయినట్టు తెలియజేస్తూ ఉంగరం వేలును చూపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు పునర్నవి. తన కాబోయే భర్తను పున్ను పరిచయం చేశారు. అతని పేరు ఉద్భవ్ రఘునందన్. ఆయన కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. నటుడు, స్క్రీన్ రైటర్. ‘నేను అవును అని చెప్పాల్సి వచ్చింది. ఉద్భవ్ రఘునందన్, నేను మా బిగ్ డే గురించి రేపు చెబుతాం’’ అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది పునర్నవి. అయితే ఇదంతా పునర్నవి అప్ కమింగ్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లో భాగం మాత్రమే అని.. నిజమైన పెళ్లి, నిశ్ఛితార్థం కాదని తెలుస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ కోసం వీళ్లిద్దరూ ఒక వెబ్ సిరీస్‌లో నటించారు. ఇటీవలే వీరిద్దరూ డబ్బింగ్ కూడా పూర్తిచేశారు. హిందీ వెబ్ సిరీస్ ‘పర్మనెంట్ రూంమేట్స్’కు ఇది రీమేక్. ఈ వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగానే పున్ను ఈ ఎంగేజ్‌మెంట్ ప్లాన్ వాడుతున్నట్టు సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kKnKqe

‘సర్కారు వారి పాట’లు మొదలెట్టేసిన తమన్

ప్రస్తుతం టాలీవుడ్‌లో హవా నడుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నావి, బుట్టబొమ్మా, రాములో రాములో.. పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు యూట్యూబ్‌లో అనేక రికార్డలు క్రియేట్ చేశాయి. దీంతో తమన్‌ కోసం అగ్రహీరోలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే పరశురామ్, మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘’ సినిమాకు సంబంధించి ఛాన్స్ దక్కించుకున్నాడు. Also Read: ఈ క్రమంలోనే ‘సర్కారు వాటి పాట’కు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్టు తమన్ తాజాగా వెల్లడించాడు. ఇప్పటికే కొన్ని పూర్తి చేయగా.. మిగిలిన వాటికి సిట్టింగ్‌ జరుగుతున్నట్లు తెలిపాడు. ‘సర్కారు వారి పాట’కు సంబంధించి అద్భుతమైన మ్యూజిక్ కంపోజింగ్స్ జరిగాయి. మహేష్ గారికి మంచి పాటలు అందించేందుకు వీలుగా అద్భుతమైన సన్నివేశాలను సృష్టించిన డార్లింగ్ డైరెక్టర్ పరశురామ్‌కు ధన్యవాదాలు. నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని తమన్ ట్వీట్ చేశాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kIHeLB

Alphabet Posts Strong Results as Google, YouTube Ads Rebound

Google-parent Alphabet said Thursday its profit climbed to $11.2 billion (roughly Rs. 83,300 crores) in the latest quarter, beating expectations, as ad spending rebounded after being hit by the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3myvOuy

Apple One Subscription Bundle Launches Friday

Apple One - the subscription bundle that includes Apple Music, Apple TV+, Apple Arcade, and iCloud storage - will launch Friday, October 30, Apple CEO Tim Cook has announced. Apple One costs Rs....

from NDTV Gadgets - Latest https://ift.tt/3e7LB0t

LG K92 5G With Quad Rear Cameras, Snapdragon 690 SoC Launched

LG K92 5G is priced in the US at $359 and will be available for AT&T carriers on November 6. The phone has a quad rear camera setup with a 64-megapixel main sensor. The LG K92 5G packs a 4,000mAh...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kIfDKu

Poco Said to Launch New Smartphone Globally in First Half of December

Poco may launch its next smartphone in the first half of December, a tipster claims. The Xiaomi sub-brand is expected to launch a mid-range smartphone globally in December, however, details about its...

from NDTV Gadgets - Latest https://ift.tt/3e9CwUJ

PUBG Mobile Will No Longer Be Accessible in India from Friday

PUBG Mobile will terminate its access for users in India starting Friday, October 30. The new move comes nearly two months after the government banned the highly popular battle royale game along with...

from NDTV Gadgets - Latest https://ift.tt/35QnkYS

Amazon Quarterly Profit Triples on Retail Sales, Cloud Computing

Amazon's third-quarter profits tripled from a year ago on strong retail sales during the pandemic and growth in cloud computing, the company announced Thursday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2HPvZCt

Facebook Anticipates Tougher 2021 Even as Pandemic Boosts Ad Revenue

Facebook on Thursday warned of a tougher 2021 despite beating analysts' estimates for quarterly revenue as businesses adjusting to the global coronavirus pandemic continued to rely on the company's...

from NDTV Gadgets - Latest https://ift.tt/34G49ld

ఒకే స్రీన్‌పై 20 మంది అగ్రతారలు.. టాలీవుడ్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన సాంగ్

సాధారణంగా ఒక హీరో సినిమాలో మరో హీరో కాసేపు అలా కనిపిస్తేనే భారీగా హైప్ క్రియేట్ అవుతుంది. తమ హీరో మరో సినిమాలో గెస్ట్‌ రోల్ కనిపించాడంటే ఆయన అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటి కాంబినేషన్లు, పాత్రలు అన్ని సమయాల్లోనూ కుదరదు. కానీ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. తెలుగు తెరకు మల్టీస్టారర్లు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్-ఏఎన్నార్ కాలం నుంచి.. ఇప్పుడు రామ్‌చరణ్-తారక్ కాలం వరకు అప్పుడప్పుడూ మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. Also Read: అసలు విషయానికొస్తే.. వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్ర ప్రసాద్‌ కాంబినేషన్లో టి.సుబ్బిరామిరెడ్డి సమర్పణలో దర్శకుడు మురళీ మోహన్‌ రావు తెరకెక్కించిన చిత్రం ‘’. 1981లో వచ్చిన ‘నజీబ్‌’ అనే హిందీ చిత్రానికి రీమేక్‌ ఇది. బప్పీ లహరి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ఓ ఫంక్షన్ నేపథ్యంలో వచ్చే పాటలో ఏకంగా 20మంది నాటి అగ్రతారలు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. శోభన్‌‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, దర్శకుడు కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ, శారద, విజయ నిర్మల, విజయ శాంతి, రాధ, జయమాలిని, పరుచూరి బ్రదర్స్, మురళీ మోహన్, గొల్లపూడి మారుతి దర్శనమిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మరే సినిమాలోనూ ఇంతమంది అగ్రనటులు కనిపించిన దాఖలాలు లేవు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇదొక రికార్డు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kGiZh7

Tinder Expands Its In-App Face-to-Face Video Chat Feature Globally [Update]

Tinder is expanding its in-app video chat feature globally for all users. After testing the feature in multiple countries, the popular dating app is rolling out its 'Face to Face' feature that...

from NDTV Gadgets - Latest https://ift.tt/31MSCyE

Amazon, Alphabet, Facebook Post Strong Profits; Apple Sees Dip in Earnings

Big Tech powerhouses delivered robust quarterly earnings reports, leveraging the needs of pandemic-hit consumers amid heightened scrutiny of their economic power.

from NDTV Gadgets - Latest https://ift.tt/2TyXEuc

Indian Army Launches WhatsApp-Like Indigenous Messaging App SAI

Indian Army has developed and launched a secure messaging application named Secure Application for the Internet (SAI) that supports an end-to-end secure voice, text, and video calling services for...

from NDTV Gadgets - Latest https://ift.tt/34G0jIP

Khushi: భూమిక నడుమును పవన్ నిజంగా చూడలేదట.. అది సూర్య ట్రిక్

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లో ‘ఖుషీ’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానముంది. పవన్‌, భూమిక జంటగా నటించిన ఈ చితాన్ని ఎస్‌.జె.సూర్య తెరకెక్కించారు. కొత్తదనం నిండిన సరికొత్త కథతో తీసిన ఈ సినిమా అప్పట్లో ప్రేమకథా చిత్రాల్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలకు, పవన్‌ లవ్‌, యాక్షన్‌ హంగామాకు యూత్ ఊగిపోయింది. ముఖ్యంగా పవన్.. హీరోయిన్ నడుము చూసే సీన్ చాలా హైలెట్ అయింది. ఇన్నేళ్లయినా ఈ సీన్ గురించి ఎక్కడో చోట చర్చ జరుగుతూనే ఉంటుంది. Also Read: ఈ రొమాంటిక్‌ సీన్‌ వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. నిజానికి తెరపై అంత చక్కగా పండిన ఆ సన్నివేశం వెనుకు పవన్‌ కళ్యాన్ అద్భుతమైన నటన దాగి ఉందట. బ్లాక్ శారీలో ఉన్న భూమిక నడుమును చూసే సమయంలో పవన్ ముఖంలో పలికిన హావభావాలు చూస్తే నిజంగా భూమికను ఎదురుగా కూర్చోబెట్టి ఆ సన్నివేశం చిత్రీకరించారేమో అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే.. పవన్‌ నిజంగా ఆమె నడుమును చూడలేదట. సూర్య పవన్‌ను ఓ బల్లపై కూర్చోబెట్టి ఎదురుగా భూమిక ఉన్నట్లు, ఆమె నడుమును చాటుగా చూస్తున్నట్లు నటించి చూపమన్నారట. అలా షూట్‌ చేసిన సన్నివేశాన్నే తర్వాత భూమిక నడుముతో కలిపి చూపించారు. అంతేకాని ఆ ఎపిసోడ్‌లో చూపించినట్లు పవన్‌.. భూమిక నడుమును నిజంగా చూడలేదు. కానీ సినిమాలో ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు ఎంతో వాస్తవికంగా కనిపిస్తుంటుంది. పవన్ నటన, ఎస్.జె.సూర్య అద్భుతమైన టేకింగ్‌కు ఈ సీన్ ఉదాహరణగా చెప్పొచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kHPsUv

కీర్తి సురేష్ రిస్క్ చేస్తోందా?.. టెన్షన్‌లో ఫ్యాన్స్

‘మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కీర్తి సురేష్. ఆ క్రేజ్‌తో కెరీర్‌ను చక్కదిద్దుకోకుండా ఆమె తప్పటడుగులు వేస్తోందనిపిస్తోంది. స్టార్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్నా పట్టించుకోకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఎన్నుకున్న కొన్ని కథలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఓటీటీలో విడుదలైన ‘పెంగ్విన్’ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా నిరాశపరిచింది. దీంతో పాటు ఆమె సినిమాలన్నీ కూడా వరుసగా ఓటీటీ వేదికలపైకి వచ్చేస్తున్నాయి. దీంతో కీర్తి సురేష్‌ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. Also Read: ఈ టైమ్‌లోనే ఆమె తీసుకున్న నిర్ణయం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘’ సినిమాను మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీనికి మెహర్ రమేష్ డైరెక్టర్. ఈ సినిమా కథ మొత్తం హీరో చెల్లెలి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఈ పాత్ర కోసం యూనిట్ సాయిపల్లవి, కీర్తిసురేష్‌ పేర్లను పరిశీలించి చివరికి కీర్తిని ఓకే చేశారు. ఈ రోల్‌కు కీర్తి సురేష్‌ కూడా ఓకే చెప్పేయడంతో ఆమె ఫ్యాన్స్ షాకయ్యారు. హీరోయిన్‌గా ఎన్నో అవకాశాలు వస్తుండగా ఇప్పుడు చిరంజీవికి చెల్లెలిగా నటించేందుకు సిద్ధం కావడం వారికి రుచించడం లేదు. ఒక్కసారి చెల్లెలి పాత్రలో నటిస్తే ఇక స్టార్ హీరోలెవరూ ఆమెవైపు కన్నెత్తి చూడరని, దీంతో కెరీర్ చేజేతులా నాశనం చేసుకున్నట్లు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతోనే ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని, దీని తర్వాత ఆమెకు అవకాశాలు మరింత పెరుగుతాయని కొందరు అంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34DkAPc

Does poor hygiene lead to fewer Covid deaths?

'Better hygiene practices could lower a person's immunity and make the person susceptible to auto-immune diseases.'

from rediff Top Interviews https://ift.tt/2TzhLbN

ప్రభాస్‌కు షాకిచ్చిన టీవీ ప్రేక్షకులు.. ‘సాహో’ బుల్లితెరపైనా డిజాస్టరే

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ''. ‘బాహుబలి’ రెండు పార్ట్‌ల తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై భారీ అంచనాతో విడుదలైనా ఆశించినంగా అలరించలేకపోయింది. బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. తెలుగు సహా ఇతర భాషల్లో విజయం సాధించలేదు. చివరికి దసరా సందర్భంగా బుల్లితెరపై ప్రసారం చేయగా అక్కడా భారీ షాకిచ్చింది. వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం టీవీలో అయినా రికార్డులు క్రియేట్‌ చేస్తుందని ప్రభాస్‌ అభిమానులు భావించారు. అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ అక్కడా బోల్తా పడింది. ఆదివారం జీటీవీలో వరల్డ్ ప్రీమియర్ షోగా ప్రసారం చేసిన ఈ సినిమా వచ్చిన టీఆర్పీ రేటింగ్ కేవలం 5.8 మాత్రమే. చిన్నహీరోల పాత సినిమాలు మళ్లీ మళ్లీ ప్రసారం చేసినా 3-5 టీఆర్పీ రేటింగులు వస్తుంటాయి. అలాంటిది పాన్ ఇండియ స్టార్‌ ఎదిగిన సినిమా తొలిసారి టీవీలో ప్రసారం చేస్తే పట్టించుకున్న ప్రేక్షకులే లేరు. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూడోసారి ప్రసారం చేస్తే 11కి పైగా రేటింగ్ వచ్చింది. అలాంటిది సాహో తొలిసారి టెలికాస్ట్ చేస్తే 6కంటే తక్కువ రావడం నిజంగా షాకింగ్ విషయమే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2J9nOBJ

ఇష్టం లేకపోయినా తప్పడం లేదు.. ఈ సినిమా భిన్నమైన అనుభవం: సూర్య

తమిళ అంటే తెలుగు ప్రేక్షకులు ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. ఆయన చేసే సినిమాలు, ఎంచుకునే పాత్రలే దానికి కారణం. హీరోగా నిలదొక్కుకుంటూనే విలక్షణమైన పాత్రలు చేస్తుంటారాయన. తాజాగా ఆయన నటించిన ‘’ సినిమా నవంబర్ 12న ఓటీటీ ద్వారా విడుదల కాబోతోంది. సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఆన్‌లైన్‌లో విలేకర్లతో ముచ్చటించారు. Also Read: ‘‘ఆకాశం నీ హద్దురా’.. లాక్‌డౌన్‌కి ముందే విడుదల కావాల్సిన సినిమా. అయితే కరోనా పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. ఈ ఆరు నెలల విజువల్‌ ఎఫెక్ట్స్‌తో చిత్రాన్ని మరింత సహజంగా తీర్చిదిద్దింది మా టీమ్. థియేటర్‌ ప్రేక్షకుల కోసమే ఈ సినిమా తీసినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావల్సి వస్తోంది. మా డైరెక్టర్ సుధ ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. కానీ నిర్మాతగా, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరి కోసం ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నా. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమా చేరువ కానుండడం సంతోషంగా ఉంది’ ‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఒక సాధారణ మనిషి, అసాధారణమైన కలల్ని కని సాకారం చేసుకున్న విధానం మా సినిమాలో చూపించాం. మనందరం తక్కువ ఖర్చుతో విమానయానం చేస్తున్నామంటే కారణం కెప్టెన్‌ గోపీనాథ్‌. ఒక స్కూల్ మాస్టర్ కొడుకైన ఆయన ఎయిర్ డెక్కన్ సంస్థను ఎలా స్థాపించగలిగారన్నది భావోద్వేగంగా చూపించగలిగాం. సుధ కొంగర స్క్రిప్టు వినిపించాక సంతృప్తి కలిగింది. సెట్స్‌పైకి వెళ్లడానికి కొన్ని నెలల ముందే ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌‌పై బాగా వర్క్ చేశాం.’ Also Read: ‘‘యువ’ సినిమా చేసేటప్పటి నుంచి సుధతో పరిచయం ఉంది. ఆ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆమె.. ఓ సన్నివేశంలో నేను బాగా నటించలేదని మొహం మీదే చెప్పేసింది. దర్శకుడు మణి రత్నంకి ఆ సీన్ నచ్చినా నాతో మళ్లీ చేయించింది. ఈ సినిమాను కూడా వాస్తవికత ఉట్టిపడేలా ఆమె ఈ తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది’. ‘గజిని’, ‘సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌’, ‘సింగం’... ఇలా అనేక సినిమాల్లో చాలా రకమైన గెటప్పుల్లో కనిపించా. ఇందులో నటించడం మాత్రం భిన్నమైన అనుభవాన్నిచ్చింది. ఒక సగటు వ్యక్తిగా, ఎయిర్‌ ఫోర్స్‌ కెప్టెన్‌గా, ఎయిర్‌లైన్స్‌ అధినేతగా ఇలా పలు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నాను. మోహన్‌బాబు గారు ఈ సినిమాకి పెద్ద బలం. ఆయన సన్నివేశాలు, తమిళ యాస విషయంలోనూ ఆసక్తిగా అడిగి తెలుసుకునేవారు. ఆయన పాత్ర గుర్తుండిపోతుంది’ అని చెప్పుకొచ్చారు సూర్య.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TySTAO

Amazon Could Bag Rights to Broadcast Champions League Matches in Italy

Amazon could secure exclusive rights to screen European Champions League matches in Italy for the 2021-2024 seasons on its streaming platform Prime, sources close to matter said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3jD4IRg

దర్శకేంద్రుడి ఆగ్రహం.. రోజంతా ఏడుస్తూనే ఉన్న రంభ.. షూటింగ్ ప్యాకప్

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. హీరోయిన్లనూ అందంగా చూపించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతుంటారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆయన షూటింగ్‌ లొకేషన్లలోనూ అంతే సరదాగా ఉండేవారట. కానీ ఓ సందర్భంలో హీరోయిన్ రంభ‌పై కస్సుమన్నారంట దర్శకేంద్రుడు. జేడీ చక్రవర్తి, జంటగా ఆయన డైరెక్షన్లో ‘బొంబాయి ప్రియుడు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే ఈ చిత్రంలోని ‘గుప్పెడు గుండెను తడితే’ పాట గుర్తుంది కదా. ఇందులో హీరో రంభ నడుముపై బత్తాయిలు వేస్తుంటాడు. పాట షూటింగ్ గ్యాప్‌లో అందరూ కూర్చుని ఉన్న సమయంలో.. ‘డైరెక్టర్‌ గారు నీమీద పుచ్చకాయలు వేయిస్తారు’ అని చెప్పడంతో రంభ గట్టిగా నవ్వేసిందట. దీంతో చిరాకు పడ్డ రాఘవేంద్రరావు ‘మీరు నవ్వడం ఆపేశాక చెప్పండి. నేనొచ్చి షాట్‌ తీస్తా’ అని కోపగించుకుని వెళ్లిపోయారట. Also Read: రాఘవేంద్రరావు అలా అనేసరికి రంభ బోరున ఏడ్చేశారట. ఎవరు ఎంత నచ్చజెప్పినా ఆమె ఏడుపు ఆపకపోవడంతో ఈ రోజు పాటకు ప్యాకప్ చెప్పేసి... మరుసటి రోజు షూటింగ్ కొనసాగించారు. ‘షాట్‌లో నా తప్పు లేకుండా నన్ను అంటే నాకు కోపం వస్తుంది. నేను చాలా సెన్సిటివ్’ అని ఓ సందర్భంగా రంభ చెప్పుకొచ్చింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HO98qX

iPhone 12 Pro Ceramic Shield Prone to Scratches, Durability Test Finds

iPhone 12 Pro has been put to a durability test by YouTube channel JerryRigEverything. The test includes multiple rounds to ascertain the resistance of the latest iPhone from scratches, flames, and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jBIEX1

Sony's PlayStation App Updated With Redesigned Interface, Voice Chat, More

Sony has updated its PlayStation app for Android and iOS in preparation of the PlayStation 5 release on November 12. The app has been redesigned with PS Store integration, voice chat, remote storage...

from NDTV Gadgets - Latest https://ift.tt/2TvKRJ4

OnePlus Nord OxygenOS Update Brings October Security Patch, More

OnePlus Nord has got OxygenOS 10.5.9 update in India and Global variants. The OTA update brings the October security patch, new Game Space features, optimisations and general bug fixes.

from NDTV Gadgets - Latest https://ift.tt/3jAz1I5

AMD's Radeon RX 6000 Series Is Here to Take on Nvidia's RTX 3000 Series

AMD has unveiled three new graphics cards under the Radeon RX 6000 series: AMD Radeon RX 6800, AMD Radeon RX 6800 XT, and its new flagship AMD Radeon RX 6900 XT. The first two - RX 6800 and RX 6800...

from NDTV Gadgets - Latest https://ift.tt/35NdS8V

Apple's Clips App Gets a Big Update, Includes Support for Vertical Videos

Apple Clips is rolling out a new update that will bring support for vertical videos, easier sharing to social media platforms, and a refreshed interface, among other things. By supporting multiple...

from NDTV Gadgets - Latest https://ift.tt/31UkWPJ

US Antitrust Regulator Loses Bid to Revive Qualcomm Case

A US appeals court on Wednesday declined to reconsider an August decision that dismissed the US Federal Trade Commission's antitrust case against Qualcomm, handing a victory to the chip maker.

from NDTV Gadgets - Latest https://ift.tt/3eisIIp

Lost in translation: Amazon Website Launch Trips Over Faulty Swedish

Amazon's long-awaited launch of its Swedish website on Wednesday was marred by glitches and translation errors, including mistaking the Argentinian flag for Sweden's.

from NDTV Gadgets - Latest https://ift.tt/37Qls59

Wednesday 28 October 2020

PlayStation Plus Collection Details Announced: All You Need to Know

PlayStation Plus Collection details have been announced by Sony just ahead of the launch of PlayStation 5. The service will offer PS5 owners access to a curated library of iconic PlayStation 4 titles....

from NDTV Gadgets - Latest https://ift.tt/2HKCU07

Samsung Sees Profit Decline on Weak Server Chip Demand

Samsung said on Thursday that it expects its fourth-quarter profit to fall due to weak server chip demand and rising smartphone competition, after posting its best quarterly operating profit in two...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jxCuao

Counterpoint: Samsung Takes Lead in Indian Smartphone Market in Q3 2020

Indian smartphone market records highest ever single quarter shipments in Q3 2020, as per the latest research by Counterpoint's Market Monitor service, with Samsung regaining the top spot. The...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jLRodr

Amazon Questioned Over Tax Paid in India by Joint Parliamentary Panel

Amazon on Wednesday was questioned by a joint parliamentary panel over its revenue model and tax payments in India. The e-commerce giant had earlier refused to appear before the committee.

from NDTV Gadgets - Latest https://ift.tt/2G8GFff

Oppo K7x Set to Launch on November 4

Oppo K7x, a new smartphone in the K series, is set to launch for November 4, the Chinese company on Thursday revealed through a teaser posted on Weibo. The official teaser image also highlights that...

from NDTV Gadgets - Latest https://ift.tt/3einr3z

'Who the Hell Elected You?' US Tech Hearing Turns Into Political Scuffle

A US Senate hearing to hold tech companies accountable for how they moderate content turned into a political scuffle as lawmakers not only went after the companies but also attacked each other.

from NDTV Gadgets - Latest https://ift.tt/34CvO6E

ఆ సినిమా ఆపేసినందుకు అందరూ తిట్టారు.. అందుకే రాజకీయాల్లోకి వచ్చా: పవన్

‘ఇడియట్‌’, ‘అతడు’, ‘నేనింతే’.. ఈ సినిమాలతో పవన్‌ కళ్యాణ్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ కథలన్నీ దర్శకులు పవన్‌ కోసం సిద్ధం చేసినవే. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టులను పవన్ వదులుకోవాల్సి వచ్చింది. ఇలాగే పవన్‌ మరికొన్ని సినిమాలు కూడా సెట్స్‌పైకి తీసుకొద్దామని భావించి వదిలేశారు. వాటిలో ‘’, ‘కోబలి’ ముఖ్యమైనవి. ‘అజ్ఞాతవాసి’ తర్వాత త్రివిక్రమ్‌ తెరకెక్కిద్దామనుకున్న ‘కోబలి’ భవిష్యత్తులో తెరకెక్కే అవకాశం ఉంది. పవన్‌తో బండ్ల గణేష్‌తో తీసే సినిమా ‘కోబలి’ ప్రాజెక్టే అని ప్రచారం జరుగుతోంది. అయితే ‘సత్యాగ్రహి’ సినిమా మాత్రం భవిష్యత్తులోనూ పట్టాలెక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే ‘సత్యాగ్రహి’ని చాలా ఏళ్ల క్రితమే సెట్స్‌పైకి తీసుకెళ్లి ఆ తర్వాత ఆపేశారట పవన్‌. దీనికి గల కారణాలను ఓ కార్యక్రమంలో బయటపెట్టారు. Also Read: ‘‘చాలా సంవత్సరాల క్రితమే ‘సత్యాగ్రహి’ని మొదలుపెట్టాను. ఆ చిత్ర పోస్టర్‌లో ఓవైపు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణన్, మరోవైపు చెగువేరా చిత్రాలను పెట్టాను. ఇప్పుడు నా నిజ జీవితంలో ఏం చేస్తున్నానో అదే ఆ చిత్ర కథ. సినిమాల్లో పోరాటం చేసినంత మాత్రాన బయట పనులు జరగడం కష్టం. అందుకే సినిమాలతో పోరాటం చేయడం ఇష్టం లేక రాజకీయాల్లోకి వచ్చాను. ఆ సినిమా ఆపేసినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు. కానీ ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నందున దాన్ని వదులుకోక తప్పలేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kK31CY

Here Are Your Free PlayStation Plus Games for November

PlayStation 5 (PS5) launch is just around the corner and Sony's list of free PlayStation Plus games for the month of November has a surprise addition for PS5 users. The list includes Middle-earth:...

from NDTV Gadgets - Latest https://ift.tt/3oAhLq8

Google Steps Up Campaign Against EU Push for Tough New Tech Rules

Google has launched a new campaign to counter the European Union's push for tough new tech rules and is lobbying hard against EU's digital chief and spelling out the costs of new regulations,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mvPYVT

Google Being Probed by Italian Watchdog Over Advertising Market Abuse

Italy's antitrust authority is investigating Alphabet's Google for alleged abuse of its dominant position in the Italian online display advertising market, it said on Wednesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mA8VGW

Flipkart Big Diwali Sale Goes Live: Here Are the Best Offers Today

Flipkart Big Diwali sale 2020 is now live for Plus members. We've handpicked the best deals on mobile phones, laptops, headphones, and other electronics that are available today.

from NDTV Gadgets - Latest https://ift.tt/2TA6gRm

Covid: 'We will be battling it for 2 years at least'

'The most intriguing thing (about COVID-19) is the range of the illness -- from asymptomatic or less symptoms to death and quite severe manifestations.'

from rediff Top Interviews https://ift.tt/2HMGWVZ

‘నా లైఫ్ డేంజర్‌లో ఉంది.. కాపాడండి’.. సీఎంను వేడుకున్న డైరెక్టర్

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని వర్గాల నుంచి వస్తున్న విమర్శలు, హెచ్చరికలతో హీరో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన చిన్న కూతురిని రేప్ చేస్తామంటూ సోషల్‌మీడియాలో కొందరు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై విజయ్ సేతుపతి ఆవేదన వ్యక్తం చేయడంతో పలువురు ఆయనకు మద్దతుగా నిలిచారు. Also Read: తాజాగా ఈ చిత్ర దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత శీను రామసామి వెలుగులోకి వచ్చారు. తన జీవితం ప్రమాదంలో ఉందని, మీరే కాపాడాలని ముఖ్యమంత్రిని వేడుకుంటూ బుధవారం ట్వీట్ చేశారు. విజయ్‌ సేతుపతిని ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోమని సూచించిన వారిలో రామస్వామి కూడా ఉన్నారు. అలా కోరినందుకు ఇప్పుడు ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. తనకు, విజయ్‌సేతుపతికి మధ్య దూరం పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని రామస్వామి ఆరోపించారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mwEZLX

Andhra Pradesh Wants to Ban EA.com and 131 More Sites to Prevent Gambling

Online gaming websites could be banned by the government next, including EA.com, MiniClip, and Zapak. Andhra Pradesh CM YS Jagan Mohan Reddy has asked Union Minister RS Prasad to ban 132 websites...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JkaydT

T-Mobile Launches TVision Live TV Streaming Service

T-Mobile launched TVision live streaming service with live news, entertainment, and sports channel bundles starting at $10 (roughly Rs. 740) per month.

from NDTV Gadgets - Latest https://ift.tt/37O0QdG

LG Wing With Swivel Screen, Triple Rear Cameras Debuts in India

LG Wing has been launched in India as the latest smartphone by the South Korean company. Offering new use cases, the LG Wing comes with a unique dual screen design that includes a swivel screen, which...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jwJpkh

How sweet Golu became killer Golu in Mirzapur

'When people come to watch my work, I want them to take away something -- it could be the story, it could be an emotion they haven't felt in a very long time.'

from rediff Top Interviews https://ift.tt/3e1GRtf

Ubisoft+ Coming to Amazon Luna on November 10, Google Stadia to Follow

Ubisoft has announced that its subscription service, originally called UPlay+, has been rebranded to Ubisoft+ and will be coming to Amazon Luna on November 10 and later on Google Stadia. The service...

from NDTV Gadgets - Latest https://ift.tt/2HDIxNx

Vu Masterpiece TV With 85-Inch 4K HDR QLED Panel Launched in India

Vu has launched its latest flagship television, the 85-inch Masterpiece TV. Priced at Rs. 3,50,000, the Vu Masterpiece TV has a 4K HDR QLED screen and 50W built-in soundbar, with support for Dolby...

from NDTV Gadgets - Latest https://ift.tt/35Vja2f

YouTube Music Gets New Library Sorting Options, Renames Your Mix Playlist

YouTube Music is adding new ways to sort the music library for desktop. Users can now sort their library through three ways – recently added, A to Z, or Z to A. YouTube has also renamed its flagship...

from NDTV Gadgets - Latest https://ift.tt/3oxcD68

Facebook Says Suspected Iranian Hackers Behind US Election Threats

Iranian hackers suspected of emailing threatening messages to US voters last week and spreading false information about compromised election systems ran a disinformation campaign last year targeting...

from NDTV Gadgets - Latest https://ift.tt/34AcBTi

Apple TV+ Signs Jon Stewart for New Series Coming 2021

Jon Stewart is coming back to TV. The former host of The Daily Show has signed a multi-year deal with Apple TV+ to host and executive produce a new as-yet untitled current affairs series.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mviC9S

MagSafe Fast Charging Seems Limited to Apple's 20W Adapter

Apple's MagSafe Charger for the iPhone 12 series seems to restrict 15W fast charging specifically to the company's 20W USB-C adapter. This means that you aren't likely to get the same fast...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ox8IWY

Tuesday 27 October 2020

Facebook Derails Deception Campaign Ahead of US Presidential Election

Facebook on Tuesday said it derailed a fledgling deception campaign aimed at the US that was trying to gain momentum ahead of the presidential election next week.

from NDTV Gadgets - Latest https://ift.tt/3e4YuZ8

Net Neutrality: US FCC Votes to Maintain 2017 Repeal of Rules

US Federal Communications Commission voted 3-2 on Tuesday to maintain its 2017 repeal of Obama-era net neutrality rules, even after a federal court directed a review of some provisions of the repeal.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ea0iA3

Cyperpunk 2077 Delayed by 21 Days to December 10

Cyperpunk 2077 has been delayed once again, this time by 21 days with the new release date being December 10. This time, the developers have cited optimising the game for nine platforms as the reason...

from NDTV Gadgets - Latest https://ift.tt/35DOz97

OnePlus Watch Launch Postponed Indefinitely, Tipster Claims

OnePlus' first wearable was expected to be announced sometime this month but now a noted tipster says that the OnePlus Watch launch is delayed with no new date known for now. The reason for this...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mwSRWq

FIFA 21 PS5, Xbox Series S/X Release Date Announced

FIFA 21 is coming to PlayStation 5 and Xbox Series S/X on December 4. EA Sports announced the release date for the next-gen version of FIFA 21 on Tuesday, and said that it would share more details...

from NDTV Gadgets - Latest https://ift.tt/35GGHn7

Apple Buys Self-Learning AI Video Firm That Can Help Improve Its Apps

Apple acquired Vilynx, a startup specialising in advanced artificial intelligence and computer vision technology, that may help the iPhone maker improve its own AI across a number of apps and...

from NDTV Gadgets - Latest https://ift.tt/31PShv5

Facebook, Google, Twitter CEOs to Defend Key Law in Front of US Senate Panel

Chief executives of Twitter, Facebook, and Alphabet's Google will tell US lawmakers at a hearing on Wednesday that a federal law protecting internet companies is crucial to free expression on the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jzjzfi

Microsoft Earnings Continue to Soar Due to Increased Demand for Cloud

Microsoft said its profit in the recently ended quarter continued to soar as the pandemic boosted a trend toward business being taken care of in the internet cloud.

from NDTV Gadgets - Latest https://ift.tt/3osaZTg

TikTok Partners With Shopify to Move Into E-Commerce Space

TikTok, still under US government scrutiny for its Chinese ownership, is moving closer to becoming a marketplace for buying stuff. Canadian e-commerce platform Shopify said Tuesday it's made a deal...

from NDTV Gadgets - Latest https://ift.tt/2G5kyGx

ఈ గయ్యాళి అత్తకు బలైన కోడళ్లెందరో.. అగ్రహీరోలనే ఆటాడుకున్న సూర్యకాంతం

ఆమె వేధింపులకు కోడళ్లు అదిరి పడాల్సిందే. సూటిపోటి మాటలకు తోడికోడళ్లు బెదరాల్సిందే. ఆమె నోటికి భర్త జడవాల్సిందే. ఆమె ఏం చేసినా ఇరుగుపొరుగు వారు నోరు మూసుకోవాల్సిందే. తెరపై ఆమె కనిపిస్తే అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఎన్నార్ అయినా సరే మిన్నకుండిపోవాల్సిందే. అత్తంటే రాక్షసి అనే ముద్ర పడేలా వెండితెరపై ఆమె ప్రదర్శించిన గయ్యాళితనాన్ని అసహ్యించుకోని తెలుగువారు లేదు. కానీ వ్యక్తిగతంగా ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానం. సినిమాల్లో ఆమెను చూసి బెదిరిపోయిన వాళ్లే ఎదురుగా కనిపిస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాళ్లు. ఆ నటి మరెవరో కాదు సూర్యకాంతం. 1924, అక్టోబర్ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయ పాలెం అనే గ్రామంలో ఆమెను జన్మించారు. నేడు 95వ జయంతి. గయ్యాళి గంగమ్మగా తెలుగు ప్రేక్షకులు కీర్తించే సూర్యకాంతం ఆ గయ్యాళితనాన్ని అందిపుచ్చుకున్నది సాధనా వారి ‘సంసారం’ (1950) అనే చిత్రం ద్వారా. అందులో రేలంగికి తల్లి (శేషమ్మ)గా సూర్యకాంతం నటించింది. ఆ సినిమాలో సూర్యకాంతానికి తోడు మరో గయ్యాళి వెంకమ్మ పాత్రను బెజవాడ కాంతమ్మ పోషించింది. 1951లో శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారు కె.బి.నాగభూషణం దర్శకత్వంలో నిర్మించిన ‘సౌదామిని’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ప్రక్కన హీరోయిన్‌ హేమవతి పాత్ర కోసం సూర్యకాంతానికి కబురెళ్లింది. అయితే అంతకుముందే ఓ కారు ప్రమాదం వల్ల ఆమె ముఖం నిండా గాయాలయ్యాయి. దీంతో హీరోయిన్ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘సంసారం’ చిత్రం చూసిన ఓ బాలీవుడ్ నిర్మాత హిందీ సినిమాలో సూర్యకాంతాన్ని హీరోయిన్‌గా బుక్‌ చేశారు. తనకు ఇవ్వజూపిన పాత్రకోసం గతంలో మరొక నటిని ఎంపికచేసి తొలగించినట్లు సూర్యకాంతానికి తెలిసింది. మానవత్వ విలువలు పాటించే సూర్యకాంతానికి ఆ నిర్మాత చేసిన పని నచ్చలేదు. వెంటనే మరో కారణం చూపి ఆ అవకాశాన్ని ఇష్టపూర్వకంగానే వదలుకుంది. ఒకరిని బాధపెట్టి సంతోషంగా ఉండటం ఆమెకు నచ్చేది కాదు. Also Read: ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ పాత్రలు రాకపోవడంతో సహాయ పాత్రలు... ముఖ్యంగా గయ్యాళి పాత్రలకే పరిమితం కావలసివచ్చింది. అంతవరకూ గయ్యాళి పాత్రలకు పేరెన్నికగన్న శేషుమాంబను పక్కనబెట్టి 1953లో వచ్చిన ‘కోడరికం’ చిత్రంతో గయ్యాళి పాత్రలకు ట్రేడ్‌ మార్క్‌గా సూర్యకాంతం నిలిచారు. తన హావభావాలతో వెటకారం రంగరించిన గయ్యాళితనాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆ తరువాత ‘చిరంజీవులు’, ‘మాయాబజార్‌’, ‘దొంగరాముడు’, ‘తోడికోడళ్ళు’, ‘మాంగల్యబలం’, ‘వెలుగునీడలు’, ‘అత్తా ఒకింటి కోడలే’, ‘ఇల్లరికం’, ‘భార్యాభర్తలు’ వంటి అనేక సినిమాలలో సూర్యకాంతం వైవిధ్యభరితమైన సహజ నటనను ప్రదర్శించారు. భానుమతి నిర్మించిన అన్ని సినిమాల్లోనూ సూర్యకాంతం తప్పకుండా కనిపించేవారు. ఆమె గయ్యాళితనమంతా సినిమాల్లోనే. బయట మాత్రం చాలా సున్నిత మనస్కురాలు. ఓ సినిమాలో చిత్తూరు నాగయ్యను నానామాటలు అని తిట్టే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. షాట్‌ అయిపోయిన తరువాత ఆమె నాగయ్య కాళ్ళమీద పడి క్షమాపణలు వేడుకున్నారు. అప్పట్లో ‘సూర్యకాంతం’ అనే పేరును పిల్లలకు పెట్టేందుకు తల్లిదండ్రులు జడిసే విధంగా ఆమె ఆ పాత్రలపై పూర్తిస్థాయిలో అధికారం చెలాయించారు. చక్రపాణి లాంటి అగ్ర నిర్మాతే సూర్యకాంతాన్ని దృష్టిలో వుంచుకొనే ‘గుండమ్మ కథ’ సినిమా నిర్మించారంటే... పైగా అక్కినేని, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోలు నటించిన ఆ సినిమాకి ‘గుండమ్మ కథ’ అనే టైటిల్ పెట్టి విజయం సాధించారంటే సూర్యకాంతం ఎంతటి మహానటో అర్ధమవుతుంది. మహాన Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dZTJ32

25 మిలియన్ వ్యూస్... రికార్డు క్రియేట్ చేసిన ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్దే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23వ తేదీన ‘బీట్స్ ఆఫ్ ’ అంటూ మోషన్ పోస్టర్ విడుదల చేస్తూ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది యూనిట్. ఈ టీజర్ ‌అందరినీ విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సోషల్‌మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 25 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌ సాధించి అత్యధిక వ్యూస్‌ సాధించిన ఇండియన్ సినిమా మోషన్‌ పోస్టర్‌గా రికార్డ్‌ను క్రియేట్‌ చేసినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. రొమాంటిక్ ప్రేమకథగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3e6DCRo

'BJP unleashed Chirag against Nitish'

'The BJP has the torch and with that same torch, the BJP is trying to light up its house in Bihar.'

from rediff Top Interviews https://ift.tt/31Nxw3j

LG Wing to Launch in India Today: Expected Price, Specifications

LG Wing will be launched in India at a virtual event at 11.30am. The smartphone sports two displays - one of them is a swivel screen that rotates clockwise in 90 degrees. The handset features a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2HK9z5W

సిక్స్ ప్యాక్ అందుకే చేయలేదు: షాకింగ్ కారణం చెప్పిన పవన్ కళ్యాణ్

గతంలో బాలీవుడ్‌కే పరిమితమైన సిక్స్ ప్యాక్ బాడీ ఫ్యాషన్ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ కామన్ అయిపోయింది. యంగ్ హీరోల్లో చాలామంది కండలు పెంచి సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ వెండితెరపై హంగామా చేస్తున్నారు. మెగా హీరోల విషయానికొస్తే అల్లు అర్జున్‌, రామ్‌చరణ్ కొన్ని సినిమాల్లో సిక్స్ ప్యాక్ బాడీతో సందడి చేశారు. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ ఎప్పుడూ తన కెరీర్లో ఎప్పుడూ సిక్స్ ప్యాక్‌ కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పందించిన పవన్ తన మనసులో మాట బయటపెట్టారు. ‘ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలంతా సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ కోసం శ్రమిస్తున్నారు. ఇలా నేనెందుకు ప్రయత్నించలేదని చాలామంది అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే నాకు సిక్స్ ప్యాక్‌పై ఎప్పుడూ ఇంట్రస్ట్ లేదు. నేను ధైర్యం అనే బలం కోసం పనిచేసేవాడి. కండలు ఎవరైనా పెంచొచ్చు. కానీ గుండె ధైర్యాన్ని పెంచుకోవడం చాలా కష్టం. ఓ రాజకీయ నేతగానూ నేను ప్రజల్లోకి వెళ్లడానికి ఆ ధైర్యం చాలా అవసరం’ అని చెప్పుకొచ్చారు పవన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HDg2zx

TCL TS3015 Soundbar With Wireless Subwoofer Launched in India

TCL has launched the TS3015 soundbar in India, a 2.1-channel speaker system with a wireless subwoofer. The soundbar features various wired and wireless connectivity methods, and is available on Amazon...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ovk9OZ

iPhone 12, iPhone 12 Pro Pass Drop Tests With Flying Colours

iPhone 12 and iPhone 12 Pro drop test videos are out and show the robustness of the Ceramic Shield front panel. Apple itself claims that the proprietary glass construction offers a fourfold increase...

from NDTV Gadgets - Latest https://ift.tt/37IEJFF

Judge Sets First Hearing in US Google Antitrust Lawsuit

US District Judge Amit Mehta on Monday set a status hearing on the Justice Department's antitrust lawsuit against Alphabet's Google for Friday, October 30.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ec8fVD

Oscar Isaac in Talks to Play Moon Knight in Disney+ Hotstar Series: Reports

Oscar Isaac is in talks to play Moon Knight in the eponymous Disney+ Marvel series, which will air on Disney+ Hotstar in India. Isaac is best known for Star Wars, X-Men: Apocalypse, Show Me a Hero,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jBDxWF

Moon Richer in Water Than Once Thought, Studies Find

There may be far more water on the Moon than previously thought, according to two studies published Monday raising the tantalising prospect that astronauts on future space missions could find...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jsVtTn

ఎన్టీఆర్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్... కామన్ టైటిల్‌తో ఎన్ని సినిమాలు తీశారంటే..

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అంటే తెలుగు ప్రజలకు ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై రాముడైనా, కృష్ణుడైనా, కలియుగ దైవం వెంకన్న అయినా ఆయనే. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడమే ఆయనకు తెలిసింది. తొలుత చిన్న సినిమాలు చేస్తూ కెరీర్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఎన్టీఆర్‌కు 1951లో విడుదలైన పాతాళ భైరవి మాస్ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. అందులోని తోటరాముడు పాత్రలో ఒదిగిపోయిన తీరు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలా తోటరాముడు పాత్ర తర్వాత ఏకంగా 15 సినిమాలకు ప్రేరణ అవుతుందని ఎవరూ ఊహించలేదు. పాతాళ భైరవి ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్‌కి ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ తన సినిమాలకు రాముడు అనే పేరు వచ్చేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఈ కోవలోనే అగ్గి రాముడు, పిడుగు రాముడు, శభాష్ రాముడు, టాక్సీరాముడు, బండరాముడు, దొంగ రాముడు, టైగర్ రాముడు ఏడు చిత్రాలు వరుసగా తెరకెక్కించారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు ఎన్టీఆర్ కెరీర్లోనే మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. 1977లో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఎన్టీఆర్‌కు రాముడు టైటిల్ సెంటిమెంట్ మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత కూడా.. డ్రైవర్ రాముడు, ఛాలెంజ్ రాముడు, శృంగార రాముడు, కలియుగ రాముడు, సరదా రాముడు, సర్కస్ రాముడు, రాముని మించిన రాముడు.. అంటూ మరో ఏడు సినిమాలు తెరకెక్కించారు. ఇలా ఎన్టీఆర్ కామన్ టైటిల్‌తో ఏకంగా 15 సినిమాలు తెరకెక్కించడం ఓ విశేషం.. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఏ హీరో కూడా కామన్ టైటిల్‌తో ఇన్ని సినిమాలు తెరకెక్కించిన దాఖలాలు లేవు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35A5qJS

రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ ఎంపీ

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళికి తెలంగాణ ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలిని ఎంపీ డిమాండ్ చేసారు. అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టె అవకాశం ఉంది అని ఆయన రాజమౌళికి హెచ్చరించారు. మీ కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని సోయం బాపు రావు పేర్కొన్నారు. నైజాం కు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని ఆయన పేర్కొన్నారు. భీం ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమే అని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా చరిత్ర ను తెలుసుకోవాలి, లేకుంటే మర్యాదగా ఉండదని అని బాపురావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్‌ పై అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా కొమరం భీమ్ జయంతి సందర్భంగా మొన్న ఎన్టీఆర్ లుక్‌ని రాజమౌళి విడుదల చేశారు. Read more: అయితే గతంలో రామ్ చరణ్ లుక్ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించగా, ఎన్‌టీఆర్ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించాడు. ఈ టీజరే ఇప్పుడు వివాదస్పదమయ్యింది. టీజర్‌లో ఎన్టీఆర్‌ ముస్లిం గెటప్‌ ఈ వివాదానికి దారితీసింది. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం పాలనపై తిరుగుబావుట ఎగరవేసిన మన్యం వీరుడి క్యారెక్టర్‌కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడుతారని మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఈ టీజర్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3e0hibP

Amazon, Flipkart Diwali Special Sales: What to Expect

Flipkart Big Diwali sale 2020 and Amazon Great Indian festival sales will offer another chance to grab your favourite electronics at discounted prices. Here's everything you need to know before you...

from NDTV Gadgets - Latest https://ift.tt/35CeTAj

Mi 10T Pro 5G First Impressions

Xiaomi is back with new models in the Mi 10 series, this time with new features and a more aggressive price. We take an early look at the new Mi 10T Pro 5G smartphone, priced at Rs. 39,999, to see if...

from NDTV Gadgets - Latest https://ift.tt/2HGxLpQ

Microsoft Adds Mouse, Trackpad Support for iPad on Word, Excel, Powerpoint

Microsoft has added mouse and trackpad support for the iPadOS version of Microsoft 360, including Word, Excel, and PowerPoint. The update has started rolling out in a phased manner, and should reach...

from NDTV Gadgets - Latest https://ift.tt/2JbFFbl

YouTube Rolling Out Player Redesign, New Gesture Controls on App

YouTube is rolling out a player page redesign and gesture controls to Android as well as iOS platforms. The aim is to make the video watching experience easier and communicating with them time...

from NDTV Gadgets - Latest https://ift.tt/2G65XdY

Kate Winslet Held Her Breath for 7 Minutes to Film for Avatar 2

Avatar 2 star Kate Winslet is the face of the latest behind the scenes look at James Cameron's Avatar sequel that showcases what it takes to film underwater. Winslet revealed that she trained to...

from NDTV Gadgets - Latest https://ift.tt/37L5tW8

Ant Group Looks to Raise Record $34.4 Billion in IPO as Investors Line Up

Ant Group is poised to raise up to $34.4 billion (roughly Rs. 2,54,100 crores) in the world's largest stock market debut as investors rush to buy into the fast-growing Chinese fintech giant despite...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ovqUQL

Monday 26 October 2020

Google Says All Pixel and Nest Devices Now Use Recycled Materials

Google today said that it had met its goal of including recycled material in all its products ahead of schedule. It has also set new targets for reducing landfill waste at its assembly units and...

from NDTV Gadgets - Latest https://ift.tt/37J7Ybj

WeChat's Immediate Ban Rejected by US Appeals Court

A US appeals court on Monday rejected a Justice Department request that it allow the government to immediately ban Apple and Alphabet's Google from offering Tencent's WeChat for download in US app...

from NDTV Gadgets - Latest https://ift.tt/3e2uoVW

Zoom Begins Rolling Out End-to-End Encryption for All Platforms, Except iOS

End-to-end encryption is available on Zoom desktop client version 5.4.0 for Mac and PC, the Zoom Android app, and Zoom Rooms. The Zoom iOS app is still pending Apple App Store approval. When this...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Tsfcbh

Apple Increases App Store Prices in India and Five Other Countries

Apple has raised the App Store prices in India as well as five other countries, namely Brazil, Colombia, Indonesia, Russia, and South Africa. The new development will come into effect for apps and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2J1KkMO

Twitter Flags Trump Tweet on Mail-in Ballots Over 'Disputed' Content

Twitter flagged a tweet by US President Donald Trump about mail-in ballots, adding a disclaimer describing the post's content as "disputed" and potentially misleading.

from NDTV Gadgets - Latest https://ift.tt/31GRT27

ఫ్రెండ్స్ కోసం చిరంజీవి చేసిన సినిమా.. ఎంత పెద్ద హిట్టో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్న మెగాస్టార్ ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో అందరికీ తెలిసిందే. తనతో పాటు తనవాళ్లూ కూడా ఎదగాలన్నది ఆయన నమ్మిన సూత్రం. దీంతో సినీ పరిశ్రమలో కష్టకాలంలో ఉన్న ఎందరినో ఆయన ఆదుకున్నారు. అలాగే స్నేహానికి ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి.. ఎవ్వరినీ ఊరికే డబ్బులు ఖర్చు చెయ్యనివ్వరట చిరంజీవి. ఈ మాట ఆయనతో పనిచేసిన ఎంతో మంది దర్శకనిర్మాతలు చెబుతుంటారు. చిరంజీవి చెన్నై ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న రోజుల్లో నటులు సుధాకర్‌, హరిప్రసాద్‌‌లతో మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత హాస్యనటుడు, విలన్‌గా, హరిప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకోగా.. చిరంజీవి సుప్రీమ్ హీరోగా వారికందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. అయితే సుధాకర్, హరిప్రసాద్‌ ఓ సినిమా తీస్తున్నామని, అందులో హీరోగా నటించాలని కోరారు. తన స్నేహితులను నిర్మాతలుగా నిలబెట్టేందుకు చిరంజీవి వెంటనే ఒకే చెప్పేశారు. దీంతో వారి కాంబినేషన్లో మొదట ‘దేవాంతకుడు’ సినిమా 1984లో విడుదల కాగా అంతగా ఆడలేదు. దీంతో సుధాకర్, హరిప్రసాద్ ఆర్థికంగా నష్టపోయారు. దీంతో తన స్నేహితులను ఆదుకునేందుకు చిరంజీవి మళ్లీ ముందుకొచ్చారు. వారి నిర్మాణంలో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో 1988లో ‘’ తెరకెక్కించగా అది సూపర్‌హిట్ అయింది. ఈ సినిమా విజయంతో సుధాకర్, హరిప్రసాద్ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అలాగే ఈ సినిమా శత దినోత్సవ వేడుకల సందర్భంగా కొంత మొత్తాన్ని ఆ ఏడాది ఆత్మహత్య చేసుకున్న పత్తిరైతుల కుటుంబాలకు సాయంగా అందజేశారు. ఇలా చిరంజీవి తన ఫ్రెండ్స్‌కి సాయం చేయడమే కాకుండా రైతులను కూడా ఆదుకోవడం ఆయన మంచి మనసుకు నిదర్శనం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37PStP3

Instagram Changes Nudity Policy Following #IWantToSeeNyome Campaign

Instagram will introduce a new nudity policy this week following a campaign by Black British plus-sized model Nyome Nicholas-Williams, who said the removal of images showing her covering her breasts...

from NDTV Gadgets - Latest https://ift.tt/3oDkGyz

Future Retail Will Go Into Liquidation if Reliance Deal Fails, Company Says

India's Future Retail will go into liquidation if its deal to sell assets to Reliance Industries fails, the group told a Singapore arbitrator while arguing against Amazon's bid to scupper the deal, a...

from NDTV Gadgets - Latest https://ift.tt/37WYjOH

Facebook Adds Cloud Gaming Feature for Android Users

Facebook put its spin on cloud gaming by letting players instantly hop into an array of mobile games at the social network without downloading apps – but won't be offering the service for Apple iOS...

from NDTV Gadgets - Latest https://ift.tt/31NYUy5

వామ్మో పెళ్లా... నాకు ఇంట్రస్ట్‌ లేదు: మెగా హీరో షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్‌లో ఇటీవల కొందరు హీరోలు పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి ప్రవేశించినా.. ఇంకా కొందరు హీరోలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లుగా చెలామణి అవుతున్నారు. అలాంటి వారిలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ఒకరు. ఇటీవలే 35వ పుట్టినరోజు జరుపుకున్న ఆయన ఎక్కడికెళ్లినా పెళ్లెప్పుడు అన్న ప్రశ్నే ఎదురవుతోంది. ఇటీవల ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పిన మేనమామ చిరంజీవి.. ‘సోలో లైఫ్ ఇంకొన్ని రోజులే.. ఎంజాయ్ చేయ్’ అంటూ సెటైర్ వేశారు. దీంతో తేజ్ తర్వలోనే పెళ్లి పీటలెక్కడం ఖాయమన్న అభిప్రాయానికి ఫ్యాన్స్ వచ్చేశారు. Also Read: ఈ నేపథ్యంలోనే పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేశాడు సాయిధరమ్‌ తేజ్. తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అయితే పెళ్లిపై తనకు ఆసక్తి లేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేసేయాలని నిర్ణయానికి వచ్చేశారు. వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక సంబంధాలు చూడమని చెప్పా. అంతకుమించి పెళ్లిపై నాకెలాంటి ఇంట్రస్ట్ లేదు. ఒకవేళ అమ్మాయి నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా’ అంటూ క్లారిటీ ఇచ్చాడు తేజ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dXIrwf

What Kiara Advani is GUILTY about!

'Guilty, in Lust Stories. Fully faked an orgasm and how.'

from rediff Top Interviews https://ift.tt/2J5U5d4

ఛార్మి తల్లిదండ్రులకు కరోనా.. ఆ మాట తెలియగానే భయమేసిందంటూ ఆవేదన

హీరోయిన్, నిర్మాత ఛార్మి తల్లిదండ్రులకు సోకింది. ఈ విషయాన్ని ఛార్మి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. లాక్‌డౌన్ వేళ కరోనా పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తన తల్లిదండ్రులు కొవిడ్‌-19 బారిన పడ్డారని చెప్పారు. అక్టోబర్ 22న వారికి కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు పేర్కొన్న ఛార్మి.. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డారని ఛార్మి చెప్పారు. ఇటీవల వచ్చిన హైదరాబాద్‌ వరదలు, ఇతర పరిస్థితుల కారణంగా ఈ మహమ్మారి సోకిందని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాట తెలియగానే భయమేసిందని ఆమె అన్నారు. వాళ్లిద్దరూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తన తల్లిదండ్రులను త్వరలోనే ఆరోగ్యంగా చూడాలనుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఛార్మి కౌర్. తన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ ప్రార్థనలు చేయాల్సిందిగా కోరుతున్నా అని ఆమె కోరారు. Also Read: ఈ మేరకు కరోనా పట్ల అందరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్న ఛార్మి.. ఎవరైనా సరే సింటమ్స్ కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమా నిర్మాణాల్లో భాగం పంచుకుంటోంది ఛార్మి. విజయ్ దేవరకొండ హీరోగా ఆమె నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫైటర్' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34tMtJF

కాబోయే భర్తతో తొలిసారి అలా... సర్‌ప్రైజ్ ఇచ్చిన కాజల్

టాలీవుడ్ చందమామ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. స్నేహితుడు, ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోనుంది. అయితే ఇన్నిరోజులైనా కాజల్ తన కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయకపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే దసరా పండగ సందర్భంగా వారందరినీ సర్‌ప్రైజ్ ఇస్తూ కాజల్‌ తన కలల రాకుమారుడితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలో.. గౌతమ్ తనకు కాబోయే భార్యను దగ్గరికి తీసుకోగా... కాజల్ అతడి భుజాలపై ఆనుకుని సంతోషంలో మునిగితేలుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయి... ‘చూడముచ్చటైన జంట’ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. Also Read: కాజల్ కొద్దిరోజుల క్రితం తన పెళ్లి గురించి అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. గౌతమ్‌తో ఏర్పడిన స్నేహం.. ప్రేమగా ఎలా మారిందో చెప్పడంతో పాటు తమ పెళ్లికి రెండు కుటుంబాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ప్రకటించింది. కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు తెలిపింది. కరోనా కారణంగా కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలోనే వివాహం చేసుకుంటున్నట్లు కాజల్ వెల్లడించింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35wFONX

ByteDance Said to Be in Early Talks to List Its Short Video App Douyin

TikTok-owner ByteDance is in preliminary talks with investment banks to list its Chinese short video app Douyin in Hong Kong, according to sources. Investment banks are said to be doing research and...

from NDTV Gadgets - Latest https://ift.tt/31KlaZH

Marvel's Shang-Chi and the Legend of the Ten Rings Wraps Production

Shang-Chi and the Legend of the Ten Rings has finished filming. Over the weekend, star Simu Liu and director Destin Daniel Cretton revealed on their respective social media accounts that production...

from NDTV Gadgets - Latest https://ift.tt/34v1pHa

అదే జరగాలే గానీ నాకెలాంటి అభ్యంతరం లేదు.. అందుకే 'ఆద్య' అని ఫిక్సయ్యాం: రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, నిర్మాత, రచయిత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. చాలా రోజుల తర్వాత తిరిగి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ లేడి ఓరియంటెడ్ ప్యాన్ ఇండియా వెబ్ సిరీస్‌కి శ్రీకారం చుట్టారు. మహిళా సాధికారత నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ని తన కూతురు '' పేరుతో విడుడల చేయబోతోంది రేణు దేశాయ్. మొత్తం 12 ఎపిసోడ్లుగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. డి.ఎస్.కె.స్క్రీన్, సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై డిఎస్ రావు, రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్‌తో యువ ప్రతిభాశాలి ఎంఆర్. కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యు అండ్ ఐ పద్మనాభరెడ్డి సమర్పిస్తున్నారు. ఇందులో నందిని రాయ్ తోపాటు బాలీవుడ్ హీరో 'వైభవ్ తత్వవాడి' ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నాలుగు భాషల్లో రూపొందనున్న ఈ ఆద్య వెబ్ సిరీస్ విజయదశమి రోజు డిఎస్ రావు కార్యాలయంలో అధికారికంగా ప్రారంభమైంది. Also Read: పూజా కార్యక్రమాల అనంతరం స్క్రిప్ట్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త చింతిరెడ్డి అనంత్ రెడ్డి దర్శకుడు కృష్ణకు అందించారు. అనంతరం రేణు దేశాయ్ పై చిత్రీకరించిన ముహూర్త సన్నివేశానికి ప్రముఖ దర్శకులు నీలకంఠ కెమెరా స్విచాన్ చేయగా.. డిఎస్ రావు క్లాప్ కొట్టారు. ఎంఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు శివేంద్ర దాశరధి, పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్, బివివి చౌదరి, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రేణు దేశాయ్ మాట్లాడుతూ.. దర్శకుడు కృష్ణ చెప్పిన కథ తనను విపరీతంగా ఆకట్టుకుందని, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేంత గొప్ప కథ ఇది అన్నారు. మహిళా సమస్యలపై తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌కి ఆద్య అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టుకుందామని నిర్మాత చెప్పడంతో వెంటనే ఓకే అన్నానని చెప్పారు. ఆద్య అంటే మహా సరస్వతి, మహా లక్ష్మి, ఆది శక్తి అని చెప్పిన ఆమె ఈ వెబ్ సిరీస్‌కి అంతటి బలం ఉండాలనే ఆ పేరునే ఫైనల్ చేశామని తెలిపారు. ఇక ప్రొడక్షన్, కథ, డైరెక్షన్ ఈ మూడు అంశాలు కలసి వస్తే తిరిగి కెమెరా ముందుకు రావడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని రేణు చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3or3psa

ఒక్క రూపాయికే విమానం టిక్కెట్... ఆసక్తికరంగా ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్

వెంకటేశ్‌తో 'గురు'లాంటి సూపర్‌హిట్ మూవీ తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో విలక్షణ నటుడు సూర్య నటించిన చిత్రం 'శూరరై పోట్రు'. ఈ చిత్రాన్ని తెలుగులో '' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌, గునీత్‌ మోంగ, ఆలీఫ్‌ సుర్తితో కలిసి సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం యూనిట్‌ విడుదల చేసింది. Also Read: ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవితకథగా వెలువడిన సింప్లి ఫై' ఈ పుసక్తానికి కల్పిత వెర్షన్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో సూర్య ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్లా్‌ట్‌ఫామ్‌లో విడుదల చేసేందుకు సూర్య సహా నిర్మాతలందరూ నిర్ణయించుకున్నారు. తొలుత అక్టోబర్ 30 విడుదల చేయాలనుకున్నప్పటికీ.. తాజాగా నవంబర్‌ 12కి వాయిదా వేశారు. Also Read: దసరా పండగ సందర్భంగా ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘పేద ప్రజలకు విమాన ప్రయాణాన్ని దగ్గర చేయాలన్న సంకల్పంతో ఓ విమాన సంస్థను స్థాపించాలనుకున్న ఓ సామాన్య యువకుడు ఆ క్రమంలోనే ఎదుర్కొన్న సవాళ్లను కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35Bd7PR

Google Removes Three Popular Apps for Children Over Privacy Violations

Google has removed three children's apps from the Play Store after International Digital Accountability Council (IDAC) pointed out data collection violations. The three apps that were axed are –...

from NDTV Gadgets - Latest https://ift.tt/3olPgMV

iPhone 12 Durability Test Shows It's Tougher Than the iPhone 11

The ceramic coating on the screen of the iPhone 12 makes it much tougher than on the iPhone 11, concluded a durability test. The coating also makes the iPhone 12 better at resisting scratches on the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3e3Q18v

OnePlus Nord N100 Price, Release Date Surface Online

OnePlus Nord N100 price and release date have been leaked online. The new OnePlus phone is rumoured to launch - alongside the OnePlus Nord N10 5G - on Monday as the company's most affordable...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ot7lZi

James Gunn Hints He Might Kill Off a Lot of the New Suicide Squad

The Suicide Squad writer-director James Gunn has teased that most of the new lineup may not survive till the end of the new DC film, and confirmed that he had "carte blanche" from Warner Bros. to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3kpD1fM

Covid: Grieving the loss of a dear one? Help is here

'How many people have died in India so far due to Covid?'

from rediff Top Interviews https://ift.tt/2TmmZHP

Sunday 25 October 2020

ఉల్లిపాయ రసం రాస్తే జుట్టు పెరుగుతుందా..

ఉల్లిపాయలకు కన్నీళ్లకు అవినాభావ సంబంధం ఉందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనలో చాలామంది నోటి దుర్వాసన సమస్య వల్లనో లేదా కన్నీళ్లను అవాయిడ్ చేయాలనుకోవడం వల్లనో ఉల్లిపాయను పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. కానీ మీకో విషయం తెలుసా? ఉల్లిపాయ కేవలం ఆహారానికి టేస్ట్ ను యాడ్ చేయడమే కాదు మరింకెన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతుందని? ఆనియన్ కంటే ఇంకా మెరుగైనది ఏదీ అంటే ఆనియన్ జ్యూస్ అనే చెప్పుకోవాలి. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఆనియన్ జ్యూస్ అలాగే దాని ద్వారా లభించే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండేందుకు మనం రకరకాల జ్యూస్ లను మనం మన డైట్ లో భాగంగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. ఐతే, మీరెప్పుడైనా ఆనియన్ జ్యూస్ గురించి విన్నారా? జ్యూస్ ల విషయానికి వస్తే చాలా మంది తాజా కూరగాయలు ఆలాగే పండ్ల రసాల గురించే ఆలోచిస్తారు. ఆనియన్ అనేది మనకు దృష్టిలోకే రాదు. ఐతే, ఆర్గానోసల్ఫర్ కాంపౌండ్ అలిసిన్ అనేది ఇందులో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి, ఆనియన్ జ్యూస్ అనేది మెటాబాలిజాన్ని పెంపొందిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. కార్డియో వాస్క్యులార్ రిస్కులను తగ్గిస్తుంది. యూరినరీ డిజార్డర్స్ ను ట్రీట్ చేస్తుంది. ఇక్కడితో ఆనియన్ జ్యూస్ కి సంబంధించిన లాభాల జాబితా పూర్తవలేదు. దీని నుంచి లభించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ అద్భుతమైన వెజిటబుల్ లో సల్ఫర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు, విటమిన్ ఏ, బీ, సి మరియు ఈ అలాగే శక్తివంతమైన క్వర్సెంటైన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఎన్నో ఇతర ఫ్లెవనాయిడ్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఆనియన్ జ్యూస్ ను ఇంట్లోనే ఎలా తయారుచేయాలి? ఆనియన్ జ్యూస్ ను సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇది రాకెట్ సైన్స్ ఏ మాత్రం కాదు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆనియన్ ను పీల్ చేయండి. 2. రన్నింగ్ వాటర్ లో ఆనియన్ ను శుభ్రంగా కడగండి. ఈ స్టెప్ అనేది వెజిటబుల్ ను శుభ్రం చేయడానికి హెల్ప్ చేస్తుంది. 3. తాజా పేపర్ టవల్ తీసుకుని ఆనియన్ పై ఉన్న తడిని తుడవండి. 4. ఇపుడు ఆనియన్ ను పదునైన కత్తి సహాయంతో తరగాలి. 5. ఇప్పుడు ఆనియన్ పీసెస్ ను జ్యూసర్ లో పెట్టి డివైస్ ను ఆన్ చేయాలి. ఒక్కొక్కటిగా ఆనియన్ పీసెస్ ను జ్యూసర్ లో వేయాలి. జ్యూస్ వస్తుంది. 6. ఇప్పుడు జ్యూసర్ ను శుభ్రంగా కడగాలి. వేడి నీళ్లతో కడగాలి. కొద్ది నిమిషాలు స్క్రబ్ చేయాలి. అపుడే, ఆనియన్స్ యొక్క ఘాటైన వాసన పూర్తిగా తొలగిపోతుంది. 7. ఫ్రెష్ ఆనియన్ జ్యూస్ ను గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అవసరానికి తగినట్టుగా వాడాలి. స్కిన్ కేర్ కోసం ఆనియన్ జ్యూస్ ను ఎలా వాడాలి? నేచురల్ ప్రోడక్ట్స్ ను ఉపయోగించి పర్ఫెక్ట్ స్కిన్ ను పొందవచ్చు. ఆనియన్ జ్యూస్ ఈ విషయంలో ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఆనియన్ జ్యూస్ మరియు శనగపిండితో ఫేస్ మాస్క్:కావలసిన పదార్థాలు:
  • ఒకటిన్నర టేబుల్ స్పూన్ తాజా ఉల్లిరసం
  • 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి
  • అర టీస్పూన్ పాలు
  • చిటికెడు నట్ మెగ్
  • 2-3 డ్రాప్స్ మీ ఫేవరేట్ ఎసెన్షియల్ ఆయిల్
  • కాటన్ బాల్
ప్రాసెస్:1. ఈ ఫేస్ మాస్క్ ను ప్రిపేర్ చేయడానికి పైన చెప్పబడిన పదార్థాలన్నిటినీ ఓ ప్లాస్టిక్ బౌల్ లోకి తీసుకోండి. 2. చిక్కటి పేస్ట్ అయ్యేవరకు బాగా మిక్స్ చేయండి. ఇందులో కొంత పాలను కలపడం ద్వారా ఫేస్ మాస్క్ వంటి కన్సిస్టెన్సీ వస్తుంది. 3. కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను మీకు నచ్చినది యాడ్ చేయండి. ఆనియన్స్ యొక్క స్ట్రాంగ్ ఆరోమాను ఇలా తగ్గించవచ్చు. 4. ముఖాన్ని క్లీన్సింగ్ చేసుకోండి. ఆ తరువాత, ఈ ఫేస్ మాస్క్ ను ఈవెన్ గా ముఖంపై అప్లై చేయండి. 5. ఈ ప్యాక్ ను 15 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచండి. లేదా పూర్తిగా డ్రై అయ్యేవరకు అలాగే ఉంచండి. 6. కాటన్ బాల్ ను పాలలో ముంచి దీంతో సున్నితంగా సర్కులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ స్కిన్ పై మాస్క్ ను తుడిచేయండి. ఈ ఎక్స్ఫోల్లియేటింగ్ ప్యాక్ ను వారానికి ఒకసారి వాడితే మీ చర్మం త్వరలోనే కాంతివంతంగా మారుతుంది. హెయిర్ లాస్ ను కంట్రోల్ చేసే ఆనియన్ జ్యూస్ మరియు తేనె మాస్క్:కావాల్సిన పదార్థాలు:
  • పావు కప్పుడు తాజా ఆనియన్ జ్యూస్
  • 1 టేబుల్ స్పూన్ తేనె
  • షవర్ క్యాప్
  • ప్లాస్టిక్ బౌల్
ప్రాసెస్: 1. పైన చెప్పిన పదార్థాలన్నిటినీ ప్లాస్టిక్ బౌల్ కి తీసుకోవాలి. పేస్ట్ లా కలుపుకోవాలి. 2. ఈ పేస్ట్ ను నేరుగా స్కాల్ప్ కు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఫింగర్ టిప్స్ ను ఉపయోగించి మసాజ్ చేసుకోవాలి. 3. ఈ మిశ్రమాన్ని తలపై అరగంటపాటు ఉంచాలి. రాత్రిపూట అప్లై చేస్తే రాత్రంతా తలపై ఉంచవచ్చు. షవర్ క్యాప్ వేసుకుని ఈ మిశ్రమాన్ని కవర్ చేయాలి. 4. గోరువెచ్చటి నీటితో అలాగే తేలికపాటి షాంపూతో ఈ మిశ్రమాన్ని కడగాలి. 5. ఈ టెక్నీక్ ను వారానికి రెండు సార్లు వాడాలి. హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆరోగ్యం విషయంలో ఆనియన్ జ్యూస్ ను ఎలా వాడాలి? 1. చెవి నొప్పి: ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ జ్యూస్ అలాగే ఒక కాటన్ బాల్ ను తీసుకోండి. కాటన్ బాల్ ను ఆనియన్ జ్యూస్ లో ముంచి చెవిలో ఆనియన్ డ్రాప్స్ ను రిలీజ్ చేయండి. రోజుకు రెండు సార్లు ఈ ప్రాసెస్ ను ఫాలో అయితే చెవి నొప్పి తగ్గుతుంది. 2. దగ్గు: రెండు టేబుల్ స్పూన్ల ఆనియన్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఒక టీ స్పూన్ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోండి. ఈ మిశ్రమం మూడు నాలుగు రోజులపాటు ఉంటుంది. గొంతు నొప్పి అలాగే దగ్గు నుంచి రిలీఫ్ అందించేందుకు ఈ మిశ్రమం హెల్ప్ చేస్తుంది. ఆనియన్ జ్యూస్ ద్వారా ఇలా అనేక లాభాలను పొందవచ్చు. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2IY5RGa

KGF-2: క్రూరత్వానికి అధినేత్రి ఆ హీరోయిన్.. మరో పవర్‌ఫుల్ రోల్ రివీల్ చేసిన డైరెక్టర్

గతంలో ‘కెజిఎఫ్’ సినిమాతో సంచలనాలు సృష్టించిన టీమ్.. దానికి కొనసాగింపుగా ‘’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ నుంచి హీరోయిన్ పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రోజు (అక్టోబర్ 26) రవీనా పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పారు. కెజిఎఫ్ చాప్టర్ 2లో రమికా సేన్‌ అనే పొలిటీషియన్‌ పాత్రలో సీనియర్ నటి రవీనా టాండన్ నటిస్తోందని చెప్పారు. 'క్రూరత్వానికి అధినేత్రి, పవర్‌ హౌస్‌ రమికా సేన్‌'కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆమె పాత్రను పరిచయం చేశారు. ఇందులో ర‌వీనా ఎర్ర‌టి చీర ధ‌రించి అసెంబ్లీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె పోషిస్తున్న ఈ పవర్‌ఫుల్ రోల్, స్పెషల్ పోస్టర్ సినిమాపై ఇప్పటికే ఉన్న ఆతృతను మరింత పెంచేశాయి. Also Read: ప్యాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయన పోషిస్తున్న 'అధీరా' లుక్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా, తాజాగా వదిలిన రవీనా లుక్ దానికి రెక్కలు కట్టింది. తెలుగులో వారాహి చలన చిత్రం వారు గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. గ‌రుడ‌ని హ‌త్య చేసి న‌రాచిలో తన సామ్రాజ్యాన్ని రాఖీ ఎలా బిల్డ్ చేసుకున్నాడు? ఎలా న‌రాచీకి కింగ్‌గా మారాడ‌న్న అంశాల నేప‌థ్యంలో ఈ ‘కెజిఎఫ్-2’ రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా ర‌వి బ‌స్రూర్ సంగీతం సమకూర్చుతున్నారు. ముఖ్యంగా తెలుగు, కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kt95zm

Realme Watch S With Blood Oxygen Monitor to Launch on November 2

Realme Watch S is set to make its global debut on November 2. The smartwatch, which will be launched in Pakistan, has features such as heart-rate and blood oxygen monitors, 16 sport modes and a 15-day...

from NDTV Gadgets - Latest https://ift.tt/35CDHIs

FAU-G Teaser Offers Glimpse Into Game's Brawler Mechanics

FAU-G, an Indian alternative to popular battle royale game PUBG, is yet to be released for gamers in the country. However, without providing any details about the debut of the game, Bollywood actor...

from NDTV Gadgets - Latest https://ift.tt/3mjnwqn

LG Q52 With 6.6-Inch Display, Quad Rear Cameras Launched

LG Q52 has launched as the successor of the LG Q51 that was introduced earlier this year. The LG Q52 has a side-mounted fingerprint sensor, a large 4,000mAh battery, and a quad camera setup with a...

from NDTV Gadgets - Latest https://ift.tt/31H6NFn

Pakistan Prime Minister Imran Khan Asks Facebook to Ban Islamophobic Content

Pakistan's Prime Minister Imran Khan has appealed to Facebook CEO Mark Zuckerberg to ban Islamophobic content on the site, warning of an increase in radicalisation amongst Muslims.

from NDTV Gadgets - Latest https://ift.tt/34tLZD7

Apple Supplier Foxconn Said to Set Up Task Force to Fend Off Luxshare

Apple's top iPhone assembler, Taiwan-based Foxconn, has set up a task force to fend off the growing clout of Chinese electronics manufacturer Luxshare, that it believes poses a serious threat to its...

from NDTV Gadgets - Latest https://ift.tt/2J7duKH

Reliance-Future Deal Said to Be Put on Hold as Amazon Wins Arbitration Order

A Singapore arbitration panel has put on hold Future Group's $3.38 billion (roughly Rs. 24,900 crores) asset sale to Reliance Industries, an interim win for Amazon, which had alleged the deal between...

from NDTV Gadgets - Latest https://ift.tt/37IvntE

'Xi is worried about what India will do'

'He is psychologically preparing the PLA and the Chinese public to avoid a loss of face.'

from rediff Top Interviews https://ift.tt/35vO7tz

పనిమనిషిలా ఉంది హీరోయిన్‌గా వద్దన్నాడు.. చివరికి ఆమెనే పెళ్లాడాడు

ఒకప్పటి హీరోయిన్ నిరోష.. మీకు గుర్తుందా. అదేనండి సీనియర్ నటి రాధిక చెల్లెలు. ఇంకా గుర్తుకురావడం లేదా.. ‘సింధూర పువ్వు’ హీరోయిన్. ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది. బాలకృష్ణతో ‘నారీ నారీ నడుమ మురారి’, చిరంజీవితో ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ లాంటి సినిమాల్లో నటించిన ఈ బ్లాక్ బ్యూటీ తెలుగులో హీరోయిన్‌గా సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయినా తమిళంలో మాత్రం బాగానే రాణించింది. తనతో పాటు అనేక చిత్రాల్లో నటించిన నటుడు రాంకీని పెళ్లి చేసుకున్న నిరోష ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అయితే ‘సింధూర పువ్వు’ సినిమాకు సంబంధించి రాంకీ, నిరోషకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. 1988లో డైరెక్టర్ దేవరాజ్ ఓ అద్భుతమైన ప్రేమకథను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుని రాంకీని హీరోగా సెలక్ట్ చేశారు. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రాధిక చెల్లెలు నిరోషను చూసి హీరోయిన్‌గా తీసుకుందామనుకున్నారట. ఆమె ఫోటోను చూసి షాకైన రాంకీ.. పనిపిల్లగా ఉన్న ఈ అమ్మాయిని హీరోయిన్‌గా ఎలా తీసుకుంటారని డైరెక్టర్‌గా వాదించాడట. అయితే నిరోషపై నమ్మకం పెట్టుకున్న దేవరాజ్.. ఆమె నిజంగా టాప్ హీరోయిన్ అవుతుందని చెప్పి ఆ సినిమాకు ఆమెను ఎంపిక చేశారట. 1988లో ప్రారంభమైన ‘సింధూ పూవే’ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని అదే ఏడాది విడుదలైంది. తెలుగులో డబ్బింగ్ చేసి ‘సింధూర పువ్వు’గా విడుదల చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించింది. అప్పటి స్టార్ హీరో విజయ్‌కాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించడం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించింది. ఇందులోని ‘సింధూర పువ్వా.. నీవే చిందించరావా’ అనే పాట ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయంతో నిరోష లక్కీ హీరోయిన్‌గా ముద్ర పడింది. తన సినిమాలో ఆమె వద్దని చెప్పిన రాంకీయే ఆమెతో వరుస సినిమాలు చేశారు. వీరిద్దరు కలిసి నటించిన ఏడు సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయంటేనే వీరి జంటను ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాంకీ ఈ మధ్యకాలంలో వచ్చిన ‘ఆర్ఎక్స్100’ సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34tMOfu

ఆ అలవాట్లతో కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. రీఎంట్రీకి రెడీ!

‘నేను ప్రేమిస్తున్నాను’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది బెంగాలీ భామ . జేడీ చక్రవర్తి హీరోగా ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో నటనతో పాటు అందాలు ఆరబోసి తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘బావగారు బాగున్నారా’లో నటించి బ్రేక్ తెచ్చుకుంది. ఆ తర్వాత కన్యాదానం, రాయుడు, సుల్తాన్, మావిడాకులు, పిల్ల నచ్చింది, పెద్ద మనుషులు, నీతోనే ఉంటాను, లాహిరి లాహిరి లాహిరిలో.. వంటి సినిమాలు చేసి మంచిపేరు తెచ్చుకుంది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే రచన ఒక్కసారిగా కనుమరుగై పోవడం తెలుగు ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. అందంతో పాటు అభినయం కలగలసిన ఈ బెంగాలీ భామ ఒక్కసారిగా సినిమాలకు దూరం కావడానికి కారణం ఆమె చెడు అలవాట్లేనట. హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో రచన మద్యం, సిగరెట్లకు బానిసైందట. దీంతో అవకాశాలు తగ్గి డిప్రెషన్‌కు గురైందట. ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు నచ్చజెప్పి బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ప్రోబల్ బసు అనే వ్యక్తితో పెళ్లి చేశారు. ఆ తర్వాత వైవాహిక జీవితంతో బిజీ కావడంతో పాటు ఇతర భాషల్లో అవకాశాలు రావడంతో రచన చెడు అలవాట్లకు పూర్తిగా దూరమైంది. బాబు పుట్టిన తర్వాత కూడా ఆమె కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో ఒకప్పటి హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌ మొదలుపెడుతుండటంతో రచన కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందట. మంచి పాత్రలు ఇస్తే తెలుగులో మళ్లీ నటించేందుకు తాను రెడీ అని రచన చెబుతోంది. రచన బెనర్జీ తెలుగు, త‌మిళ్‌, క‌న్నడ‌, మ‌లయాళం, హిందీ, ఒడియా భాష‌ల్లో కలిసి మొత్తం 200కు పైగా సినిమాల్లో న‌టించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31JJwTg

Bigg Boss Telugu 4: లాస్యది కన్నింగ్ స్మైల్, మోనాల్ ప్రేమ పంచుతోంది, అన్నీ నేర్పుతోంది: ఇచ్చిపారేసిన సమంత

అక్కినేని కోడలా మాజాకా.. నాగార్జున అన్నట్టుగానే ఆయనంత సాఫ్ట్ కాదు సమంత.. బిగ్ బాస్ హౌస్‌లో తెర వెనుక బాగోతాల్ని కుండబద్దలుకొట్టినట్టు బట్టబయలు చేస్తోంది. అఫ్ కోర్స్ ఇది కూడా బిగ్ బాస్ ఆడించే ఆటే అయినప్పటికీ జనం నోళ్లలో నానే మాటల్ని అంటుంటే మస్త్ మజా అనిపించింది. నాగార్జున స్థానంలో ఆదివారం నాడు బిగ్ బాస్ హోస్ట్‌గా అలరించిన సమంత ఒక్కో ఇంటి సభ్యుడి గురించి మాట్లాడుతూ అలరించింది. టాక్ బ్యాక్‌లో బిగ్ బాస్ డైరెక్టర్లు చెప్పిందే మాట్లాడకుండా సమయస్పూర్తితో వ్యవహరించినట్టే కనిపించింది. ఇక్కడికి వచ్చే ముందు ఇంటిలో ఉన్న వాళ్ల గురించి తెలుసుకున్నానని.. ఇంటిలో ఉన్న ఒక్కో అమ్మాయి గురించి రెండు నిమిషాలు చెప్తా అని.. అరియానాతో మొదలుపెట్టింది సమంత. అరియానాని చూస్తుంటే తనని తాను చూసుకున్నట్టుగా ఉందని చెప్తూ.. నువ్ ఫైటర్‌వి అని ప్రశంసించింది. ఇక దివి అందంగా ఉంటే సరిపోదని.. ఇప్పుడిప్పుడే ఆట ఆడటం మొదలుపెట్టినట్టు అనిపిస్తుందని చెప్పింది. హారిక.. అభిజిత్ విషయంలో కాస్త ఓవర్ అవుతున్న విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా ప్రస్తావిస్తూ.. బిగ్ బాస్‌నే అన్ ఫెయిర్ అంటున్నావ్.. అభిజిత్ అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువా అని అడగడంతో.. ముందు ఫ్యామిలీనే కానీ.. అభిజిత్ నెక్స్ట్ అంటూ అభిజిత్‌పై ప్రేమను ఒలకబోసింది హారిక. ఇక లాస్య గురించి మాట్లాడుతూ.. ‘నవ్వుతూనే అందర్నీ బుట్టలో పడేస్తుంది’ అని పంచ్ వేసింది. ‘నీది అవార్డ్ విన్నింగ్ స్మైలా?. కానీ నీది కన్నింగ్ స్మైల్ అంటుంటారే అని లాస్య‌కి డైరెక్ట్ పంచ్ వేసిన సమంత.. వాళ్లు అలా కన్నింగ్ స్మైల్ అనుకున్నా.. నాకైతే విన్నింగ్ స్మైల్‌ కనిపిస్తుంది’ అని కూల్ చేసింది. కానీ చాలా సేఫ్‌గా ఆడుతున్నావ్.. గాసిప్ క్వీన్.. బిగ్ బాస్‌కి వచ్చాక సేఫ్ మర్చిపోవాలని చెప్పిన సమంత లాస్య.. ఫేక్ నవ్వుని బయటపెట్టడమే కాకుండా ఆమె సేఫ్ గేమ్‌ని బహిర్గతం చేసింది. ఇక మోనాల్‌తో ఆటాడుకుంది సమంత. నవ్వుతూనే ఇవ్వాల్సింది గట్టిగానే ఇచ్చిపారేసింది. ‘మోనాల్ 7 వారాల్లో తెలుగు చాలా బాగా నేర్చుకుంది.. బిగ్ బాస్ హౌస్‌లో చాలా మందికి చాలా నేర్పుతుంది. ప్రేమ చాలా మందికి పంచుతుంది. ప్రేమించడం నేర్పుతుంది’ అంటూ సెటర్లు వేసింది. ఏంటి నేను మాట్లాడుతుంటే ఎవరూ మాట్లాడటం లేదు.. నేను నిజం చెప్పలేదా? అంటూ సెటైర్లు వేసింది సమంత. ఇంతలో అఖిల్ దొంగ చూపులు చూస్తూ తెగ ఫీల్ అయిపోయాడు. అయితే మోనాల్ మాట్లాడుతూ.. ‘నేను గేమ్ ఆడటానికి వచ్చా.. అదే చేస్తున్నా.. చాలా మందికి అర్థం కావడం లేదు’ అని ఏడ్వడం మొదలుపెట్టింది మోనాల్. ‘నేను నీకు ఒక సలహా చెప్పనా.. నేను నా ఇంట్లో చైతూతో అయినా చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చినప్పుడు నేను స్టైట్‌గా మాట్లాడితే క్లారిటీతో చెప్తారు.. కానీ ఏడ్వడం మొదలుపెడితే.. ఆయనకు ఇంకా కోపం వస్తుంది.. ఎందుకు అంటే ఏడుపు ఒకసారే వర్కౌట్ అవుతుంది’ అని మోనాల్‌కి ఇచ్చిపారేసింది సమంత. అంత చెప్పినా.. మోనాల్ మళ్లీ తన ఏడుపు గొట్టు పెర్ఫామెన్స్ బయటకు తీసి కన్నీటి కుళాయి ఓపెన్ చేయడంతో.. ‘ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్.. దయచేసి ఏడ్వకు’ అని కూర్చోబెట్టేసింది సమంత. మొత్తానికైతే.. అరియానాపై ప్రశంసలు కురిపించడం.. మోనాల్, లాస్యల తప్పుల్ని ఎత్తి చూపే విషయంలో మామ కంటే బెటర్ అనిపించింది సమంత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31FG3oS

అఖిల్-మోనాల్ ‘స్వయంవరం’.. బిగ్ బాస్ వాళ్లు ఈ ఇద్దరికీ పెళ్లి చేసేట్టు ఉన్నారే.. ఆఖరుకి సమంత కూడా!!

బిగ్ బాస్‌లో మసాలా కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు చూస్తారని అనుకుంటున్నారో ఏమో కానీ.. బిగ్ బాస్ నిర్వాహకులు ఆడియన్స్‌ సహనానికి పరీక్ష పెడుతున్నారు. ప్రతి సీజన్‌కి ఓ రెండు మూడు జంటల్ని ఎన్నుకోవడం.. వాళ్ల మధ్య బలవంతంగా ఎఫైర్లు పెట్టడం.. వాళ్లు దగ్గరయ్యేలా పరిస్థితుల్ని కల్పించడం.. చివర్లో వాళ్లకు వాళ్లే కొట్టుకుని తిట్టుకునేట్టు చేయడం.. ఫైనల్‌గా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసరికి ఆ జంటలను క్యారెక్టర్ లేకుండా చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీక్షాపంత్ , దీప్తి సునయన, నందిని, తేజస్విని, తనీష్, సమీర్ రెడ్డి, గీతా మాధురి ఇలా చాలా మంది మధ్య రొమాంటిక్ యాంగిల్‌ని నడిపించి చివర్లో అంత తుస్ అనిపించేవారు. అయితే గత మూడు సీజన్లలలో ఆటతో పాటుగా ఎఫైర్లు, రొమార్స్‌లు, సొల్లు కబుర్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సొల్లు కబుర్లు, ఎఫైర్ల, రొమాన్స్‌లతోనే ఆట నడుస్తోంది. పైగా ఈ సీజన్‌లో బరితెగించిన జంటలు చాలానే ఉండటంతో బిగ్ బాస్ వాళ్లు 20 శాతం అడల్ట్ కంటెంట్ కోరుకుంటే దానికి పదిరెట్లు ఎక్కువ ఇచ్చే గజ్జర్, , అభిజిత్, హారిక లాంటి వాళ్లు దొరకడంతో బిగ్ బాస్ హౌస్ లవర్స్ పార్క్ మాదిరి తయారైంది. ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయేవారు.. మహాతల్లి, బిగ్ బాస్ దత్త పుత్రిక మోనాల్ గజ్జర్ ఎఫైర్లు, ఆమె వస్త్రధారణతో ఇది A సర్టిఫికేట్ షో అనే అభిప్రాయానికి వచ్చేలా చేశారు. మొదట్లో మోనాల్ కోసం అఖిల్, అభిజిత్‌లు కొట్టుకుచచ్చేంత పని చేసేవారు.. ఈ మధ్య అభిజిత్.. హారికకు దగ్గరైన తరువాత అఖిల్-మోనాల్‌లు మరింత దగ్గరౌతున్నారు. బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వాలే కాని బిగ్ బాస్ హౌస్‌లోనే కాపురం పెట్టేసేటంత నీఛాతి నీఛంగా ప్రవర్తిస్తున్నారు. ఖాళీ దొరికితే పాపం అన్నట్టుగా ముద్దులు, హగ్గులతో షోని చెత్త చెత్త చేస్తున్నారు. అఖిల్, అభిజిత్‌లు సరిపోలేదు అన్నట్టు.. ఈ మధ్య అవినాష్‌తో కూడా కనెక్ట్‌ అయ్యి పనికిమాలిన రొమాన్స్‌కి తెరతీస్తోంది మోనాల్. ఇక అవినాష్ అయితే మరీ కక్కుర్తి బ్యాచ్ సంఘం అధ్యక్షుడి పాత్ర పోషిస్తూ మోనాల్‌ని చూసి తెగ సొల్లు కార్చుకుంటున్నాడు. అటు అరియానా కూడా తహతహలాడుతూ అవినాష్‌ను కావాలని రెచ్చగొడుతూ కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. మోనాల్-అఖిల్‌లు కావాలని ఇలా చేస్తున్నారో బిగ్ బాస్ వీళ్లని కేవలం బోల్డ్ కంటెంట్ ఇవ్వమంటున్నారో తెలియదు కానీ.. నాగార్జున మొదటి నుంచి వీళ్లని కావాలని రెచ్చగొడుతూ కనిపిస్తున్నారు. నీ మనసులో A ఉన్నాడు అంటూ మోనాల్‌ని కావాలని రెచ్చగొట్టారు. ఆ తరువాత మనసులో ఎవరు ఉన్నారు అదీ ఇదీ అంటూ అఖిల్-మోనాల్‌ల మధ్య ఏదో నడుస్తుందని జనంలోకి బలంగా వెళ్లేట్టు ప్రమోట్ చేశారు. కావాలని వాళ్లిద్దరికీ టాస్క్‌లు ఇవ్వడం.. ఇద్దర్నీ దగ్గర చేయడం.. పదే పదే వాళ్లనే చూపించడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ‘ప్రేమ మొదలైంది’ సినిమా టాస్క్‌లో కూడా హౌస్‌లో ఎవరూ లేనట్టు అఖిల్-మోనాల్‌లను హీరో హీరోయిన్లుగా పెట్టి వాళ్ల మధ్య రొమాంటిక్ సీన్లు పెట్టారు. అయినా బిగ్ బాస్ పిచ్చి కాకపోతే.. అఖిల్-మోనాల్‌లు రొమాన్స్ చేస్తున్నట్టు నటించాలా?? రోజూ హౌస్‌లో చేసేది అదే కదా.. సుబ్బరంగా అర్థరాత్రి కెమెరాలు వాళ్లపై ఫోకస్ పెడితే వాళ్లకు కావాల్సిన కంటెంట్ దొరకేసేదే. తాజాగా నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్‌కి వెళ్లడంతో అతని ప్లేస్‌లో హోస్ట్‌గా సమంత అడుగుపెట్టింది. వచ్చీరావడంతోనే ‘అఖిల్ నీ డ్రెస్ బాగుంది.. గుజరాతీ స్టైల్‌నా’ అంటూ గుజరాతీ భామ మోనాల్‌పై డైరెక్ట్ పంచ్ వేసింది. ఇక సీతా లవ్స్ రామా.. రామా లవ్స్ సీతా అనే పాటకు మోనాల్-అఖిల్‌తో స్టెప్పులు వేయించారు.. ఇక మా కథ వేరు ఉంటుంది బాబా అంటూ తెగ సిగ్గుపడిపోతుంది మోనాల్.. ఇది కూడా నేషనల్ టెలివిజన్‌లో వచ్చేసింది అనుకోండి అదే వేరే విషయం. ఇక పండుగ పూట సమంత ఇంటి సభ్యులతో ‘స్వయంవరం’ అనే గేమ్‌ని స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న అమ్మాయిలు లాస్య మినహా మిగిలిన నలుగురు అరియానా, హారిక, దివి, మోనాల్‌కు స్వయం వరం ఏర్పాటు చేసి.. వాళ్లని ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలకు టాస్క్ ఇచ్చింది సమంత. అయితే ఈ ‘స్వయంవరం’లో విన్నర్స్‌ ఎవరో తేల్చే బాధ్యత తన మరిది.. అక్కినేని వారసుడు, మోస్ట్ ఎలిమిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్‌కి అప్పగించింది సమంత. ఇక్కడ కూడా దరిద్రం ఏంటంటే.. మోనాల్‌ని ఇంప్రెస్ చేయాలని అఖిల్‌కే చెప్పడం. రోజూ అఖిల్ చేసేది ఇదే కదా.. మళ్లీ పండగ పూట కూడా ఇదే దరిద్రాన్ని చూపిస్తున్నారు. అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. అఖిల్ ‘మొన్న కనిపించావు.. మైమరచిపోయాను’ అనే పాటను అందుకోకుండా ఈసారి పాట మార్చడం. మురారి సినిమాలోని ‘బంగారు కళ్ల బుచ్చెమ్మో’ పాట పాడాడు. ఇక సొహైల్‌పై అదిరిపోయే పంచ్ వేసింది సమంత. బనియన్‌తో కండలు చూస్తూ రచ్చ టైటిల్ సాంగ్ రచ్చ లేపే స్టెప్పులు వేశాడు సొహైల్. ‘ఒకే ఇంప్రెస్ అయ్యారా?? లేదంటే ఆ బనియన్ కూడా ఇప్పించాలా? అంటూ హుషారైన పంచ్ వేసింది అక్కినేని కోడలు పిల్ల.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3opADYP

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd