సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న విషయం విదితమే. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పద్మావతి గల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు, నరేష్, సత్య, అర్చనా సౌందర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం, లాక్డౌన్ చర్యల్లో భాగంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అశోక్ గల్లా పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం ఈ చిత్రంలో ఆయన లుక్ను నిర్మాతలు విడుదల చేశారు. టేబుల్పై కూర్చొని ల్యాంప్ వెలుగులో దీక్షగా పుస్తకం చదువుతున్న అశోక్ లుక్ ఆకట్టుకుంటోంది. నిర్మాత పద్మావతి గల్లా మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని కోరారు. ప్రభుత్వాలు, డాక్టర్లు, పోలీసులు చెబుతున్న సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగస్వాములు కావాలన్నారు. సూపర్స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సంయుక్తంగా సమర్పిస్తోన్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తుండగా, జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా, కిందటేడాది నవంబర్ 10న ఈ చిత్రాన్ని అత్యంత భారీగా రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇండస్ట్రీలోని హేమాహేమీలంతా ఈ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. అలాగే, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UJ5CCt
No comments:
Post a Comment