మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ‘మనకోసం’ను సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీసీసీకి ఇప్పటికే తారలు సహా పలువురు దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. అలాగే దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక సంఘం అధ్యక్షుడు శంకర్ బృందం కార్మికులకు నిత్యావసరాల పంపిణీ కోసం నడుం కట్టారు. ముందే ప్రకటించినట్టే ఈ ఆదివారం నుంచి 24 శాఖల కార్మికుల్లో పేదలకు సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. ఎన్.శంకర్ స్వయంగా ఈ నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి గారి సారథ్యంలో కమిటీ అద్భుత ఆలోచన చేసి సినీ పరిశ్రమలో ప్రతి కార్మికుడికి ఇంటికి నెలకు సరిపడా బియ్యం, పప్పు, ఉప్పు, ఇతర నిత్యావసర సరుకులన్నీ అందిస్తున్నాం. అందులో భాగంగా స్టూడియోస్ విభాగం కార్పెంటర్కి సరుకులు అందించాం. నేటి నుంచి పంపిణీ కార్యక్రమం మొదలైంది. నిరంతరం సాగే ప్రక్రియ ఇది. ప్రతి కార్మికుడు సీసీసీ మాకు ఆహార భద్రతనిస్తుంది అన్న ధైర్యంతో ఉండండి. నెల నెలా మీకు సరుకులు ఇంటికే చేరతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త అయిన మెగాస్టార్ చిరంజీవి గారితో సహా దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా కమిటీ సభ్యులైన తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్ , బెనర్జీ ఇలా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మరీ ముఖ్యంగా నాతోటి దర్శకుడైన మెహర్ రమేష్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది’’ అని అన్నారు. Also Read: కాగా, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘సంకల్పానికి సమన్వయం తోడయితే, తోటి కార్మిక సోదరుల కుటుంబాలకి కష్ట సమయంలో భరోసానివ్వగలం అని, అండగా నిలవగలం అని రుజువు చేసిన తెలుగు సినీ పరిశ్రమకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. అలాగే, సినీ కార్మికుడికి నిత్యావసరాలు అందిస్తోన్న ఫొటోను ట్వీట్లో పొందుపరిచారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UIwYIF
No comments:
Post a Comment