Saturday, 25 April 2020

మహేష్ బాబు తలకు మసాజ్ చేస్తున్న సితార

కరోనా లాక్ డౌన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందర్నీ కూడా లాక్ చేసి పడేసింది. పేద ధనిక తేడా లేకుండా అందర్నీ ఇళ్లకే పరిమితం చేసింది. దీంతో ఎప్పుడూ షూటింగ్స్, సినిమాలంటూ దేశ విదేశాలకు ఇతర ప్రాంతాలకు చక్కర్లు కొట్టే సినీ తారలు సైతం ఇళ్లలోనే ఉంటున్నారు. ఫ్యామిలీస్‌తో హ్యీపీగా ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ వేళ తమ ఇంటిలో జరుగుతున్న విశేషాలన్నింటిని సోషల్ మీడయాలో షేర్ చేస్తున్నారు. తాజగా టాలీవుడ్ సూపర్ స్టార్ ... సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. కరోనా విషయంలో కూడా అప్రమత్తం చేస్తూ ఆయన అనేక మెసేజులు ఇచ్చారు. 'సరిలేరు మీకెవ్వరు' సినిమా తర్వాత హీరో మహేష్‌బాబు మరో సినిమాకు రెడీ అయ్యారు. పరుశరామ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఓ సినిమా తర్వాత మరో సినిమా షూటింగ్‌కు వెళ్లే మధ్యలో మహేష్ కనీసం రెండు నెలల గ్యాప్ తీసుకుంటాడు. వీలుంటే విదేశాలకు వెళ్తాడు. లేదంటూ కుటుంబంతో ఇంట్లోనే గడుపుతారు. అనూహ్యంగా లాక్‌డౌన్‌ రావడం, షూటింగ్‌లు నిలిచిపోవడంతో మహేష్‌ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా మహేష్, సితారకు సంబంధించిన ఓ అద్బుతమైన ఫోటోని నమ్రత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇటీవలేమహేష్‌, గౌతమ్‌ కలిసి టెన్నీస్‌ ఆడుతున్న వీడియో పోస్టు చేసిన నమ్రత... తాజాగా కుమార్తె తండ్రికి హెడ్‌ మసాజ్‌ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోలో మహేష్, సితార సీరియస్‌గా ఏదో చూస్తు ఉన్నారు. తండ్రి తలకు మసాజ్ చేస్తూ సితార కూడా సీరియస్‌గా ఏదో చూస్తూ ఉంది. ఈ ఫోటో చూసిన మహేష్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S6ixwG

No comments:

Post a Comment

Chirag Vohra: The Man Who Became Gandhi Thrice

Chirag Vohra has set a benchmark with his performance as Gandhi in Freedom At Midnight. from rediff Top Interviews https://ift.tt/3Yqyr69 ...