సోషల్ మీడియాలో మెగాస్టార్ ఫుల్ యాక్టివ్గానే ఉంటున్నారు. తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు చిరు. లాక్ డౌన్తో తన తమ్ముళ్లను, చెల్లెలును మిస్ అవుతున్నానని తెలిపారు. తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్తోపాటు సోదరీమణులను కలవడాన్ని తాను ఎంతగానో మిస్ అవుతున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇటీవల సోషల్మీడియాలోకి అడుగుపెట్టిన ఆయన కరోనావైరస్ గురించి ప్రజలకు అనేక విధాలుగా అవగాహన కల్పిస్తూ తరచూ పోస్టులు పెడుతున్నారు. లాక్డౌన్కు ముందు ఓ ఆదివారం తన తల్లి అంజనాదేవి, తమ్ముళ్లు పవన్కల్యాణ్, నాగబాబు, సోదరీమణులు మాధవి, విజయ దుర్గాలతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో తీసుకున్న ఓ ఫొటోను ఆయన ట్విటర్ వేదికగా షేర్ చేశారు. 'లాక్డౌన్కు ముందు ఓ ఆదివారం నాడు ఇలా. ప్రియమైన వారిని కలవడం ఎంతగానో మిస్ అవుతున్నాను. మీలో చాలామందికి ఇలాంటి భావనే ఉందని నాకు తెలుసు. మన సాధారణమైన జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుందని నమ్ముతున్నాను. అమ్మ,నేను- చెల్లెల్లు, తమ్ముళ్లు' అని చిరంజీవి పేర్కొన్నారు. m ఈ ట్వీట్ను బట్టి చిరంజీవి తన తమ్ముళ్లను, చెల్లెల్లను ఎంతగా మిస్ అవుతున్నారో తెలుస్తుంది. అప్పుడప్పుడు తనవారితో చిరు ఇలా గెట్ టు గెదర్ కూడా ఏర్పాటు చేసుకుంటారన్న విషయం కూడా చిరు తన అభిమానులకు ఈ ట్వీట్ ద్వారా తెలియజేశారు. చిరు ట్వీట్కు ఫ్యాన్స్ తెగ లైక్ చేస్తున్నారు. చిరు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు పెడుతున్నారు. ఇటు చెర్రీ ఫ్యాన్స్ కొందరు మా దేవుడు రామ్ చరణ్ ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ytHJpz
No comments:
Post a Comment