పవన్ కళ్యాణ్, విడిపోయిన భార్య భర్తలు. రేణును రెండో పెళ్లి చేసుకున్న పవన్ విడాకులు ఇచ్చి ఆంగ్రేజీ భామ అన్నా లెజ్నేవాతో ఏడడుగులు వేశాడు. ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే... పవన్, రేణు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బద్రి సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బద్రి' ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు అయింది. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకి రేణు దేశాయ్ పరిచయమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి తాజాగా రేణు దేశాయ్ ప్రస్తావిస్తూ, 'బంగాళా ఖాతంలో .. 'అంటూ సాగే ఒక పాట షూటింగ్ సమయంలో తీసిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. బద్రి సినిమా షూటింగ్ సమయంలో తాను ఇబ్బంది పడ్డానని తెలిపారు. "విదేశాల్లో సిటీకి దూరంగా వుండే ఒక రిమోట్ ఏరియాలో బద్రి సినిమా షూటింగు జరిగింది. షాట్ గ్యాప్ లో అక్కడ కూర్చోవడానికి కూడా ఏమీ ఉండేవి కాదు. అక్కడ ఒక బండ వుంటే పవన్ దానిపై కూర్చున్నారు. నేను షార్ట్ స్కర్ట్ వేసుకున్న కారణంగా ఆ బండపై కూర్చోలేకపోయాను. 'ఒక అమ్మాయి పక్కన నిలబడి ఉండగా కూర్చోవడం బ్యాడ్ మేనర్స్' అంటూ కల్యాణ్ గారితో జోక్ కూడా చేశాను. అది గాలి బాగా వచ్చే ప్రదేశం కావడంతో నిలబడటం కూడా చాలా కష్టంగా వుండేది. వాటిని అధిగమిస్తూ షూటింగును పూర్తి చేశాము" అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు వపన్తో కలిసి ఉన్న మరో ఫోటోను కూడా రేణు దేశాయ్ షేర్ చేశారు. ‘పవన్ కళ్యాన్ చికితా పాట కోసం షూట్ చేశారు. ఆ తర్వాత నేను వరమంటే అనే విచారకరమైన పాట కోసం షూటింగ్ చేస్తున్నాను.ఆ రోజు మేము షూట్ ని ప్యాక్ చేసిన తర్వాత చాలా అలసిపోయాము. ఎందుకంటే ఈ ప్రదేశానికి వెళ్ళడానికి చాలా నడక అవసరం మరియు ఇది అక్కడ చాలా ఎండగా ఉంది. ఆకలితో ఇద్దరూ అలసిపోయి మా లోకాన్ని కూడా మేం మరిచిపోయాం’ అంటూ మరో ఇన్ స్టా పోస్టు చేశారు రేణు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XR5zq6
No comments:
Post a Comment