Sunday 21 March 2021

నీ అసలు రంగు ఎవరికీ తెలియదు.. రంగ్ దే ప్రీ రిలీజ్‌లో కీర్తి సురేష్ బహిరంగ వ్యాఖ్యలు

నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘’ చిత్రం మార్చి 26 ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సితార ఎంటర్టైన్మెంట్స్ ఫేమ్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్.. ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మహానటి సినిమా తరువాత దాదాపు మూడేళ్లు అవుతుంది ఇలాంటి స్టేజ్ మీద మాట్లాడి. అందుకే కాస్త వణుకుగా ఉంది.. ఈ ఈవెంట్‌కి త్రివిక్రమ్ సార్ రావడం చాలా ఆనందంగా ఉంది. నా మీద నమ్మకంతో నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. దేవి శ్రీ ప్రసాద్‌తో ఇది నా మూడో సినిమా. హ్యాట్రిక్ హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అలాగే దర్శకుడు వెంకీ.. ‘ఏంటి వెంకీ.. నిన్ను ఇక్కడ అందరూ చాలా ఇన్నోసెంట్ అని చెప్పుకుంటున్నారు.. నీ అసలు రంగు ఎవరికీ తెలియదు.. (నవ్వుతూ) జస్ట్ సరదాకి అంటున్నా. వెంకీ ఈ కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పా. నితిన్‌తో మా కెమిస్ట్రీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అది మీరు స్క్రీన్ మీద చూస్తారు. మార్చి 26న ఈ సినిమా విడుదలౌతుంది. తప్పకుండా చూడండి’ అంటూ అభిమానుల్ని కోరింది కీర్తి సురేష్. మొత్తానికి కీర్తి సురేష్ ఈ సినిమా ప్రమోషన్స్‌కి రావడం లేదని బహిరంగంగానే విమర్శలు చేశారు . అయితే కీర్తి సురేష్ ప్రీ రిలీజ్‌కి రావడంతో రంగ్ దే ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3f0UwTL

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...