Saturday, 27 March 2021

Vedam Nagaiah: నటుడు 'వేదం' నాగయ్య కన్నుమూత.. సినీ ప్రముఖుల సంతాపం

సినీ నటుడు, 'వేదం' సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న నాగయ్య కొద్దిసేపటి క్రితం మరణించారు. గత కొన్ని నెలల క్రితమే నాగయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూయడంతో మానసికంగా కృంగిపోయిన ఆయన ఈ రోజు (శనివారం) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. నాగయ్య మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలుపుతున్నారు. గత కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారిన నాగయ్యను మా అసోసియేషన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకున్నారు. అయినప్పటికీ భార్య లేని లోటును జీర్ణించుకోలేక పోయిన ఆయన మానసిక బాధతో అనారోగ్యం పాలై గుంటూరు జిల్లా దేచవరంలోని తన నివాసంలో కన్నుమూశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వేదం' సినిమాలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్‌లతో పాటు నాగయ్యకి మంచి పేరు వచ్చింది. పల్లెటూరి వృద్ధుని పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు నాగయ్య. ‘పద్మ మన పైసలు దొరికాయే..నీ బిడ్డ సదువుకుంటాడే’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచి ఉంటాయి. ఆ తర్వాత 30కిపైగా చిత్రాల్లో నటించారు నాగయ్య.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3w3ocFZ

No comments:

Post a Comment

'Consumers should not pay higher taxes for clean tech'

'We are not asking for incentives, but at least taxation can be aligned such that the rupee tax on consumers remains the same.' fr...