Tuesday, 8 December 2020

ఎవడికీ తలవంచని ఉద్యోగం వ్యవసాయం.. రైతన్న మీసం మెలేసేట్టు ఉందే!

జై కిసాన్.. జై జవాన్ నినాదంతో దేశం అట్టుడుకుంది. అన్నం పెట్టే రైతుకి కడుపు కాలి ఉద్యమబాట పట్టారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. రైతుల సహేతుకమైన డిమాండ్లకు పలు పార్టీలు, కవులు, రచయితలు, సినిమా స్టార్ల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ తరుణంలో రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ హిమ మీడియా వర్స్స్, విలేజ్ ఫిల్మ్ కార్పొరేషన్స్ సంయుక్తంగా రూపొందించిన అప్ కమింగ్ మూవీలోని టీజర్ ఆలోచింపచేస్తుంది. ‘చూడు ఈ ప్రపంచంలో తల వంచకుండా.. ఎవరికీ భయపడకుండా ఉండే ఉద్యోగం ఏంటో తెలుసా.. వ్యవసాయం’ అంటూ శుభలేఖ సుధాకర్ నాగలి కాడె పట్టుకుని చెప్పే డైలాగ్ ప్రతి రైతు మీసం మెలేసేట్టుగా ఉంది. రైతు అంటేనే చిన్న చూపు చూస్తున్న తరుణంలో రైతన్నకు భరోసా కల్పించేట్టుగా ఉంది ఈ డైలాగ్. పల్లెవాతావరణాన్ని ప్రతిబింబిస్తూ రైతు ప్రాధాన్యతను 38 సెకన్ల వీడియోలో సూటిగా కొట్టినట్టు చూపించగలిగాడు దర్శకుడు అంజన్ రెడ్డి. దర్శకుడిగా అంజన్ రెడ్డికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. సినిమాటోగ్రఫీతో పాటు.. జైకిసాన్.. అంటూ బ్యాగ్రౌండ్‌లో స్కోర్ ఈ టీజర్‌కి మరింత హైప్ తీసుకువచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. జర్నలిస్ట్‌గా వివిధ శాఖల్లో పనిచేసిన అంజన్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. శుభలేక సుధాకర్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలో శ్రీ మానస్, వరుణ్ హీరోలుగా నటిస్టున్నారు. మరినా సింగ్, సహారా క్రిష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా, పద్మ జయంతి, మది ఇతర పాత్రల్లో నటించారు. నవీన్ పొట్లూరి సినిమాటోగ్రఫీ అందించగా.. బుచ్చినాయుడు కండ్రిగ ఫేమ్ మిహిరాంశ్ సంగీతం అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36ZcZMk

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....