టాలీవుడ్ టాప్ హీరోయిన్ శెట్టికి దైవభక్తి ఎక్కువ. వీలు దొరికినప్పుడల్లా ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి రహస్యంగా వెళ్లిన వార్త ఇప్పుడు వైరల్గా మారింది. పోలవరం పంచాయతీ పరిధిలోని గోదావరి మధ్యలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన అనుష్క స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సన్నిహితులతో కలిసి పడవలో గోదావరిలో పడవపై ప్రయాణించి ఆమె ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించారు. Also Read: కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతితో మరో ఇద్దరు మాత్రమే అనుష్కతో ఉన్నారు. వారు గోదావరిలో ప్రయాణిస్తుండగా తీసిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్నప్పటికీ ఎలాంటి ఆడంబరం లేకుండా అనుష్క వచ్చిన తీరు అందరినీ షాక్కు గురిచేస్తోంది. తన స్వస్థలం మంగళూరు నుంచి పురుషోత్తమపట్నం చేరుకున్న అనుష్క అక్కడి నుంచి లాంచీలో ఆలయానికి చేరుకున్నారు. అయితే తమ గ్రామానికి అనుష్క వచ్చిందని ఆలస్యంగా తెలుసుకున్న స్థానికులు ఆమెను కళ్లారా చూడలేకపోయామేనని ఆవేదన చెందుతున్నారు. Also Read: కార్తీక మాసంలో గోదావరి మధ్యలోని ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా అనుష్క అన్నారు. షూటింగుల కారణంగా చాలారోజులుగా ఆలయానికి వెళ్లడం వీలు పడలేదని, అందువల్లే ఈ కార్తీక మాసంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్ల చెప్పారు. ప్రకృతి ఒడిలో గోదావరి నది మధ్యలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Wcitx3
No comments:
Post a Comment