Tuesday, 1 December 2020

‘కరోనా వైరస్’ నుంచి మరో ట్రైలర్.. దగ్గుతోనే భయపెట్టేస్తున్న ఆర్జీవీ

లాక్‌డౌన్ సమయంలో సినిమా షూటింగులకు బ్రేక్ పడినా వివాదాస్పద దర్శకుడు మాత్రం ఎక్కడా తగ్గలేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కొన్ని సినిమాలు తెరకెక్కించి ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు. తాజాగా కరోనా మహమ్మారిని కూడా వాడేసుకుంటూ ఆర్జీవీ ఓ సినిమా తెరకెక్కించారు. దానికి ‘’ అని టైటిల్ పెట్టారు. ఆగస్త్య మంజు దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్‌ను వర్మ బుధవారం విడుదల చేశారు. ఇప్పటికే మొదటి ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ‘కరోనా ఎఫెక్ట్‌ ఉంది కదా ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరి నుంచి ఎవరికి.. ఎలా వస్తుందో తెలియటం లేదు. కాబట్టి నాకు చెప్పకుండా ఎవరు బయటకు వెళ్లేది లేదు.. అని కుటుంబ పెద్ద డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. ‘60-70 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లకు మాత్రమే కరోనా వస్తుందనడం కరెక్ట్‌ కాదు. 25 ఏళ్ల అబ్బాయి కూడా చచ్చిపోయాడంట.. ఇంకా ఆయన మాటలు వింటే గోవిందా.. గోవిందా’ అనే మరో డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ముగుస్తుంది. కరోనా పేషెంట్లు దగ్గినట్లుగా భారీ శబ్దంతో కూడిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. Also Read: ‘కరోనా వైరస్‌’ సినిమా డిసెంబర్‌ 11న విడుదల కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్‌లో విడుదల అవుతున్న తొలి సినిమా ‘కరోనా వైరస్’ అని రామ్‌గోపాల వర్మ పేర్కొన్నారు. సమాజంలో జరిగే సంఘటనలను ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు తెరకెక్కించడంతో వర్మ దిట్ట. దీంతో ఆయన సినిమాలన్నీ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఈ కోవలోనే ‘మర్డర్’, ‘దిశ’ సినిమాలు కోర్టు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల వర్మ నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ‘కరోనా వైరస్’ అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JyrVrh

No comments:

Post a Comment

'God Does Not Make People Like Mohsina Kidwai Now'

'She was not a yes person. She would tell the truth and her feelings to Indira Gandhi, and Indira Gandhi would value her opinion. The sa...